ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అదనంగా 3 కోట్ల గ్రామీణ-పట్టణ గృహాల నిర్మాణంపై నిర్ణయం వల్ల దేశంలో గృహ అవసరాలను తీర్చగలమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. అంతేగాక ప్రతి పౌరుడి  మెరుగైన జీవన ప్రమాణాలకు భరోసా ఇచ్చే దిశగా ప్రభుత్వ నిబద్ధతను ఈ నిర్ణయం సుస్పష్టం చేస్తున్నదని ఆయన పేర్కొన్నారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:

‘‘కోట్లాది భారతీయుల ‘జీవన సౌలభ్యం’, ఆత్మగౌరవానికి ఇదో ఉత్తేజం!...

ప్రధానమంత్రి ఆవాస్ యోజనను మరింత విస్తరించడం ద్వారా అదనంగా 3 కోట్ల గ్రామీణ-పట్టణ గృహాల నిర్మాణానికి మంత్రిమండలి నిర్ణయించింది. దేశంలో గృహావసరాలను తీర్చడంతోపాటు ప్రతి పౌరుడి మెరుగైన జీవన ప్రమాణానికి భరోసా ఇవ్వడంపై ప్రభుత్వ నిబద్ధతను ఈ నిర్ణయం చాటి చెబుతోంది. అలాగే సార్వజనీన వృద్ధి, సామాజిక సంక్షేమంపై మా ప్రభుత్వ చిత్తశుద్ధిని కూడా ‘పిఎంఎవై’ విస్తరణ నిర్ణయం ప్రస్ఫుటం చేస్తుంది’’ అని పేర్కొన్నారు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
e-Jagriti: Reimagining consumer justice for a Digital India

Media Coverage

e-Jagriti: Reimagining consumer justice for a Digital India
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 4 జూలై 2026
July 04, 2026

PM Modi’s Viksit Bharat Vision in Action: Modern Infrastructure, Strategic Strength & Economic Progress