గౌరవనీయులు వాల్టర్ రస్సెల్ మీడ్ నేతృత్వంలోని మేధావులు, వ్యాపార వేత్తలతో కూడిన అమెరికా ప్రతినిధి బృందంతో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంభాషించారు.
భారత్ - అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంలోనూ.. అలాగే ప్రపంచ శాంతి, పురోగతి, శ్రేయస్సు లక్ష్యంగా ఇరు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలోనూ వారి కృషి ఎంతో విలువైనదని ప్రధానమంత్రి అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
“గౌరవనీయులు వాల్టర్ రస్సెల్ మీడ్ నేతృత్వంలోని మేధావులు, వ్యాపార వేత్తలతో కూడిన అమెరికా ప్రతినిధి బృందంతో సంభాషించడం సంతోషాన్నిచ్చింది. భారత్ - అమెరికా సంబంధాల బలోపేతంలోనూ.. అలాగే ప్రపంచ శాంతి, పురోగతి, శ్రేయస్సు లక్ష్యంగా ఇరు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలోనూ వారి కృషి ఎంతో విలువైనది.
@wrmead”
Glad to interact with a US delegation of thinkers and business leaders led by Mr. Walter Russell Mead. Value their contribution in strengthening India-US ties and advancing our partnership for global peace, progress and prosperity.@wrmead pic.twitter.com/Nw3snfzB4C
— Narendra Modi (@narendramodi) October 7, 2025


