Cabinet approves 4 lane construction from Barabanki to Bahraich in Uttar Pradesh worth Rs.6969.04 crore

March 18th, 04:10 pm

The Cabinet Committee on Economic Affairs, chaired by PM Narendra Modi has approved construction of 4-Lane Access-Controlled National Highway-927 from Barabanki to Bahraich in Uttar Pradesh worth Rs.6969.04 crore. The project will bypass major habitations, increase average travel speeds, reduce travel time to about one hour, and improve overall road safety, fuel efficiency, and vehicle operating costs.

ఆచార్య వినోబా భావే జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నివాళి

September 11th, 08:51 am

ఆచార్య వినోబా భావే జయంతి సందర్భంగా ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయనకు ఈ రోజు నివాళి అర్పించారు. భారతదేశ ఆధ్యాత్మిక, సామాజిక, రాజకీయ రంగాలకు ఆచార్య వినోబా భావే అందించిన సమున్నత సేవలను ప్రధానమంత్రి స్మరించుకొన్నారు.

ఆంధ్రప్రదేశ్ లోని అమరావతిలో వివిధ అభివృద్ధి పథకాల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం

May 02nd, 03:45 pm

ఈవేళ పవిత్ర అమరావతి గడ్డపై నిల్చుని నా మనో నేత్రంతో వీక్షిస్తున్నది ఒక నగరాన్ని మాత్రమే కాదు.. ఒక స్వప్న సాకారాన్ని... ఓ కొత్త అమరావతిని.. సరికొత్త ఆంధ్రను దర్శిస్తున్నా. సంప్రదాయంతో ముడిపడిన పురోగమనానికి అమరావతిగడ్డ ఒక ప్రతీక. బౌద్ధ వారసత్వమైన శాంతితోపాటు వికసిత భారత్ ను రూపుదిద్దే శక్తిని కూడా ఈ నేల అక్కున చేర్చుకుంటుంది. ఈ రోజు ఇక్కడ సుమారు 60,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభాలు జరిగాయి. ఇవి కేవలం కాంక్రీట్ నిర్మాణాలు కాదు. ఆంధ్రప్రదేశ్ ఆకాంక్షలకు, భారత అభివృద్ధి దృక్పథానికి బలమైన పునాదులు. వీరభద్ర స్వామి, అమరలింగేశ్వర స్వామి, తిరుపతి వేంకటేశ్వర స్వామిలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నా శుభాకాంక్షలు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గార్లకు నా అభినందనలు.

ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతిలో రూ.58,000 కోట్లకుపైగా విలువైన అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన.. ప్రారంభోత్స‌వం

May 02nd, 03:30 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతిలో రూ.58,000 కోట్లకుపైగా విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం చేసి, మరికొన్నిటికి శంకుస్థాపన చేశారు. ఇవాళ పవిత్ర అమరావతి గడ్డపై నిల్చున్న తన మనో నేత్రంతో వీక్షిస్తున్నది ఒక నగరాన్ని మాత్రమే కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఆ మేరకు ఒక స్వప్న సాకారాన్ని... ఓ కొత్త అమరావతిని.. సరికొత్త ఆంధ్రను దర్శిస్తున్నానని అభివర్ణించారు. “సంప్రదాయంతో ముడిపడిన పురోగమనానికి అమరావతిగడ్డ ఒక ప్రతీక. బౌద్ధ వారసత్వమైన శాంతితోపాటు వికసిత భారత్‌ను రూపుదిద్దే శక్తిని కూడా ఈ నేల అక్కున చేర్చుకుంటుంది” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఈ రోజు పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయడాన్ని ప్రస్తావిస్తూ- ఇవి కేవలం కాంక్రీట్ నిర్మాణాలు కాదన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆకాంక్షలకు, భారత అభివృద్ధి దృక్పథానికి బలమైన పునాదులని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా వీరభద్ర స్వామి, అమరలింగేశ్వర స్వామి, తిరుపతి వేంకటేశ్వర స్వామిని స్మరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్‌లకూ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.

