ప్రపంచం ఇప్పుడు భారతీయ స్టార్టప్‌ల వైపు చూస్తూ ఉండాలి: స్పేస్ స్టార్టప్ సీఈఓలతో సంభాషణ సందర్భంగా ప్రధాని మోదీ

August 23rd, 11:42 am

ప్రధాని మోదీ స్పేస్ స్టార్టప్ సీఈఓలతో సంభాషిస్తూ, ఒక కొత్త రంగంలోకి ప్రవేశించేందుకు వారు చూపిన ధైర్యాన్ని ప్రశంసించారు. ఈ సంభాషణలో అంతరిక్ష రంగాన్ని ప్రైవేట్ సంస్థలకు తెరవడం, భారతీయ కంపెనీలకు ప్రభుత్వ మద్దతు, రోబోటిక్ అంతరిక్ష నౌకలు, తరచుగా జరిగే రాకెట్ ప్రయోగాలు మరియు భారతదేశపు మొట్టమొదటి స్పేస్-ఫార్మా స్టార్టప్ వంటి అనేక ఆసక్తికరమైన అంశాలపై చర్చ జరిగింది.

అంతరిక్ష స్టార్టప్ సీఈఓలతో ముచ్చటించిన ప్రధాని మోదీ

August 23rd, 11:30 am

ప్రధాని మోదీ అంతరిక్ష స్టార్టప్ సీఈఓలతో ముచ్చటించి, ఒక కొత్త రంగంలోకి ప్రవేశించేందుకు వారు చూపిన ధైర్యాన్ని ప్రశంసించారు. ఈ ముచ్చటలో అంతరిక్ష రంగాన్ని ప్రైవేట్ సంస్థలకు తెరవడం, భారతీయ కంపెనీలకు ప్రభుత్వ మద్దతు, రోబోటిక్ అంతరిక్ష నౌకలు, తరచూ రాకెట్ ప్రయోగాలు, భారతదేశపు మొట్టమొదటి స్పేస్-ఫార్మా స్టార్టప్ వంటి పలు ఆసక్తికరమైన అంశాలపై చర్చ జరిగింది.

అంతరిక్ష రంగ అంకుర సంస్థల సీఈవోలు, వ్యవస్థాపకులతో ప్రధాని సమావేశం

August 21st, 02:21 pm

భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న ప్రైవేట్ అంతరిక్ష పర్యావరణ వ్యవస్థను, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులను, కంపెనీలను, పెట్టుబడులను ఆకర్షించే దాని సామర్థ్యాన్ని ప్రధాని మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించాలని, పరిశ్రమల మధ్య సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని, యువతను అంతరిక్షం వైపు ప్రోత్సహించేందుకు మరింతగా కృషి చేయాలని ఆయన ప్రోత్సహించారు.

Prime Minister interacts with Pawan Chandana and Naga Bharath Daka of Skyroot Aerospace

July 27th, 10:22 pm

PM Modi interacted with Pawan Chandana and Naga Bharath Daka of Skyroot Aerospace about the success of Vikram-1 and many other interesting subjects. He said their energy, ambition and positivity reflect the vibrant spirit of India's private space ecosystem and conveyed his best wishes to the entire Skyroot team.

విక్రమ్-1 ప్రయోగం విజయవంతమైన సందర్భంగా స్కైరూట్ ఏరోస్పేస్ బృందాన్ని అభినందించిన ప్రధానమంత్రి

July 18th, 01:51 pm

‘విక్రమ్-1’ను విజయవంతంగా ప్రయోగించిన స్కైరూట్ ఏరోస్పేస్ బృందాన్ని ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినందించారు. ఈ రోజు స్కైరూట్ బృందంతో మాట్లాడిన ప్రధానమంత్రి, భారత అంతరిక్ష ప్రయాణంలో ఇదొక నిర్ణయాత్మక ఘట్టమని వ్యాఖ్యానించారు. పెరుగుతున్న మన ప్రైవేట్ రంగ భాగస్వామ్యం కొత్త అవకాశాలను కల్పిస్తూ, ఆవిష్కరణలను వేగవంతం చేస్తోందని శ్రీ మోదీ తెలిపారు.

