ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివ‌ర్గం 10 సంవ‌త్స‌రాల కాలానికి ఉత్త‌ర్ పూర్వ రూపాంతర పారిశ్రామికీకరణ పథకం,2024 (ఉన్నతి– 2024)కు వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ, పరిశ్రమల ప్రోత్సాహం మరియు అంతర్గత వాణిజ్య ప్రతిపాదనను ఆమోదించింది. నోటిఫికేషన్‌ తేదీ నుండి 8 సంవత్సరాల పాటు మొత్తం రూ.10,037 కోట్ల వ్యయ బాధ్యతలకు కట్టుబడి ఉంటుంది.


కొత్త యూనిట్లను స్థాపించడానికి లేదా ఇప్పటికే ఉన్న యూనిట్ల గణనీయమైన విస్తరణను చేపట్టడానికి పెట్టుబడిదారులకు ఈ పథకం కింద ఈ క్రింది ప్రోత్సాహకాలు అందుబాటులో ఉంటాయి.

 
క్రమ సంఖ్య

జీఎస్టీ ఎక్కడ వర్తిస్తుంది

జీఎస్టీ ఎక్కడ వర్తించదు

 

1

క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ ఇన్సెంటివ్ (కొత్త & విస్తరిస్తున్న యూనిట్లు రెండింటికీ):


జోన్ ఏ: ప్లాంట్ మరియు మెషినరీ పెట్టుబడి  అర్హత విలువలో 30 % /బిల్డింగ్ నిర్మాణం & మన్నికైన భౌతిక ఆస్తులు రూ. 5 కోట్లు
 

జోన్ బి: ప్లాంట్ మరియు మెషినరీలో పెట్టుబడి యొక్క అర్హత విలువలో 50%/బిల్డింగ్ నిర్మాణం & మన్నికైన భౌతిక ఆస్తులు రూ. 7.5 కోట్లు

క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ ఇన్సెంటివ్ (కొత్త & విస్తరిస్తున్న యూనిట్లు రెండింటికీ):

 


జోన్ ఏ: ప్లాంట్ మరియు మెషినరీలో పెట్టుబడి యొక్క అర్హత విలువలో 30%/బిల్డింగ్ నిర్మాణం & మన్నికైన భౌతిక ఆస్తులు రూ. 10 కోట్లు
 

జోన్ బి: ప్లాంట్ మరియు మెషినరీలో పెట్టుబడి యొక్క అర్హత విలువలో 50%/బిల్డింగ్ నిర్మాణం & మన్నికైన భౌతిక ఆస్తులు రూ. 10 కోట్లు

2

కేంద్ర మూలధన వడ్డీ రాయితీ (కొత్త & విస్తరిస్తున్న యూనిట్లు రెండింటికీ):


జోన్ ఏ: 7 సంవత్సరాలకు 3% వడ్డీ రాయితీ అందించబడుతుంది
జోన్ బి: 5% వడ్డీ రాయితీ 7 సంవత్సరాలకు అందించబడుతుంది 

కేంద్ర మూలధన వడ్డీ రాయితీ (కొత్త & విస్తరిస్తున్న యూనిట్లు రెండింటికీ):

 

జోన్ ఏ: 7 సంవత్సరాలకు 3% వడ్డీ రాయితీ అందించబడుతుంది
జోన్ బి: 5% వడ్డీ రాయితీ 7 సంవత్సరాలకు అందించబడుతుంది
 

3

తయారీ & సేవల లింక్డ్ ఇన్సెంటివ్ (ఎంఎస్‌ఎల్‌ఐ)– కొత్త యూనిట్ల కోసం మాత్రమే – జీఎస్టీ నికర చెల్లింపుకు లింక్ చేయబడింది. అంటే జీఎస్టీ గరిష్ట పరిమితితో తక్కువ ఇన్‌పుట్ పన్ను క్రెడిట్ చెల్లించింది

 

జోన్ ఏ: పి&ఎం జోన్ బిలో పెట్టుబడి  అర్హత విలువలో 75%
: పి&ఎంలో పెట్టుబడి యొక్క అర్హత విలువలో 100%