పాడ్ క్యాస్ట్‌లో లెక్స్ ఫ్రిడ్మాన్‌తో ప్రధాని సంభాషణకు తెలుగు అనువాదం

March 16th, 11:47 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు పాడ్ క్యాస్ట్ ద్వారా లెక్స్ ఫ్రిడ్మాన్తో జరిపిన సంభాషణలో అనేక అంశాల గురించి ముచ్చటించారు. ఆత్మీయంగా జరిగిన సంభాషణలో భాగంగా ఉపవాసాలు ఎందుకు చేపడతారు, నిరాహారంగా ఉండటం ఎలా సాధ్యం అన్న ఫ్రిడ్మాన్ ప్రశ్నకు సమాధానమిస్తూ, తన ఉపవాస దీక్షకు గౌరవ సూచకంగా ఫ్రిడ్మాన్ కూడా ఉపవాసాన్ని చేపట్టినందుకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. “భారతదేశంలో మతపరమైన ఆచార వ్యవహారాలు నిత్య జీవితంతో పెనువేసుకుని ఉంటాయి.” అని తెలియజేస్తూ, హిందూ మతం కేవలం ఆచార వ్యవహారాలకే పరిమితం కాదని, దేశ అత్యున్నత న్యాయస్థానం వివరించినట్టు జీవితానికి దిశానిర్దేశం చేసే సిద్ధాంతమని వెల్లడించారు. ఉపవాసం వల్ల క్రమశిక్షణ అలవడుతుందని, మనస్సు, శరీరాల మధ్య సమన్వయం మెరుగవుతుందని చెప్పారు.

పాడ్ క్యాస్ట్ ద్వారా లెక్స్ ఫ్రిడ్‌మాన్‌ తో ముచ్చటించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

March 16th, 05:30 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు పాడ్ క్యాస్ట్ ద్వారా లెక్స్ ఫ్రిడ్‌మాన్‌తో జరిపిన సంభాషణలో అనేక అంశాల గురించి ముచ్చటించారు. ఆత్మీయంగా జరిగిన సంభాషణలో భాగంగా ఉపవాసాలు ఎందుకు చేపడతారు, నిరాహారంగా ఉండటం ఎలా సాధ్యం అన్న ఫ్రిడ్‌మాన్‌ ప్రశ్నకు సమాధానమిస్తూ, తన ఉపవాస దీక్షకు గౌరవ సూచకంగా ఫ్రిడ్‌మాన్‌ కూడా ఉపవాసాన్ని చేపట్టినందుకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. “భారతదేశంలో మతపరమైన ఆచార వ్యవహారాలు నిత్య జీవితంతో పెనువేసుకుని ఉంటాయి..” అని తెలియజేస్తూ, హిందూ మతం కేవలం ఆచార వ్యవహారాలకే పరిమితం కాదని, దేశ అత్యున్నత న్యాయస్థానం వివరించినట్టు జీవితానికి దిశానిర్దేశం చేసే సిద్ధాంతమని వెల్లడించారు. ఉపవాసం వల్ల క్రమశిక్షణ అలవడుతుందని, మనస్సు, శరీరాల మధ్య సమన్వయం మెరుగవుతుందని చెప్పారు.

'ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్' స్ఫూర్తి మన దేశాన్ని బలపరుస్తుంది: 'మన్ కీ బాత్' సందర్భంగా ప్రధాని మోదీ

March 26th, 11:00 am

నా ప్రియమైన దేశప్రజలారా!ఇతరులకు సేవ చేసేందుకు తమ జీవితాలను అంకితం చేస్తున్న వేలాది మంది గురించి మనం 'మన్ కీ బాత్'లో మాట్లాడుకున్నాం. తమ పింఛన్ మొత్తాన్ని కూతుళ్ల చదువుల కోసం వెచ్చించే వారు చాలా మంది ఉన్నారు. కొందరు తమ జీవితాంతం సంపాదనను పర్యావరణం కోసం, జీవరాశుల సేవ కోసం వెచ్చిస్తారు.మన దేశంలోదాతృత్వం చాలా ఎక్కువగా ఉంది. ప్రజలు ఇతరుల సంతోషం కోసం తమ సర్వస్వాన్ని దానం చేయడానికి వెనుకాడరు. అందుకే మనకు చిన్నప్పటి నుంచి శిబి, దధీచి లాంటి అవయవదాతలు, దేహదాతల కథలు చెబుతుంటారు.

హర్యానాలోని ఫరీదాబాద్‌లో అమృత ఆసుపత్రి ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం

August 24th, 11:01 am

అమృత ఆసుపత్రి రూపంలో మనందరికీ దీవెనలు పంచుతున్న మా అమృతానందమయి జీకి నేను నమస్కరిస్తున్నాను. స్వామి అమృతస్వరూపానంద పూరీ జీ, హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ జీ, ముఖ్యమంత్రి శ్రీ మనోహర్ లాల్ జీ, నా క్యాబినెట్ సహచరుడు క్రిషన్ పాల్ జీ, హర్యానా ఉప ముఖ్యమంత్రి శ్రీ దుష్యంత్ చౌతాలా జీ, ఇతర ప్రముఖులు, లేడీస్ అండ్ జెంటిల్మెన్!

ఫరీదాబాద్ లో అత్యాధునికమైన అమృత హాస్పిటల్ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి

August 24th, 11:00 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫరీదాబాద్ లో అత్యాధునిక అమృత హాస్పిటల్ ను ఈ రోజు న ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో పాలుపంచుకొన్నవారిలో హరియాణా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ, హరియాణా ముఖ్యమంత్రి శ్రీ మనోహర్ లాల్, ఉప ముఖ్యమంత్రి శ్రీ దుష్యంత్ చౌటాలా, కేంద్ర మంత్రి శ్రీ క్రిష్ణ పాల్ గుర్జర్, శ్రీ మాత అమృతానందమయి తదితరులు కూడా ఉన్నారు.

శ్రీరామనవమి సందర్భం లో జూనాగఢ్‌ లోని ఘాటిలా లో ఉమియా మాత మందిరం 14వ స్థాపనదిన కార్యక్రమం లో ప్రసంగించనున్న ప్రధాన మంత్రి

April 09th, 04:33 pm

శ్రీరామ నవమి ని పురస్కరించుకొని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022వ సంవత్సరం ఏప్రిల్ 10వ తేదీ న మధ్యాహ్నం ఒంటి గంట కు గుజరాత్‌ లోని జూనాగఢ్‌ లో ఘాటిలా లో ఉమియా మాత మందిరం 14వ స్థాపన దిన కార్యక్రమాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌ మాద్యమం ద్వారా ప్రసంగించనున్నారు.

సౌరాష్ట్రపటేల్ సేవా సమాజ్ సూరత్ లో నిర్మించిన హాస్టల్ ఫేజ్-1 కు అక్టోబర్ 15 న భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించనున్న ప్రధాన మంత్రి

October 14th, 02:33 pm

సౌరాష్ట్ర పటేల్ సేవా సమాజ్ సూరత్ లో నిర్మించిన హాస్టల్ ఫేజ్-1 (బాలుర వసతి గృహం) తాలూకు భూమి పూజ కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అక్టోబర్ 15 న ఉదయం 11:00 గంటల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా నిర్వహించనున్నారు.

ఎగుమ‌తిదారులు, బ్యాంకుల‌కు మ‌ద్ద‌త‌నిచ్చేందుకు రాగ 5 సంవ‌త్స‌రాల‌లో ఇసిజిసి లిమిటెడ్‌లో 4,400 కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డికి ఆమోదం తెలిపిన కేంద్ర ప్ర‌భుత్వం

September 29th, 04:18 pm

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ గారి నాయ‌క‌త్వంలో ఎగుమ‌తుల రంగానికి ఊతం ఇచ్చేందుకు ప్ర‌భుత్వం ప‌లు చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఇందుకు అనుగుణంగా ప్ర‌భుత్వం ఈరోజు ఇసిజిసి లిమిటెడ్ ( పూర్వ‌పు ఎక్స్‌పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌) కు ఐదు సంవ‌త్స‌రాల కాలంలో రూ 4,400 కోట్ల రూపాయలను 2021-22,2025-26 ఆర్ధిక సంవ‌త్స‌ర కాలానికి పెట్టుబ‌డి సమ‌కూర్చేందుకు ఆమోదించింది. ప్ర‌స్తుతం ఆమోదించిన పెట్టుబ‌డిని ఇసిజిసి లిస్టింగ్ ప్ర‌క్రియ‌తో అనుసంధానం చేస్తూ ఇనిషియ‌ల్ ప‌బ్లిక్ ఆఫ‌ర‌ర‌రింగ్ ద్వారా స‌మ‌కూర్చ‌నుంది. ఇది మ‌రిన్ని ఎగుమ‌తుల‌కు మ‌ద్ద‌తు నిచ్చేందుకు అండ‌ర్ రైటింగ్ సామ‌ర్ధ్యాన్ని పెంచ‌నుంది.

