PM Modi lays the foundation stone of Pune metro.
India is urbanising at a very quick pace & thus, its essential to work in 2 directions. 1st is to improve quality of life in villages: PM
Growth of our cities must be adequately planned: PM
The Government of India is actively working on the Rurban Mission: PM
We need to invigorate our villages with good facilities while preserving their character & spirit: PM
After 8th November, urban local bodies' income has increased which can be allocated towards development: PM
In this nation everybody is equal before the law and everyone has to follow the law: PM
ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు పుణె మెట్రో ప్రాజెక్టు (ఒకటో దశ)కు పునాదిరాయి వేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటైన భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి ప్రసంగిస్తూ, భారతదేశంలో చాలా త్వరితగతిన పట్టణీకరణ చోటుచేసుకొంటోందని, అందువల్ల రెండు దిశలలో కృషి చేయవలసి ఉందన్నారు; వాటిలో- పల్లె ప్రజల జీవనంలోని నాణ్యతను మెరుగుపరచడం ఒకటి కాగా మన పట్టణ ప్రాంతాలు ఎదుర్కొంటున్న సవాళ్లు ఏమిటన్న దానిపై దీర్ఘ కాల ప్రాతిపదికన ఆలోచించడం రెండోది అని ఆయన వివరించారు. ఇలా ఆలోచిస్తే ఆ సవాళ్లను తగ్గించడం సాధ్యపడగలదని ఆయన చెప్పారు.
ప్రతి ఒక్కదానినీ కూడా రాజకీయాల దృష్టికోణంలో నుండే చూడజాలమని, మనం భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకోవాలని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. మనం మన నగరాల పురోభివృద్ధి కోసం తగిన ప్రణాళికలను రచించుకోవాలని కూడా ఆయన అన్నారు.

ఎదుగుతున్న మరియు శీఘ్రంగా పట్టణీకరణకు నోచుకొంటున్న ప్రాంతాల అవసరాలను తీర్చే రూర్బన్ మిషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం చురుకుగా కృషి చేస్తున్నట్లు ప్రధాన మంత్రి చెప్పారు.
ప్రస్తుత ప్రయోజనాలు ముఖ్యమైనవేనని, కానీ భవిష్యత్తు యొక్క ఆకాంక్షలను నెరవేర్చగలిగే వ్యవస్థలు కూడా మనకు అవసరమేనని ప్రధాన మంత్రి అన్నారు. చేపట్టిన ప్రాజెక్టులు ఏవైనప్పటికీ వాటిని నిర్ణీత కాల క్రమంలో పూర్తి చేయడం కోసం ప్రభుత్వ పరిశ్రమిస్తుందని ఆయన వివరించారు.

ప్రభుత్వం గ్యాస్ గ్రిడ్ లు, వాటర్ గ్రిడ్ లు, డిజిటల్ నెట్ వర్క్ ల దిశగా కృషి చేస్తోందని, రైతులకు చేయూతనిచ్చేందుకు అంతరిక్ష సంబంధ సాంకేతిక విజ్ఞ‌ానాన్ని ఊతంగా తీసుకొంటూ, ఇంకా సాంకేతిక విజ్ఞ‌ానాన్ని కూడా వినియోగించుకొంటున్నట్లు ప్రధాన మంత్రి తెలిపారు.
ఈ దేశంలో ప్రతి ఒక్క వ్యక్తి చట్టం దృష్టిలో సమానమే అని, ప్రతి ఒక్కరూ చట్టాన్ని అనుసరించవలసిందే అని ప్రధాన మంత్రి అన్నారు. ఒకవేళ అవినీతి మరియు నల్లధనం అనే రెండు దుష్కర్మలను ఇంతకు ముందు నిర్మూలించి ఉంటే గనక తాను తీసుకొన్న నిర్ణయాలను తీసుకొనే వాడిని కాదు అని ప్రధాన మంత్రి చెప్పారు.

పుణె ఒక పాండిత్య నగరమని ప్రధాన మంత్రి చెబుతూ, ఆన్ లైన్ బ్యాంకింగ్ ను అక్కున చేర్చకోవడంలోను మరియు లభ్యమవుతున్న సదుపాయాలను అన్వేషించడంలోను ఈ నగరం నాయకత్వం వహించాలని ఉద్బోధించారు.

ఈ దేశంలో 125 మంది భారతీయుల వాణి వినవస్తుందని, ఈ స్వరాన్ని ఏ కొద్ది మందో నష్టపరచజాలరని ప్రధాన మంత్రి అన్నారు.
Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
PLI schemes attract ₹2 lakh crore investment till September, lift output and jobs across sectors

Media Coverage

PLI schemes attract ₹2 lakh crore investment till September, lift output and jobs across sectors
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 13 డిసెంబర్ 2025
December 13, 2025

PM Modi Citizens Celebrate India Rising: PM Modi's Leadership in Attracting Investments and Ensuring Security