శ్రీమతి విజయ మెహతా జీ కన్నుమూత.. సంతాపం తెలిపిన ప్రధానమంత్రి
July 01st, 11:41 am
శ్రీమతి విజయ మెహతా జీ మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని తెలిపారు. శ్రీమతి విజయ మెహతా గారు ఆధునిక మరాఠీ నాటక రంగ మార్గదర్శకుల్లో ఒకరనీ, సృజనాత్మకతకీ, కళాకౌశలానికీ మరో పేరనీ శ్రీ మోదీ ప్రశంసించారు. ఆమె నాటకాలూ, సినిమాలూ వివిధ తరాల నటులపైనా, దర్శకులపైనా, రంగస్థల ప్రేమికులపైనా ప్రభావాన్ని చూపాయని ఆయన అన్నారు.