Cabinet approves 4-laning of Badnawar–Timarwani NH-752D stretch of the Delhi Mumbai expressway in Madhya Pradesh

March 10th, 04:23 pm

The Cabinet Committee on Economic Affairs, chaired by PM Modi, has approved the development of a 4-lane corridor from Badnawar to Timarwani worth ₹3,839.42 crore. It will provide connectivity from Ujjain to the Timarwani interchange at the Delhi-Mumbai Expressway (DME). This will lower logistics costs, facilitate efficient movement of raw materials and finished goods and strengthen access to industrial hubs and MMLPs.

శ్రీ సంస్థాన్ గోకర్ణ పార్తగలి జీవోత్తమ్ మఠం 550వ వార్షికోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం

November 28th, 03:35 pm

ఈ రోజు ఈ పవిత్ర సందర్భంలో నా మనసు శాంతితో నిండిపోయింది. సాధువులు, మహర్షుల సమక్షంలో కూర్చోవడం ఒక ఆధ్యాత్మిక అనుభవం. ఇక్కడ పెద్ద సంఖ్యలో భక్తులు ఉండటం శతాబ్దాల నాటి ఈ మఠం శక్తిని మరింత బలోపేతం చేస్తుంది. ఈ వేడుకలో మీ మధ్య ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడికి రాకముందు, రామాలయం... వీర్ విఠల్ ఆలయాల్లో పూజలో పాల్గొనే భాగ్యం నాకు లభించింది. ఇక్కడి శాంతి, ప్రశాంత వాతావరణం ఈ వేడుక ఆధ్యాత్మిక సారాన్ని మరింతగా పెంచాయి.

గోవాలో జరిగిన శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాలి జీవోత్తమ్ మఠం 550వ వార్షికోత్సవంలో ప్రసంగించిన ప్రధానమంత్రి

November 28th, 03:30 pm

“శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాలి జీవోత్తమ్ మఠం 550వ వార్షికోత్సవాన్ని చేసుకుంటోంది. ఇది చాలా చారిత్రాత్మక సందర్భం. గత 550 సంవత్సరాలలో ఈ మఠం అనేక కల్లోల పరిస్థితులను ఎదుర్కొంది. తరాలు మారినా, కాలాలు మారినా.. దేశంతో పాటు సమాజంలో అనేక పరివర్తనలు వచ్చినా మఠం ఎప్పుడూ దిశను కోల్పోలేదు. దీనికి బదులు ఈ మఠం ప్రజలకు మార్గదర్శక కేంద్రంగా మారింది. మఠానికి ఉన్న గొప్ప గుర్తింపు ఏంటంటే.. చరిత్రతో గట్టిగా పాతుకుపోయి ఉన్నప్పటికీ కాలంతో పాటు మారుతూ ముందుకు కదులుతూనే ఉంది” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. మఠం స్థాపించటంలో ఉన్న స్ఫూర్తి ఈ రోజు కూడా అదే విధంగా సజీవంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఆ స్ఫూర్తే సాధనను సేవతో, సంప్రదాయాన్ని ప్రజా సంక్షేమంతో మిలితం చేస్తోందన్నారు. ‘జీవితానికి స్థిరత్వం, సమతుల్యత, విలువలను అందించడం’ అనే ఆధ్యాత్మికతకు ఉన్న నిజమైన భావనను తరతరాలుగా మఠం తెలియజేస్తోందని ప్రధాని అన్నారు. కష్ట సమయాల్లో కూడా సమాజాన్ని నిలబెట్టే బలానికి మఠం చేసిన 550 సంవత్సరాల ప్రయాణమే నిదర్శనమని ఆయన ఉద్ఘాటించారు. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకొని మఠాధిపతి శ్రీమద్ విద్యాధీశ తీర్థ స్వామీజీ, కమిటీలోని సభ్యులందరూ, ఈ వేడుకతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

మే 31న మధ్యప్రదేశ్‌లో ప్రధాని పర్యటన

May 30th, 11:15 am

లోకమాత దేవీ అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మే 31న మధ్యప్రదేశ్‌లో పర్యటించనున్నారు. భోపాల్‌లో ఉదయం 11:15 గంటలకు లోకమాత దేవీ అహల్యాబాయి మహిళా సశక్తికరణ్ మహాసమ్మేళనంలో ఆయన పాల్గొంటారు. భోపాల్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, శంకుస్థాపన చేసి, బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు- 2025 ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం

February 24th, 10:35 am

ముందుగా నేను ఇక్కడికి రావడం ఆలస్యమైనందుకు క్షమాపణలు కోరుతున్నాను. 10, 12వ తరగతి విద్యార్థులకు ఈ రోజు పరీక్షలున్నాయని నిన్న నేనిక్కడికి వచ్చినప్పుడు తెలిసింది. వారి పరీక్షల సమయం, రాజ్ భవన్ నుంచి నేను బయలుదేరే సమయం ఒకేసారి ఉన్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా రోడ్లను మూసేస్తే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవడానికి ఇబ్బందులు పడతారు. వారికి అసౌకర్యం కలగకుండా విద్యార్థులంతా పరీక్ష కేంద్రాలకు చేరుకున్నాకే రాజ్ భవన్ నుంచి బయలుదేరాలని నిర్ణయించుకున్నాను. అందుకే ఆలస్యమైంది. అలా కావాలనే నేను నా ప్రయాణాన్ని 15-20 నిమిషాలు ఆలస్యం చేశాను. ఇది మీకు కొంత అసౌకర్యాన్ని కలిగించింది. నన్ను మన్నించాలని మరోసారి మీ అందరినీ కోరుతున్నాను.

మధ్యప్రదేశ్ భోపాల్ లో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు-2025 ను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

February 24th, 10:30 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు మధ్యప్రదేశ్ భోపాల్ లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్-2025 (జీఐఎస్)ను ప్రారంభించారు. సదస్సుకు ఆలస్యంగా చేరుకున్నందుకు క్షమాపణలు తెలియచేసిన ప్రధాని, బోర్డు పరీక్షలకు హాజరయ్యే 10వ, 12వ తరగతి విద్యార్థులు, తన రాక కోసం ఇదే మార్గంలో చేసే భద్రతాపరమైన ఏర్పాట్ల వల్ల ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఆలస్యంగా బయలుదేరినట్లు చెప్పారు. భోజరాజు పాలించిన ప్రాంతంలో ఏర్పాటైన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు మదుపర్లను, వ్యాపారవేత్తలను ఆహ్వానించడం తనకు గర్వకారణమని శ్రీ మోదీ అన్నారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో వికసిత్ మధ్యప్రదేశ్ కీలకం కాబట్టి నేటి కార్యక్రమం ముఖ్యమైందని ప్రధాని అన్నారు. సదస్సు నిర్వహణ కోసం అద్భుతమైన ఏర్పాట్లను చేసిన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా శ్రీ మోదీ అభినందించారు.

Maha Kumbh is a divine festival of our faith, spirituality and culture: PM in Prayagraj

December 13th, 02:10 pm

PM Modi inaugurated development projects worth ₹5500 crore in Prayagraj, highlighting preparations for the 2025 Mahakumbh. He emphasized the cultural, spiritual, and unifying legacy of the Kumbh, the government's efforts to enhance pilgrimage facilities, and projects like Akshay Vat Corridor and Hanuman Mandir Corridor.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ చేతుల మీదుగా ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో రూ.5500 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభం

December 13th, 02:00 pm

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ రాజ్‌లో రూ.5500 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యే వారిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని, పవిత్ర సంగమ ప్రాంతమైన ప్రయాగరాజ్‌కు, మహాకుంభమేళాకు వచ్చే సాధువులు, సన్యాసులకు భక్తితో నమస్కరించారు. కృషి, అంకితభావంతో మహా కుంభమేళాను విజయవంతం చేస్తున్న ఉద్యోగులు, శ్రామికులు, పారిశుద్ధ్య కార్మికులకు శ్రీ మోదీ కృతజ్ఞతలు తెలిపారు. మహా కుంభమేళా జరిగే పరిమాణాన్ని, స్థాయి గురించి వివరిస్తూ, 45 రోజుల పాటు సుదీర్ఘంగా సాగే మహాయజ్ఞంగా, ప్రతి రోజూ లక్షల మంది భక్తుల పాల్గొనే, ప్రపంచంలోనే అతి పెద్ద కార్యక్రమంగా దీన్ని అభివర్ణించారు. ‘‘ప్రయాగరాజ్ నేలపై సరికొత్త చరిత్ర లిఖితమవుతోంది’’ అని ప్రధానమంత్రి అన్నారు. వచ్చే ఏడాది జరగబోతున్న మహా కుంభమేళా దేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక గుర్తింపును నూతన శిఖరాలకు తీసుకెళుతుందతని, ఈ ఐక్యత ‘మహాయజ్ఞం’ గురించి ప్రపంచమంతా చర్చిస్తుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. మహా కుంభమేళాని విజయవంతంగా నిర్వహించాలన్నారు.

