Prime Minister condoles the passing of legendary playback singer S. Janaki Amma

July 12th, 09:33 am

The Prime Minister, Shri Narendra Modi, has expressed deep grief over the passing of distinguished playback singer S. Janaki Amma.

Prime Minister expresses grief over boat accident involving Indian nationals near Phu Quoc, Vietnam

July 11th, 06:31 pm

The Prime Minister, Shri Narendra Modi, has expressed deep grief over the tragic boat accident involving Indian nationals near Phu Quoc, Vietnam.

Prime Minister visits the UNESCO World Heritage Prambanan Temple Complex

July 08th, 01:46 pm

PM Modi and Indonesian President Prabowo Subianto visited the iconic UNESCO World Heritage site Prambanan Temple Complex in Indonesia. The two leaders unveiled a plaque marking the commencement of the ASI's conservation and restoration project at the temple complex. India’s support for the restoration of the Prambanan Temple reflects its enduring commitment to preserving shared civilizational heritage.

Prime Minister shares Sanskrit Subhashitam highlighting the strength of courage and resilience

July 08th, 07:48 am

PM Modi shared a Sanskrit Subhashitam emphasising that courage is a nation's greatest strength. He said steadfast resolve enables the country to remain united through challenges and continue progressing towards prosperity and self-reliance.

Prime Minister conferred ‘Bintang Adipurna of the Republic of Indonesia,’ the highest civilian award of the nation, by the President of Indonesia

July 07th, 03:27 pm

PM Modi was conferred the 'Bintang Adipurna of the Republic of Indonesia', the country's highest medal of honour, by Indonesian President Prabowo Subianto in recognition of his leadership and exceptional contribution to strengthening India-Indonesia relations. The PM dedicated the award to the people of India and Indonesia and to the enduring civilisational ties between the two countries.

అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన కీకో ఫుజిమోరిని అభినందించిన ప్రధానమంత్రి

July 04th, 01:54 pm

పెరూ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన శ్రీమతి కీకో ఫుజిమోరికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. భారత్-పెరూ మధ్య గల దీర్ఘకాలిక, స్నేహపూర్వక సంబంధాలను ప్రస్తావిస్తూ... పలు రంగాల్లో ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి భారత్ కట్టుబడి ఉందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.

స్వామి వివేకానంద నిర్వాణ దినోత్సవ సందర్భంగా ప్రధానమంత్రి నివాళులు

July 04th, 01:50 pm

నేడు స్వామి వివేకానంద నిర్వాణ దినోత్సవం (మహాసమాధి దినం) సందర్భంగా ఆయనకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులర్పించారు. దేశపు సంపన్న సాంస్కృతిక వారసత్వానికి, ఆధ్యాత్మిక సంప్రదాయాలకు, జాతీయ చైతన్యానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకురావడంలో స్వామి వివేకానంద చేసిన అసాధారణ కృషి తరతరాలకూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ప్రధాని కొనియాడారు. ఆయన అపారమైన జ్ఞానం, శాశ్వతమైన ఆదర్శాలు నేటికీ దేశంలోని లక్షలాది మంది యువతకు మార్గదర్శకంగా ఉన్నాయని పేర్కొన్నారు. ‘‘దేశాన్ని వికసిత భారత్‌గా తీర్చిదిద్దాలనే మన సామూహిక సంకల్పానికి, స్వామిజీ అందించిన ఆధ్యాత్మిక సందేశం నిరంతరం సరికొత్త శక్తిని, స్ఫూర్తిని అందిస్తూనే ఉంటుంది’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

పవిత్ర శ్రీ అమర్‌నాథ్ యాత్ర ఆరంభమైన వేళ శివ భక్తులందరికీ ప్రధానమంత్రి శుభాకాంక్షలు.. సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధాని

July 03rd, 03:56 pm

పవిత్ర శ్రీ అమర్‌నాథ్ యాత్ర ఈ రోజు నుంచి మొదలైన సందర్భంగా శివ భక్తులందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఒక సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ఆయన ఇలా పంచుకున్నారు:

