పంజాబ్‌లోని జలంధర్ నుండి ₹5,470 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని మోదీ

July 17th, 03:45 pm

పంజాబ్‌లోని జలంధర్‌లో, ఆ ప్రాంతంలో రవాణా అనుసంధానాన్ని బలోపేతం చేయడం, ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరచడం మరియు ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేయడం లక్ష్యంగా ₹5,470 కోట్లకు పైగా విలువైన రైలు మరియు రహదారి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు మరియు వాటికి శంకుస్థాపన చేశారు.

భారత సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించే, పెంపొందించే దిశగా చేస్తున్న ప్రయత్నాలను ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

June 18th, 02:33 pm

భారత సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించేందుకూ, పెంపొందించేందుకూ మొదలుపెట్టిన ప్రయత్నాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు. సరికొత్త ఉత్సాహంతో భారత సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షిస్తూ, పండుగ చేసుకుంటూ, ముందుకు తీసుకుపోతున్నట్లు ఆయన తెలిపారు.

127 ఏళ్ల తర్వాత పవిత్ర పిప్రహ్వా అవశేషాల పునరాగమనాన్ని స్వాగతించిన ప్రధాని

July 30th, 02:44 pm

భగవాన్ బుద్ధుడి పవిత్ర పిప్రహ్వా అవశేషాలు 127 ఏళ్ల సుదీర్ఘ కాలం అనంతరం భారత్‌కు తిరిగి రావడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. సుసంపన్నమైన దేశ సాంస్కృతిక వారసత్వంలో గర్వించదగిన, ఆనందకరమైన క్షణంగా దీనిని అభివర్ణించారు.