మాతృభూమి పవిత్ర వారసత్వాన్ని చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి..

May 21st, 09:04 am

సంస్కృత భాషలోని ఓ సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు. ఆధ్యాత్మిక సాధన, ఆరాధనలతో పాటు ధైర్య సాహసాలకీ, శక్తికీ, సర్వజన సంక్షేమానికీ నిలయం అయిన పవిత్ర భూమిగా మన మాతృదేశం అలరారుతోందని ఆయన అన్నారు. గొప్ప వారసత్వంతో పాటు ప్రాచీన సంస్కృతికి ఆలవాలమైన ఈ పవిత్ర భూమి ఎల్లవేళలా అందరూ సుఖంతో, సమృద్ధితో వర్ధిల్లేటట్లు చేయాలని తాను మనసారా కోరుకుంటున్నానని శ్రీ మోదీ అన్నారు.

గురువుకు అంకిత భావంతో సేవ చేయడం ద్వారానే జ్ఞానాన్ని సంపాదించగలమని చెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

May 12th, 02:21 pm

జ్ఞానాన్ని గురువుకు అంకిత భావంతో సేవ చేసినప్పుడే సాధించగలుగుతామని స్పష్టం చేస్తున్న సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.

సోమనాథ్ ఆలయాన్ని సందర్శించిన ప్రధానమంత్రి

May 11th, 12:28 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ సోమనాథ్ ఆలయాన్ని సందర్శించారు. పునర్నిర్మాణం తర్వాత సోమనాథ్ ఆలయంలోకి భక్తులను అనుమతించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆలయ సందర్శనకు వెళ్లటం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.

గుజరాత్‌లోని ప్రభాస్ పటన్‌ వద్ద జరిగిన సోమనాథ్ అమృత్ మహోత్సవ్‌లో ప్రధాని ప్రసంగం

May 11th, 10:20 am

గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్ గారు, ఉప ముఖ్యమంత్రి భాయ్ హర్ష్ సంఘ్వి గారు.. గుజరాత్ ప్రభుత్వ మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, విచ్చేసిన విశిష్ట అతిథులూ... ఇక్కడికి విచ్చేసిన వారందరూ…

గుజరాత్‌లోని సోమనాథ ఆలయ పునరుద్ధరణకు 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన సోమనాథ అమృత మహోత్సవంలో పాల్గొన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

May 11th, 10:15 am

గుజరాత్‌లోని సోమనాథ ఆలయ పునరుద్ధరణానంతర ప్రతిష్ఠాపనోత్సవానికి 75 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో ఇవాళ నిర్వహించిన అమృత మహోత్సవంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు.

మే 10, 11వ తేదీల్లో గుజరాత్‌లో పీఎం పర్యటన

May 09th, 11:19 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, 2026 మే 10, 11వ తేదీల్లో గుజరాత్‌లో పర్యటించనున్నారు. మే 10న రాత్రి గుజరాత్‌లోని జామ్‌నగర్‌ చేరుకుంటారు. మే 11న ఉదయం 10:15 గంటలకు సోమనాథ్‌ ఆలయంలో జరిగే సోమనాథ్ అమృత్ మహోత్సవంలో ప్రధానమంత్రి పాల్గొంటారు. అనంతరం ప్రధానమంత్రి వడోదరాకు వెళ్తారు. సాయంత్రం 6 గంటలకు సర్దార్‌ధామ్ హాస్టల్‌ను ప్రారంభిస్తారు. ఈ రెండు సందర్భాల్లోనూ ఏర్పాటు చేసిన సభల్లో ఆయన ప్రసంగిస్తారు.

వియత‌్నాం కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి, వియత్నాం అధ్యక్షుడితో ఉమ్మడి మీడియా సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి ప్రకటన

May 06th, 01:00 pm

భారత్-వియత్నాం భాగస్వామ్యంలో వారసత్వం, అభివృద్ధి రెండూ కీలకమే. గతేడాది భారత్ నుంచి బుద్ధుని పవిత్ర అవశేషాలను వియత్నాంకు తీసుకువెళ్లినప్పుడు అక్కడి జనాభాలో సుమారు పదిహేను శాతం మంది అంటే.. పదిహేను మిలియన్లకు పైగా ప్రజలు వాటిని దర్శించుకున్నారు. మన ఉమ్మడి వారసత్వాన్ని పరిరక్షించేందుకు, వియత్నాంలోని మై సన్, న్హాన్ టవర్స్ వద్ద ప్రాచీన చాం నాగరికత దేవాలయాల పునరుద్ధరణను మేం చేపడుతున్నాం. చాం నాగరికతకు సంబంధించిన రాతప్రతులను కూడా డిజిటలైజ్ చేసి, ఈ అమూల్యమైన వారసత్వాన్ని భవిష్యత్ తరాల కోసం భద్రపరుస్తున్నాం.

