29 జూన్ 2025 న జరిగిన ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం యొక్క 123 వ భాగంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
June 29th, 11:30 am
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. ‘మన్ కీ బాత్’ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మీ అందరికీ అభినందనలు. మీరందరూ యోగా శక్తితో, అంతర్జాతీయ యోగా దినోత్సవ జ్ఞాపకాలతో నిండిపోయి ఉండాలి. ఈసారి కూడా జూన్ 21వ తేదీన, మనదేశంతో పాటు ప్రపంచం నలుమూలల నుండి కోట్లాది మంది అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. మీకు గుర్తుందా! ఇది 10 సంవత్సరాల కిందట ప్రారంభమైంది. ఇప్పుడు 10 సంవత్సరాలలో ఈ ధోరణి ప్రతి సంవత్సరం మరింత గొప్పగా మారుతోంది. ఎక్కువ మంది ప్రజలు తమ దైనందిన జీవితంలో యోగాను అవలంబిస్తున్నారని ఇది సూచిస్తుంది. ఈసారి యోగా దినోత్సవ ఆకర్షణీయమైన చిత్రాలను మనం చాలా చూశాం. విశాఖపట్న సముద్ర తీరంలో మూడు లక్షల మంది కలిసి యోగా చేశారు. మరో అద్భుతమైన దృశ్యం కూడా విశాఖపట్నం నుండే వచ్చింది. రెండు వేలకు పైగా గిరిజన విద్యార్థులు 108 నిమిషాల పాటు 108 సూర్య నమస్కారాలు చేసిన దృశ్యమది. ఊహించుకోండి! ఎంత క్రమశిక్షణ, ఎంత అంకితభావం ఉండి ఉంటుందో! మన నావికాదళ నౌకల్లో కూడా గొప్ప యోగా ప్రదర్శన కనిపించింది. తెలంగాణలో మూడు వేల మంది దివ్యాంగులు కలిసి యోగా శిబిరంలో పాల్గొన్నారు. సాధికారతకు యోగా ఎలా మాధ్యమం అవుతుందో వారు నిరూపించారు. ఢిల్లీ ప్రజలు యోగాను పరిశుభ్రమైన యమునా సంకల్పంతో అనుసంధానించి, యమునా నది ఒడ్డుకు వెళ్లి యోగా చేశారు. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన అయిన జమ్మూ కాశ్మీర్లోని చీనాబ్ వంతెన వద్ద కూడా ప్రజలు యోగా చేశారు. హిమాలయాల మంచు శిఖరాల్లో ఐటీబీపీ సైనికులు చేసిన యోగా కనిపించింది. సాహసం, సాధన కలిసి సాగాయి. గుజరాత్ ప్రజలు కూడా కొత్త చరిత్రను సృష్టించారు. వడ్ నగర్లో 2121 మంది కలిసి భుజంగాసనం వేసి కొత్త రికార్డు సృష్టించారు. న్యూయార్క్, లండన్, టోక్యో, పారిస్ మొదలైన ప్రపంచంలోని ప్రతి పెద్ద నగరం నుండి యోగా చిత్రాలు వచ్చాయి. ప్రతి చిత్రంలో ఒక విషయం ప్రత్యేకంగా ఉంది. శాంతి, స్థిరత్వం, సమతుల్యత ఆ చిత్రాల్లో అంతర్భాగంగా ఉన్నాయి. ఈసారి థీమ్ కూడా చాలా ప్రత్యేకమైంది. యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్.. అంటే 'ఒక భూమి - ఒక ఆరోగ్యం'. ఇది కేవలం నినాదం కాదు. ఇది 'వసుధైవ కుటుంబకం' అని మనల్ని అనుభూతి చెందించే దిశ. ఈ సంవత్సరం యోగా దినోత్సవ గొప్పతనం ఖచ్చితంగా ఎక్కువ మందిని యోగాను స్వీకరించడానికి ప్రేరేపిస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమాన్ని బలపరుస్తూ ఢిల్లీలో భగవాన్ మహావీర్ వనస్థలి పార్కులో మొక్క నాటిన ప్రధానమంత్రి
June 05th, 01:33 pm