శూన్యం

పథకంలోని అన్ని భాగాల నుండి ఒక యూనిట్‌కు గరిష్ట అర్హత ప్రయోజనాలు: రూ. 250 కోట్లు

 


వ్యయం:
నోటిఫికేషన్ తేదీ నుండి 10 సంవత్సరాల వరకు పథకం కాలానికి ప్రతిపాదిత పథకం యొక్క ఆర్థిక వ్యయం రూ.10,037 కోట్లు. (కమిట్ అయిన బాధ్యతలకు అదనంగా 8 సంవత్సరాలు). ఇది సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అవుతుంది. ఈ పథకాన్ని రెండు భాగాలుగా విభజించాలని ప్రతిపాదించారు. పార్ట్ ఏ అర్హత ఉన్న యూనిట్లకు (రూ.9737 కోట్లు) ప్రోత్సాహకాలను అందిస్తుంది మరియు పార్ట్ బి పథకం అమలు మరియు సంస్థాగత ఏర్పాట్లకు సంబంధించినది.(రూ. 300 కోట్లు).

లక్ష్యాలు:
ప్రతిపాదిత పథకం సుమారు 2180 దరఖాస్తులను ఊహించింది మరియు పథకం వ్యవధిలో దాదాపు 83,000 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేయబడింది. గణనీయమైన సంఖ్యలో పరోక్ష ఉపాధి కూడా ఏర్పడుతుందని అంచనా.

 పథకం యొక్క ముఖ్య లక్షణాలు:

 i. పథకం వ్యవధి: పథకం నోటిఫికేషన్ తేదీ నుండి మరియు 31.03.2034 వరకు 8 సంవత్సరాల కట్టుబడి బాధ్యతలతో పాటు అమలులో ఉంటుంది.

ii. రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు వ్యవధి: నోటిఫికేషన్ తేదీ నుండి 31.03.2026 వరకు పారిశ్రామిక యూనిట్ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అనుమతించబడుతుంది

iii. రిజిస్ట్రేషన్ మంజూరు: రిజిస్ట్రేషన్ కోసం అన్ని దరఖాస్తులను 31.03.2027లోపు పరిష్కరించాలి

iv. ఉత్పత్తి లేదా ఆపరేషన్ ప్రారంభం: అన్ని అర్హత కలిగిన పారిశ్రామిక యూనిట్లు రిజిస్ట్రేషన్ మంజూరు చేసినప్పటి నుండి 4 సంవత్సరాలలోపు తమ ఉత్పత్తి లేదా ఆపరేషన్‌ను ప్రారంభించాలి.

v. జిల్లాలు రెండు జోన్లుగా వర్గీకరించబడ్డాయి: జోన్ ఏ (పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన జిల్లాలు) & జోన్ B (పారిశ్రామికంగా వెనుకబడిన జిల్లాలు)

vi. నిధుల కేటాయింపు: పార్ట్ ఏ యొక్క 60% 8 ఎన్‌ఈ రాష్ట్రాలకు మరియు 40% ఫస్ట్-ఇన్-ఫస్ట్-అవుట్ (ఎఫ్‌ఐఎఫ్‌ఓ) ప్రాతిపదికన కేటాయించబడింది.

vii. సూక్ష్మ పరిశ్రమల కోసం (ఎంఎస్‌ఎంఈ పరిశ్రమ నిబంధనల ప్రకారం నిర్వచించబడింది) పి&ఎం గణనలో భవన నిర్మాణం మరియు క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ ఇన్సెంటివ్ కోసం ఖర్చులు ఉంటాయి.

viii. అన్ని కొత్త పారిశ్రామిక యూనిట్లు మరియు విస్తరిస్తున్న యూనిట్లు సంబంధిత ప్రోత్సాహకాలకు అర్హులు.


అమలు వ్యూహం:

రాష్ట్రాల సహకారంతో డిపిఐఐటీ ఈ పథకాన్ని అమలు చేస్తుంది. జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలో కింది కమిటీలు అమలు పర్యవేక్షిస్తాయి.

