స్క్వాష్ ప్రపంచ కప్‌లో విజయం సాధించిన భారత బృందానికి ప్రధాని శుభాకాంక్షలు

December 15th, 10:16 am

ఎస్‌డీఏటీ స్క్వాష్ ప్రపంచ కప్ - 2025లో మొదటిసారి ప్రపంచ కప్ సాధించి చరిత్ర సృష్టించిన భారత స్క్వాష్ బృందాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు అభినందించారు.

ప్రముఖ స్క్వాష్ క్రీడాకారుడు శ్రీ రాజ్ మన్‌చందా కన్నుమూత ప్రధానమంత్రి సంతాపం

December 04th, 03:42 pm

ప్రముఖ స్క్వాష్ క్రీడాకారుడు శ్రీ రాజ్ మన్‌చందా ఈ రోజు మరణించారు. దీనిపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. శ్రీ రాజ్ మన్‌చందా సిసలైన భారతీయ స్క్వాష్ దిగ్గజం. అంకితభావం, ప్రావీణ్యం కలిగిన క్రీడాకారునిగా ఆయన ప్రసిద్ధి చెందారంటూ శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. శ్రీ మన్‌చందా సైన్యంలో పనిచేసి దేశానికి సేవలందించారంటూ ప్రధాని కొనియాడారు.

లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్-2028లో క్రికెట్కు చోటుపై ప్రధాని హర్షం

October 16th, 08:18 pm

లాస్ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌-2028లో బేస్ బాల్/సాఫ్ట్ బాల్, క్రికెట్, ఫ్లాగ్‌ ఫుట్‌బాల్, లాక్రోస్, స్క్వాష్‌ క్రీడలకు స్థానం కల్పించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో చేర్చడం ద్వారా ఈ అద్భుత క్రీడకు ప్రపంచవ్యాప్త ప్రజాదరణ పెరుగుతుందని ఆయన అన్నారు.