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా, మొక్కల పెంపకం కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమాన్ని బలపరచడంలో భాగంగా ఆయన ఢిల్లీలోని భగవాన్ మహావీర్ వనస్థలి పార్కులో ఒక మొక్కను నాటారు.పట్టణాల్లో స్వచ్ఛ, హరిత రవాణాను ప్రోత్సహించడానికి ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ప్రధానమంత్రి
June 05th, 12:46 pm
పట్టణ ప్రాంతాల్లో దీర్ఘకాలిక అభివృద్ధిని, హరిత రవాణా సాధనాలను ప్రోత్సహించే ధ్యేయంతో ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన ఒక కార్యక్రమంలో భాగంగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు.ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు న్యూఢిల్లీలోని తన నివాసంలో సిందూర్ మొక్కను నాటిన ప్రధానమంత్రి
June 05th, 11:50 am
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని తన నివాసంలో సిందూర్ మొక్కను నాటి దానికి నీళ్లు పోశారు. గుజరాత్లో కచ్ఛ్కు చెందిన సాహసిక మాతృమూర్తులు, సోదరీమణులు కానుకగా ఆయనకు అందజేసిన మొక్క అది. 1971లో భారత్-పాకిస్తాన్ యుద్ధ కాలంలో కచ్ఛ్కు చెందిన మాతృమూర్తులు, సోదరీమణులు మొక్కవోని ధైర్య-సాహసాలతో పాటు గొప్ప దేశభక్తిని ప్రదర్శించారు. ప్రధాని ఇటీవల గుజరాత్లో పర్యటించిన సంగతిని గుర్తుచేసుకున్నారు...నాకు బహుమతిగా ఇచ్చిన సిందూర్ మొక్క మన దేశ నారీశక్తి శౌర్యంతో పాటు ప్రేరణకు కూడా ఒక ప్రబలమైన ప్రతీకగా అలరారుతుందని ప్రధానమంత్రి అన్నారు.పర్యావరణ పరిరక్షణ పట్ల అంకితభావాన్ని మరింత పెంపొందించుకోవాలని దేశ పౌరులకు ప్రధాని పిలుపు
June 05th, 09:07 am
పర్యావరణ పరిరక్షణ పట్ల నిబద్ధతను దేశ పౌరులు మరింత పెంపొందించుకోవాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పర్యావరణాన్ని మరింత పచ్చగా, మెరుగ్గా మార్చేందుకు క్షేత్రస్థాయిలో సేవలు అందిస్తున్నవారిని అభినందించారు.ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు, ‘ఏక్ పేడ్ మాఁ కే నామ్’ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక మొక్కల పెంపకం కార్యక్రమానికి నేతృత్వం వహించనున్న ప్రధాని
June 04th, 01:20 pm
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా, గురువారం (జూన్ 5న) ఉదయం 10.15 గంటలకు న్యూఢిల్లీ లోని భగవాన్ మహావీర్ వనస్థలి పార్కులో చేపట్టే మొక్కల పెంపకం కార్యక్రమానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం వహించనున్నారు. పర్యావరణ సంరక్షణ, హరిత ప్రధాన రవాణా సదుపాయాలు .. వీటి పట్ల భారత్ నిబద్దతను ప్రధాని పునరుద్ఘాటించనున్నారు.రాజ్యాంగం మరియు ప్రజాస్వామ్య వ్యవస్థలపై అచంచలమైన విశ్వాసాన్ని పునరుద్ఘాటించినందుకు దేశప్రజలకు కృతజ్ఞతలు: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
June 30th, 11:00 am
