79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు
August 15th, 03:52 pm
79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన ప్రసంగం 103 నిమిషాల పాటు కొనసాగింది. ఆయన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగాల్లో ఇదే సుదీర్ఘమైనది. ఇందులో భాగంగా పలు నిర్ణయాత్మక ప్రకటనలు చేశారు. 2047 నాటికి వికసిత్ భారత్ను సాధించటంపై ఒక సాహసోపేతమైన రోడ్ మ్యాప్ను ఇచ్చారు. ప్రధానమంత్రి ప్రసంగం స్వావలంబన, ఆవిష్కరణ, ప్రజల సాధికారతపై దృష్టి సారించింది. ఇతరులపై ఆధారపడే స్థాయి నుంచి ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయమైన, సాంకేతికతపరంగా అభివృద్ధి చెందిన, ఆర్థికంగా ధృడమైన దేశంగా మారిన భారత్ ప్రయాణాన్ని ప్రధానంగా పేర్కొన్నారు.79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
August 15th, 07:00 am
ఈ స్వాతంత్య్ర మహోత్సవం 140 కోట్ల ప్రజల సంకల్పాన్ని ప్రతిబింబిస్తూ జరుగుతున్న వేడుక. ఈ స్వాతంత్య్ర దినోత్సవం సమష్టి విజయానికి ప్రతీక. మనందరికీ గర్వకారణం. మన హృదయాలు ఆనందంతో ఉప్పొంగే క్షణమిది. దేశంలో ఎప్పటికప్పుడు ఐక్యతా స్ఫూర్తి బలోపేతమవుతోంది. 140 కోట్ల భారతీయులు ఈ రోజు మువ్వన్నెల్లో మెరుస్తున్నారు. ‘హర్ ఘర్ తిరంగా’ రెపరెపలాడుతోంది. ఎడారులయినా, హిమాలయ శిఖరాలయినా, సముద్ర తీరాలయినా, లేదా జనసమ్మర్ధ ప్రాంతాలయినా.. అంతటా ఒకే నినాదం, ఒకే ఉత్సాహం. మనం ప్రాణం కన్నా మిన్నగా భావించే మాతృభూమి కీర్తనే మార్మోగుతోంది.India celebrates 79th Independence Day
August 15th, 06:45 am
PM Modi, in his address to the nation on the 79th Independence day paid tribute to the Constituent Assembly, freedom fighters, and Constitution makers. He reiterated that India will always protect the interests of its farmers, livestock keepers and fishermen. He highlighted key initiatives—GST reforms, Pradhan Mantri Viksit Bharat Rozgar Yojana, National Sports Policy, and Sudharshan Chakra Mission—aimed at achieving a Viksit Bharat by 2047. Special guests like Panchayat members and “Drone Didis” graced the Red Fort celebrations.అంతరిక్ష అన్వేషణపై జరిగిన అంతర్జాతీయ సదస్సును ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని చేసిన ప్రసంగం
May 07th, 12:00 pm
గ్లోబల్ స్పేస్ ఎక్స్ప్లొరేషన్ కాన్ఫరెన్స్-2025లో మీ అందరినీ కలుసుకోవడం సంతోషంగా ఉంది. అంతరిక్షం కేవలం ఓ గమ్యస్థానం కాదు. అది ఆసక్తి, ధైర్యం, సమష్టి ప్రగతిని ప్రకటించే అంశం. భారతీయ అంతరిక్ష ప్రయాణం ఈ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది. 1963లో ఓ చిన్న రాకెట్ ప్రయోగం నుంచి చంద్రుని దక్షిణ ధ్రువానికి చేరుకున్న మొదటి దేశంగా ఎదిగేంత వరకు మా ప్రయాణం అత్యద్భుతం. మా రాకెట్లు పేలోడ్లను మించిన బరువును మోస్తున్నాయి. 1.4 బిలియన్ల మంది భారతీయుల కలలను అవి మోస్తున్నాయి. భారత్ సాధించిన విజయాలు శాస్త్ర రంగంలో గొప్ప మైలురాళ్లు. వీటన్నింటినీ మించి, మానవ స్ఫూర్తి... గురుత్వాకర్షణ శక్తిని అధిగమిస్తుందనడానికి ఇది గొప్ప రుజువు. 2014లో మొదటి ప్రయత్నంలోనే అంగారక గ్రహాన్ని చేరుకొని భారత్ చరిత్ర సృష్టించింది. చంద్రుడిపై నీటి జాడను కనుగొనేందుకు చంద్రయాన్-1 తోడ్పడింది. చంద్రయాన్-2 అధిక స్పష్టత ఉన్న చంద్రుని ఛాయాచిత్రాలను మనకు పంపింది. చంద్రుని దక్షిణ ధ్రువంపై మన అవగాహనను చంద్రయాన్–3 పెంచింది. మేం రికార్డు సమయంలో క్రయోజనిక్ ఇంజిన్లను తయారుచేశాం. ఒకే ప్రయోగంలో 100 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టాం. మా వాహక నౌకల ద్వారా 34 దేశాలకు చెందిన 400 ఉపగ్రహాలను కక్ష్యంలో ప్రవేశపెట్టాం. ఈ ఏడాది అంతరిక్షంలో రెండు ఉపగ్రహాల డాకింగ్ ప్రక్రియను పూర్తి చేశాం. ఇది పెద్ద విజయం.అంతరిక్ష శోధనపై అంతర్జాతీయ సదస్సు-2025 (జిఎల్ఇఎక్స్)లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
