మధ్య ప్రదేశ్లోని ఖండ్వాలో ఓ దుర్ఘటన ప్రాణనష్టానికి దారితీసింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దీనిపై ఈ రోజు సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున పరిహారం అందజేస్తామని ఆయన ప్రకటించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధానమంత్రి కార్యాలయం ఒక సందేశాన్ని పొందుపరిచింది:
‘‘మధ్య ప్రదేశ్లోని ఖండ్వాలో జరిగిన దుర్ఘటన ప్రాణనష్టానికి దారితీయడం విచారకరం. బాధితులకు, వారి కుటుంబాలకు కలిగిన దు:ఖంలో నేను సైతం పాలుపంచుకుంటున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.
మృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ.2 లక్షల చొప్పున పరిహారాన్ని అందజేస్తాం. గాయపడిన వారికి రూ.50,000 వంతున పరిహారంగా అందజేస్తాం: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (@narendramodi)’’
Deeply saddened by the loss of lives in an accident at Khandwa, Madhya Pradesh. My thoughts are with the affected people and their families during this difficult time. Praying for the speedy recovery of the injured.
— PMO India (@PMOIndia) October 2, 2025
An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the…


