వందేమాతరం 150 సంవత్సరాల ప్రత్యేక చర్చ సందర్భంగా లోక్ సభలో ప్రధానమంత్రి ప్రసంగం

December 08th, 12:30 pm

ఈ ప్రత్యేక సందర్భంలో సామూహికంగా చర్చించేందుకు ముందుకు వచ్చినందుకు మీకు, ఈ సభలోని గౌరవ సభ్యులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేశ స్వాతంత్ర్య ఉద్యమాన్ని శక్తి, త్యాగస్పూర్తి, నిరాడంబరతను నింపిన ఆ మంత్రాన్ని, ఆ స్పష్టమైన పిలుపును గౌరవంగా గుర్తుచేసుకుంటూ.. ఈ సభలో వందేమాతరాన్ని స్మరించుకోవడం మనందరికీ గొప్ప గౌరవం. వందేమాతరం 150 సంవత్సరాల చారిత్రక ఘట్టానికి మనం సాక్షులుగా నిలబడటం చాలా గర్వకారణం. ఈ కాలం చరిత్ర విస్తృతి నుంచి లెక్కలేనన్ని సంఘటనలను మన ముందుకు తీసుకువస్తుంది. ఈ చర్చ ఖచ్చితంగా సభ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. కానీ మనం ఈ క్షణాన్ని సమష్టిగా ఉపయోగించుకుంటే రాబోయే తరాలకు, ప్రతి తరానికి కూడా నేర్చుకునే మూలంగా ఉపయోగపడుతుంది.

జాతీయ గేయం వందేమాతరానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లోక్ సభ ప్రత్యేక చర్చలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

December 08th, 12:00 pm

జాతీయ గేయం వందేమాతరానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ రోజు లోకసభలో నిర్వహించిన ప్రత్యేక చర్చలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ విశేష సందర్భంలో సమష్టి చర్చకు అంగీకరించిన గౌరవ సభ్యులందరికీ ప్రధానమంత్రి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. దేశ స్వాతంత్ర్యోద్యమానికి ఉత్తేజాన్నీ, ప్రేరణనూ అందించి.. త్యాగనిరతి - దృఢసంకల్పంతో కూడిన మార్గాన్ని నిర్దేశించిన ‘వందేమాతరం’ మంత్రాన్ని స్మరించుకుంటున్నామని, సభలో ఉన్న వారందరికీ ఇదో గొప్ప గౌరవమని ఆయన వ్యాఖ్యానించారు. వందేమాతరానికి 150 ఏళ్లు పూర్తయిన ఈ చరిత్రాత్మక సందర్భం దేశానికి గర్వకారణమని శ్రీ మోదీ అన్నారు. ఈ వేళ అనేక చారిత్రక సంఘటనలు మన కళ్లెదుట కదలాడేలా నిలుపుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ చర్చ సభ అంకితభావాన్ని చాటడమే కాకుండా, భావి తరాలు అవగాహన పెంచుకునే జ్ఞానసంపదగా నిలుస్తుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. సభ్యులంతా ఈ చర్చను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ప్రజల సమిష్టి ప్రయత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి 'మన్ కీ బాత్' ఒక అద్భుతమైన వేదిక: ప్రధాని మోదీ

November 30th, 11:30 am

ఈ నెల మన్ కీ బాత్‌లో, రాజ్యాంగ దినోత్సవ వేడుకలు, వందేమాతరం 150వ వార్షికోత్సవం, అయోధ్యలో ధర్మ ధ్వజ ఆవిష్కరణ, ఐఎన్‌ఎస్ 'మహే' ప్రవేశం మరియు కురుక్షేత్రలో అంతర్జాతీయ గీతా మహోత్సవం వంటి నవంబర్‌లో జరిగిన కీలక సంఘటనలను ప్రధాని మోదీ హైలైట్ చేశారు. రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాలు & తేనె ఉత్పత్తి, భారతదేశ క్రీడా విజయాలు, మ్యూజియంలు మరియు సహజ వ్యవసాయం వంటి అనేక ముఖ్యమైన అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. కాశీ-తమిళ సంగమంలో ప్రతి ఒక్కరూ భాగం కావాలని ప్రధాని కోరారు.

దక్షిణాఫ్రికా పర్యటనకు బయలుదేరే ముందు ప్రధానమంత్రి ప్రకటన

November 21st, 06:45 am

దక్షిణాఫ్రికా అధ్యక్షతన జోహెన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న జీ20 నాయకుల 20వ సదస్సులో పాల్గొనాలన్న శ్రీ సిరిల్ రామఫోసా ఆహ్వానం మేరకు 2025 నవంబర్ 21 నుంచి 23 వరకు ఆ దేశంలో పర్యటిస్తాను.

