ఏప్రిల్ 14న ఉత్తరాఖండ్, యూపీల్లో పర్యటించనున్న ప్రధానమంత్రి
April 13th, 04:11 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 ఏప్రిల్ 14న ఉత్తరాఖండ్లోను, ఉత్తరప్రదేశ్లోను పర్యటించనున్నారు. ఉదయం సుమారు 11:15 గంటలకు ప్రధాని ఉత్తరప్రదేశ్లోని సహారన్పూర్ చేరుకొంటారు. ఢిల్లీ -డెహ్రాడూన్ ఆర్థిక కారిడార్ లో ఉన్నత భాగమైన వైల్డ్లైఫ్ కారిడార్ గురించి ప్రధానమంత్రి సమీక్షిస్తారు. ఉదయం దాదాపు 11:40 గంటలకు ప్రధాని డెహ్రాడూన్ సమీపంలో జై మా దాత్ కాళీ ఆలయాన్ని దర్శించుకొని, పూజ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తరువాత, ఇంచుమించు మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రధానమంత్రి డెహ్రాడూన్లో ఒక జనసభలో పాల్గొని, ఢిల్లీ-డెహ్రాడూన్ ఆర్థిక కారిడార్ ను ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.కోటా ఎయిర్పోర్ట్ భూమిపూజ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పీఎం చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం
March 07th, 03:15 pm
వారం కిందటే.. రాజస్థాన్ను సందర్శించే అవకాశం నాకు లభించింది. పవిత్రమైన అజ్మేర్ నుంచి వేలాది కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించాం. శంకుస్థాపనలు చేశాం. అదే కార్యక్రమంలో 21,000 మందికి పైగా రాజస్థాన్ యువతకు నియామక పత్రాలను అందించాం. అజ్మేర్ పర్యటన చేపట్టిన కొన్ని రోజుల వ్యవధిలోనే కోటాలో ముఖ్యమైన విమానాశ్రయ ప్రాజెక్టు పనులను ప్రారంభించే అవకాశం నాకు దక్కింది. ఒక వారంలోనే రాజస్థాన్లో ప్రారంభమైన ఈ రెండు ప్రధాన అభివృద్ధి కార్యక్రమాలు శక్తిమంతమైన సందేశాన్నిస్తున్నాయి. ప్రస్తుతం రాజస్థాన్ ఎంత వేగంగా పురోగతి సాధిస్తుందో ఇవి చూపిస్తున్నాయి. అది మౌలిక వసతులు, యువతకు ఉద్యోగావకాశాలు, రైతులు, మహిళలకు పథకాలైనా లేదా ప్రతి రంగంలోనూ చేపడుతున్న కార్యక్రమాలైనా రాజస్థాన్లో వేగంగా పని జరుగుతోంది.కోటా విమానాశ్రయానికి శంకుస్థాపన చేసిన ప్రధాని.. సమగ్రాభివృద్ధితో హడోటీ ప్రాంత రూపురేఖలు మారుతున్నాయన్న శ్రీ నరేంద్ర మోదీ
March 07th, 02:45 pm
హడోటీ ప్రాంత అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలవనున్న కోటా విమానాశ్రయ శంకుస్థాపన కార్యక్రమాన్నుద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘రాజస్థాన్ నేడు అపూర్వమైన వేగంతో ముందుకు సాగుతోంది. ఇక్కడ నిర్మించబోతున్న కొత్త విమానాశ్రయం ఈ ప్రాంత ఆర్థిక, పారిశ్రామికాభివృద్ధికి బలమైన చోదక శక్తిగా నిలవబోతోంది’’ అని శ్రీ మోదీ అన్నారు.ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా వన్యప్రాణుల సంరక్షణకు కట్టుబడి ఉన్నట్లు ప్రధానమంత్రి పునరుద్ఘాటన..
