చంద్రశేఖర్ ఆజాద్ జయంతి... శ్రద్ధాంజలి అర్పించిన ప్రధానమంత్రి
July 23rd, 08:22 am
చంద్రశేఖర్ ఆజాద్ జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. చంద్రశేఖర్ ఆజాద్ నిర్భయత్వాన్ని, ధైర్య సాహసాల్ని, తిరుగులేని దేశభక్తిని చాటి భారతదేశ స్వాతంత్య్రక సమర చరిత్రలో గౌరవాన్విత స్థానాన్ని సొంతం చేసుకున్నారని ప్రధానమంత్రి ప్రశంసించారు.లోకమాన్య తిలక్ జయంతి సందర్భంగా నివాళి అర్పించిన ప్రధానమంత్రి
July 23rd, 08:12 am
లోకమాన్య తిలక్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో మహోన్నత వ్యక్తిగా లోకమాన్య తిలక్ జాతీయ భావాన్ని మేల్కొలిపారని, ప్రజాసేవకు తమను తాము అంకితం చేసుకొనేలా తరతరాలకు స్ఫూర్తినందించారని ప్రధాని కొనియాడారు.విశిష్ట విప్లవకారుడు శ్రీ మంగళ్ పాండేకి ప్రధానమంత్రి నివాళి
July 19th, 10:55 am
విశిష్ట విప్లవకారుడు శ్రీ మంగళ్ పాండే జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఆయనకు నివాళి అర్పించారు. బ్రిటిష్ పాలకులపై తిరుగుబాటులో శ్రీ పాండే ప్రదర్శించిన ధైర్యసాహసాలు భారతీయులందరికీ గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఆయన శౌర్యగాథ తరతరాలకూ స్ఫూర్తినిస్తూనే ఉంటుందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా పీఎం ప్రసంగానికి తెలుగు అనువాదం
July 06th, 06:47 pm
కేంద్ర క్యాబినెట్లో సహ మంత్రులు అమిత్ భాయ్ షా, గజేంద్ర సింగ్ షెకావత్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి, బీజేపీ సీనియర్ సభ్యులు, నాలాంటి లక్షలాది మంది కార్యకర్తలకు స్ఫూర్తిగా నిలిచే శ్రీ మఖన్లాల్ జీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శమిక్ భట్టాచార్య, గౌరవ ప్రజా ప్రతినిధులు, విశిష్ట అతిథులు, సోదరీ సోదరులారా!డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
July 06th, 06:17 pm
డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతిని పురస్కరించుకుని ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో సందేశం ద్వారా సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ముందుగా నిర్ణయించిన ప్రయాణాల కారణంగా స్వయంగా హాజరుకాలేకపోతున్నట్లు చెప్పిన ఆయన.. ఇలాంటి ఒక చరిత్రాత్మక సందర్భంలో భౌగోళిక అడ్డంకులను అధిగమించటంలో డిజిటల్ అనుసంధానత అద్భుతమైన పాత్ర పోషిస్తోందని అన్నారు. సాంకేతికత సహాయంతో నేను ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో మీతో భాగస్వామిని అవుతున్నాను అని ఆయన పేర్కొన్నారు.శ్రీ రామ్ విలాస్ పాశ్వాన్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నివాళి
July 05th, 12:09 pm
కేంద్ర మాజీ మంత్రి శ్రీ రామ్ విలాస్ పాశ్వాన్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఆయనకు నివాళి అర్పించారు. సమాజంలోని అణగారిన-బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన అవిరళ కృషి చేశారని పేర్కొన్నారు. ప్రజలకు, దేశానికి సేవ చేయడంలో ఆయన అంకితభావం సదా స్మరణీయమని వ్యాఖ్యానించారు.స్వామి వివేకానంద నిర్వాణ దినోత్సవ సందర్భంగా ప్రధానమంత్రి నివాళులు
July 04th, 01:50 pm
