భగవద్ గీత కు స్వామి చిద్భవానందజీ వ్యాఖ్యానం తాలూకు కిండల్ కథనాన్ని ఈ నెల 11న ఆవిష్కరించనున్న ప్రధాన మంత్రి
March 10th, 05:00 pm
భగవద్ గీత కు స్వామి చిద్భవానందజీ వ్యాఖ్యానం తాలూకు కిండల్ మాధ్యమ కథనాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గురువారం నాడు, అంటే ఈ నెల 11న, ఉదయం 10.25 గంటల కు వర్చువల్ పద్ధతి లో ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భం లో ప్రధాన మంత్రి ప్రసంగిస్తారు కూడాను. భగవద్ గీత కు స్వామి చిద్భవానందజీ వ్యాఖ్యానం ప్రతులు 5 లక్షల పైచిలుకు అమ్ముడవటాన్ని స్మరించుకొనేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమైంది.