ఆర్ఎస్ఎస్ కు చెందిన సీనియర్ నేత శ్రీ మదన్ దాస్ దేవి కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు.
శ్రీ మదన్ దాస్ దేవి తన జీవనాన్ని దేశ సేవ లో సమర్పణం చేశారని ఒక ట్వీట్ లో శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మరణించిన నేత తో తనకు గల ప్రగాఢమైనటువంటి వ్యక్తిగత అనుబంధాన్ని కూడా ప్రధాన మంత్రి గుర్తు కు తెచ్చుకోవడం తో పాటు తాను ఆయన నుండి ఎంతో నేర్చుకొన్నానన్నారు.
ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి -
‘‘శ్రీ మదన్ దాస్ దేవి గారి కన్నుమూత వార్త తెలిసి అత్యంత దుఃఖం కలిగింది. ఆయన తన పూర్తి జీవనాన్ని దేశ సేవ కు అంకితం చేసి వేశారు. ఆయన తో నాకు ప్రగాఢమైన అనుబంధం ఉండటం ఒక్కటే కాకుండా సదా ఎంతో నేర్చుకొనే అవకాశాలు కూడా లభించాయి. ఈ శోక ఘడియ లో ఆయన యొక్క కుటుంబ సభ్యుల కు మరియు కార్యకర్త లు అందరి కి ఆ ఈశ్వరుడు ఊతాన్ని అందించు గాక. ఓమ్ శాంతి.’’ అని పేర్కొన్నారు.
श्री मदन दास देवी जी के देहावसान से अत्यंत दुख हुआ है। उन्होंने अपना पूरा जीवन राष्ट्रसेवा में समर्पित कर दिया। उनसे मेरा न सिर्फ घनिष्ठ जुड़ाव रहा, बल्कि हमेशा बहुत कुछ सीखने को मिला। शोक की इस घड़ी में ईश्वर सभी कार्यकर्ताओं और उनके परिवारजनों को संबल प्रदान करे। ओम शांति!
— Narendra Modi (@narendramodi) July 24, 2023