      I. సెక్రటరీ, డిపిఐఐటి(ఎస్‌ఐఐటి) నేతృత్వంలోని స్టీరింగ్ కమిటీ దాని మొత్తం ఆర్థిక వ్యయంలో పథకం యొక్క ఏదైనా వివరణపై నిర్ణయం తీసుకుంటుంది మరియు అమలు కోసం వివరణాత్మక మార్గదర్శకాలను జారీ చేస్తుంది.

     II. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని రాష్ట్ర స్థాయి కమిటీ, పారదర్శకత మరియు సమర్ధతకు భరోసా, అమలు, తనిఖీలు మరియు బ్యాలెన్స్‌లను పర్యవేక్షిస్తుంది.

   III. రాష్ట్ర సీనియర్ సెక్రటరీ (పరిశ్రమలు) నేతృత్వంలోని సెక్రటరీ స్థాయి కమిటీ, రిజిస్ట్రేషన్ మరియు ప్రోత్సాహకాల క్లెయిమ్‌ల సిఫార్సుతో సహా పథకాన్ని అమలు చేయడానికి బాధ్యత వహిస్తుంది.

 
నేపథ్యం:

ఈశాన్య ప్రాంతంలోని రాష్ట్రాల్లో పరిశ్రమల అభివృద్ధి మరియు ఉపాధి కల్పన కోసం భారత ప్రభుత్వం నూతన పారిశ్రామిక అభివృద్ధి పథకం ఉన్నతి(ఉత్తర పూర్వ పరివర్తన పారిశ్రామికీకరణ పథకం) 2024ను కేంద్ర రంగ పథకంగా రూపొందించింది. ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం లాభదాయకమైన ఉపాధిని సృష్టించడం. ఇది ఈ ప్రాంత సామాజిక-ఆర్థిక అభివృద్ధికి దారి తీస్తుంది. ఇది తయారీ మరియు సేవా రంగాలలో ఉత్పాదక ఆర్థిక కార్యకలాపాలను సృష్టిస్తుంది.

 కొత్త పెట్టుబడులను ఆకర్షించడం మరియు ఇప్పటికే ఉన్న వాటిని పెంపొందించడం ద్వారా ఉద్యోగాల కల్పన, నైపుణ్యాభివృద్ధి మరియు స్థిరమైన అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ఎన్‌ఈఆర్‌లో పారిశ్రామిక అభివృద్ధికి కొత్త ప్రాధాన్యత ఇవ్వాలి. అయినప్పటికీ ఎన్‌ఈఆర్‌ యొక్క పారిశ్రామిక వృద్ధి మరియు సహజమైన వాతావరణం మధ్య సరైన సమతుల్యతను కొనసాగించడానికి, పునరుత్పాదక శక్తి, ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు మొదలైన కొన్ని పరిశ్రమలు సానుకూల జాబితాలో ఉంచబడ్డాయి మరియు పర్యావరణానికి ఆటంకం కలిగించే సిమెంట్, ప్లాస్టిక్ మొదలైన కొన్ని రంగాలు ప్రతికూల జాబితాలో ఉన్నాయి.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Budget 2026 positions India to accelerate from volume-driven production to value-driven global leadership in Healthcare: Experts

Media Coverage

Budget 2026 positions India to accelerate from volume-driven production to value-driven global leadership in Healthcare: Experts
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares a Sanskrit Subhashitam emphasising the Power of Self-Confidence in Building a Developed India
February 03, 2026

Prime Minister Shri Narendra Modi today shared a Sanskrit Subhashitam emphasizing the transformative role of self-confidence in realizing the vision of a developed India.

In a post on X, he wrote:

"आत्मविश्वास वह शक्ति है, जिसके बल पर सब कुछ संभव है। विकसित भारत के सपने को साकार करने में देशवासियों की यही शक्ति बहुत काम आने वाली है।

श्रीर्मङ्गलात् प्रभवति प्रागल्भ्यात् सम्प्रवर्धते।

दाक्ष्यात् तु कुरुते मूलं संयमात् प्रतितिष्ठति॥ "