ఆమోదించిన సబ్సిడీ మొత్తం రూ.51,875 కోట్లు

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ సమావేశమైన కేంద్ర మంత్రిమండలి- ఎరువులపై సూక్ష్మ పోషకాధారిత సబ్సిడీ (ఎన్‌బీఎస్‌) పరిమితికి ఆమోదం తెలిపింది. ఈ మేరకు నత్రజని (ఎన్‌), భాస్వరం (పి), పొటాష్ (కె), గంధకం (ఎస్‌) సూక్ష్మ పోషక ఎరువులకుగాను కిలోగ్రాముకు వర్తించే సబ్సిడీపై కేంద్ర ఎరువుల మంత్రిత్వశాఖ ప్రతిపాదించిన రేట్లకు ఆమోదముద్ర వేసింది. తదనుగుణంగా రబీ సీజన్-2022-23 (01.10.2022 నుంచి 31.03.2023 వరకు)లో ఫాస్పేట్‌, పొటాష్‌, సల్ఫర్ ఎరువులపై సబ్సిడీ రేట్లు కిందివిధంగా ఉంటాయి.

సంవత్సరం

కిలోగ్రాముకు రూపాయలలో

రబీ 2022-23

(01.10.2022 నుంచి 31.03.2023 వరకు)

ఎన్‌

పి

కె

ఎస్‌

98.02

66.93

23.65

6.12

ఆర్థిక భారం

   రబీ-2022 (01.10.2022 నుండి 31.03.2023 వరకు)కుగాను మంత్రిమండలి ఆమోదించిన ‘ఎన్‌బీఎస్‌’ సబ్సిడీ మొత్తం రూ. 51,875 కోట్లు. కాగా, దేశవాళీ ఎరువుల (ఎస్‌ఎస్‌పి) రవాణాపై ఇచ్చే సబ్సిడీ కూడా ఇందులో భాగంగా ఉంటుంది.

ప్రయోజనాలు

   ఈ నిర్ణయంతో 2022-23 రబీలో రైతులకు ‘పి అండ్‌ కె’ ఎరువులన్నీ సబ్సిడీ/సరసమైన ధరలకు సజావుగా లభిస్తాయి. తద్వారా వ్యవసాయ రంగానికి చేయూత ఉంటుంది. ఆ మేరకు ఎరువులు, ముడి పదార్థాల అంతర్జాతీయ ధరలలో అస్థిరత్వ భారాన్ని ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది.

నేపథ్యం

   దేశంలోని ఎరువుల తయారీ/దిగుమతిదారుల ద్వారా రైతులకు సబ్సిడీ ధరతో యూరియా సహా 25 గ్రేడ్‌ల ఎరువులను ప్రభుత్వం అందుబాటులో ఉంచుతుంది. వీటిలో ‘పి అండ్‌ కె’ ఎరువులపై సబ్సిడీని 01.04.2010 నుంచి ‘ఎన్‌బీఎస్‌’ పథకం కింద పర్యవేక్షిస్తోంది. ఆ విధంగా తన కర్షకహిత విధానాలకు అనుగుణంగా రైతుకు సరసమైన ధరలతో ‘పి అండ్‌ కె’ ఎరువులు లభించేలా చూసే బాధ్యతను నిర్వర్తిస్తోంది. ఎరువులు, ఉత్పాదక సరంజామా.. అంటే- యూరియా, డిఎపి, ఎంఓపి, సల్ఫర్‌ల అంతర్జాతీయ ధరలు బాగా పెరిగిన నేపథ్యంలో రైతులపై భారం పడుతుంది. కాబట్టి ‘డిఎపి’ సహా ‘పి అండ్ కె’ ఎరువులపై సబ్సిడీ పెంపు ద్వారా ఆ భారాన్ని స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సరసమైన ధరతో రైతాంగానికి ఎరువులు లభ్యమయ్యేలా ఆమోదిత ధరల ప్రకారం ఎరువుల కంపెనీలకు సబ్సిడీ మొత్తాన్ని విడుదల చేస్తుంది.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
'Housing for all' by 2029: Centre approves Rs 10,021 crore fund for PMAY-G in 12 states

Media Coverage

'Housing for all' by 2029: Centre approves Rs 10,021 crore fund for PMAY-G in 12 states
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 3 జూన్ 2026
June 03, 2026

One Vision, Many Fronts: How PM Modi is Building Viksit Bharat Across Tech, Defense, Green Energy & Welfare