March 03rd, 08:56 am
ప్రపంచ వన్య ప్రాణి దినోత్సవాన్ని పాటించడం అంటే మన భూగ్రహాన్ని సమృద్ధం చేస్తున్న, మన అనుబంధ విస్తారిత వ్యవస్థలకు పోషణనిస్తున్న వన్యప్రాణుల్లోని అద్భుత వైవిధ్యాన్ని తలుచుకుంటూ పండుగ చేసుకోవడమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వర్ణించారు. ఈ రోజు వన్యప్రాణుల సంరక్షణ దిశగా పాటుపడుతున్న ప్రతి ఒక్కరి కృషిని గౌరవించడమే కాకుండా సంరక్షణ, మనుగడకు పూచీ పడే పద్ధతుల అనుసరణ, అభయారణ్యాల పరిరక్షణ.. వీటి విషయంలో మనం చూపుతున్న నిబద్ధతను పునరుద్ఘాటించే రోజు అని ఆయన అన్నారు.జనవరి 17, 18 తేదీలలో అస్సాంలో పర్యటించనున్న ప్రధానమంత్రి
January 16th, 02:51 pm
2026 జనవరి 17, 18 తేదీలలో అస్సాం రాష్ట్రంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పర్యటించనున్నారు.అంతర్జాతీయ చిరుత దినోత్సవం సందర్భంగా వన్యప్రాణి ప్రేమికులకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
December 04th, 09:43 am
ఇవాళ అంతర్జాతీయ చిరుత దినోత్సవం సందర్భంగా, చిరుత పులుల రక్షణకు అంకితమైన వన్యప్రాణి ప్రేమికులకు, సంరక్షకులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. చిరుతలను సంరక్షించటానికి, అవి వృద్ధి చెందగలిగే పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించాలన్న లక్ష్యంతో మూడేళ్ల కిందట మా ప్రభుత్వం ప్రాజెక్టు చీతాను ప్రారంభించింది. కోల్పోయిన పర్యావరణ వారసత్వాన్ని, జీవవైవిధ్యాన్ని బలోపేతం చేసేందుకు చేసిన ప్రయత్నమిది అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.వన్యమృగాల సంరక్షణలో ఎప్పటికీ అగ్రగామిగా భారత్: ప్రధానమంత్రి
March 09th, 12:10 pm
భారత్లో వన్యప్రాణి వైవిధ్యం సమృద్ధిగా ఉందని, ఇక్కడి సంస్కృతి వన్యమృగాలను గౌరవిస్తుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ‘‘మనం మన వన్యప్రాణులను పరిరక్షించుకోవడంతోపాటు భూగ్రహం చాలా కాలం పాటు మనుగడలో ఉండేటట్లు మన వంతు తోడ్పాటును అందించడంలో అన్ని దేశాల కన్నా ముందు నిలుద్దాం’’ అని శ్రీ మోదీ అన్నారు.వన్తారలో రోజు గడిపిన ప్రధాని మోదీ: ఆశతో అడవిని బాగు చేయడం
March 05th, 03:15 pm
మార్చి 4, 2025న, గుజరాత్లోని జామ్నగర్లో ఉన్న ఒక అద్భుతమైన వన్యప్రాణుల రక్షణ, పునరావాసం మరియు పరిరక్షణ కేంద్రం అయిన వన్తారను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. రిలయన్స్ జామ్నగర్ రిఫైనరీ కాంప్లెక్స్ లోపల 3,500 ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న వన్తార ప్రపంచంలోనే అతిపెద్ద సదుపాయంగా నిలుస్తుంది, 2,000 కంటే ఎక్కువ జాతులలో 1.5 లక్షలకు పైగా రక్షించబడిన, అంతరించిపోతున్న మరియు అంతరించిపోతున్న జంతువులకు అభయారణ్యాన్ని అందిస్తుంది. వన్తార కేవలం ఒక ఆశ్రయం మాత్రమే కాదు, నైతిక జంతు సంక్షేమం మరియు పర్యావరణ స్థిరత్వం పట్ల భారతదేశం యొక్క అభివృద్ధి చెందుతున్న నిబద్ధతకు నిదర్శనం.వన్యప్రాణులను సంరక్షించే, వాటిని ప్రమాదాల నుంచి రక్షించే, పునరాశ్రయాన్ని కల్పించే కేంద్రం ‘వన్తారా’ను ప్రారంభించిన ప్రధానమంత్రి
March 04th, 04:05 pm
వన్యప్రాణులను సంరక్షించడం, వాటిని ప్రమాదాల బారి నుంచి కాపాడడం, వన్యప్రాణులకు పునరాశ్రయాన్ని కల్పించడానికి ఉద్దేశించిన ‘వన్తారా’ కేంద్రాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్లోని జాంనగర్లో ఈ రోజు ప్రారంభించారు. శ్రీ అనంత్ అంబానీతోపాటు ఆయన బృందం దయాభరిత ప్రయత్నాలను శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. వన్తారా వన్యప్రాణుల సంక్షేమాన్ని, పర్యావరణ సుస్థిరత్వాన్ని ప్రోత్సహిస్తూనే వన్యప్రాణులకు ఒక సంరక్షణ కేంద్రంగా పనిచేస్తుందని ఆయన అభివర్ణించారు.వన్యప్రాణుల సంరక్షణ పట్ల దేశ నిబద్ధతను ప్రముఖంగా చాటిన ప్రధానమంత్రి
March 03rd, 07:14 pm
ఈరోజు ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా వివిధ వన్యప్రాణుల సంరక్షణ పట్ల దేశం పూర్తి నిబద్ధత కలిగి ఉందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ తెలిపారు. మైగవ్ఇండియా సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో చేసిన పోస్ట్ కు ప్రధానమంత్రి స్పందిస్తూ:ప్రధానమంత్రి అధ్యక్షతన గిర్లో నేడు నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్లైఫ్ ఏడో సమావేశం
