యాత్రికుల వాహనమొకటి హిమాచల్ ప్రదేశ్ లోని కుల్లూ జిల్లా లో లోయ లో పడిపోయిన ఘటన లో ప్రాణనష్టం వాటిల్లినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన లో గాయపడిన వ్యక్తుల కు అన్ని విధాలు గాను సహాయాన్ని అందించడం జరుగుతోందని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. క్షతగాత్రులు త్వరితగతి న పునఃస్వస్థులు కావాలని కూడా ఆయన ఆకాంక్షించారు.
ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -
‘‘యాత్రికుల వాహనం హిమాచల్ ప్రదేశ్ లోని కుల్లూ లో లోయ లో పడిపోయిన ఘటన అత్యంత దుఃఖదాయకం గా ఉంది. ఈ దుర్ఘటన లో ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల దగ్గరి సంబంధికుల కు నేను నా ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను; ఈ దుర్ఘటన లో గాయపడిన వ్యక్తుల కు చేతనైన అన్ని విధాలుగాను సహాయాన్ని అందించడం జరుగుతోంది. వారు త్వరలో పునఃస్వస్థులు కావాలని నేను కోరుకొంటున్నాను: ప్రధాన మంత్రి’’ అని పేర్కొంది.
हिमाचल प्रदेश के कुल्लू में टूरिस्ट वाहन के खाई में गिरने की घटना अत्यंत दुखदायी है। इस दुर्घटना में जिन्होंने अपनों को खो दिया है, उनके परिजनों के प्रति मैं गहरी संवेदना प्रकट करता हूं। इसके साथ ही घायलों की हरसंभव मदद की जा रही है। उनके शीघ्र स्वस्थ होने की कामना करता हूं: PM
— PMO India (@PMOIndia) September 26, 2022