Assam will become the gateway to tourism in the North East: PM Modi

February 04th, 12:00 pm

PM Modi inaugurated and laid the foundation stone for projects worth Rs 11,000 crores in Guwahati, Assam. Highlighting the significance of Indian pilgrimage sites and temples, PM Modi emphasized that these places symbolize an indelible mark of our civilization over thousands of years, showcasing how Bharat has held on to every crisis it has faced.

అస్సాంలోని గౌహ‌తిలో రూ. 11,000 కోట్ల విలువైన అభివృద్ధి ప‌థ‌కాల‌కు శంకుస్థాప‌న‌లు చేసిన ప్ర‌ధాన మంత్రి

February 04th, 11:30 am

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈరోజు అస్సాంలోని గౌహ‌తిలో రూ. 11,000 కోట్ల విలువైన ప‌థ‌కాల‌కు శంకుస్థాప‌న చేశారు. గౌహతిలో స్పోర్ట్స్ & మెడికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, కనెక్టివిటీని పెంపొందించే ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. స‌మావేశాన్ని ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగిస్తూ, 11,000 కోట్ల రూపాయ‌ల విలువైన ప‌థ‌కాల‌కు ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన చేసేందుకు మా కామాఖ్య ఆశీర్వాదంతో ఈరోజు అస్సాంలో ఉన్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. నేటి అభివృద్ధి ప్రాజెక్టులు ఈశాన్య రాష్ట్రాలతో పాటు ఆగ్నేయాసియాలోని పొరుగు దేశాలకు అస్సాం కనెక్టివిటీని పెంచుతాయని, అలాగే పర్యాటక రంగంలో ఉపాధిని పెంచుతుందని, రాష్ట్రంలోని క్రీడా ప్రతిభకు కొత్త అవకాశాలను సృష్టిస్తుందని ఆయన అన్నారు. నేటి అభివృద్ధి ప్రాజెక్టుల కారణంగా రాష్ట్రంలో వైద్య విద్య మరియు ఆరోగ్య సంరక్షణ రంగానికి విస్తరణ గురించి కూడా ఆయన ప్రస్తావించారు. నేటి అభివృద్ధి ప్రాజెక్టు కోసం అస్సాం మరియు ఈశాన్య ప్రాంత ప్రజలను ప్రధాని మోదీ అభినందించారు తనకు ఘన స్వాగతం పలికిన గౌహతి పౌరులకు ధన్యవాదాలు తెలిపారు.

Art is pro-nature, pro-environment and pro-climate: PM Modi

December 08th, 06:00 pm

PM Modi inaugurated the first Indian Art, Architecture & Design Biennale (IAADB) 2023 being held at Red Fort. During the programme, the Prime Minister inaugurated the ‘Aatmanirbhar Bharat Centre for Design’ at Red Fort and the student Biennale- Samunnati. He also launched a Commemorative Stamp. PM Modi also took a walkthrough of the exhibition showcased on the occasion.

ఢిల్లీలో భారతీయ కళలు.. వాస్తు-నిర్మాణ తొలి ద్వైవార్షిక వేడుకలు-2023కు ఎర్రకోట వద్ద ప్రధాని ప్రారంభోత్సవం

