భగవాన్ హనుమాన్ను ప్రార్థించిన ప్రధానమంత్రి.. సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధాని
April 02nd, 10:48 am
భగవాన్ హనుమాన్ జీ భక్తికి, శక్తికి, అచంచల అంకితభావానికీ సాటి లేని ప్రతీక అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ‘‘ఆ మహాశక్తిమంతుని కరుణతో భక్తులందరిలో ధైర్యసాహసాలతో పాటు సకారాత్మకత నిండాలి’’ అని శ్రీ మోదీ ప్రార్థించారు.సంస్కృత సుభాషితం ద్వారా డాక్టర్ శ్రీ శ్రీ శ్రీ శివకుమార స్వామీజీకి ప్రధాని నివాళి
April 01st, 10:37 am
పూజనీయ డాక్టర్ శ్రీ శ్రీ శ్రీ శివకుమార స్వామీజీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. విద్య, సామాజిక సంక్షేమం, ఆధ్యాత్మిక రంగాల్లో ఆయన చేసిన అసమానమైన కృషి.. నిస్వార్థ సేవ దిశగా దేశంలోని ప్రతి తరానికి స్ఫూర్తినిస్తూనే ఉంటుందని శ్రీ మోదీ అన్నారు.ఆధ్యాత్మిక గురువు డాక్టర్ శ్రీ శ్రీ శ్రీ శివకుమార స్వామిగళుకి ప్రధానమంత్రి ఘన నివాళి
April 01st, 10:33 am
నేడు ఆధ్యాత్మిక గురువు డాక్టర్ శ్రీ శ్రీ శ్రీ శివకుమార స్వామిగళు జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఘన నివాళులు అర్పించారు. కరుణ, వినయం, మానవాళికి నిరంతరం చేసిన సేవలతో ఆయన.. ప్రజల జ్ఞాపకాల్లో నిలిచిపోయారని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఇతరుల అభ్యున్నతికి జీవితాన్ని అంకితం చేసి, నిస్వార్థ సేవలోనే నిజమైన గొప్పతనం ఉందని నిరూపించారని తెలిపారు. విద్య, సామాజిక సంక్షేమం, ఆధ్యాత్మిక రంగాల్లో ఆయన చేసిన అసాధారణమైన కృషి సమాజంపై చెరగని ముద్ర వేసిందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. నిస్వార్థం, సేవా మార్గంలో వెళ్లాలనుకునే ఎంతో మందికి ఆయన జీవితం నేటికీ మార్గదర్శకంగా నిలుస్తూ, స్ఫూర్తినిస్తోందని వ్యాఖ్యానించారు.శ్రీమద్ సుధీంద్ర తీర్థ స్వామీజీకి నివాళి అర్పించిన ప్రధాని
March 31st, 10:58 am
శ్రీమద్ సుధీంద్ర తీర్థ స్వామీజీ జన్మ శతాబ్ది సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఆయనకు నివాళి అర్పించారు. శ్రీమద్ సుధీంద్ర తీర్థ స్వామీజీ సేవ, ఆధ్యాత్మికతలకు జీవితాన్ని అంకితం చేశారని, సమాజంపై చెరగని ముద్ర వేశారని శ్రీ మోదీ కొనియాడారు. పూజ్య స్వామీజీ అనేక సంస్థలను, పరిశోధన కేంద్రాలను స్థాపించారని, ప్రజల్లో విద్యావ్యాప్తిని పెంచడానికి ఎంతో నిబద్ధతతో కృషి చేశారని ప్రధానమంత్రి అన్నారు.భగవాన్ మహావీర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు
March 31st, 10:34 am
భగవాన్ మహావీర్ జన్మ కల్యాణక్ (మహావీర్ జయంతి) పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. భగవాన్ మహావీరుని జీవితం, ఆయన బోధనలు సత్యం, అహింస, కరుణ మార్గంలో నిరంతరం వెలుగులు నింపుతాయని శ్రీ మోదీ పేర్కొన్నారు. ‘‘ఆయన ఆదర్శాలు ఆధ్యాత్మికంగా ఉత్తేజాన్నివ్వడమే కాకుండా, నేటి ప్రపంచానికి ఎంతో సందర్భోచితంగా ఉన్నాయి. సమానత్వం, దయపై ఆయన చూపిన శ్రద్ధ, సమాజం పట్ల మనకు ఉన్న ఉమ్మడి బాధ్యతను గుర్తుచేస్తుంది’’ అని ప్రధానమంత్రి తెలిపారు.కూష్మాండ దేవి దైవికానుగ్రహాన్నీ, కరుణనూ చాటే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధాని
