వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 2024కి సంబంధించిన 10వ ఎడిషన్‌ను గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్‌లో  ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సంవత్సరం శిఖరాగ్ర సదస్సుకు ఇతివృత్తం 'గేట్‌వే టు ది ఫ్యూచర్'. దీనిలో 34 భాగస్వామ్య దేశాలు, 16 భాగస్వామ్య సంస్థల పాల్గొంటున్నాయి . ఈశాన్య ప్రాంతాలలో పెట్టుబడి అవకాశాలను ప్రదర్శించడానికి ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ కూడా సమ్మిట్‌ను వేదికగా ఉపయోగిస్తోంది. ఈ సందర్భంగా పలువురు పారిశ్రామిక వేత్తలు ప్రసంగించారు.

 

శ్రీ లక్ష్మీ మిట్టల్, ఆర్సెలార్ మిట్టల్ చైర్మన్:  గత సంవత్సరం సెప్టెంబర్‌లో వైబ్రంట్ గుజరాత్ 20వ వార్షికోత్సవాన్ని సందర్శించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్ మెగా గ్లోబల్ ఈవెంట్ కోసం సంస్థాగతమైన ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించడానికి ప్రక్రియ కొనసాగింపుపై ప్రధానమంత్రి చెప్పారని ప్రశంసించారు. ప్రతి అంతర్జాతీయ ఫోరమ్‌లో ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు మరియు గ్లోబల్ సౌత్ వాయిస్‌ని బలోపేతం చేసే సూత్రాలపై ప్రధాన మంత్రికి ఉన్న నమ్మకాన్ని కూడా ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. దేశాన్ని స్వయం-ఆధారితంగా మార్చడంలో ఉక్కు ప్రాముఖ్యతను నొక్కిచెప్పిన శ్రీ మిట్టల్, 2021లో ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా హజీరా విస్తరణ ప్రాజెక్ట్ శంకుస్థాపనను గుర్తుచేసుకున్నారు. ప్రాజెక్ట్ మొదటి దశ 2026 నిర్దేశిత సంవత్సరానికి పూర్తవుతుందని తెలియజేసారు. పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్ వంటి హరిత రంగాలలో పెట్టుబడులు పెట్టడాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.

 

జపాన్‌లోని సుజుకీ మోటార్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ తోషిహిరో సుజుకి: ప్రధానమంత్రి ఒక బలమైన నాయకుడిగా ఘనత సాధించారు. దేశంలోని తయారీ పరిశ్రమలకు అందించిన మద్దతుకు సుజుకి ధన్యవాదాలు తెలిపారు. భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్‌గా అవతరించిందని పేర్కొంటూ, దేశ ఆర్థిక వృద్ధిపై ప్రధానమంత్రి ప్రగతిశీల విధానం ప్రభావాన్ని సుజుకి ప్రముఖంగా ప్రస్తావించారు. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నాలను నొక్కిచెప్పడంతో, భారతదేశంలో ఉత్పత్తి చేయబడిన మొదటి ఈవీని యూరోపియన్ దేశాలకు, జపాన్‌కు ఎగుమతి చేసే కంపెనీ ప్రణాళికలను కూడా ఆయన స్పృశించారు. ఇథనాల్, గ్రీన్ హైడ్రోజన్, ఆవు పేడ నుండి బయోగ్యాస్ ఉత్పత్తి ద్వారా గ్రీన్హౌస్ ఉద్గారాలను తగ్గించడానికి సంస్థ ప్రణాళికను కూడా ఆయన ప్రస్తావించారు.