May 07th, 11:30 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అంతరిక్ష శోధనపై అంతర్జాతీయ సదస్సు-2025 (జిఎల్ఇఎక్స్)ను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా తొలుత ప్రపంచవ్యాప్తంగాగల విశిష్ట ప్రతినిధులు, శాస్త్రవేత్తలు, వ్యోమగాములను ఆయన స్వాగతించారు. అంతరిక్ష రంగంలో భారత్ అద్భుత పయనం గురించి జిఎల్ఇఎక్స్- 2025లో పాల్గొంటున్నవారికి ప్రముఖంగా వివరించారు. ““అంతరిక్షమంటే కేవలం ఒక గమ్యం కాదు.. ఉత్సుకత-సాహసం-సమష్టి ప్రగతిని ప్రస్ఫుటం చేసే సంకల్పం” అని ఆయన అభివర్ణించారు. భారత్ 1963లో ఓ చిన్న రాకెట్ను ప్రయోగించిన నాటినుంచి చంద్రుని దక్షిణ ధ్రువంపై పాదం మోపిన తొలి దేశం స్థాయి ఎదగడం వరకూ సాధించిన విజయాలు ఈ స్ఫూర్తిని ప్రతిబింబిస్తాయని ఆయన స్పష్టం చేశారు. “భారతీయ రాకెట్లు తమ కార్యభారాన్ని మించి... అంటే- 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలను మోస్తూ తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాయి” అని వ్యాఖ్యానించారు. అలాగే భారత అంతరిక్ష విజయాలు శాస్త్రవిజ్ఞానంలో కీలక ఘట్టాలని, సమస్యలను అధిగమించడంలో మానవాళి స్ఫూర్తికినిదర్శనాలని ఆయన పేర్కొన్నారు. భారత్ 2014నాటి తన తొలి ప్రయత్నంలోనే అంగారక గ్రహాన్ని చేరుకోవడం ద్వారా చారిత్రక విజయం సాధించిందని గుర్తుచేశారు. జాబిలిపై జలం జాడను పసిగట్టడంలో చంద్రయాన్-1 ప్రయోగం తోడ్పడిందని పేర్కొన్నారు. తదుపరి చంద్రయాన్-2 ప్రయోగం చంద్ర ఉపరితల సుస్పష్ట (అత్యధిక రిజల్యూషన్) చిత్రాలను అందించిందని, ఇక తాజా చంద్రయాన్-3 ప్రయోగం చంద్రుని దక్షిణ ధ్రువంపై మానవాళి అవగాహనను మరింత పెంచిందని విశదీకరించారు. “భారత్ రికార్డు సమయంలో క్రయోజెనిక్ ఇంజిన్లను రూపొందించింది. ఒకే రాకెట్ ద్వారా 100 ఉపగ్రహాలను ప్రయోగించింది.. భారత ప్రయోగ వాహనాల ద్వారా 34కుపైగా దేశాలకు చెందిన 400కు మించి ఉపగ్రహాలను విజయవంతంగా అంతరిక్షంలో నిలిపింది” అని వివిధ విజయాలను ప్రధాని ఏకరవు పెట్టారు. ఇదే క్రమంలో ఈ ఏడాది అంతరిక్షంలో రెండు ఉపగ్రహాల అనుసంధానం ద్వారా భారత్ సాధించిన తాజా విజయాన్ని ప్రస్తావిస్తూ- అంతరిక్ష పరిశోధనలో ఇదొక కీలక ముందడుగని పేర్కొన్నారు.భారతదేశంపై ఈ వారం ప్రపంచం
April 22nd, 12:27 pm
దౌత్యపరమైన ఫోన్ కాల్స్ నుండి సంచలనాత్మక శాస్త్రీయ ఆవిష్కరణల వరకు, ఈ వారం ప్రపంచ వేదికపై భారతదేశం యొక్క ఉనికి సహకారం, ఆవిష్కరణ మరియు సాంస్కృతిక గర్వంతో గుర్తించబడింది.Cabinet approves the establishment of “Third Launch Pad”
January 16th, 03:00 pm
The Union Cabinet chaired by the Prime Minister Shri Narendra Modi today approved the establishment of the Third Launch Pad (TLP) at Satish Dhawan Space Centre of ISRO at Sriharikota, Andhra Pradesh.ఉపగ్రహాల స్పేస్ డాకింగ్ ప్రయోగం విజయవంతం: ఇస్రోకు ప్రధాని అభినందనలు
January 16th, 01:36 pm
స్పేస్ డాకింగ్ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించడంపై ఇస్రోకూ, అంతరిక్ష నిపుణులందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.The four astronaut-designates symbolize the trust, courage, valor and discipline of today’s India: PM Modi