March 22nd, 09:07 am
కుష్మాండ దేవి దైవికానుగ్రహాన్నీ, కరుణనూ చాటే ఒక సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రజలతో పంచుకున్నారు.మదురైలోని తిరుప్పరన్కుండ్రమ్లో గల అరుళ్మిగు సుబ్రమణ్యస్వామి ఆలయంలో పూజలు చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
March 01st, 07:36 pm
మదురైలోని తిరుప్పరన్కుండ్రమ్లో గల అరుళ్మిగు సుబ్రమణ్యస్వామి ఆలయాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు దర్శించి, పూజలు చేశారు.ఏఐ పురోగతి నుండి టి20 ప్రపంచ కప్ వరకు, మన్ కీ బాత్లో భారతదేశ ఎదుగుదలను ప్రస్తావించిన ప్రధానమంత్రి మోదీ
February 22nd, 11:30 am
ఈ నెల మన్ కీ బాత్లో, ఢిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో ప్రధాని మోదీ తన అనుభవాల గురించి మాట్లాడారు. భారత సంతతికి చెందిన క్రికెటర్లు, అవయవ దానం, నదీ ఉత్సవాలు, డిజిటల్ భద్రత, పరీక్ష పే చర్చా వంటి అనేక ముఖ్యమైన అంశాలను ఆయన ప్రస్తావించారు. ఫిబ్రవరి 23న రాష్ట్రపతి భవన్లో 'రాజాజీ ఉత్సవ్' జరుపుకుంటామని ఆయన హైలైట్ చేశారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీకి నారీ శక్తితో ఉన్న లోతైన సంబంధాన్ని గుర్తుచేసుకుంటూ ప్రధాని ఆమెకు ఘనంగా నివాళులు అర్పించారు.డేరా సచ్ఖండ్ బల్లాన్ను దర్శించుకున్న ప్రధానమంత్రి
February 01st, 09:00 pm
పంజాబ్లోని డేరా సచ్ఖండ్ బల్లాన్ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సందర్శించారు. శ్రీ గురు రవిదాస్ మహారాజ్ జీ జయంతి సందర్భంగా డేరా సచ్ఖండ్ బల్లాన్ను దర్శించుకోవడం ఎంతో ప్రత్యేక అనుభూతిని కలిగించిందని శ్రీ మోదీ అన్నారు.ఆదంపూర్ విమానాశ్రయానికి శ్రీ గురు రవిదాస్ మహరాజ్ జీ పేరు పెట్టడం ఆ మహనీయుని కాలాతీత ఆదర్శాలకు తగిన నివాళి: ప్రధానమంత్రి
February 01st, 06:21 pm
ఈ రోజు సంత్ రవిదాస్ జయంతి శుభ సందర్భంలో ఆదంపూర్ విమానాశ్రయాన్ని శ్రీ గురు రవిదాస్ మహారాజ్ జీ విమానాశ్రయంగా పిలవాలని నిర్ణయించడం ఎంతో గౌరవం, గర్వకారణమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. శ్రీ గురు రవిదాస్ మహారాజ్ జీ కాలాతీత ఆదర్శాలకు ఇది సముచిత నివాళి అవుతుందన్న శ్రీ మోదీ... సమానత్వం, కరుణ, సేవలను బోధించిన ఆయన సందేశం మనందరికీ స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు.మొదటి ఓటు నుండి స్టార్టప్ ఇండియా వరకు, మన్ కీ బాత్లో భారతదేశ యువత పట్ల ప్రధానమంత్రి మోదీ ఉత్సాహం
January 25th, 11:30 am
ఈ సంవత్సరం జాతీయ ఓటర్ల దినోత్సవం నాడు జరిగిన మొదటి మన్ కీ బాత్లో, ప్రధానమంత్రి మోదీ ఓటు వేయడం యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు మరియు ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ అభినందించారు. స్టార్టప్లు, నీటి సంరక్షణ, నాణ్యత, సంస్కృతి & పండుగలు మరియు పరిశుభ్రత వంటి కీలక అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా నిపుణులు పాల్గొనే రాబోయే ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ను ప్రధాని హైలైట్ చేశారు.శ్రీ నారాయణ ధర్మ సంఘం ట్రస్టు స్వామీజీలను కలిసిన ప్రధాని
January 23rd, 04:02 pm