మిత్రులారా! ఫిబ్రవరి నుండి ఇప్పటి వరకు నెలలో చివరి ఆదివారం వచ్చినప్పుడల్లా నేను మీతో ఈ సంభాషణను కోల్పోయినట్టు భావించాను. కానీ ఈ నెలల్లో మీరు నాకు లక్షలాది సందేశాలు పంపడం చూసి నేను చాలా సంతోషించాను. 'మన్ కీ బాత్' రేడియో కార్యక్రమం కొన్ని నెలలుగా జరగకపోవచ్చు. కానీ 'మన్ కీ బాత్' స్ఫూర్తి దేశంలో, సమాజంలో ప్రతిరోజూ నిస్వార్థ చింతనతో చేసే మంచి పనులను వ్యాప్తి చేస్తోంది. సమాజంపై సానుకూల ప్రభావాన్ని చూపే ఇలాంటి పనులు నిరంతరం కొనసాగాలి. ఎన్నికల వార్తల మధ్య ఇలాంటి హృదయాన్ని హత్తుకునే వార్తలను మీరు ఖచ్చితంగా గమనించి ఉంటారు.జి-7 విస్తృత సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం తెలుగు పాఠం
June 14th, 09:54 pm
మున్ముందుగా నన్ను ఈ శిఖరాగ్ర సదస్సుకు ఆహ్వానించడంతోపాటు అత్యంత గౌరవ మర్యాదలతో ఆత్మీయ ఆతిథ్యం ఇచ్చినందుకు ప్రధానమంత్రి మెలోనీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే చాన్సలర్ ఓలాఫ్ షోల్ట్స్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ జి-7 శిఖరాగ్ర సదస్సు ప్రత్యేకమైనదేగాక, దీనికెంతో చారిత్రక ప్రాధాన్యం కూడా ఉంది. ఆ మేరకు కూటమి 50వ వార్షికోత్సవం సందర్భంగా గౌరవనీయ మిత్రులైన జి-7 దేశాధినేతలందరికీ నా మనఃపూర్వక శుభాభినందనలు తెలుపుతున్నాను.జి-7 సదస్సులో కృత్రిమ మేధ ఇంధనం ఆఫ్రికా మధ్యధరా ప్రాంతం అంశాలపై విస్తృత సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం
June 14th, 09:41 pm
ఇటలీలోని అపులియాలో జి-7 సదస్సులో భాగంగా ఇవాళ కృత్రిమ మేధ, ఇంధనం, ఆఫ్రికా, మధ్యధరా ప్రాంతం తదితర అంశాలపై నిర్వహించిన విస్తృత సమావేశంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా తొలుత జి-7 కూటమి 50వ వార్షికోత్సవ మైలురాయిని అందుకోవడంపై ఆయన అభినందనలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ- మానవాళి చరిత్రలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య ప్రక్రియలో తాను మూడోసారి ఎన్నికైన తర్వాత ఈ శిఖరాగ్ర సదస్సుకు హాజరుకావడం తనకెంతో సంతృప్తినిచ్చిందని ప్రధాని హర్షం వెలిబుచ్చారు. మానవ కేంద్రక విధాన ప్రాతిపదికగా ఉన్నపుడే సాంకేతిక పరిజ్ఞానం విజయవంతం కాగలదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు సేవా ప్రదానం కోసం డిజిటల్ సాంకేతికత వినియోగంలో భారత్ సాధించిన విజయాలను సభికులతో ప్రధాని పంచుకున్నారు.‘ఏక్ పేడ్ మా కే నామ్’ ప్రచార ఉద్యమాన్ని ప్రారంభించిన ప్రధాన మంత్రి
June 05th, 02:21 pm
ప్రపంచ పర్యావరణ దినం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘ఏక్ పేడ్ మా కే నామ్’ ప్రచార ఉద్యమాన్ని ప్రారంభించారు. శ్రీ నరేంద్ర మోదీ దిల్లీ లోని బుద్ధ జయంతి పార్కు లో ఒక రావి మొక్క ను నాటారు. మన భూ గ్రహాన్ని మెరుగైంది గా మలచడం లో అందరు వారి వంతు తోడ్పాటు ను అందించవలసింది అంటూ ఆయన విజ్ఞప్తి చేశారు. గడచిన పది సంవత్సరాల లో భారతదేశం చేపట్టిన అనేక ఉమ్మడి ప్రయాస లు దేశం లో అటవీ ప్రాంత విస్తీర్ణం పెరిగేందుకు దారితీశాయి అని ఆయన అన్నారు. స్థిరమైన అభివృద్ధి దిశ లో మనం పడుతున్న తపన లో ఇది ఒక మహత్కార్యం అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2023 సందర్భంగా ప్రధాన మంత్రి వీడియో సందేశం
June 05th, 03:00 pm