పవిత్ర యాత్ర సందర్భంగా.. అయిదు సంకల్పాలతో అమర్‌నాథ్ యాత్రికులకు ప్రధానమంత్రి లేఖ

July 03rd, 03:53 pm

ఈ యేడు అమర్‌నాథ్ యాత్రకు వెళ్తున్న భక్తులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. వారి తీర్థయాత్ర అన్నివిధాలా సురక్షితంగా, మంగళప్రదంగా సాగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘హిమలింగాన్ని దర్శించుకునే అమర్‌నాథ్ యాత్ర.. మన ఆధ్యాత్మిక సంప్రదాయంలో, సాంస్కృతిక ఏకతలో శాశ్వతమైన అధ్యాయం’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

వైద్యుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

July 01st, 12:22 pm

ఇవాళ జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న డాక్టర్లందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు చెప్పారు. దేశానికి వారు చేస్తున్న సేవలు, చూపుతున్న కరుణ, నిబద్ధతకు కృతజ్ఞతలు తెలిపారు.

మెరుగైన పాలన, పౌరులకు సాధికారతతోపాటు వికసిత్ భారత్‌కు బలమైన పునాదిని అందించిన డిజిటల్ ఇండియా: ప్రధాని నరేంద్ర మోదీ

July 01st, 12:04 pm

డిజిటల్ ఇండియా కార్యక్రమం ప్రారంభమై విజయవంతంగా 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం దేశంలో ప్రభుత్వ పాలనా వ్యవస్థను పూర్తిగా మార్చివేసిందని, ప్రజా సేవల్ని మెరుగుపరిచి పౌరుల జీవితాల్లో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చిందని ఆయన కొనియాడారు.

శ్రీమతి విజయ మెహతా జీ కన్నుమూత.. సంతాపం తెలిపిన ప్రధానమంత్రి

July 01st, 11:41 am

శ్రీమతి విజయ మెహతా జీ మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని తెలిపారు. శ్రీమతి విజయ మెహతా గారు ఆధునిక మరాఠీ నాటక రంగ మార్గదర్శకుల్లో ఒకరనీ, సృజనాత్మకతకీ, కళాకౌశలానికీ మరో పేరనీ శ్రీ మోదీ ప్రశంసించారు. ఆమె నాటకాలూ, సినిమాలూ వివిధ తరాల నటులపైనా, దర్శకులపైనా, రంగస్థల ప్రేమికులపైనా ప్రభావాన్ని చూపాయని ఆయన అన్నారు.

హుల్ దివస్ సందర్భంగా వీర యోధులకు ప్రధానమంత్రి నివాళులు

June 30th, 06:10 pm

నేడు హుల్ దివస్ సందర్భంగా విదేశీ పాలన అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన సిదో-కన్హూ, చాంద్-భైరవ్, ఫూలో-ఝానో వంటి వీర యోధులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఘన నివాళులర్పించారు. గిరిజన ఆత్మగౌరవం, మర్యాదను కాపాడటం కోసం వారు చేసిన పోరాటం, త్యాగాల గాథ దేశ ప్రజల హృదయాల్లో నిరంతరం సరికొత్త శక్తిని నింపుతూనే ఉంటుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

ప్రతి లక్ష్యాన్ని సాధించడానికి ఐక్యత అవసరమని వివరించే సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

June 30th, 11:00 am

మన సంకల్పాలు, ఆలోచనలు, భావోద్వేగాలు అన్నీ ఒకే తాటిపైకి వచ్చినప్పుడు మనం చేపట్టే ప్రతి ప్రయత్నమూ విజయవంతమవుతుంది. భారతవర్షం (భారతదేశం) ప్రతి లక్ష్యాన్ని సాధించడానికి మనమందరం ఇలాంటి ఐక్యతా భావంతోనే ముందుకు సాగాలని ఈ సుభాషితం తెలుపుతుంది.