వర్కాలలోని శివగిరి మఠంలో శ్రీ నారాయణ ధర్మ సంఘం ట్రస్టు స్వామీజీలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు భేటీ అయ్యారు.డెహ్రాడూన్లో ఉత్తరాఖండ్ ఆవిర్భావ రజతోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
November 09th, 01:00 pm
ఉత్తరాఖండ్ గవర్నర్ శ్రీ గుర్మీత్ సింగ్, శాసనసభ స్పీకర్ సోదరి శ్రీ రీతూ, ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింగ్, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరుడు శ్రీ అజయ్ టమ్టా, రాష్ట్ర మంత్రులు, వేదికను అలంకరించిన ఎంపీలు, మాజీ ముఖ్యమంత్రులు, మమ్మల్ని ఆశీర్వదించడానికి పెద్ద సంఖ్యలో వచ్చిన గౌరవనీయ సాధు జనులు, ఇతర విశిష్ట అతిథులు, సోదరీసోదరులారా!ఉత్తరాఖండ్ రాష్ట్ర అవతరణ రజతోత్సవాన్ని పురస్కరించుకుని డెహ్రాడూన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
November 09th, 12:30 pm
ఉత్తరాఖండ్ రాష్ట్ర అవతరణ రజతోత్సవాన్ని పుస్కరించుకొని డెహ్రాడూన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఆయన రూ. 8,140 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని.. దేవభూమి ఉత్తరాఖండ్ ప్రజలకు శుభాకాంక్షలు, హృదయపూర్వక వందనాలు తెలియజేశారు.అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న కెప్టెన్ శుభాంశు శుక్లాతో ముచ్చటించిన ప్రధానమంత్రి
June 28th, 08:24 pm
ఈ రోజు మీరు మీ మాతృభూమి భారత్కు దూరంలో ఉన్నా.. భారతీయులందరి హృదయాలకు దగ్గరగా ఉన్నారు. మీ పేరులోనే శుభం ఉంది. అందువల్ల మీ ఈ ప్రయాణం శుభప్రదమైన నవ శకానికి నాంది పలికింది. ఈ సమయంలో మనిద్దరమే ఇలా మాట్లాడుకుంటున్నప్పటికీ మొత్తం 140 కోట్ల మంది భారతీయుల మనోభావాలూ నాతో ఉన్నాయి. నా గొంతు భారతీయులందరి ఉత్సాహాన్ని ప్రతిబింబిస్తుంది. అంతరిక్షంలో భారత పతాకాన్ని ఎగురవేసినందుకు మీకు నా అభినందనలు. అక్కడ అంతా బాగానే ఉందా? మీరు బాగానే ఉన్నారా?ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్) లో ఉన్న గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంభాషణ
June 28th, 08:22 pm
భారత వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించారు. గ్రూప్ కెప్టెన్ శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన మొట్టమొదటి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు. శుభాంశు శుక్లా ప్రస్తుతం మాతృభూమికి అత్యంత దూరంలో ఉన్నప్పటికీ, ఆయన భారతీయులందరి హృదయాలకు అత్యంత చేరువలో ఉన్నారని ప్రధానమంత్రి అన్నారు. శుభాంశు పేరు స్వయంగా శుభప్రదమైనదని, ఆయన ప్రయాణం కొత్త శకానికి నాంది పలికిందని పేర్కొన్నారు. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ అయినప్పటికీ, 140 కోట్ల మంది భారతీయుల భావోద్వేగాలు, ఉత్సాహాన్ని ఇది ప్రతిబింబిస్తుందని శ్రీ మోదీ అన్నారు. శుభాంశుతో మాట్లాడుతున్న ఈ స్వరం యావత్ దేశపు సమష్టి ఉత్సాహం, గర్వాన్ని కలిగి ఉందని పేర్కొన్నారు. అంతరిక్షంలో భారతదేశ జెండాను ఎగురవేసిన శుభాంశుకు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. శుభాంశు ఆరోగ్య పరిస్థితి గురించి, అంతరిక్ష కేంద్రంలో అంతా బాగానే ఉందా అని అడిగి తెలుసుకున్నారు.న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఆచార్య శ్రీ విద్యానంద్ జీ మహారాజ్ శతజయంతి వేడుక సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