February 27th, 12:24 pm
PM Modi visited Vikram Sarabhai Space Center (VSSC) at Thiruvananthapuram, Kerala and inaugurated three important space infrastructure projects worth around Rs 1800 crores. Recalling his statement about the beginning of a new ‘kaal chakra’ made from Ayodhya, Prime Minister Modi said that India is continuously expanding its space in the global order and its glimpses can be seen in the country’s space program.కేరళలో తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (వి ఎస్ ఎస్ సి) ను సందర్శించిన ప్రధాన మంత్రి
February 27th, 12:02 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేరళలోని తిరువనంతపురంలో విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్ (వి.ఎస్.ఎస్.సి)ని సందర్శించారు సుమారు రూ.1800 కోట్ల విలువైన మూడు ముఖ్యమైన అంతరిక్ష మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో ఎస్ఎల్ వి ఇంటిగ్రేషన్ ఫెసిలిటీ (పిఐఎఫ్); . మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ లో కొత్త 'సెమీ క్రయోజనిక్స్ ఇంటిగ్రేటెడ్ ఇంజిన్ అండ్ స్టేజ్ టెస్ట్ ఫెసిలిటీ'; తిరువనంతపురంలోని వి.ఎస్.ఎస్.సి వద్ద 'ట్రైసోనిక్ విండ్ టన్నెల్' ప్రాజెక్టులు వీటిలో ఉన్నాయి. ఈ సందర్భంగా గగన్ యాన్ మిషన్ పురోగతిని సమీక్షించిన మోదీ, మిషన్ ద్వారా అంతరిక్షం లోకి వెళ్లేందుకు నియమితులైన నలుగురు వ్యోమగాములకు 'వ్యోమగామి వింగ్స్‘ ప్రదానం చేశారు. గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్, గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్, వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా వీరిలో ఉన్నారు.BRICS will be – Breaking barriers, Revitalising economies, Inspiring innovation, Creating opportunities, and Shaping the future: PM Modi
August 23rd, 03:30 pm
PM Modi addressed the BRICS Plenary Session in Johannesburg, South Africa. He elaborated at length the reforms undertaken by the Government in promoting the overall progress and development of India. PM Modi also lauded the initiatives such as the New Development Bank, Contigency Reserve Arrangement among others that have sought to promote stability and prosperity for the countries of the Global South.PM Modi interacts with the Indian community in Paris
July 13th, 11:05 pm
PM Modi interacted with the Indian diaspora in France. He highlighted the multi-faceted linkages between India and France. He appreciated the role of Indian community in bolstering the ties between both the countries.The PM also mentioned the strides being made by India in different domains and invited the diaspora members to explore opportunities of investing in India.కేంద్ర -రాష్ట్ర సైన్స్ సదస్సు ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
September 10th, 10:31 am
గుజరాత్ ప్రముఖ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్ గారు, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు, డాక్టర్ జితేంద్ర సింగ్ గారు, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల మంత్రులు, స్టార్టప్ల ప్రపంచానికి చెందిన అందరు సహచరులు, విద్యార్థులు, ఇతర ప్రముఖులు, మహిళలు మరియు పెద్దమనుషులు!PM inaugurates ‘Centre-State Science Conclave’ in Ahmedabad via video conferencing
