2026 వ సంవత్సరం మే 31 వ తేదీ న జరిగిన ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం యొక్క 134 వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

May 31st, 11:30 am

నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. 'మన్ కీ బాత్' కార్యక్రమంలో మరోసారి మీతో కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు దేశం కోసం, సమాజ ప్రయోజనం కోసం అద్భుతమైన పనులు చేస్తున్నారు. వాటి గురించి విన్నప్పుడు మనకు కొత్త స్ఫూర్తి కలుగుతుంది. అథ్లెటిక్స్‌లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనతతో నేను ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. కొన్ని రోజుల కిందట జార్ఖండ్‌లోని రాంచీలో జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీలు జరిగాయి. ఇందులో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి దాదాపు 800 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాలుగు వేర్వేరు ఈవెంట్లలో నాలుగు జాతీయ రికార్డులను నెలకొల్పారు. గురిందర్‌వీర్ సింగ్, విశాల్ టీకే, తేజస్విన్ శంకర్, దేవ్ మీనా, కుల్దీప్ కుమార్ ఈ ఘనత సాధించారు. ఈ మిత్రులు వివిధ విభాగాలలో కొత్త రికార్డులను నెలకొల్పారు. ముందుగా వారందరికీ నా అభినందనలు.

ఈద్-ఉల్-అజ్హా సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు

May 28th, 09:55 am

ఈద్-ఉల్-అజ్హా పర్వదినం సందర్భంగా పౌరులందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

మార్పు తెచ్చే శక్తి వాస్తవిక జ్ఞ‌ానానికి ఉందని చెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

May 26th, 09:20 am

సిసలైన జ్ఞ‌ానం దేశం, సమాజంతో పాటు పూర్తి మానవజాతి సంక్షేమానికి కూడా బాటను వేస్తుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. మన జ్ఞ‌ానం, మనం చేసే పనులు యావత్తు మానవాళికి స్ఫూర్తిని అందించేవిగా ఉండడం ముఖ్యమని ఆయన అన్నారు.

పోచిషే బోయిషాఖ్ సందర్భంగా గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్‌కు ప్రధానమంత్రి నివాళులు

May 09th, 09:10 am

నేడు పోచిషే బోయిషాఖ్ (రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ జయంతి) సందర్భంగా గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక నివాళులర్పించారు.

ఉత్తర ప్రదేశ్‌లోని హర్దోయిలో గంగా ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

April 29th, 11:35 am

ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ గారు, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు, ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య గారు, బ్రజేష్ పాఠక్ గారు, కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు జితిన్ ప్రసాద గారు, పంకజ్ చౌదరి గారు, యూపీ ప్రభుత్వ మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఇక్కడికి భారీ సంఖ్యలో విచ్చేసిన నా ప్రియమైన సోదరసోదరీలారా!

ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయిలో సరికొత్త 594 కిలోమీటర్ల పొడవైన ప్రవేశ నియంత్రిత గంగా ఎక్స్‌ప్రెస్‌ రహదారిని ప్రారంభించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ

April 29th, 11:30 am

ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయిలో కొత్తగా నిర్మిస్తున్న 594 కిలోమీటర్ల పొడవైన ప్రవేశ నియంత్రిత గంగా ఎక్స్‌ప్రెస్ రహదారిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. నరసింహ పుణ్యక్షేత్రానికి, కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ప్రవహిస్తున్న గంగామాత దివ్య సన్నిధికి నమస్కరిస్తూ ప్రధానమంత్రి ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ ప్రాంతమంతా గంగామాత ఆధ్యాత్మిక శోభతో, మాతృత్వాన్ని పంచే జీవధారతో పునీతమైన పుణ్యక్షేత్రమని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘ఈ ఎక్స్‌ప్రెస్‌ రహదారి ఉత్తరప్రదేశ్‌కు లభించిన వరం. సాక్షాత్తు గంగామాత ఆశీర్వాదమే ఇది’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు. ఈ ఎక్స్‌ప్రెస్‌ రహదారి ద్వారా పవిత్ర పుణ్యక్షేత్రాలకు చేరుకునే ప్రయాణ సమయం గణనీయంగా తగ్గి, కొన్ని గంటల్లోనే అక్కడికి చేరుకోవచ్చని వివరించారు.

బసవ జయంతి సందర్భంగా జగద్గురు బసవేశ్వరకు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధానమంత్రి

April 20th, 09:43 am

బసవ జయంతి సందర్భంగా జగద్గురు బసవేశ్వరకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు.

కర్ణాటకలోని మాండ్యలో శ్రీ గురు భైరవైక్య మందిర ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

April 15th, 11:10 am

పరమ పూజ్య జగద్గురు శ్రీ శ్రీ శ్రీ డాక్టర్ నిర్మలానందనాథ మహాస్వామీజీ, మాజీ ప్రధానమంత్రి హెచ్ డీ దేవెగౌడ గారు, కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ గారు, పరమ పూజ్య జగద్గురు స్వామి పరమాత్మానంద సరస్వతిజీ, కేంద్ర మంత్రులు హెచ్ డీ. కుమారస్వామి గారు, శోభా కరంద్లాజే గారు, కర్ణాటక ప్రతిపక్ష నాయకుడు ఆర్ అశోక గారు, రాష్ట్ర మంత్రి ఎన్. చెలువరాయస్వామి గారు, సకల సాధువులందరికీ, ఇతర ప్రముఖులు, ఇక్కడికి భారీ సంఖ్యలో విచ్చేసిన సోదర సోదరీలందరికీ నమస్కారాలు.