నేడు స్వామి వివేకానంద నిర్వాణ దినోత్సవం (మహాసమాధి దినం) సందర్భంగా ఆయనకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులర్పించారు. దేశపు సంపన్న సాంస్కృతిక వారసత్వానికి, ఆధ్యాత్మిక సంప్రదాయాలకు, జాతీయ చైతన్యానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకురావడంలో స్వామి వివేకానంద చేసిన అసాధారణ కృషి తరతరాలకూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ప్రధాని కొనియాడారు. ఆయన అపారమైన జ్ఞానం, శాశ్వతమైన ఆదర్శాలు నేటికీ దేశంలోని లక్షలాది మంది యువతకు మార్గదర్శకంగా ఉన్నాయని పేర్కొన్నారు. ‘‘దేశాన్ని వికసిత భారత్గా తీర్చిదిద్దాలనే మన సామూహిక సంకల్పానికి, స్వామిజీ అందించిన ఆధ్యాత్మిక సందేశం నిరంతరం సరికొత్త శక్తిని, స్ఫూర్తిని అందిస్తూనే ఉంటుంది’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.హుల్ దివస్ సందర్భంగా వీర యోధులకు ప్రధానమంత్రి నివాళులు
June 30th, 06:10 pm
నేడు హుల్ దివస్ సందర్భంగా విదేశీ పాలన అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన సిదో-కన్హూ, చాంద్-భైరవ్, ఫూలో-ఝానో వంటి వీర యోధులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఘన నివాళులర్పించారు. గిరిజన ఆత్మగౌరవం, మర్యాదను కాపాడటం కోసం వారు చేసిన పోరాటం, త్యాగాల గాథ దేశ ప్రజల హృదయాల్లో నిరంతరం సరికొత్త శక్తిని నింపుతూనే ఉంటుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.వీర్ సావర్కర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నివాళులు సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి
May 28th, 09:52 am
నేడు వీర్ సావర్కర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన్ను స్మరించుకున్నారు. సావర్కర్ అసాధారణ ధైర్యసాహసాలకు, దేశభక్తికి, సమాజ సంస్కరణలకు ఆయన చేసిన కృషికి ఈ సందర్భంగా నివాళులు అర్పించారు.గుజరాత్లోని సోమనాథ్ వద్ద సర్దార్ వల్లభభాయ్ పటేల్కు నివాళి అర్పించిన ప్రధాని
May 11th, 03:55 pm
గుజరాత్లోని సోమనాథ్ వద్ద సర్దార్ వల్లభభాయ్ పటేల్కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వకంగా నివాళులు అర్పించారు.ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి.. నివాళులు అర్పించిన ప్రధానమంత్రి
February 19th, 08:48 am
ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఆ దూరదర్శి నేత,అసాధారణ పరిపాలకుడు, వ్యూహ రచన నిపుణుడు, స్వరాజ్య యోధునికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు.పండిత్ దీన్దయాళ్ ఉపాధ్యాయ్ జీకి శ్రద్ధాంజలి ఘటించిన ప్రధానమంత్రి
February 11th, 10:19 am
పండిత్ దీన్దయాళ్ ఉపాధ్యాయ్ జీ వర్ధంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. పండిత్ దీన్దయాళ్ ఉపాధ్యాయ్ ఆదర్శాలూ, విలువలపై ఆధారపడిన ఆయన ఆలోచనలూ దేశంలో ప్రతి తరానికీ మార్గదర్శనం చేస్తున్నాయని శ్రీ మోదీ అన్నారు.జాతిపిత మహాత్మాగాంధీకి ప్రధానమంత్రి నివాళి
January 30th, 10:41 am
జాతిపిత మహాత్మాగాంధీ వర్థంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు నివాళులు అర్పించారు. స్వదేశీ భావనకు బాపు ఎల్లప్పుడూ ప్రాధాన్యమిచ్చేవారని, ఇదే అభివృద్ధి చెందిన, స్వావలంబన సాధించిన భారత్ అనే సంకల్పానికి మూలాధారమని శ్రీ మోదీ అన్నారు. ‘‘ఆయన వ్యక్తిత్వం, చేసిన పనులు కర్తవ్య మార్గంలో నడిచేలా ఈ దేశ ప్రజలను ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉంటాయి’’ అని శ్రీ మోదీ చెప్పారు.భారతరత్న డాక్టర్ ఎంజీ రామచంద్రన్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించిన ప్రధానమంత్రి
January 17th, 10:17 am