September 10th, 10:30 am
PM Modi inaugurated the ‘Centre-State Science Conclave’ in Ahmedabad. The Prime Minister remarked, Science is like that energy in the development of 21st century India, which has the power to accelerate the development of every region and the development of every state.PM to visit Gujarat on 10th June
June 08th, 07:23 pm
PM Modi will visit Gujarat on 10th June. He will launch development initiatives during ‘Gujarat Gaurav Abhiyan’. He will inaugurate A.M. Naik Healthcare Complex and Nirali Multi Speciality Hospital in Navsari. Later, he will inaugurate the headquarters of Indian National Space Promotion and Authorisation Centre (IN-SPACe) at Bopal, Ahmedabad.జాతీయ సాంకేతిక విజ్ఞాన దినం నాడు భారతీయ శాస్త్రవేత్తల కు కృతజ్ఞత ను వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
May 11th, 09:29 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మన ప్రతిభావంతులైన శాస్త్రవేత్తల కు మరియు వారి యొక్క ప్రయాసల కు కృతజ్ఞత ను వ్యక్తం చేశారు. 1998వ సంవత్సరం లో జరిపిన పోఖ్ రణ్ లో పరీక్ష లు సఫలం అయ్యాయి అంటే అందుకు వారి ప్రయాస లు కారణం మరి.గుజరాత్లో 11వ ఖేల్ మహాకుంభ్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
March 12th, 06:40 pm
గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్జీ, రాష్ట్ర ప్రముఖ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్జీ, పార్లమెంటులో నా సహచరుడు, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ చైర్మన్ సి. ఆర్.పాటిల్జీ, గుజరాత్ ప్రభుత్వంలో క్రీడల శాఖ సహాయ మంత్రి శ్రీ హర్ష్ సంఘ్వీజీ, పార్లమెంట్లో నా సహచరులు శ్రీ హస్ముఖ్ భాయ్ పటేల్, శ్రీ నరహరి అమీన్ మరియు అహ్మదాబాద్ మేయర్ భాయ్ శ్రీ కితిత్ కుమార్ పర్మార్జీ, ఇతర ప్రముఖులు మరియు గుజరాత్ నలుమూలల నుండి వచ్చిన నా యువ స్నేహితులు !11వ ఖేల్ మహాకుంభ్ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించిన ప్రధానమంత్రి
March 12th, 06:30 pm
అహ్మదాబాద్ లో 11వ ఖేల్ మహాకుంభ్ ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయ్ పటేల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.భారతదేశ యువత కొత్తగా మరియు పెద్ద ఎత్తున ఏదైనా చేయాలని కోరుకుంటుంది: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
August 29th, 11:30 am
మన్ కీ బాత్ సందర్భంగా, ప్రధాన మంత్రి ధ్యాన్చంద్కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు మరియు ప్రపంచ వేదికపై దేశాన్ని గర్వపడేలా చేసిన మన ఒలింపియన్ల గురించి మాట్లాడారు. దేశంలోని యువత రిస్క్ తీసుకొని ముందుకు సాగగల సామర్థ్యం కోసం ఆయన ప్రశంసించారు. మా నైపుణ్యం కలిగిన మానవశక్తి కృషిని ప్రధాన మంత్రి ప్రస్తావించారు మరియు భగవాన్ విశ్వకర్మకు నివాళులు అర్పించారు.‘వివా టెక్’ 5వ విడత సదస్సులో ప్రధానమంత్రి కీలకో ప్రసంగ పాఠం
June 16th, 04:00 pm
ఎక్కడ సంప్రదాయకత విఫలమవుతుందో అక్కడ ఆవిష్కరణ తోడ్పాటునిస్తుందన్నది నా విశ్వాసం. మన శకంలో అత్యంత విచ్ఛిన్నకర కోవిడ్-19 ప్రపంచ మహమ్మారి విజృంభణ సమయంలో ఈ సత్యం ప్రస్ఫుటమైంది. అన్నిదేశాలూ అనేక కష్టనష్టాలకు లోనుకావడమేగాక భవిష్యత్తుపై తీవ్ర ఆందోళనకు గురయ్యాయి. మన సంప్రదాయక విధానాలకు కోవిడ్-19 విషమ పరీక్ష పెట్టినప్పటికీ, ఆవిష్కరణలే మనను ఆదుకున్నాయి.