సిక్కిం రాష్ట్ర 50వ ఆవిర్భావ వేడుకల ముగింపు సందర్భంగా గ్యాంగ్‌టక్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

April 28th, 10:25 am

సిక్కిం గవర్నర్ శ్రీ ఓం మాథుర్, ప్రజలెన్నుకున్న, ఉత్సాహవంతుడైన యువకుడు, నా ప్రియ మిత్రుడైన ముఖ్యమంత్రి శ్రీ ప్రేమ్ సింగ్ తమాంగ్, పార్లమెంటులో నా సహసభ్యులు శ్రీ దోర్జీ షెరింగ్ లెప్చా, డాక్టర్‌ ఇంద్ర హాంగ్ సుబ్బా, శ్రీ దిల్లీ రామ్ థాపా, రాష్ట్రంలోని నా ప్రియ సోదరీసోదరులారా!

PM Modi participates in the closing ceremony of Sikkim’s 50th Year of Statehood celebrations in Gangtok, Sikkim

April 28th, 10:15 am

Addressing the closing ceremony of Sikkim’s 50th Year of Statehood celebrations in Gangtok, Sikkim, PM Modi said the state exemplifies the spirit of ‘Ek Bharat, Shreshtha Bharat’. Highlighting tourism, sporting talent and the role of self-help groups in Sikkim, he termed the Northeast as India’s ‘Asht Lakshmi’ and called for collective efforts to accelerate Sikkim’s development and realise Viksit Bharat.

ఇది చార్‌ధామ్ యాత్రా సమయం... శ్రీ కేదార్‌నాథ్ ఆలయం ఎదురు చూస్తోందన్న ప్రధానమంత్రి

April 22nd, 11:28 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన భక్తితత్పరతను వ్యక్తీకరిస్తూ భక్తకోటికి ఒక లేఖ రాశారు. ఈ సంవత్సరం చార్‌ధామ్ యాత్ర మొదలైందని, దేవభూమి ఉత్తరాఖండ్‌లోని శ్రీ కేదార్‌నాథ్ ధామ్ తలుపులను తెరిచారనీ, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. యాత్రలో పాలుపంచుకోవడానికి ఉత్తరాఖండ్‌కు వెళ్తున్న భక్తులను ఉద్దేశించి ఆయన ఒక లేఖను రాస్తూ, వారంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. భక్తులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

కర్ణాటకలో ప్రధాని పర్యటన: శ్రీ గురు భైరవైక్య మందిరం ప్రారంభ విశేషాలను ప్రజలతో పంచుకున్న శ్రీ మోదీ

April 15th, 05:46 pm

ఈ రోజు కర్ణాటక పర్యటన విశేషాలను, ముఖ్యాంశాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.

కర్ణాటకలోని మాండ్యలో శ్రీ గురు భైరవైక్య మందిర ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

April 15th, 11:10 am

పరమ పూజ్య జగద్గురు శ్రీ శ్రీ శ్రీ డాక్టర్ నిర్మలానందనాథ మహాస్వామీజీ, మాజీ ప్రధానమంత్రి హెచ్ డీ దేవెగౌడ గారు, కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ గారు, పరమ పూజ్య జగద్గురు స్వామి పరమాత్మానంద సరస్వతిజీ, కేంద్ర మంత్రులు హెచ్ డీ. కుమారస్వామి గారు, శోభా కరంద్లాజే గారు, కర్ణాటక ప్రతిపక్ష నాయకుడు ఆర్ అశోక గారు, రాష్ట్ర మంత్రి ఎన్. చెలువరాయస్వామి గారు, సకల సాధువులందరికీ, ఇతర ప్రముఖులు, ఇక్కడికి భారీ సంఖ్యలో విచ్చేసిన సోదర సోదరీలందరికీ నమస్కారాలు.

కర్ణాటక మాండ్యలోని శ్రీ క్షేత్ర ఆదిచుంచనగిరిలో శ్రీ గురుభైరవైక్య మందిరాన్ని ప్రారంభించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ

April 15th, 11:00 am

కర్ణాటకలోని మాండ్య జిల్లా శ్రీ క్షేత్ర ఆదిచుంచనగిరిలో శ్రీ గురు భైరవైక్య మందిరాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసిందన్న ప్రధానమంత్రి... వైభవోపేతంగా శ్రీ గురు భైరవైక్య ఆలయాన్ని ప్రారంభించి, మహోన్నతులైన సాధుసంతులతో సంభాషించే భాగ్యాన్ని తనకిచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. చారిత్రక జ్వాలాపీఠం వద్ద సమయం గడపడం, అశేషంగా తరలివచ్చిన భక్తులనుద్దేశించి ప్రసంగించడం మాటలకందని బలమైన భావోద్వేగాలను కలిగించాయన్నారు. ‘‘ఈ దైవిక అనుభవాలు శాశ్వతంగా నా స్మృతిపథంలో నిలిచిపోతాయి’’ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.