 

రిలయన్స్ గ్రూప్‌నకు చెందిన శ్రీ ముఖేష్ అంబానీ: వైబ్రంట్ గుజరాత్‌ను ఈ రోజు ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పెట్టుబడి శిఖరాగ్ర సదస్సు గా అభివర్ణించారు, ఎందుకంటే ఈ రకమైన మరే ఇతర శిఖరాగ్ర సమావేశం 20 సంవత్సరాలుగా జరగలేదు. "ఇది మన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత, స్థిరత్వానికి నివాళి" అని ఆయన అన్నారు. వైబ్రంట్ గుజరాత్ ప్రతి ఎడిషన్‌లో తాను పాల్గొన్నట్లు ఆయన తెలియజేశారు. గుజరాతీ మూలాల పట్ల గర్వపడుతున్నానని అంటూ.. శ్రీ అంబానీ గుజరాత్‌ను మార్చినందుకు ప్రధానమంత్రిని ప్రశంసించారు.. "ఈ పరివర్తనకు ప్రధాన కారణం ఆధునిక కాలంలో గొప్ప నాయకుడిగా, భారతదేశ చరిత్రలో అత్యంత విజయవంతమైన ప్రధానమంత్రిగా శ్రీ నరేంద్ర మోదీ- ఎదిగిన మన నాయకుడు. ప్రపంచం మాట్లాడడమే కాదు, చప్పట్లు కొడుతుంది. భారత ప్రధాని అసాధ్యాన్ని ఎలా సుసాధ్యం చేశారనే దానిపై ఆయన విశదీకరించారు - ‘మోదీ హై తో ముమ్కిన్ హై’ ఈ నినాదం ప్రపంచ ప్రేక్షకులలో ప్రతిధ్వనిస్తోంది. శ్రీ ముఖేష్ అంబానీ తన తండ్రి ధీరూభాయ్‌ని గుర్తు చేసుకుంటూ రిలయన్స్ ఎప్పటికీ గుజరాతీ కంపెనీగానే ఉంటుందని అన్నారు. "ప్రతి రిలయన్స్ వ్యాపారం నా 7 కోట్ల మంది తోటి గుజరాతీల కలలను నెరవేర్చడానికి కృషి చేస్తోంది" అని ఆయన అన్నారు. రిలయన్స్ గత 10 సంవత్సరాలలో ప్రపంచ స్థాయి ఆస్తులను సృష్టించడానికి భారతదేశం అంతటా 150 బిలియన్ యుఎస్ డాలర్లు అంటే 12 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టిందని, ఇందులో మూడింట ఒక వంతు గుజరాత్‌లోనే పెట్టుబడి పెట్టారని ఆయన తెలియజేశారు. శ్రీ అంబానీ గుజరాత్‌కు 5 ప్రతిజ్ఞలు చేశారు. మొదటిది, రాబోయే 10 సంవత్సరాలలో గణనీయమైన పెట్టుబడులతో గుజరాత్ వృద్ధి కథలో రిలయన్స్ ప్రముఖ పాత్ర పోషిస్తుంది, ప్రత్యేకంగా, గ్రీన్ గ్రోత్‌లో గుజరాత్‌ను ప్రపంచ నాయకుడిగా మార్చడంలో రిలయన్స్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. "2030 నాటికి పునరుత్పాదక ఇంధనం ద్వారా గుజరాత్ సగం శక్తి అవసరాలను తీర్చడానికి మేము సహాయం చేస్తాము" అని ముఖేష్ అంబానీ అన్నారు. జామ్‌నగర్‌లో 5000 ఎకరాల విస్తీర్ణంలో ధీరూభాయ్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్ రాబోతోంది, ఇది 2024 ద్వితీయార్థంలో ప్రారంభించబడుతుందని ఆయన తెలిపారు. రెండవది, 5జీ అత్యంత వేగంగా రోల్ అవుట్ అయినందున, నేడు గుజరాత్ పూర్తిగా 5జీ ప్రారంభం అయింది. ఇది డిజిటల్ డేటా ప్లాట్‌ఫారమ్‌లో, ఏఐ స్వీకరణలో గుజరాత్‌ను అగ్రగామిగా చేస్తుంది. నాణ్యమైన ఉత్పత్తులను తీసుకురావడానికి, లక్షలాది మంది రైతులు, చిన్న వ్యాపారులకు సహాయం చేయడానికి మూడవ రిలయన్స్ రిటైల్ తన పాదముద్రను విస్తరిస్తుంది. నాల్గవది, రిలయన్స్ గుజరాత్‌ను కొత్త మెటీరియల్స్, సర్క్యులర్ ఎకానమీలో అగ్రగామిగా మారుస్తుందని ఆయన అన్నారు. గ్రూప్ హజీరాలో ప్రపంచ స్థాయి కార్బన్ ఫైబర్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తోంది. 2036 ఒలింపిక్స్‌కు వేలం వేయాలనే ఉద్దేశంతో ప్రధాని చేసిన ప్రకటనకు అనుగుణంగా, గుజరాత్‌లో క్రీడలు, విద్య మరియు నైపుణ్యాల మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి రిలయన్స్, రిలయన్స్ ఫౌండేషన్ అనేక ఇతర భాగస్వాములతో కలిసి పనిచేస్తాయని ఆయన చెప్పారు. 'భారతదేశ అభివృద్ధికి గుజరాత్ అభివృద్ధి' అని అంబానీ చెప్పారు.  ఇప్పుడు 'ప్రధానమంత్రిగా మీ మిషన్ ప్రపంచ వృద్ధికి భారతదేశ అభివృద్ధి అని చెప్పారని శ్రీ అంబానీ గుర్తు చేసుకున్నారు. మీరు గ్లోబల్ గుడ్ అనే మంత్రంపై పని చేస్తున్నారు మరియు భారతదేశాన్ని ప్రపంచ వృద్ధి ఇంజిన్‌గా చేస్తున్నారు. కేవలం రెండు దశాబ్దాల్లో గుజరాత్ నుంచి ప్రపంచ స్థాయికి చేరుకున్న మీ ప్రయాణం ఆధునిక ఇతిహాసం కంటే తక్కువ కాదు’ అని ఆయన అన్నారు. “యువ తరానికి ఆర్థిక వ్యవస్థలోకి ప్రవేశించడానికి, ఆవిష్కరణలు చేయడానికి మరియు 100 మిలియన్ల మందికి సులభంగా జీవించడానికి మరియు సులభంగా సంపాదించడానికి నేటి భారతదేశం ఉత్తమ సమయం అని ఆయన అన్నారు. జాతీయవాది, అంతర్జాతీయవాది అయినందుకు రాబోయే తరాలు ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతాయి. వికసిత భారత్‌కు గట్టి పునాది వేశారు. 2047 నాటికి భారతదేశం 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారకుండా భూమిపై ఉన్న ఏ శక్తీ అడ్డుకోలేదని ఆయన చెప్పారు. గుజరాత్ ఒక్కటే 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారడాన్ని నేను చూస్తున్నాను. మోడీ శకం భారతదేశాన్ని శ్రేయస్సు, పురోగతి, కీర్తి కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని ప్రతి గుజరాతీ, ప్రతి భారతీయుడు విశ్వసిస్తున్నాడు అని వారి అంబానీ తెలిపారు. 