కేంద్ర భూభాగం లడఖ్ కోసం ఇంటిగ్రేటెడ్ మల్టీ పర్పస్ కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపిన కేబినెట్

July 22nd, 04:24 pm

ప్రధాని శ్రీ నరేంద్ర మోదీఅధ్యక్షతన కేంద్ర కేబినెట్ కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్ కోసం ఇంటిగ్రేటెడ్ బహుళ ప్రయోజక మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.

సిఎస్ఐఆర్ సమావేశంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

June 04th, 10:28 am

ఏ దేశంలోనైనా సైన్స్ అండ్ టెక్నాలజీ తన పరిశ్రమ, మార్కెట్, సమన్వయం, ఒకదానితో ఒకటి అనుసంధానించబడిన అంతర్గత వ్యవస్థతో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నంతవరకు అభివృద్ధి చెందుతుంది. మన దేశంలో, సైన్స్, సమాజం మరియు పరిశ్రమల యొక్క ఒకే వ్యవస్థను నిర్వహించడానికి CSIR ఒక సంస్థాగత వ్యవస్థగా పనిచేస్తోంది. మా సంస్థ దేశానికి చాలా ప్రతిభను ఇచ్చింది. చాలా మంది శాస్త్రవేత్తలు ఇచ్చారు. ఈ సంస్థకు శాంతిస్వరూప్ భట్నాగర్ వంటి గొప్ప శాస్త్రవేత్తలు నాయకత్వం వహించారు. నేను ఇక్కడకు వచ్చినప్పుడల్లా, మరియు ఈ కారణంగా, ఒక సంస్థ యొక్క వారసత్వం చాలా గొప్పగా ఉన్నప్పుడు, భవిష్యత్తుపై వారి బాధ్యత కూడా అంతే పెరుగుతుందని నేను నొక్కిచెప్పాను. ఈ రోజు కూడా, నేను, దేశం, మానవాళికి కూడా మీ నుండి అధిక అంచనాలు ఉన్నాయి. శాస్త్రవేత్తల నుండి, సాంకేతిక నిపుణుల నుండి చాలా అంచనాలు ఉన్నాయి.

సిఎస్ఐఆర్ సొసైటీ సమావేశాని కి అధ్యక్షత వహించిన ప్ర‌ధాన మంత్రి

June 04th, 10:27 am

కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఎండ్ ఇండస్ట్రియల్ రిసర్చ్ (సిఎస్ఐఆర్) సమావేశానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా అధ్యక్షత వహించారు.

డాక్టర్ హరేకృష్ణ మహతాబ్ రాసిన ‘ఒడిశా ఇతిహాస్’ హిందీ పుస్తకం విడుదల సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగపాఠం

April 09th, 12:18 pm

ఈ కార్యక్రమంలో నాతోపాటు పాల్గొంటున్న.. పార్లమెంటు సభ్యుడు, పార్లమెంటరీ జీవనంలోనూ ఉన్నతమైన లక్ష్యాలతో పనిచేస్తూ ఓ సజీవమైన ఉదాహరణగా నిలుస్తున్న సోదరుడు భర్తృహరి మహతాబ్ జీ, ధర్మేంద్ర ప్రధాన్ జీ, ఇతర పెద్దలు, సోదర, సోదరీమణులారా, ‘ఉత్కళ్ కేసరి’ హరేకృష్ణ మహతాబ్ గారికి సంబంధించిన కార్యక్రమంలో పాలుపంచుకునే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. దాదాపు ఏడాదిన్నర క్రితం మనమంతా ‘ఉత్కళ్ కేసరి’ హరేకృష్ణ మహతాబ్ గారి 120వ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నాం, వారి ఆలోచనల స్ఫూర్తిని మనలో నింపుకున్నాం. ఇవాళ వారి ప్రసిద్ధ పుస్తకం ‘ఒడిశా ఇతిహాస్’ హిందీ సంకలనాన్ని జాతికి అంకితం చేసుకుంటున్నాం. ఒడిశాలోని వైవిధ్యమైన చరిత్ర దేశప్రజలందరికీ చేరాల్సిన ఆవశ్యకత ఉంది. ఒడియా, ఇంగ్లీషు తర్వాత హిందీలో ఈ పుస్తకాన్ని తీసుకురావడం అభినందనీయం. ఈ ప్రయత్నానికి గాను సోదరులు భర్తృహరి మహతాబ్ గారికి, హరేకృష్ణ మహతాబ్ ఫౌండేషన్ వారికి, మరీ ముఖ్యంగా శంకర్‌లాల్ పురోహిత్ గారికి ధన్యవాదాలతోపాటు హార్దిక అభినందనలు కూడా తెలియజేస్తున్నాను.