జీ-7 సమావేశాల నేపథ్యంలో దక్షిణాఫ్రికా, బ్రెజిల్ దేశాధ్యక్షులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ

June 18th, 03:05 pm

జూన్ 17న కెనడా కననాస్కిస్ లో జరిగిన జీ-7 శిఖరాగ్ర సమావేశాల నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభివృద్ధి చెందుతున్న దేశాల నేతలతో సమావేశమయ్యారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు శ్రీ సిరిల్ రామాఫోజా, బ్రెజిల్ అధ్యక్షుడు శ్రీ లూయిజ్ ఇనాసియో లులా డిసిల్వాతో భేటీ కావడమే కాకుండా, సుహృద్భావపూర్వక వాతావరణంలో అర్ధవంతంగా చర్చలు జరిగాయి.

జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా దక్షిణాఫ్రికా అధ్యక్షునితో ప్రధానమంత్రి మాటామంతీ

June 18th, 02:51 pm

ఈ నెల 17న కెనడాలోని కననాస్కిస్‌లో జరిగిన జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా దక్షిణాఫ్రికా అధ్యక్షుడు శ్రీ సిరిల్ రామాఫోజాతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.

పాలనలో డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, కృత్రిమ మేధ, ఇంకా డేటాల వినియోగంపై ప్రకటన

November 20th, 07:52 am

ప్రపంచ వృద్ధి 3 శాతాని కంటే కాస్త ఎక్కువ మాత్రమే నమోదయింది. ఇది ఈ శతాబ్దం మొదలైన తరువాత నుంచి చూస్తే అత్యంత తక్కువ. మహమ్మారికి ముందు కాలంలో ఇది సగటున సుమారు 4 శాతం గా ఉండింది. దీనికి తోడు, టెక్నాలజీ ఊహించినదాని కంటే వేగంగా వెళుతోంది. టెక్నాలజీని సమాన స్థాయిలలో న్యాయబద్ధంగా ఉపయోగించుకోవడం ద్వారా వృద్ధిని పెంచడానికీ, అసమానతలను తగ్గించడానికీ, స్థిరాభివృద్ధి లక్ష్యాల (ఎస్‌డీజీస్) సాధనలో అంతరాన్ని పూడ్చే దిశలో ఒక పెద్ద అడుగు వేయడానికీ ఒక చరిత్రాత్మక అవకాశాన్ని మనకు అందిస్తుంది.

నైజీరియా, బ్రెజిల్, గయానా దేశాల్లో పర్యటించనున్న ప్రధాని మోదీ

November 12th, 07:44 pm

నవంబర్ 16-21 తేదీల్లో నైజీరియా, బ్రెజిల్, గయానాలలో అధికారిక పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లనున్నారు. నైజీరియాలో, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి మరియు భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ఉన్నత స్థాయి చర్చల్లో ఆయన పాల్గొంటారు. బ్రెజిల్‌లో జరిగే జీ20 సదస్సులో ఆయన పాల్గొంటారు. గయానాలో, ప్రధాన మంత్రి సీనియర్ నేతలతో చర్చలు జరుపుతారు, పార్లమెంట్‌లో ప్రసంగిస్తారు మరియు కారికొమ్-ఇండియా సమ్మిట్‌లో పాల్గొంటారు, ఇది కరీబియన్ ప్రాంతంతో సంబంధాలను మరింతగా పెంచుకోవడంలో భారతదేశం యొక్క నిబద్ధతను ఉద్ఘాటిస్తుంది.

PM Modi congratulates H.E Cyril Ramaphosa on being re-elected as the President of the Republic of South Africa

June 17th, 05:11 pm

The Prime Minister, Shri Narendra Modi congratulated H.E Cyril Ramaphosa on being re-elected as the President of the Republic of South Africa, today. PM Modi also expressed that he was looking forward to work with President Ramaphosa to further strengthen the strategic partnership between India and South Africa.

కొమొరోస్ యొక్కరాష్ట్రపతి గా శ్రీ అజాలీ అసోమానీ తిరిగి ఎన్నికైన సందర్భం లో ఆయన కు అభినందనల నుతెలిపిన ప్రధాన మంత్రి

January 29th, 10:30 pm

భారతదేశం-కొమొరోస్ భాగస్వామ్యాన్ని, భారతదేశం-ఆఫ్రికా భాగస్వామ్యాన్ని మరియు ‘విజన్ సాగర్’ ను మరింత బలపరచాలని తాను ఆశపడుతున్నట్లు కూడా శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

దక్షిణ ఆఫ్రికాకు వ్యతిరేకం గా జరిగిన మ్యాచ్ లో గెలిచినందుకు భారతదేశం క్రికెట్ జట్టు కుఅభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి

November 05th, 10:22 pm

ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్ లో ఈ రోజు న దక్షిణ ఆఫ్రికా పై భారతదేశం క్రికెట్ జట్టు సాధించిన గెలుపున కు గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియ జేశారు.