 

సెమీకండక్టర్ల తయారీకి దేశాన్ని తెరవాలనే ఉద్దేశ్యంతో ప్రధాన మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన మైక్రోన్ టెక్నాలజీస్, అమెరికా సీఈఓ  శ్రీ సంజయ్ మెహ్రోత్రా, భవిష్యత్తులో భారతదేశం మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే క్రమంలో ఇది ఒక భారీ ఆర్థిక చోదకశక్తిగా మారుతుందని అన్నారు. వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్ సెమీకండక్టర్ శక్తిగా భారతదేశం ఎదుగుదలకు కీలకమైన దార్శనిక ఆలోచనలను ప్రస్తావిస్తుంది. ఈ రంగంలో బహుళ వృద్ధి అవకాశాలపై కూడా వెలుగునిచ్చింది. గుజరాత్‌లో ప్రపంచ స్థాయి మెమరీ అసెంబ్లీ మరియు టెస్ట్ సదుపాయాన్ని ఏర్పాటు చేయడంలో సహాయం చేసినందుకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు, ఈ సౌకర్యం కోసం టాటా ప్రాజెక్ట్‌లతో మౌలిక సదుపాయాల భాగస్వామ్యాన్ని ప్రస్తావించారు. 500,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో మొదటి దశ 2025 ప్రారంభంలో అమలులోకి వస్తుందని, తద్వారా రాబోయే సంవత్సరాల్లో 5,000 ప్రత్యక్ష ఉద్యోగాలు మరియు 15,000 అదనపు కమ్యూనిటీ ఉద్యోగాలు సృష్టించబడతాయని ఆయన తెలియజేశారు. "మైక్రాన్ మరియు ప్రభుత్వం రెండు దశల్లో కలిపి పెట్టుబడి 2.75 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకోగలవు" అని ఆయన చెప్పారు. సెమీకండక్టర్ పరిశ్రమలో భారతదేశంలో పెట్టుబడులను పెంచడంలో యాంకర్‌గా వ్యవహరించడంలో కంపెనీ పాత్రను ఆయన వివరించారు. 

 

ఇప్పటి వరకు జరిగిన వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్‌లో ప్రతి ఎడిషన్‌లో భాగమైనందుకు సగర్వంగా భావిస్తున్నట్టు అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ అన్నారు. ఆయన అసాధారణమైన దృక్పథానికి ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన సందర్భంగా,  అదానీ తన  హాల్‌మార్క్ సంతకాలు, గొప్ప ఆశయాలు, ఖచ్చితమైన పాలన, దోషరహిత అమలును ప్రశంసించారు. భారతదేశం పారిశ్రామిక ప్రకృతి దృశ్యాన్ని ప్రాథమికంగా పునర్నిర్మించడానికి రాష్ట్రాలు పోటీపడుతూ, సహకరించుకుంటూ ముందుకు సాగుతున్నప్పుడు దేశవ్యాప్త ఒక ఉద్యమ స్ఫూర్తిని రేకెత్తించిన ప్రధానమంత్రిని ప్రశంసించారు. 