March 03rd, 04:48 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు గుజరాత్లో గిర్ నేషనల్ పార్కును సందర్శించారు. అక్కడ నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ ఏడో సమావేశాన్ని నిర్వహించగా, ఆ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు.గత పదేళ్లలో, పులులు, చిరుతలు, ఖడ్గమృగాల జనాభా కూడా పెరిగింది.. ఇది వన్యప్రాణుల సంరక్షణకు మనం ఎంత ప్రాధాన్యాన్నిస్తున్నామో, వాటికి చాలా కాలం కొనసాగగల నివాసస్థానాలను కల్పించడానికి ఎంతగా కృషిచేస్తున్నామో సూచిస్తోంది: ప్రధానమంత్రి
March 03rd, 12:36 pm
గత పది సంవత్సరాల్లో పులులు, చిరుతలు, ఖడ్గమృగాల జనాభా పెరిగిందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ప్రధాని ఈ రోజు మాట్లాడుతూ, వన్యప్రాణులను సంరక్షించడానికి మనం ఎంత ప్రాధాన్యాన్నిస్తున్నామో, పర్యావరణానికి తక్కువ నష్టం కలిగిస్తూ ఎక్కువ కాలం కొనసాగగలిగే నివాసస్థానాలను వాటికి కల్పించడానికి ఎంతగా కృషిచేస్తున్నామో ఈ పరిణామం తెలియజేస్తోందన్నారు.నేడు ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం మన భూమి మీదున్న అపురూప జీవవైవిధ్యాన్ని పరిరక్షిస్తామన్న నిబద్ధతను పునరుద్ఘాటించిన ప్రధానమంత్రి
March 03rd, 08:37 am
ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం ఈ రోజు. మన భూగ్రహంలో అలరారుతున్న అపురూపమైన జీవవైవిధ్యాన్ని పరిరక్షించాలన్న నిబద్ధతను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.Experts and investors around the world are excited about India: PM Modi in Rajasthan
December 09th, 11:00 am
PM Modi inaugurated the Rising Rajasthan Global Investment Summit 2024 and Rajasthan Global Business Expo in Jaipur, highlighting India's rapid economic growth, digital advancements, and youth power. He emphasized India's rise as the 5th largest economy, doubling exports and FDI, and the transformative impact of tech-driven initiatives like UPI and DBT.PM Modi inaugurates Rising Rajasthan Global Investment Summit
December 09th, 10:34 am
PM Modi inaugurated the Rising Rajasthan Global Investment Summit 2024 and Rajasthan Global Business Expo in Jaipur, highlighting India's rapid economic growth, digital advancements, and youth power. He emphasized India's rise as the 5th largest economy, doubling exports and FDI, and the transformative impact of tech-driven initiatives like UPI and DBT.గిర్ ను గురించి, ఆసియా సింహాలను గురించి శ్రీ పరిమళ్ నాథ్ వానీ వ్రాసిన పుస్తకాన్ని అందుకొన్న ప్రధాన మంత్రి
July 31st, 08:10 pm
గిర్ ను గురించి, ఆసియా సింహాలను గురించి రాజ్య సభ సభ్యుడు శ్రీ పరిమళ్ నాథ్ వానీ వ్రాసిన ఒక కాఫీ టేబుల్ బుక్ ‘‘కాల్ ఆఫ్ ద గిర్’’ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వీకరించారు.భారతదేశం లో చిరుతపులులసంతతి వృద్ధి చెందడంపై సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
February 29th, 09:35 pm
భారతదేశం లో చిరుతపులుల సంతతి పెరిగినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. చిరుతపులుల సంఖ్య లో ఈ గణనీయ వృద్ధి జీవ వైవిధ్యం పట్ల భారతదేశానికి ఉన్న అచంచల సమర్పణ భావాన్ని కనబరుస్తోందనడాని కి ఒక నిదర్శన గా ఉంది అని ఆయన అన్నారు.వన్యప్రాణులపట్ల పౌరుల ట్వీట్ లకు జవాబిచ్చిన ప్రధాన మంత్రి
April 10th, 09:33 am
వన్యప్రాణుల పట్ల ప్రజల ఉత్సాహాన్ని గమనిస్తూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన మనోభావాల ను వెల్లడించారు.సీబీఐ వజ్రోత్సవ జూబ్లీ వేడుకల్లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
April 03rd, 03:50 pm
దేశ ప్రీమియం ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీగా మీరు 60 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ ఆరు దశాబ్దాలు ఖచ్చితంగా విజయాలతో నిండి ఉన్నాయి. సీబీఐ కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పుల సంకలనాన్ని కూడా ఈ రోజు విడుదల చేశారు. ఇన్నేళ్ల సీబీఐ ప్రయాణాన్ని ఇది చూపిస్తుంది.న్యూ ఢిల్లీ లో సెంట్రల్బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేశన్ యొక్క వజ్రోత్సవాల ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
April 03rd, 12:00 pm
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేశన్ (సిబిఐ) యొక్క వజ్రోత్సవాల ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో ఈ రోజు న ప్రారంభించారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్ వెస్టిగేశను ను భారత ప్రభుత్వం లోని దేశీయ వ్యవహారాల శాఖ ఒక తీర్మానం ద్వారా 1963 వ సంవత్సరం లో ఏప్రిల్ 1 వ తేదీ నాడు ఏర్పాటు చేసింది.