India made G20 a people-driven national movement: PM Modi

September 26th, 04:12 pm

PM Modi addressed the G20 University Connect Finale programme at Bharat Mandapam in New Delhi. Addressing the event, PM Modi credited the happenings in India to the youthful energy of the nation and said, Events of such scale are bound to be a success when the youth associate themselves with it.” It is evident from the activities of the last 30 days that India is becoming a happening place, the Prime Minister added.

జి-20 విశ్వవిద్యాలయ అనుసంధానం ముగింపు కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం భారత్‌లో జి-20 సదస్సు సంబంధిత నాలుగు ప్రచురణల ఆవిష్కరణ;

September 26th, 04:11 pm

ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నేడు న్యూఢిల్లీలోని భారత మండపంలో ‘జి-20 విశ్వవిద్యాలయ అనుసంధానం’ ముగింపు కార్యక్రమంలో ప్రసంగించారు. దేశంలోని యువతరంలో భారత జి-20 అధ్యక్షతపై అవగాహన పెంపు, సంబంధిత కార్యక్రమాల్లో వారి భాగస్వామ్యం లక్ష్యంగా విశ్వవిద్యాలయ అనుసంధానం కార్యక్రమం చేపట్టబడింది. ముగింపు కార్యక్రమంలో భాగంగా ప్రధాని జి-20 సంబంధిత 4 ప్రచురణలు- “జి20 అధ్యక్షతలో భారత్‌ ఘన విజయం-దార్శనిక నాయకత్వం-సార్వజనీన విధానం; జి-20కి భారత అధ్యక్షత- వసుధైవ కుటుంబకం; జి-20 విశ్వవిద్యాలయ అనుసంధాన కార్యక్రమ సంగ్రహం; జి-20లో భారతీయ సంస్కృతీ ప్రదర్శన”ను ఆవిష్కరించారు.

కొమొరెజ్‌ అధ్యక్షుడితో ప్రధానమంత్రి సమావేశం

September 10th, 05:20 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ న్యూఢిల్లీలో జి-20 శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో కొమొరెజ్‌ సమాఖ్య అధ్యక్షులు మాననీయ అజలీ అసౌమనితో 2023 సెప్టెంబరు 10న సమావేశమయ్యారు. జి-20 కూటమిలో ఆఫ్రికా సమాఖ్య శాశ్వత సభ్యత్వం పొందడంలో ప్రధానమంత్రి కృషికి ఈ సందర్భంగా అధ్యక్షులు అసౌమని కృతజ్ఞతలు తెలిపారు. అందునా ఆఫ్రికాతో భారతదేశానికి లోతైన సంబంధాలున్న నేపథ్యంలో జి-20కి భారత్‌ అధ్యక్షత వహిస్తున్న సమయాన చోటుచేసుకున్న ఈ పరిణామం ప్రత్యేక ఆనందాన్నిచ్చిందని ఆయన చెప్పారు. తద్వారా భారత్‌-కొమొరెజ్‌ సంబంధాలకు ఉత్తేజం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. జి-20 అధ్యక్ష బాధ్యతలను విజయంతంగా నిర్వర్తించడంపై ప్రధానమంత్రిని ఆయన అభినందించారు.

భారత్-బ్రెజిల్-దక్షిణాఫ్రికా-అమెరికాల సంయుక్త ప్రకటన

September 09th, 09:11 pm

అదే సమయంలో జి-20కి ప్రస్తుత, తదుపరి వరుసగా అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించనున్న మూడు దేశాల హోదాలో ప్రపంచ సవాళ్ల పరిష్కారం దిశగా భారత జి-20 అధ్యక్షతన సాధించిన చరిత్రాత్మక ప్రగతిని కొనసాగిస్తామని ప్రతినబూనుతున్నాం. ఇదే స్ఫూర్తితో ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో సంయుక్తంగా మరింత పెద్ద, ప్రభావశీల, మెరుగైన బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకుల ఏర్పాటులో జి-20 నిబద్ధతను మేము స్వాగతిస్తున్నాం. జి-20 వేదికగా సమష్టి కృషి ద్వారా ప్రపంచ ప్రజల మెరుగైన భవిష్యత్తుకు మద్దతిస్తూ మేము సాధించగలిగినదేమిటో మా నిబద్ధత స్పష్టం చేస్తుంది.

The fervour generated by the Chandrayaan success needs to be channelled into Shakti: PM Modi

August 26th, 01:18 pm

PM Modi arrived to a grand welcome in Delhi. Responding to the warm civic reception, the Prime Minister expressed his gratitude for the enthusiasm of the people for the success of the Chandrayaan-3. He said that India is creating a new impact on the basis of its achievement and successes and the world is taking note.