2014 నుండి, భారతదేశ జిడిపి 185 శాతం, తలసరి ఆదాయం 165 శాతం  పెరిగింది, ప్రత్యేకించి భౌగోళిక రాజకీయ అస్థిరత, మహమ్మారి సవాళ్లతో గుర్తించబడిన యుగంలో ఇది గొప్పదని ఆయన నొక్కిచెప్పారు. గ్లోబల్ ప్లాట్‌ఫారమ్‌లపై తన స్వరాన్ని వినిపించాలని కోరుకునే దేశం నుండి ఇప్పుడు గ్లోబల్ ప్లాట్‌ఫారమ్‌లను సృష్టించే దేశానికి దేశం ప్రయాణాన్ని హైలైట్ చేస్తూ అంతర్జాతీయ వేదికపై ప్రధానమంత్రి సాధించిన విజయాలను ఆయన ప్రశంసించారు. భారతదేశం జి20 ప్రెసిడెన్సీ సమయంలో ప్రధానమంత్రి నాయకత్వం, జి20కి గ్లోబల్ సౌత్‌ను చేర్చడం గురించి ప్రస్తావిస్తూ,  అదానీ ఇది మరింత సమగ్ర ప్రపంచ క్రమంలో బెంచ్‌మార్క్‌లను నిర్దేశించిందని అన్నారు. ఇది భారతదేశ చరిత్రలో ఒక అద్భుతమైన క్షణం అని అన్నారు. "భవిష్యత్తును మీరు అంచనా వేయరు, మీరు దానిని మలచుకుంటారు", భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా మార్చడానికి, వసుధైవ కుటుంబ తత్వాల ద్వారా దేశాన్ని విశ్వ గురువుగా ప్రపంచ సామాజిక ఛాంపియన్‌గా నిలిపినందుకు ప్రధానమంత్రికి ఘనతగా అదానీ అన్నారు.  2047 నాటికి భారత్‌ను 'వికసిత భారత్‌'గా మార్చాలన్న ప్రధానమంత్రి దార్శనికత కారణంగా నేటి భారతదేశం రేపటి ప్రపంచ భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు సిద్ధంగా ఉందని, 2025 నాటికి రాష్ట్రంలో రూ.55,000 కోట్ల పెట్టుబడులు పెడతామని ఆయన ప్రకటించారు. 25,000 ప్రత్యక్ష మరియు పరోక్ష ఉద్యోగాలను సృష్టించే వివిధ రంగాలలో రూ. 50,000 కోట్ల పెట్టుబడుల లక్ష్యం. ఆత్మనిర్భర్ భారత్ కోసం హరిత సరఫరా గొలుసు వైపు విస్తరించడం మరియు సోలార్ ప్యానెల్లు, విండ్ టర్బైన్లు, హైడ్రో ఎలక్ట్రోలైజర్లు, గ్రీన్ అమ్మోనియా, పీవీసీ, కాపర్, సిమెంట్ ప్రాజెక్టులలో విస్తరణతో సహా అతిపెద్ద సమగ్ర పునరుత్పాదక ఇంధన పర్యావరణ వ్యవస్థను సృష్టించడం గురించి కూడా ఆయన స్పృశించారు. గుజరాత్‌లో వచ్చే ఐదేళ్లలో రూ. 2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడి పెట్టాలని, తద్వారా లక్షకుపైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు కల్పించాలని అదానీ గ్రూప్‌ ప్లాన్‌ని ఆయన తెలియజేశారు.