June 28th, 11:15 am
పరమ శ్రాద్ధేయ ఆచార్య శ్రీ ప్రజ్ఞా సాగర్ మహరాజ్, శ్రావణబెళగొళ స్వామి శ్రీ చారుకీర్తి, మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్, ఎంపీ శ్రీ నవీన్ జైన్, భగవాన్ మహావీర్ అహింసా భారతి ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ ప్రియాంక్ జైన్, కార్యదర్శి శ్రీ మమతా జైన్, ట్రస్టీ పీయూష్ జైన్, ఇతర విశిష్ట ప్రముఖులు, గౌరవనీయ సాధువులు, సోదరీసోదరులారా... జై జినేంద్ర!ఆచార్య శ్రీ విద్యానంద్ జీ మహరాజ్ శత జయంతి ఉత్సవాల్లో ప్రధానమంత్రి ప్రసంగం
June 28th, 11:01 am
న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఈరోజు జరిగిన ఆచార్య శ్రీ విద్యానంద్ జీ మహారాజ్ శతజయంతి ఉత్సవాల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, భారత ఆధ్యాత్మిక సంప్రదాయంలో ఒక చిరస్మరణీయమైన సందర్భాన్ని నేడు మనమంతా చూస్తున్నాం.. ఇది ఆచార్య శ్రీ విద్యానంద్ జీ మునిరాజ్ శతాబ్ది ఉత్సవాల పవిత్రతను స్పష్టం చేస్తోందని వ్యాఖ్యానించారు. పూజ్య ఆచార్య అమర స్ఫూర్తితో నిండిన ఈ కార్యక్రమం అపూర్వమైన స్ఫూర్తిదాయక వాతావరణాన్ని కల్పిస్తున్నదన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారందరికీ శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి.. ఈ కార్యక్రమంలో పాలుపంచుకునే అవకాశం దక్కడం తనకూ సంతోషం కలిగించిందన్నారు.శ్రీ నారాయణ గురు, మహాత్మాగాంధీ చర్చల శతాబ్ది కార్యక్రమంలో ప్రధాని ప్రసంగం
June 24th, 11:30 am
బ్రహ్మర్షి స్వామి సచ్చిదానంద గారు, శ్రీమఠం స్వామి శుభాంగ నందా గారు, స్వామి శారదానంద గారు, గౌరవనీయులైన సాధువులందరూ, ప్రభుత్వంలో నా సహచరులు శ్రీ జార్జ్ కురియన్ గారు, పార్లమెంట్లో నా సహచరులు శ్రీ అదూర్ ప్రకాష్ గారు, ఇతర సీనియర్ ప్రముఖులు, మహిళలు, గౌరవనీయులైన పెద్దలందరూ,శ్రీ నారాయణ గురు, మహాత్మాగాంధీ మధ్య చారిత్రక చర్చ జరిగి శతాబ్ది అవుతోన్న సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధానమంత్రి
June 24th, 11:00 am
గొప్ప ఆధ్యాత్మిక, నైతిక విలువలు కలిగిన మహానుభావులు శ్రీ నారాయణ గురు.. మహాత్మాగాంధీల మధ్య జరిగిన చారిత్రక చర్చకు శతాబ్ధి అవుతోన్న సందర్భంగా దిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికి శుభాకాంక్షలు తెలిపిన ఆయన దేశ చరిత్రలోనే అద్భుతమైన ఘట్టానికి ఈ వేదిక సాక్ష్యంగా నిలుస్తోందన్నారు. మన స్వాతంత్రోద్యమానికి ఈ ఇద్దరు మహానుభావుల మధ్య జరిగిన చారిత్రక చర్చ కొత్త దిశానిర్దేశం చేసిందని.. స్వాతంత్య్ర లక్ష్యాలకు, స్వతంత్ర భారత్ కలకు నిర్దిష్ట అర్థాన్నించిందని పేర్కొన్నారు. “100 సంవత్సరాల క్రితం జరిగిన శ్రీ నారాయణ గురు- మహాత్మాగాంధీల సమావేశం నేటికీ స్ఫూర్తిదాయకంగా, సందర్భోచితంగా ఉంది. సామాజిక సామరస్యం, అభివృద్ధి చెందిన భారత్ విషయంలో సమష్టి లక్ష్యాల కోసం ఉత్తేజానిచ్చే వనరుగా పనిచేస్తోంది” అని వ్యాఖ్యానించారు. ఈ చారిత్రాక శతాబ్ధి సందర్భంగా శ్రీ నారాయణ గురు పాదాలకు నమస్కరించిన ప్రధాని.. మహాత్మాగాంధీకి నివాళులర్పించారు.