ఢిల్లీ చేరుకున్న ప్రధానికి ఘనస్వాగతం

August 26th, 12:33 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఢిల్లీ లో ఘన స్వాగతం ప లికారు. చంద్రయాన్ -3 మూన్ ల్యాండర్ విజయవంతంగా ల్యాండ్ అయిన నేపథ్యంలో ఇస్రో బృందంతో మాట్లాడిన అనంతరం ప్రధాని ఈ రోజు బెంగళూరు నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. నాలుగు రోజుల దక్షిణాఫ్రికా, గ్రీస్ పర్యటన అనంతరం ప్రధాని నేరుగా బెంగళూరు వెళ్లారు. శ్రీ జె.పి.నడ్డా ప్రధాన మంత్రికి స్వాగతం పలికారు, విజయవంతమైన పర్యటన, భారత శాస్త్రవేత్తల చిరస్మరణీయ విజయం పై ఆయనను అభినందించారు.

దక్షిణాఫ్రికా, గ్రీస్ ల పర్యటన ఫలవంతం చేసుకుని తిరిగి వచ్చిన ప్రధానమంత్రికి బెంగళూరులో అద్భుత స్వాగతం

August 26th, 10:08 am

దక్షిణాఫ్రికా, గ్రీస్ దేశల్లో నాలుగు రోజుల పాటు పర్యటించిన అనంతరం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేరుగా బెంగళూరు వచ్చారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికాలో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొని అనంతరం గ్రీస్ సందర్శించారు. పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి వివిధ ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొనడంతో పాటు స్థానిక నాయకులతో కూడా సమావేశమయ్యారు. ఉభయ దేశాల్లోను భారతీయ సమాజానికి సంబంధించిన ప్రజలనున కూడా ఆయన కలుసుకున్నారు. చంద్రయాన్-3 మూన్ లాండర్ చంద్ర మండలంపై దిగడాన్ని వీడియో కాన్ఫరెన్సింగ్ విధానంలో ప్రత్యక్షంగా వీక్షించిన ప్రధానమంత్రి ఇస్రో టీమ్ తో సంభాషించడానికి బెంగళూరు వచ్చారు.

గ్రీస్ లోని ఏథెన్స్ లో భారతీయులనుద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

August 25th, 09:30 pm

వేడుకల వాతావరణం, పండుగ ఉత్సాహం ఉన్నప్పుడు ఎవరైనా త్వరగా తమ కుటుంబ సభ్యుల మధ్య ఉండాలని కోరుకుంటారు.నేను కూడా నా కుటుంబ సభ్యుల మధ్యకు వచ్చాను. ఇది ఒక రకంగా శివుని మాసంగా భావించే శ్రావణ మాసం, ఈ పవిత్ర మాసంలో మన దేశం ఒక కొత్త మైలురాయిని సాధించింది. చంద్రుడి డార్క్ జోన్ అయిన దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ నిలిచింది. చంద్రుడిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, భారత సామర్థ్యాలను యావత్ ప్రపంచానికి చాటిచెప్పింది. ప్రపంచం నలుమూలల నుంచి అభినందన సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలు తమ శుభాకాంక్షలను పంపుతున్నారు, మరియు ప్రజలు మిమ్మల్ని కూడా అభినందిస్తున్నారని నేను గట్టిగా నమ్ముతున్నాను, కాదా? మీకు చాలా అభినందనలు కూడా వస్తున్నాయి కదా? ప్రతి భారతీయుడు దీనిని అందుకుంటున్నాడు. సోషల్ మీడియా మొత్తం అభినందన సందేశాలతో నిండిపోయింది. విజయం అంత ముఖ్యమైనప్పుడు, ఆ విజయం కోసం ఉత్సాహం స్థిరంగా ఉంటుంది. మీరు ప్రపంచంలో ఎక్కడైనా జీవించవచ్చు, కానీ భారతదేశం అనే భావన మీ హృదయంలో బలంగా ఉంటుందని మీ ముఖం కూడా చెబుతుంది. భారతదేశం మీ గుండె లయలో ఉంటుంది, భారతదేశం మీ గుండె లయలో ఉంటుంది, భారతదేశం మీ గుండె లయలో ఉంటుంది. ఈ రోజు, నేను మీ అందరి మధ్య గ్రీస్ లో ఉన్నాను, చంద్రయాన్ యొక్క అద్భుతమైన విజయానికి మరోసారి నేను ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.

ఏథెన్స్ లో ఉంటున్న భారతీయ సముదాయం తో మాట్లాడిన ప్రధాన మంత్రి

August 25th, 09:00 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 ఆగస్టు 25 వ తేదీ నాడు ఏథెన్స్ లోని ఏథెన్స్ కన్సర్వేటాయర్ లో భారతీయ సముదాయాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.