కర్ణాటక మాండ్యలోని శ్రీ క్షేత్ర ఆదిచుంచనగిరిలో శ్రీ గురుభైరవైక్య మందిరాన్ని ప్రారంభించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ

April 15th, 11:00 am

కర్ణాటకలోని మాండ్య జిల్లా శ్రీ క్షేత్ర ఆదిచుంచనగిరిలో శ్రీ గురు భైరవైక్య మందిరాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసిందన్న ప్రధానమంత్రి... వైభవోపేతంగా శ్రీ గురు భైరవైక్య ఆలయాన్ని ప్రారంభించి, మహోన్నతులైన సాధుసంతులతో సంభాషించే భాగ్యాన్ని తనకిచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. చారిత్రక జ్వాలాపీఠం వద్ద సమయం గడపడం, అశేషంగా తరలివచ్చిన భక్తులనుద్దేశించి ప్రసంగించడం మాటలకందని బలమైన భావోద్వేగాలను కలిగించాయన్నారు. ‘‘ఈ దైవిక అనుభవాలు శాశ్వతంగా నా స్మృతిపథంలో నిలిచిపోతాయి’’ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నివాళి

April 14th, 09:14 am

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హృదయపూర్వక నివాళి అర్పించారు.

Prime Minister extends Easter Greetings

April 05th, 09:02 am

The Prime Minister, Shri Narendra Modi, has extended greetings on the occasion of Easter.

ఆధ్యాత్మిక గురువు డాక్టర్ శ్రీ శ్రీ శ్రీ శివకుమార స్వామిగళుకి ప్రధానమంత్రి ఘన నివాళి

April 01st, 10:33 am

నేడు ఆధ్యాత్మిక గురువు డాక్టర్ శ్రీ శ్రీ శ్రీ శివకుమార స్వామిగళు జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఘన నివాళులు అర్పించారు. కరుణ, వినయం, మానవాళికి నిరంతరం చేసిన సేవలతో ఆయన.. ప్రజల జ్ఞాపకాల్లో నిలిచిపోయారని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఇతరుల అభ్యున్నతికి జీవితాన్ని అంకితం చేసి, నిస్వార్థ సేవలోనే నిజమైన గొప్పతనం ఉందని నిరూపించారని తెలిపారు. విద్య, సామాజిక సంక్షేమం, ఆధ్యాత్మిక రంగాల్లో ఆయన చేసిన అసాధారణమైన కృషి సమాజంపై చెరగని ముద్ర వేసిందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. నిస్వార్థం, సేవా మార్గంలో వెళ్లాలనుకునే ఎంతో మందికి ఆయన జీవితం నేటికీ మార్గదర్శకంగా నిలుస్తూ, స్ఫూర్తినిస్తోందని వ్యాఖ్యానించారు.

శ్రీమద్ సుధీంద్ర తీర్థ స్వామీజీకి నివాళి అర్పించిన ప్రధాని

March 31st, 10:58 am

శ్రీమద్ సుధీంద్ర తీర్థ స్వామీజీ జన్మ శతాబ్ది సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఆయనకు నివాళి అర్పించారు. శ్రీమద్ సుధీంద్ర తీర్థ స్వామీజీ సేవ, ఆధ్యాత్మికతలకు జీవితాన్ని అంకితం చేశారని, సమాజంపై చెరగని ముద్ర వేశారని శ్రీ మోదీ కొనియాడారు. పూజ్య స్వామీజీ అనేక సంస్థలను, పరిశోధన కేంద్రాలను స్థాపించారని, ప్రజల్లో విద్యావ్యాప్తిని పెంచడానికి ఎంతో నిబద్ధతతో కృషి చేశారని ప్రధానమంత్రి అన్నారు.

భగవాన్ మహావీర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు

March 31st, 10:34 am

భగవాన్ మహావీర్‌ జన్మ కల్యాణక్ (మహావీర్‌ జయంతి) పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. భగవాన్ మహావీరుని జీవితం, ఆయన బోధనలు సత్యం, అహింస, కరుణ మార్గంలో నిరంతరం వెలుగులు నింపుతాయని శ్రీ మోదీ పేర్కొన్నారు. ‘‘ఆయన ఆదర్శాలు ఆధ్యాత్మికంగా ఉత్తేజాన్నివ్వడమే కాకుండా, నేటి ప్రపంచానికి ఎంతో సందర్భోచితంగా ఉన్నాయి. సమానత్వం, దయపై ఆయన చూపిన శ్రద్ధ, సమాజం పట్ల మనకు ఉన్న ఉమ్మడి బాధ్యతను గుర్తుచేస్తుంది’’ అని ప్రధానమంత్రి తెలిపారు.

