37వ అంతర్జాతీయ జీవశాస్త్ర ఒలింపియాడ్‌లో అద్భుత ప్రతిభ కనబరిచిన భారత బృందాన్ని అభినందించిన ప్రధానమంత్రి

July 19th, 07:11 pm

లిథువేనియాలోని విల్నియస్‌లో జరిగిన 37వ అంతర్జాతీయ బయాలజీ ఒలింపియాడ్‌లో అద్భుతమైన ప్రతిభ కనబరిచి, ఒక స్వర్ణ పతకం సహా మొత్తం నాలుగు పతకాలు సాధించిన భారత జట్టును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. భవ్య గున్వాల్, సౌమిల్ మైతీ, నిషిత్ కలని, అన్మోల్ కుమార్‌లు మాలిక్యులర్ బయాలజీ, బయోకెమిస్ట్రీ, సిస్టమాటిక్స్, ప్లాంట్ కంప్యూటేషనల్ బయాలజీ వంటి అంశాల్లో అపారమైన పరిజ్ఞానాన్ని ప్రదర్శించారన్నారు. వారి విజయం మరెందరో యువతను ఈ దిశగా ప్రోత్సహిస్తుందని శ్రీ మోదీ పేర్కొన్నారు.