గౌరవనీయ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ, మార్కెటింగ్ సీజన్ 2024-25 కోసం అన్ని తప్పనిసరి రబీ పంటలకు కనీస మద్దతు ధరల (ఎంఎస్‌పి) పెంపునకు ఆమోదం తెలిపింది. సాగుదారులకు వారి ఉత్పత్తులకు లాభదాయకమైన ధరలను నిర్ధారించడానికి, మార్కెటింగ్ సీజన్ 2024-25 కోసం ప్రభుత్వం రబీ పంటల ఎంఎస్పిని పెంచింది. కందులు (మసూర్) క్వింటాల్‌కు రూ.425గా, రాప్‌సీడ్, ఆవాలు క్వింటాల్‌కు రూ.200 చొప్పున అత్యధికంగా ఎంఎస్‌పి పెరుగుదల ఆమోదించారు. గోధుమలు, కుసుమలకు క్వింటాల్‌కు రూ.150 చొప్పున పెంచేందుకు ఆమోదం తెలిపింది. బార్లీ, కందులకు వరుసగా క్వింటాల్‌కు రూ.115, క్వింటాల్‌కు రూ.105 చొప్పున పెంచడానికి ఆమోదించారు.

మార్కెటింగ్ సీజన్ 2024-25 కోసం అన్ని రబీ పంటలకు కనీస మద్దతు ధరలు:

(రూ.క్వింటాల్ కు)

క్రమ సంఖ్య 

పంట

ఎంఎస్‌పి ఆర్ఎంఎస్- 

2014-15

ఎంఎస్‌పి ఆర్ఎంఎస్-

 2023-24

ఎంఎస్‌పి ఆర్ఎంఎస్-

 2024-25

ఉత్పత్తి వ్యయం ఆర్ఎంఎస్ 2024-25

ఎంఎస్‌పిలో పెరుగుదల (సంపూర్ణంగా)

వ్యయంపై మార్జిన్ (శాతంలో..)

1

గోధుమ 

1400

2125

2275

1128

150

102

2

బార్లీ 

1100

1735

1850

1158

115

60

3

కాయధాన్యాలు 

3100

5335

5440

3400

105

60

4

కందులు 

(మసూర్)

2950

6000

6425

3405

425

89

5

రాప్‌సీడ్, ఆవాలు 

3050

5450

5650

2855

200

98

6

పొద్దుతిరుగుడు 

3000

5650

5800

3807

150

52

కూలిలు, ఎద్దు బళ్ళు/యంత్ర పరికరాల ఖర్చులు, భూమి లీజుకు తీసుకున్నందుకు చెల్లించిన అద్దె, విత్తనాలు, ఎరువులు, నీటిపారుదల ఛార్జీలు వంటి పదార్థ ఇన్‌పుట్‌ల వినియోగంపై అయ్యే ఖర్చులు వంటి అన్ని చెల్లించిన ఖర్చులను కలిగి ఉంటుంది. పనిముట్లు, వ్యవసాయ భవనాలపై తరుగుదల, వర్కింగ్ క్యాపిటల్‌పై వడ్డీ, పంపు సెట్ల నిర్వహణకు డీజిల్/విద్యుత్ మొదలైనవి, ఇతర ఖర్చులు, కుటుంబం మొత్తం కూలికి సంబంధించిన ఖర్చు.

మార్కెటింగ్ సీజన్ 2024-25 కోసం తప్పనిసరి రబీ పంటల కోసం  ఎంఎస్‌పి పెరుగుదల 2018-19 యూనియన్ బడ్జెట్‌కు అనుగుణంగా,  ఎంఎస్‌పి ని ఆల్-ఇండియా వెయిటెడ్ సగటు ఉత్పత్తి వ్యయం కంటే కనీసం 1.5 రెట్ల స్థాయిలో నిర్ణయించింది. ఆల్-ఇండియా వెయిటెడ్ సరాసరి ఉత్పత్తి వ్యయంపై అంచనా వేసిన మార్జిన్ గోధుమలకు 102 శాతం, దాని తర్వాత రాప్‌సీడ్ & ఆవాలకు 98 శాతం; కందులు 89 శాతం; పప్పులకు 60 శాతం; బార్లీకి 60 శాతం; కుసుమకు 52 శాతం. ఈ పెరిగిన రబీ పంటల  ఎంఎస్‌పి రైతులకు లాభదాయకమైన ధరలను నిర్ధారిస్తుంది.  పంటల వైవిధ్యతను ప్రోత్సహిస్తుంది. 

ఆహార భద్రతను పెంపొందించడానికి, రైతుల ఆదాయాన్ని పెంచడానికి, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి నూనెగింజలు, పప్పుధాన్యాలు, శ్రీ అన్న/మిల్లెట్ల వైపు పంటల వైవిధ్యాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ధరల విధానంతో పాటు,  నూనెగింజలు, పప్పుధాన్యాల సాగుకు రైతులను ప్రోత్సహించడానికి నాణ్యమైన విత్తనాలు, ఆర్థిక సహాయాన్ని అందించే లక్ష్యంతో ప్రభుత్వం జాతీయ ఆహార భద్రతా మిషన్ (ఎన్ఎఫ్ఎస్ఎం), ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్వై), నూనెగింజలు, నూనె పామ్ జాతీయ మిషన్ (ఎన్ఎంఓఓపి) వంటి అనేక కార్యక్రమాలను చేపట్టింది. ,
 

అంతేకాకుండా, కిసాన్ క్రెడిట్ కార్డ్ (కెసిసి) పథకం ప్రయోజనాలను దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి రైతుకు విస్తరించడానికి, ప్రభుత్వం లక్ష్యంతో కిసాన్ రిన్ పోర్టల్ (కేఆర్పి), కేసిసి ఘర్ ఘర్ అభియాన్,  వాతావరణ సమాచార నెట్‌వర్క్ డేటా సిస్టమ్స్ (విండ్స్) ప్రారంభించింది. రైతులు తమ పంటలకు సంబంధించి సకాలంలో నిర్ణయాలు తీసుకోవడంలో సాధికారత కల్పించేందుకు సకాలంలో  ఖచ్చితమైన వాతావరణ సమాచారాన్ని అందించడం. ఈ కార్యక్రమాలు వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు చేయడం, ఆర్థిక చేరికలను మెరుగుపరచడం, డేటా వినియోగాన్ని ఆప్టిమైజ్ చేయడం మరియు దేశవ్యాప్తంగా రైతుల జీవితాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India’s power sector set for strong FY27 growth on rising demand, capacity additions: Report

Media Coverage

India’s power sector set for strong FY27 growth on rising demand, capacity additions: Report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 20 జూలై 2026
July 20, 2026

Yuva to Global Stage: How PM Modi’s Policies Are Turning India’s Youth, Farms & Factories into Growth Engines