December 08th, 05:15 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ న్యూఢిల్లీలో భారతీయ కళలు.. వాస్తు-నిర్మాణ తొలి ద్వైవార్షిక వేడుకలు (ఐఎఎడిబి)-2023ను ఎర్రకోట వద్ద ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ‘ఆత్మనిర్భర్ భారత్ సెంటర్ ఫర్ డిజైన్’ (ఎబిసిడి)తోపాటు విద్యార్థుల ద్వైవార్షిక వేడుకలు ‘సమున్నతి’ని కూడా ప్రధాని ప్రారంభించారు. అలాగే ఈ వేడుకల స్మారక తపాలా బిళ్లను ఆవిష్కరించి, ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించారు. కాగా, ఢిల్లీ నగర సాంస్కృతిక ప్రాముఖ్యాన్ని ‘ఐఎఎడిబి’ ప్రపంచానికి పరిచయం చేస్తుంది. అనంతరం ప్రధాని ప్రసంగిస్తూ- ప్రపంచ వారసత్వ ప్రదేశమైన ఎర్రకోటను సందర్శనకు ప్రతి ఒక్కరినీ ఆహ్వానించారు. దేశ స్వాతంత్ర్యానికి ముందు.. తర్వాత అనేక తరాలు గతించినా ఈ కోట ప్రాంగణానికిగల చారిత్రక ప్రాశస్త్యం ఎన్నటికీ చెరగనిదిగా, అచంచలంగా నిలిచి ఉందని ఆయన వివరించారు.

హైదరాబాద్‌లో కోటి దీపోత్సవంలో పాల్గొన్న ప్రధాని మోదీ

November 27th, 08:18 pm

తెలంగాణలోని హైదరాబాద్‌లో జరిగిన కోటి దీపోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగించారు. కోవిడ్ మహమ్మారి యొక్క క్లిష్ట సమయంలో కూడా, అన్ని సంబంధిత సమస్యలు మరియు సవాళ్లను అధిగమించడానికి మేము దీపాలను వెలిగించాము” అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రజలు విశ్వసించి, ‘స్థానికులకు స్వరం’ పలికినప్పుడు, లక్షలాది మంది భారతీయుల సాధికారత కోసం వారు దియాను కాల్చేస్తారని ఆయన వ్యాఖ్యానించారు. ఉత్తరాఖండ్‌లోని సొరంగంలో చిక్కుకున్న వివిధ శ్రామిక్‌ల క్షేమం కోసం ఆయన ప్రార్థించారు.

మథురలో సంత్ మీరా బాయి 525వ జయంతి సందర్భంగా ప్రధాని ప్రసంగం

November 23rd, 07:00 pm

ఈ కార్యక్రమంలో గౌరవనీయులైన బ్రజ్ సాధువులు, ఉత్తర ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారు, మా ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు, అనేక మంది క్యాబినెట్ సభ్యులు, మథుర పార్లమెంటు సభ్యురాలు, సోదరి హేమమాలిని గారు, మరియు నా ప్రియమైన బ్రజ్ నివాసితులు!

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మ‌ధురా నగరంలో సాధ్వి మీరాబాయి జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రధానమంత్రి

November 23rd, 06:27 pm

ఉత్తరప్రదేశ్‌లోని మధురలో ఇవాళ సాధ్వి మీరాబాయి 525వ జయంతి వార్షికోత్సవంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. అలాగే ఆమె గౌరవార్థం స్మారక తపాలా బిళ్లతోపాటు నాణాన్ని ఆయన ఆవిష్కరించారు. వేడుకల్లో భాగంగా అక్కడ ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను, సాంస్కృతిక కార్యక్రమాన్ని తిలకించారు. సాధ్వి మీరాబాయి స్మృత్యర్థం ఏడాది పొడవునా నిర్వహించే ఉత్సవాలు ఈ కార్యక్రమాలతో ప్రారంభమయ్యాయి.

PM Modi campaigns in Madhya Pradesh’s Betul, Shajapur and Jhabua

November 14th, 11:30 am

Amidst the ongoing election campaigning in Madhya Pradesh, Prime Minister Modi’s rally spree continued as he addressed multiple public meetings in Betul, Shajapur and Jhabua today. PM Modi said, “In the past few days, I have traveled to every corner of the state. The affection and trust towards the BJP are unprecedented. Your enthusiasm and this spirit have decided in Madhya Pradesh – ‘Phir Ek Baar, Bhajpa Sarkar’. The people of Madhya Pradesh will come out of their homes on 17th November to create history.”

మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా ప్రచారంలో యువత పాల్గొనడం చాలా ప్రోత్సాహకరంగా ఉంది: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

July 30th, 11:30 am

నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. 'మన్ కీ బాత్' కార్యక్రమానికి మీ అందరికీ సాదర స్వాగతం. జులై నెల అంటే వర్షాకాలం, వర్షాల నెల. ప్రకృతి వైపరీత్యాల కారణంగా గత కొన్ని రోజులుగా బాధాకరమైన, ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. యమునాతో పాటు వివిధ నదుల్లో వరదలు పోటెత్తడంతో పలు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొండ ప్రాంతాలలో కొండచరియలు కూడా విరిగిపడ్డ సంఘటనలు జరిగాయి. మరోవైపు కొంతకాలం క్రితం దేశంలోని పశ్చిమ ప్రాంతంలో-గుజరాత్ లోని వివిధ ప్రదేశాలలో బిపార్జాయ్ తుఫాను వచ్చింది. మిత్రులారా!ఈ విపత్తుల మధ్య, మనమందరం దేశవాసులం మరోసారి సామూహిక కృషి శక్తిని చూపించాం. స్థానిక ప్రజలు, ఎన్. డి. ఆర్. ఎఫ్. జవాన్లతో పాటు స్థానిక అధికార యంత్రాంగం విపత్తులను ఎదుర్కోవడానికి రాత్రింబగళ్లు శ్రమించింది. ఏ విపత్తునైనా ఎదుర్కోవడంలో మన సామర్థ్యం, వనరుల పాత్ర ప్రధానమైంది. కానీ దాంతోపాటే మన స్పందన, పరస్పరం సహకరించుకునే స్ఫూర్తి కూడా అంతే ముఖ్యం. ప్రజలందరూ బాగుండాలన్న సర్వజన హితాయ భావన భారతదేశానికి గుర్తింపు, భారతదేశ బలం.

నేపాల్ ప్రధాన మంత్రి పర్యటన సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పత్రికా ప్రకటన

June 01st, 12:00 pm

ముందుగా నేను ప్రధాన మంత్రి ప్రచండ గారికి, ఆయన ప్రతినిధి బృందానికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాను. తొమ్మిదేళ్ల క్రితం, 2014లో, అధికారం చేపట్టిన మూడు నెలల్లోనే నేను తొలిసారి నేపాల్ లో పర్యటించాను. ఆ సమయంలో భారత్-నేపాల్ సంబంధాలు, హిట్- హైవేలు, ఐ-వేస్, ట్రాన్స్ వేస్ కోసం 'హిట్' ఫార్ములా ఇచ్చాను. మన సరిహద్దులు మన మధ్య అడ్డంకిగా మారకుండా భారత్, నేపాల్ మధ్య సంబంధాలు నెలకొల్పుతామని చెప్పాను. ట్రక్కులకు బదులు పైపులైన్ ద్వారా చమురు ఎగుమతి చేయాలి. భాగస్వామ్య నదులపై వంతెనలు నిర్మించాలి. నేపాల్ నుంచి భారత్ కు విద్యుత్ ను ఎగుమతి చేసే సౌకర్యాలు కల్పించాలి.

న్యూఢిల్లీలో అధీనంతో ముఖాముఖిలో ప్రధాని ప్రసంగం

May 27th, 11:31 pm

ముందుగా శిరస్సు వంచి వివిధ 'ఆధీనాలతో' సంబంధం ఉన్న మీలాంటి మహర్షులందరికీ నమస్కరిస్తున్నాను. ఈ రోజు మీరు నా నివాసంలో ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను. శివుని అనుగ్రహం వల్లనే నీలాంటి శివభక్తులందరినీ కలిసి చూసే అవకాశం నాకు లభించింది. రేపు కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి మీరంతా స్వయంగా వచ్చి మీ ఆశీస్సులు కురిపించబోతున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను.

కొత్త పార్లమెంటు భవనంలో సెంగోల్ ప్రతిష్టాపన కు ముందు అధీనం స్వాముల ఆశీస్సులు అందుకున్న ప్రధాన మంత్రి

May 27th, 09:14 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కొత్త పార్లమెంటు భవనంలో సెంగోల్ ప్రతిష్టకు ముందు అధీనమ్ స్వాముల ఆశీస్సులు అందుకున్నారు. అధీనమ్లను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి, వారు స్వయంగా ప్రధాని నివాసానికి రావడం గొప్ప అదృష్టమని అన్నారు. పరమశివుని ఆశీస్సుల వల్లే తాను ఆయన శిష్యులందరితో ఒకేసారి సంభాషించగలిగానని ప్రధాన మంత్రి అన్నారు. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి అదీనాలు హాజరై ఆశీస్సులు అందించనుండడం సంతోషదాయకం అని ప్రధాని అన్నారు.