PM Modi interacts with recipients of Nari Shakti Puraskar 2016
If India can grow at 8% per annum over the next 3 decades, it would be one of the world’s most advanced countries: PM

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘నారీ శక్తి పురస్కారాలు’ మరియు ‘స్త్రీ శక్తి పురస్కారాలు’ అందుకున్న వారిని ఈ రోజు కలుసుకొని, వారితో ముచ్చటించారు.

ప్రధాన మంత్రి వారితో సంభాషించిన క్రమంలో, పురస్కార విజేతలను- వారు తమ వ్యక్తిగత దక్షత పరంగా, ఇంకా తమ తమ రంగాలలో మార్గదర్శకులుగా నిలచి సాధించిన అగ్రగామి విజయాలకు గాను- వారిని అభినందించారు.

భారతదేశం రానున్న మూడు దశాబ్దాలలో ఏటా 8 శాతం వృద్ధిని నమోదు చేయగలిగితే గనక, ప్రపంచంలో అత్యంత పురోగామి దేశాలలో భారత్ కూడా ఒకటి కాగలుగుతుందని ప్రధాన మంత్రి అన్నారు. ఈ లక్ష్యానికి చేరుకోవడానికి మహిళలు తమ తోడ్పాటును గరిష్ఠ స్థాయిలో అందించగలిగే విధంగా తమను తాము తీర్చిదిద్దుకోవాలని ఆయన అన్నారు.

ఈ రోజు లోక్ సభ లో ప్రవేశపెట్టబోయే ప్రసూతి సెలవు బిల్లు మాతృత్వ సెలవును 12 వారాల నుండి 26 వారాలకు పెంచుతుందని ప్రధాన మంత్రి వివరించారు.

మహిళలు మరియు శిశువుల వికాస శాఖ మంత్రి శ్రీమతి మేనకా గాంధి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Centre launches Bhavya scheme to set up 100 industrial parks across country

Media Coverage

Centre launches Bhavya scheme to set up 100 industrial parks across country
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 24 మే 2026
May 24, 2026

Strength, Growth & Global Trust: How PM Modi is Transforming India Across Frontiers