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, భారతరత్న డాక్టర్ ఎంజీ రామచంద్రన్ (ఏంజీఆర్) జయంతి సందర్భంగా ఆయనకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులర్పించారు.రాణి వేలు నాచియార్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ప్రధానమంత్రి
January 03rd, 08:16 am
దేశంలోని అత్యంత పరాక్రమవంతురాలైన యోధుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన రాణి వేలు నాచియార్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఆమెకు నివాళులు అర్పించారు. ధైర్యసాహసాలు, వ్యూహాత్మక నైపుణ్యాలు మూర్తీభవించిన గొప్ప పోరాట యోధురాలిగా ఆమె చిరస్మరణీయులు అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన ప్రధానమంత్రి
January 03rd, 08:07 am
సేవ, విద్య ద్వారా సమాజంలో మార్పు కోసం జీవితాన్ని అంకితం చేసిన సంఘ సంస్కర్త సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా, ఆమె సేవలను స్మరించుకుంటూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.నేతాజీ సుభాష్ చంద్రబోస్కు నివాళి అర్పిస్తూ.. సామర్థ్యం, న్యాయం, ఐక్యత గురించి తెలియజెప్పే సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధాని
December 30th, 10:10 am
అసమాన ధైర్యసాహసాలను ప్రదర్శించి నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1943 డిసెంబర్ 30న పోర్ట్బ్లెయిర్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని ఆయనకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.'సదైవ అటల్' వద్ద శ్రీ అటల్ బిహారీ వాజ్పేయికి నివాళులు అర్పించిన ప్రధానమంత్రి
December 25th, 11:21 am
మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా ఆయన స్మారక చిహ్నం 'సదైవ అటల్' వద్ద ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. అటల్ జీ జీవితం ప్రజా సేవకు, దేశ సేవకు అంకితమైందని.. దేశ ప్రజలకు నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉంటుందని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.పూర్వ ప్రధానమంత్రి, భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయికి ప్రధానమంత్రి నివాళి
December 25th, 08:43 am
మాజీ ప్రధాని, భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి జయంతి నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఆయనకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా- “దేశ పురోగమనానికి, సుపరిపాలనకు ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. వాక్పటిమ గల వక్తగానే కాకుండా ఉత్తేజపూరిత కవితలల్లిన కవిగానూ ఆయన చిరస్మరణీయులు. ఆయన నాయకత్వం, వ్యక్తిత్వం, కృషి దేశ సర్వతోముఖాభివృద్ధికి సదా మార్గనిర్దేశం చేస్తాయి అని వ్యాఖ్యానించారు.పూర్వ ప్రధానమంత్రి చౌధరీ చరణ్ సింగ్ గారి జయంతి.. ప్రధానమంత్రి నివాళులు
December 23rd, 09:39 am
పూర్వ ప్రధానమంత్రి, భారత్ రత్న చౌధరీ చరణ్ సింగ్ గారి జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. ‘‘సమాజంలో ఆదరణకు నోచుకోని వర్గాల సంక్షేమం, వ్యవసాయ రంగ పురోగతి, రైతులకు సౌభాగ్యం .. ఈ ఆశయాల సాధనకు ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. దేశ నిర్మాణానికి ఆయన అందించిన సేవలను, కృతజ్ఞులైన దేశ ప్రజలు ఎన్నటికీ మరచిపోలేరు’’ అని శ్రీ మోదీ అన్నారు.