 

దక్షిణ కొరియా సిమ్ టెక్ సీఈఓ జెఫ్రీ చున్, మాట్లాడుతూ, సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్ట్ సౌకర్యాలలో కీలకమైన సరఫరా గొలుసు భాగస్వామిగా గుజరాత్ రాష్ట్రంలోని తమ ప్రధాన కస్టమర్ మైక్రోన్ ప్రాజెక్ట్ తర్వాత సహ-స్థాన పెట్టుబడిగా తమ భారతదేశ ప్రాజెక్ట్ కోసం ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. భారతదేశం వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంలో కొత్త సరఫరా గొలుసు నెట్‌వర్క్‌ను రూపొందించే ప్రపంచ ఉద్యమాన్ని వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ ప్రదర్శిస్తుందని ఆయన అన్నారు. వారు భారతదేశంలో మరో రౌండ్ పెట్టుబడి పెట్టడానికి సిద్ధమవుతున్నారని, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ మద్దతును గుర్తించామని ఆయన తెలియజేశారు. ఇది సెమీకండక్టర్ సప్లై చైన్ నెట్‌వర్క్‌లో భారతదేశ ఉనికిని మరింత పటిష్టం చేస్తుందని అన్నారు. .

 

టాటా సన్స్ లిమిటెడ్ చైర్మన్ శ్రీ ఎన్ చంద్రశేఖరన్   మాట్లాడుతూ, ‘ఇంత కాలం పాటు గుజరాత్ స్థిరంగా, అద్భుతమైన పురోగతి సాధించడం, మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జీ దూరదృష్టితో కూడిన నాయకత్వాన్ని, మనస్తత్వాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది” అని అన్నారు. ఆర్థికాభివృద్ధి కూడా విపరీతమైన సామాజిక అభివృద్ధికి దారితీసిందని, గుజరాత్ భవిష్యత్తుకు గేట్‌వేగా స్పష్టంగా స్థిరపడిందని ఆయన నొక్కి చెప్పారు. వ్యవస్థాపకుడు జంషెడ్‌జీ టాటా నవ్‌సారిలో జన్మించినందున గుజరాత్‌లోని టాటా గ్రూప్ మూలాన్ని ఆయన హైలైట్ చేశారు. నేడు రాష్ట్రంలో 21 టాటా గ్రూప్ కంపెనీలు బలమైన ఉనికిని కలిగి ఉన్నాయి. గుజరాత్‌లో ఈవీ  వాహనాలు, బ్యాటరీ ఉత్పత్తి, సి295 డిఫెన్స్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, సెమీకండక్టర్ ఫ్యాబ్, అడ్వాన్స్ మాన్యుఫ్యాక్చరింగ్ స్కిల్ బిల్డింగ్ రంగాలలో గ్రూప్ విస్తరణ ప్రణాళికను కూడా ఆయన వివరించారు. "టాటా గ్రూప్‌కు అత్యంత ముఖ్యమైన గమ్యస్థానాలలో గుజరాత్ ఒకటి,  దాని అభివృద్ధి ప్రయాణంలో మేము కీలక పాత్ర పోషిస్తాము" అని ఆయన అన్నారు.

 

డిపి వరల్డ్ ఛైర్మన్, సుల్తాన్ అహ్మద్ బిన్ సులేయం మాట్లాడుతూ, సమ్మిట్‌ను నిర్వహించినందుకు గుజరాత్ ప్రభుత్వాన్ని అభినందించారు. శక్తివంతమైన గుజరాత్ కోసం ప్రధానమంత్రి దృష్టి సాకారం కావడం సంతోషదాయకమని అన్నారు. 'వికసిత భారత్ @ 2047' అనే ప్రధాన మంత్రి దార్శనికత ద్వారా మార్గనిర్దేశం చేయబడిన భారతదేశపు ప్రధాన వ్యాపార వేదికగా వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్ దాని విపరీతమైన పెరుగుదలను ప్రదర్శిస్తుందని ఆయన అన్నారు. గిఫ్ట్ సిటీ, ధోలేరా స్పెషల్ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్,  గుజరాత్ మారిటైమ్ క్లస్టర్ వంటి వివిధ పారిశ్రామిక క్లస్టర్‌లను అభివృద్ధి చేసి ప్రోత్సహించినందుకు ప్రభుత్వం ఘనత పొందిందని, ఇది భవిష్యత్తుకు గేట్‌వేగా పనిచేస్తుందని అన్నారు. భారతదేశం, యూఏఈ  మధ్య ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలపై వెలుగునిస్తూ, 2017 నుండి 2.4 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టిన గుజరాత్‌లో అతిపెద్ద విదేశీ పెట్టుబడిదారులలో దేశం ఒకటిగా ఉందని ఆయన తెలియజేశారు. గుజరాత్ చివరిగా 7 బిలియన్ అమెరికన్  డాలర్ల కంటే ఎక్కువ విలువైన వస్తువులను ఎగుమతి చేసిందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఉందని పేర్కొంటూ, ప్రధానమంత్రి బలమైన నాయకత్వంలో వృద్ధి కొనసాగుతుందని సులేయం ఉద్ఘాటించారు. భారతదేశం మరియు గుజరాత్ ఆర్థిక శక్తి కేంద్రాలుగా తమ సామర్థ్యాన్ని గుర్తించడంలో సహాయపడే గతిశాకిత్ వంటి పెట్టుబడి కార్యక్రమాలకు కూడా ఆయన ప్రశంసించారు.  గుజరాత్‌లోని కాండ్లాలో 2 మిలియన్ కంటైనర్‌ల సామర్థ్యంతో అత్యాధునిక కంటైనర్ టెర్మినల్స్‌ను పెట్టుబడి పెట్టడానికి మరియు అభివృద్ధి చేయడానికి డీపీ వరల్డ్ ప్రణాళిక గురించి ఆయన తెలియజేశారు. దేశం లాజిస్టిక్స్ అవస్థాపనను విస్తరించడంలో భారత ప్రభుత్వంతో భాగస్వామ్యం కావడం పట్ల ఆయన గర్విస్తున్నారని, వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్‌లో భాగమయ్యే అవకాశం కల్పించినందుకు గుజరాత్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