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ, మన దేశానికి, ప్రపంచానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిర్మూలించాలన్నదే ఈ ఏడాది పర్యావరణ దినోత్సవ ఇతివృత్తం. గత 4-5 సంవత్సరాలుగా, ప్రపంచ చొరవ కంటే ముందే భారతదేశం ఈ సమస్యపై స్థిరంగా పనిచేస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిర్మూలించడానికి 2018లోనే భారత్ రెండు స్థాయిల్లో చర్యలు ప్రారంభించింది. ఒకవైపు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై నిషేధం విధిస్తూనే మరోవైపు ప్లాస్టిక్ వ్యర్థాల ప్రాసెసింగ్ ను తప్పనిసరి చేశాం. ఫలితంగా భారత్ లో దాదాపు 30 లక్షల టన్నుల ప్లాస్టిక్ ప్యాకేజింగ్ ను తప్పనిసరిగా రీసైక్లింగ్ చేస్తున్నారు. భారతదేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం వార్షిక ప్లాస్టిక్ వ్యర్థాలలో ఇది 75 శాతం. నేడు, సుమారు 10,000 మంది ఉత్పత్తిదారులు, దిగుమతిదారులు , బ్రాండ్ యజమానులు ఈ ప్రయత్నంలో చురుకుగా పాల్గొంటున్నారు.ప్రపంచ పర్యావరణ దినం అంశం పై ఏర్పాటైన సమావేశాన్నిఉద్దేశించి వీడియో సందేశం మాధ్యం ద్వారా ప్రసంగించిన ప్రధాన మంత్రి
June 05th, 02:29 pm
ప్రపంచ పర్యావరణ దినం అంశం పై ఏర్పాటు చేసిన ఒక సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో సందేశం మాధ్యం ద్వారా ప్రసంగించారు.జర్మనీలో జరిగిన జి7 సమ్మిట్లో 'స్ట్రాంగర్ టుగెదర్: అడ్రస్సింగ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ అడ్వాన్సింగ్ జెండర్ ఈక్వాలిటీ' సెషన్లో ప్రధానమంత్రి వ్యాఖ్యలు
June 27th, 11:59 pm
ప్రపంచ ఉద్రిక్తత వాతావరణం మధ్య మనం కలుస్తున్నాము. భారతదేశం ఎల్లప్పుడూ శాంతికి అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితిలో కూడా, మేము సంభాషణ మరియు దౌత్య మార్గాన్ని నిరంతరం కోరాము. ఈ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత ప్రభావం కేవలం యూరప్కే పరిమితం కాదు. ఇంధనం, ఆహార ధాన్యాల ధరలు పెరగడం అన్ని దేశాలపై ప్రభావం చూపుతోంది. అభివృద్ధి చెందుతున్న దేశాల ఇంధన మరియు భద్రత ముఖ్యంగా ప్రమాదంలో ఉన్నాయి. ఈ సవాలు సమయంలో, భారతదేశం అవసరమైన అనేక దేశాలకు ఆహార ధాన్యాలను సరఫరా చేసింది. మేము గత కొన్ని నెలల్లో ఆఫ్ఘనిస్తాన్కు మానవతా సహాయంగా సుమారు 35,000 టన్నుల గోధుమలను పంపాము. మరియు అక్కడ భారీ భూకంపం తర్వాత కూడా, సహాయ సామాగ్రిని అందించిన మొదటి దేశం భారతదేశం. మా పొరుగున ఉన్న శ్రీలంకకు కూడా ఆహార భద్రత కల్పించేందుకు మేము సహాయం చేస్తున్నాము.Prime Minister’s remarks at the session on ‘Investing in a better Future: Climate, Energy, Health’ at G7 Summit in Germany
June 27th, 07:47 pm
At the session on ‘Investing in a better Future: Climate, Energy, Health’ during G7 Summit in Germany, PM Modi said, There is a misconception that poor countries and poor people cause more damage to the environment. But, India’s history of over thousands of years completely refutes this view.లైఫ్ ఉద్యమ ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగం
June 05th, 07:42 pm
నా స్నేహితుడు శ్రీ బిల్ గేట్స్ కు, శ్రీ అనిల్ దాస్ గుప్తాకు భారతదేశ పర్యావరణశాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ లకు నమస్కారాలు..PM launches global initiative ‘Lifestyle for the Environment- LiFE Movement’
June 05th, 07:41 pm
Prime Minister Narendra Modi launched a global initiative ‘Lifestyle for the Environment - LiFE Movement’. He said that the vision of LiFE was to live a lifestyle in tune with our planet and which does not harm it.‘భూమి ని కాపాడే ఉద్యమం’ అంశం పై జూన్ 5న ఏర్పాటైన కార్యక్రమానికి హాజరు కానున్న ప్రధాన మంత్రి
June 04th, 09:37 am
ప్రపంచ పర్యావరణ దినం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘భూమి ని కాపాడే ఉద్యమం’ అనే అంశం పై జూన్ 5వ తేదీ నాడు ఉదయం 11 గంటల కు విజ్ఞాన్ భవన్ లో ఏర్పాటైన ఒక కార్యక్రమం లో పాలుపంచుకోనున్నారు. ఈ కార్యక్రమం లో భాగం గా ప్రధాన మంత్రి సభికుల ను ఉద్దేశించి ప్రసంగిస్తారు కూడాను.Start-ups are reflecting the spirit of New India: PM Modi during Mann Ki Baat
May 29th, 11:30 am
During Mann Ki Baat, Prime Minister Narendra Modi expressed his joy over India creating 100 unicorns. PM Modi said that start-ups were reflecting the spirit of New India and he applauded the mentors who had dedicated themselves to promote start-ups. PM Modi also shared thoughts on Yoga Day, his recent Japan visit and cleanliness.ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
June 05th, 11:05 am
కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు శ్రీమాన్ శ్రీ నితిన్ గడ్కరీ జీ, నరేంద్ర సింగ్ తోమర్జీ, ప్రకాష్ జవదేకర్ జీ, పీయూష్ గోయల్ జీ, ధర్మేంద్ర ప్రధాన్ జీ, ధర్మేంద్ర ప్రధాన్ జీ, గుజరాత్ లోని ఖేడా పార్లమెంటు సభ్యుడు, దేవుసింగ్ జసింగ్ భాయ్ చౌహాన్ జీ, హర్దోయ్ పార్లమెంటు సభ్యుడు, యుపి, భాయ్ జై ప్రకాష్ రావత్ జీ, పూణే మేయర్ ముర్లీధర్ మహుల్ జీ, పింప్రి చించ్వాడ్ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ సోదరి ఉషా జీ ఈ కార్యక్రమానికి హాజరైన ఇతర ప్రముఖులు మరియు నా ప్రియమైన సోదర సోదరీమణులు,ప్రపంచ పర్యావరణ దినం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
June 05th, 11:04 am
ప్రపంచ పర్యావరణ దినం సందర్భం లో పెట్రోలియమ్ & సహజ వాయువు మంత్రిత్వ శాఖ, పర్యావరణం, అడవులు, జలవాయు పరివర్తన మంత్రిత్వ శాఖ కలసి శనివారం నాడు ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు. ఈ కార్యక్రమం లో భాగం గా పుణే కు చెందిన ఒక రైతు తో ఆయన మాట్లాడారు. ఆ రైతు సేంద్రియ వ్యవసాయం తాలూకు తన అనుభవాన్ని, వ్యవసాయం లో బయో ఫ్యూయల్ వినియోగాన్ని గురించి వెల్లడించారు.