గుజరాత్‌లోని గాంధీనగర్‌లో 'సమ్రాట్ సంప్రతి మ్యూజియం' ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం

March 31st, 10:25 am

ఈ సభకు హాజరైన ఆచార్య భగవంత్ శ్రీ పద్మసాగర్ సూరీశ్వర్ జీ మహరాజ్ సాహెబ్, గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ గారు, ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భాయ్ హర్ష్ సంఘవి గారు, పరమ పూజ్య ఆచార్య భగవంత్, పూజ్య సాధు భగవంత్, సాధ్విజీ భగవంత్, ఈ పవిత్ర సమావేశానికి హాజరైన అందరు ఆచార్యులు, ముని భగవంత్‌లు, గౌరవనీయ లోకోపకారులు, పండితులు, సోదరీ సోదరులారా!

మహావీర్ జయంతి సందర్భంగా గాంధీనగర్‌లోని కోబా తీర్థ్‌లో సామ్రాట్ సంప్రతి మ్యూజియాన్ని ప్రారంభించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ

March 31st, 10:15 am

భగవాన్ మహావీర్ జయంతి శుభ సందర్భాన్ని పురస్కరించుకుని గుజరాత్‌లోని గాంధీనగర్, కోబా తీర్థంలో సామ్రాట్ సంప్రతి సంగ్రహాలయ జైన వారసత్వ మ్యూజియాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘కోబా తీర్థం ఆధ్యాత్మిక ప్రశాంతతతో నిండి ఉంది. ఎందరో జైన మునులు, సాధువుల తపస్సు ఇక్కడ ప్రతిబింబిస్తోంది. సృజన, సేవ ఇక్కడ సహజంగానే వికసిస్తాయి’’ అని శ్రీ మోదీ అన్నారు.

సంస్కృత సుభాషితాన్ని పంచుకుంటూ... ప్రజా శ్రేయస్సు కోసం మేధస్సు, ఏఐల లక్షణాలను ప్రస్తావించిన ప్రధానమంత్రి

February 17th, 08:53 am

శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని సమాజానికి నిజంగా ఉపయోగకరంగా మార్చడంలో మేధస్సు, హేతుబద్ధత, నిర్ణయం తీసుకునే సామర్థ్యాల ప్రాముఖ్యాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు స్పష్టం చేశారు. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు గురించి ప్రధానంగా ప్రస్తావించిన ఆయన... పౌరులందరి సంక్షేమం కోసం కృత్రిమ మేధస్సును ఉపయోగించుకోగల మార్గాలను అన్వేషించడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

గొప్ప సామాజిక సంస్కర్త శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్‌కు నివాళులర్పించిన ప్రధానమంత్రి

February 15th, 02:49 pm

మహా సామాజిక సంస్కర్త శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ఆయనకు ఘన నివాళులర్పించారు. “సత్యం, అహింస, ఉన్నతమైన నైతిక విలువల సందేశాన్ని వ్యాప్తి చేయడం ద్వారా ఆయన సమాజంలో సరికొత్త చైతన్యాన్ని నింపారు. ఆయన స్ఫూర్తిదాయకమైన జీవితం దేశ ప్రజలకు ఎప్పటికీ మార్గదర్శకంగా నిలుస్తుంది” అని ఆయన అన్నారు.

సేవా తీర్థ్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీసుకున్న తొలి నిర్ణయాల్లో సేవా స్ఫూర్తితోపాటు సమాజంలో ప్రతి వర్గానికీ మేలు చేయడంపై వ్యక్తమైన శ్రద్ధ

February 13th, 04:16 pm

సేవా తీర్థ్‌కు మారిన తరువాత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీసుకున్న తొలి నిర్ణయాల్లో సేవా స్ఫూర్తి ఉట్టిపడింది.. ఆయన సంతకాలు చేసిన ముఖ్య దస్త్రాలలో సమాజంలో ప్రతి ఒక్క వర్గానికీ సంబంధించినవి ఉన్నాయి. ఆ వర్గాల్లో ప్రధానంగా రైతులు, మహిళలు, యువతీయువకులతో పాటు బలహీన వర్గాల పౌరులు ఉన్నారు.

భగవాన్ స్వామినారాయణ్ రచించిన శిక్షాపత్రి ద్విశతాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

January 23rd, 02:12 pm

ఈరోజు మనమందరం ఒక ప్రత్యేక సందర్భానికి సాక్షులుగా నిలుస్తున్నాం. భగవాన్ స్వామినారాయణ్ రచించిన శిక్షాపత్రి 200 ఏళ్లు పూర్తైన సందర్భంగా జరుగుతున్న ఈ ద్విశతాబ్ది వేడుకలు మనందరికీ దక్కిన అదృష్టం. ఈ పవిత్ర మహోత్సవంలో మనమందరం భాగస్వాములవ్వడం విశేషం. ఈ పుణ్యకాలంలో నేను సాధువులందరికీ ప్రణామం చేస్తున్నాను. ఈ ద్విశతాబ్ది ఉత్సవాల సందర్భంగా భగవాన్ స్వామినారాయణ్ కోట్లాది మంది భక్తులకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.