డాక్ట‌ర్‌హ‌రేకృష్ణ మెహ‌తాబ్ ర‌చ‌న ‘ఒడిశా ఇతిహాస్‌’ హిందీ అనువాద గ్రంథాన్ని ఆవిష్క‌రించినప్ర‌ధాన మంత్రి‌

April 09th, 12:17 pm

‘ఉత్క‌ళ్ కేస‌రి’ డాక్ట‌ర్ హ‌రేకృష్ణ మ‌హ‌తాబ్ ర‌చన అయిన ‘ఒడిశా ఇతిహాస్’ తాలూకు హిందీ అనువాద గ్రంథాన్ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆవిష్క‌రించారు. ఇంత‌వ‌ర‌కు ఒడియా లోను, ఇంగ్లీషు లోను ల‌భ్య‌మ‌వుతూ వ‌చ్చిన ఈ గ్రంథాన్ని శ్రీ శంక‌ర్‌ లాల్ పురోహిత్ హిందీ భాష లోకి త‌ర్జుమా చేశారు. కేంద్ర మంత్రి శ్రీ ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్, క‌ట‌క్ లోక్ స‌భ స‌భ్యుడు శ్రీ భ‌ర్తృహరి మహతాబ్ లు కూడా ఈ కార్య‌క్ర‌మం లో పాల్గొన్నారు.

PM Modi requests spiritual leaders to promote Aatmanirbhar Bharat by going vocal for local

November 16th, 12:46 pm

PM Modi unveiled ‘Statue of Peace’ to mark the 151st birth anniversary celebrations of Jainacharya Shree Vijay Vallabh Surishwer Ji Maharaj. Reiterating his stress on ‘vocal for local’ Shri Modi requested that as happened during the freedom struggle, all the spiritual leaders should amplify the message of Aatmanirbhar Bharat.

జైన ఆచార్య శ్రీ విజ‌య్ వ‌ల్ల‌భ్ సురీశ్వ‌ర్‌ జీ మ‌హారాజ్ 151 వ‌ జ‌యంతి సూచ‌కం గా ‘స్టాచ్యూ ఆఫ్ పీస్’ ను ఆవిష్క‌రించిన ప్ర‌ధాన మంత్రి

November 16th, 12:45 pm

జైన ఆచార్యుడు శ్రీ విజ‌య్ వ‌ల్ల‌భ్ సురీశ్వ‌ర్‌ జీ మ‌హారాజ్ 151 వ జ‌యంతి ఉత్స‌వాలకు గుర్తు గా ‘స్టాచ్యూ ఆఫ్ పీస్’ (శాంతి విగ్ర‌హం)ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ఈ రోజు న ఆవిష్క‌రించారు. జైన ఆచార్య గౌర‌వార్థం ఆవిష్క‌రించిన ఈ విగ్ర‌హానికి ‘స్టాచ్యూ ఆఫ్ పీస్’ అని పేరు పెట్టడమైంది. 151 అంగుళాల ఎత్త‌యిన ఈ విగ్ర‌హాన్ని అష్ట‌ధాతువుల తో, అంటే 8 లోహాల‌తో, నిర్మించ‌డం జ‌రిగింది. దీనిలో రాగి ప్ర‌ధాన ధాతువు గా ఉంది. దీనిని రాజ‌స్థాన్ లోని పాలీ లో గ‌ల జేత్ పుర లో నెల‌కొల్పారు.

Balasaheb Vikhe Patil Ji's work for the progress of poor, efforts towards education in Maharashtra will inspire generations to come: PM

October 13th, 11:01 am

PM Narendra Modi released the biography of late Dr. Balasaheb Vikhe Patil. Speaking on the occasion, PM Modi said, Balasaheb’s work for the progress of poor, efforts towards education and success of cooperative in Maharashtra will inspire generations to come.