సీషెల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ

June 28th, 05:00 pm

ఈ రోజే కొంచెం ముందు నాకు ‘గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్’ పురస్కారాన్ని అందించి నన్ను గౌరవించినందుకు అధ్యక్షుడు ఎర్మినీ గారికి, సీషెల్స్ ప్రజలకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇది పర్యావరణ పరిరక్షణ కోసం నిరంతర కృషి చేస్తున్న వారందరికీ ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. నేను ఇక్కడికి భారత్‌లోని 140 కోట్ల ప్రజల తరపున ఆత్మీయ శుభాకాంక్షలను, శుభాశీస్సులను తీసుకువచ్చాను.

సీషెల్స్‌ అధ్యక్షుడితో సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రధానమంత్రి ప్రకటన

June 28th, 02:02 pm

అలాగే, “గార్డియన్ ఆఫ్ ది బ్లూ హొరైజన్” పురస్కార ప్రదానం నాతోపాటు 140 కోట్ల మంది భారతీయులకు లభించిన గౌరవంగా పరిగణిస్తూ, మా దేశవాసులందరి తరఫున హర్షం ప్రకటిస్తున్నాను. ఈ సత్కారాన్ని వినమ్రంగా స్వీకరిస్తూ- వాతావరణ మార్పు సమస్యలను ఎదుర్కొంటున్న, పర్యావరణ పరిరక్షణను భావితరాల కోసం తమ కర్తవ్యంగా భావిస్తున్న దేశాలన్నింటికీ సగౌరవంగా అంకితం చేస్తున్నాను.

2026 వ సంవత్సరం జూన్ 28 వ తేదీ న జరిగిన ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం యొక్క 135 వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

June 28th, 11:30 am

ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో మరోసారి మీతో మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది. 2026 సంవత్సరంలో సగం గడిచిపోతోంది. ఈ ఆరు నెలల్లో ‘మన్ కీ బాత్’ లో మన దేశ ప్రజలు సాధించిన ఎన్నో విజయాల గురించి మనం చర్చించుకున్నాం. జూన్ నెలలో కూడా దేశం కొన్ని మైలురాళ్లను సాధించింది. అవి ప్రతి పౌరుడికి గర్వకారణాలు. ఈ విజయాలు దేశ భద్రత, స్వావలంబనకు సంబంధించినవి. కోల్‌కతాలో జరిగిన ఒక నావికాదళ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఇటీవల నాకు లభించింది. అక్కడ ఐఎన్ఎస్ దూనాగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రయ్ నౌకలను భారత నావికాదళంలోకి చేర్చారు. ఈ నౌకల రూపకల్పన నుండి తయారీ వరకు ప్రతి పనీ స్వదేశీయులే చేశారు.

బంకిం చంద్ర చటోపాధ్యాయ జయంతి సందర్భంగా ఆయనకు ప్రధానమంత్రి నివాళులు

June 26th, 12:50 pm

మహనీయుడైన బంకిం చంద్ర ఛటోపాధ్యాయ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఆయన రచనలు తరతరాల భారతీయ ప్రజల్లో దేశభక్తిని, సాంస్కృతిక గర్వాన్ని రగిలించాయని అన్నారు. ఒక మహోన్నత సాహిత్యవేత్తగా ఆయనను ప్రధానమంత్రి స్మరించుకున్నారు.

రాజర్షి ఛత్రపతి సాహూ మహారాజ్‌కు ప్రధానమంత్రి నివాళులు

June 26th, 12:46 pm

రాజర్షి ఛత్రపతి సాహూ మహారాజ్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ఆయనకు నివాళులర్పించారు. సాహూ మహారాజ్‌ తన జీవితాన్ని అణగారిన, శ్రమ దోపిడీకి గురైన, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి అంకితం చేశారని ప్రధానమంత్రి కొనియాడారు. ఆయన చేసిన గొప్ప కార్యాలు, ఆదర్శాలు రాబోయే తరాలకు, దేశానికి మార్గదర్శకంగా నిలుస్తాయని శ్రీ మోదీ పేర్కొన్నారు.

ఐక్యత, పరస్పర సామరస్యాన్ని వివరించే సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

June 26th, 12:33 pm

ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడూ ఐక్యత, పరస్పర సామరస్యంతో కలిసి పనిచేయాలనే సందేశాన్ని తెలిపే సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు పంచుకున్నారు.