 

నివిడియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్,  శ్రీ శంకర్ త్రివేదిమాట్లాడుతూ  జనరేటివ్ ఏఐ  పెరుగుతున్న ప్రాముఖ్యతను గమనిస్తూ, భారత ప్రభుత్వ సీనియర్ సభ్యులకు నాయకులకు ఉపన్యాసం ఇవ్వడానికి నివిడియా సీఈఓ  జెన్సన్ హువాంగ్‌ను పిఎం మోడీ ఆహ్వానించారని, "ఇది మొదటిది" అని అన్నారు. ఒక ప్రపంచ నాయకుడు నిజానికి ఏఐ  గురించి ఆలోచించినందుకు  ప్రధాని మోదీజీ నాయకత్వానికి ధన్యవాదాలు అని అన్నారు. ఇది భారతదేశంలో, ఇక్కడ గుజరాత్‌లో కూడా ఉత్పాదక ఏఐ ని స్వీకరించడానికి ఉత్ప్రేరకంగా ఉంది. ఉత్పాదక ఏఐ కి సంబంధించి స్కిల్ డెవలప్‌మెంట్‌లో ఎన్‌విడియా చేస్తున్న ప్రయత్నాలను వివరిస్తూ, 'భారతదేశంలో ప్రతిభ, స్థాయి,  అద్భుతమైన డేటా, విశిష్ట సంస్కృతి ఉంది" అని అన్నారు. మేక్ ఇన్ ఇండియాకు ఎన్విడియా మద్దతును కూడా ఆయన నొక్కి చెప్పారు.
 

జెరోడాక   వ్యవస్థాపకుడు, సీఈఓ  నిఖిల్ కామత్, ఒక వ్యవస్థాపకుడిగా తన ప్రయాణానికి సారూప్యతను చూపుతూ గత రెండు దశాబ్దాలుగా దేశం మొత్తం అభివృద్ధిపై ప్రస్తావించారు. 10 ఏళ్ల క్రితం లేని విధంగా దేశంలోని స్టార్టప్ ఎకోసిస్టమ్, చిన్న పారిశ్రామికవేత్తలు, ఈకామర్స్ ఎదుగుదలను తాను ప్రశంసించినందున గత 10 సంవత్సరాలు నమ్మశక్యం కానివని ఆయన వ్యాఖ్యానించారు. స్టార్టప్‌లు అభివృద్ధి చెందేందుకు వీలుగా స్థిరమైన పర్యావరణ వ్యవస్థను సులభతరం చేసినందుకు ప్రధానిని ఆయన ప్రశంసించారు. 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Muffler, cap, gloves: PM recalls gifts a New Zealander gave him 25-30 years ago

Media Coverage

Muffler, cap, gloves: PM recalls gifts a New Zealander gave him 25-30 years ago
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles the passing of legendary playback singer S. Janaki Amma
July 12, 2026

The Prime Minister, Shri Narendra Modi, has expressed deep grief over the passing of distinguished playback singer S. Janaki Amma.

The Prime Minister said that her passing is an irreparable loss to the world of music and culture. He noted that her songs in various languages were popular across generations and gave voice to every emotion with unparalleled grace and versatility.

Shri Modi said that her melodies will continue to enchant listeners in the years to come.

The Prime Minister wrote on X;

“The passing of the distinguished playback singer S. Janaki Amma is an irreparable loss to the world of music and culture. Her songs in various languages were popular across generations. They gave voice to every emotion with unparalleled grace as well as versatility. Her melodies will continue to enchant listeners in the years to come. My heartfelt condolences to her family, countless admirers and the entire music fraternity in this hour of grief. Om Shanti.”