అరుణాచల్ ప్రదేశ్లోని షి యోమి జిల్లాలో రూ. 8146.21 కోట్ల వ్యయంతో 700 మెగావాట్ల టాటో-II జల విద్యుత్ ప్రాజెక్టు చేపట్టేందుకు కేబినెట్ ఆమోదం
August 12th, 03:29 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు సమావేశమైన అయిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ.. అరుణాచల్ ప్రదేశ్లోని షి యోమి జిల్లాలో రూ. 8146.21 కోట్ల వ్యయంతో టాటో-II జల విద్యుత్ ప్రాజెక్టు (హెచ్ఈపీ) నిర్మించేందుకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసేందుకు 72 నెలల పడుతుందన్న అంచనా ఉంది.