హనుమాన్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

April 02nd, 10:47 am

హనుమాన్ జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పవిత్ర సందర్భం ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త శక్తినీ, ఉత్సాహాన్నీ అందించాలని శ్రీ మోదీ ప్రార్థించారు. ‘‘మన దేశ సామర్థ్యం మరింత వృద్ధి చెందేటట్లుగా మన అందరికీ బలం, వివేకం, జ్ఞానం సమృద్ధంగా లభించే విధంగా పవన పుత్రుడు హనుమాన్ జీ ఆశీస్సుల్ని అందించాలని నేను కోరుకుంటున్నాను’’ అని శ్రీ మోదీ అన్నారు.

ఉత్కళ దివస్ సందర్భంగా ప్రధాని శుభాకాంక్షలు

April 01st, 10:31 am

ఈ రోజు ఉత్కళ దివస్ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. సాంస్కృతిక, ఆధ్యాత్మిక వైభవానికి కాలాతీతమైన చిహ్నంగా ఒడిశా నిలుస్తుందని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఒడియా సంగీతం, కళలు, సాహిత్యం దేశాన్ని అనేక విధాలుగా సుసంపన్నం చేశాయన్నారు. ‘‘సంకల్పం, నిరాడంబరత్వం, ఆత్మీయతకు పేరుగాంచిన ఒడిశా ప్రజలు.. వివిధ రంగాల్లో విశేషమైన కృషి చేశారు. భవిష్యత్తులో ఒడిశా పురోగతిలో నూతన శిఖరాలను అధిరోహించాలని ఆశిస్తున్నాను’’ అని శ్రీ మోదీ తెలిపారు.

గుజరాత్‌లోని గాంధీనగర్‌లో 'సమ్రాట్ సంప్రతి మ్యూజియం' ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం

March 31st, 10:25 am

ఈ సభకు హాజరైన ఆచార్య భగవంత్ శ్రీ పద్మసాగర్ సూరీశ్వర్ జీ మహరాజ్ సాహెబ్, గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ గారు, ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భాయ్ హర్ష్ సంఘవి గారు, పరమ పూజ్య ఆచార్య భగవంత్, పూజ్య సాధు భగవంత్, సాధ్విజీ భగవంత్, ఈ పవిత్ర సమావేశానికి హాజరైన అందరు ఆచార్యులు, ముని భగవంత్‌లు, గౌరవనీయ లోకోపకారులు, పండితులు, సోదరీ సోదరులారా!

మహావీర్ జయంతి సందర్భంగా గాంధీనగర్‌లోని కోబా తీర్థ్‌లో సామ్రాట్ సంప్రతి మ్యూజియాన్ని ప్రారంభించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ

March 31st, 10:15 am

భగవాన్ మహావీర్ జయంతి శుభ సందర్భాన్ని పురస్కరించుకుని గుజరాత్‌లోని గాంధీనగర్, కోబా తీర్థంలో సామ్రాట్ సంప్రతి సంగ్రహాలయ జైన వారసత్వ మ్యూజియాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘కోబా తీర్థం ఆధ్యాత్మిక ప్రశాంతతతో నిండి ఉంది. ఎందరో జైన మునులు, సాధువుల తపస్సు ఇక్కడ ప్రతిబింబిస్తోంది. సృజన, సేవ ఇక్కడ సహజంగానే వికసిస్తాయి’’ అని శ్రీ మోదీ అన్నారు.

మార్చి 31న పీఎం గుజరాత్ పర్యటన

March 30th, 11:05 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్చి 31, 2026న గుజరాత్‌లో పర్యటించనున్నారు. ఉదయం సుమారు 10 గంటలకు గాంధీనగర్‌లో సామ్రాట్ సంప్రతి మ్యూజియాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తారు. మధ్యాహ్నం సుమారు 12:45 గంటలకు అహ్మదాబాద్‌లోని సనంద్‌లో కేన్స్ సెమికాన్ ప్లాంట్‌ను ప్రారంభించి, అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభను ఉద్దేశించి మాట్లాడతారు. ఆ తర్వాత వావ్-థరాడ్‌లో సాయంత్రం సుమారు 4 గంటలకు రూ. 20,000 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసి, వాటిని జాతికి అంకితం చేస్తారు. అనంతరం అక్కడ కూడా ప్రధానమంత్రి ప్రసంగించనున్నారు.

నవరాత్రి ఆరాధనతో అపార శక్తి

March 22nd, 09:12 am

నవరాత్రుల ఆధ్యాత్మిక ప్రాముఖ్యాన్ని గురించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు తన అభిప్రాయాలను పంచుకున్నారు. అమ్మవారి పట్ల భక్తితో అపార శక్తి, బలం లభిస్తాయని ఆయన పేర్కొన్నారు.

నవరాత్రి వేడుకల్లోని అచంచల విశ్వాస ప్రస్థానంపై ప్రధానమంత్రి భావన

March 21st, 08:49 am

నవరాత్రి పండగ ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను వివరిస్తూ.. జగన్మాతపై అంచంచలమైన విశ్వాసం కలిగించే మార్పులను ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వివరించారు. ఈ సందర్భంగా అమ్మవారి భక్తి స్తోత్రాన్ని పంచుకున్నారు.