నైజీరియా మాజీ అధ్యక్షుడు మహమ్మదు బుహారీ మృతిపట్ల భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. పలు సందర్భాల్లో ఆయనతో జరిగిన సమావేశాలను, సంభాషణలను శ్రీ మోదీ గుర్తు చేసుకున్నారు. మహమ్మదు బుహారీ మేధస్సు, ఆత్మీయత, భారత్ - నైజీరియా మైత్రిపట్ల ఆయనకు గల అచంచలమైన నిబద్ధత చెప్పుకోదగ్గవన్నారు. మహమ్మదు బుహారీ కుటుంబానికి, నైజీరియా ప్రభుత్వానికి, ప్రజలకు... 140 కోట్ల భారతీయుల తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్టు శ్రీ మోదీ పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
“నైజీరియా మాజీ అధ్యక్షుడు మహమ్మదు బుహారీ మృతి అత్యంత బాధాకరం. వివిధ సందర్భాల్లో ఆయనతో జరిగిన సమావేశాలు, చేసిన సంభాషణలు నాకు గుర్తొస్తున్నాయి. ఆయన పరిణతి, ఆత్మీయత, భారత్ - నైజీరియా మైత్రిపై ఆయనకున్న అచంచల విశ్వాసం ఎనలేనివి. మహమ్మదు బుహారీ కుటుంబానికి, నైజీరియా ప్రభుత్వానికి, ప్రజలకు... 140 కోట్ల భారతీయుల తరఫున నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను.
@officialABAT
@NGRPresident”
Deeply saddened by the passing of former President of Nigeria Muhammadu Buhari. I fondly recall our meetings and conversations on various occasions. His wisdom, warmth and unwavering commitment to India–Nigeria friendship stood out. I join the 1.4 billion people of India in…
— Narendra Modi (@narendramodi) July 14, 2025