స్కైరూట్ ఏరోస్పేస్‌కు ప్రధానమంత్రి శుభాకాంక్షలు

July 18th, 09:54 am

భారతదేశపు మొట్టమొదటి ప్రైవేటు అంతరిక్ష వాహక నౌక ‘విక్రమ్-1’ తొలి కక్ష్య ప్రయోగానికి సిద్ధమైన సందర్భంగా స్కైరూట్ అంతరిక్ష సంస్థకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ప్రయోగం దేశ అంతరిక్ష ప్రయాణంలో ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తుందని అభివర్ణించారు. దేశ నూతన అంతరిక్ష ఆకాంక్షలకు, దేశంలో పెరుగుతున్న ఆవిష్కరణలు, సాంకేతికత, పారిశ్రామిక సామర్థ్యానికి విక్రమ్‌-1 ప్రయోగం ఒక నిదర్శనమని ప్రశంసించారు.

హిందుస్థాన్ టైమ్స్ నాయకత్వ సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం

December 06th, 08:14 pm

హిందుస్థాన్ టైమ్స్ సదస్సులో భారత్‌కు, విదేశాలకు చెందిన విశిష్ట అతిథులు చాలా మంది ఉన్నారు. ఈ కార్యక్రమ నిర్వాహకులను, ఇక్కడ తమ అభిప్రాయాలను పంచుకున్న సహచరులను అభినందిస్తున్నాను. శోభన గారు చెప్పిన వాటిలో నేను రెండు విషయాలను గమనించాను. మొదటిది, గతంలో మోదీ ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ఇది సూచించారు అని చెప్పారు. మీడియాకు పని చేయమని చెప్పే సాహసం ఈ దేశంలో ఎవరూ చేయరు. కానీ నేను చెప్పాను. శోభన గారు, ఆమె బృందం అత్యంత ఉత్సాహంగా దానిని పూర్తి చేసినందుకు నేను సంతోషిస్తున్నాను. నేను ఇప్పుడే ఎగ్జిబిషన్ సందర్శించాను. మీ అందరూ కూడా తప్పనిసరిగా దానిని సందర్శించమని కోరుతున్నాను. ఫొటోగ్రాఫర్ మిత్రులు క్షణాలను చిరస్మరణీయంగా నిలిచిపోయేలా ఫొటోల్లో బంధించారు. ఇక రెండో విషయానికి వస్తే... నేను ఇంకా ఆమె చెప్పిన మాటలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ‘‘మీరు దేశానికి సేవలందించడం కొనసాగించాలి’’ అని చెప్పి ఉండొచ్చు. దానికి బదులుగా ‘‘మీరు దేశానికి సేవలందించడం కొనసాగించాలి’’ అని హిందుస్థాన్ టైమ్స్ చెబుతోందన్నారు. ఈ విషయంలో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

న్యూఢిల్లీలో హిందుస్థాన్ టైమ్స్ నాయకత్వ సదస్సు - 2025లో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

December 06th, 08:13 pm

న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన హిందూస్తాన్ టైమ్స్ నాయకత్వ సదస్సు - 2025లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ విదేశాల నుంచి ఎందరో ప్రముఖులు ఈ సదస్సుకు హాజరు కావడాన్ని గమనించినట్టు తెలిపారు. సదస్సు నిర్వాహకులకు, తమ ఆలోచనలు పంచుకున్నవారందరికీ ఆయన అభినందనలు తెలిపారు. శోభనాజీ ప్రస్తావించిన రెండు అంశాలను తాను శ్రద్ధగా గమనించినట్లు శ్రీ మోదీ తెలిపారు. అందులో మొదటిది, గతంలో తాను ఈ వేదికకు వచ్చినప్పుడు చేసిన ఒక సూచనను ఆమె గుర్తు చేశారని, మీడియా సంస్థల విషయంలో అలా సూచనలు ఇవ్వడం చాలా అరుదని, అయినా తాను ఆ పని చేశానని ఆయన అన్నారు. ఆ సూచనను శోభనా జీ, వారి బృందం ఉత్సాహంగా అమలు చేయడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఎగ్జిబిషన్‌ను సందర్శించినప్పుడు, ఫొటోగ్రాఫర్లు క్షణాలను చిరస్మరణీయంగా మలిచిన తీరును చూశానని, ఆ ప్రదర్శనను ప్రతి ఒక్కరూ తప్పక చూడాలని ఆయన కోరారు. శోభనా జీ ప్రస్తావించిన రెండో అంశం గురించి శ్రీ మోదీ వివరిస్తూ, తాను దేశానికి సేవ చేస్తూ ఉండాలన్నది కేవలం ఒక ఆకాంక్ష మాత్రమే కాదని, ఇదే విధంగా సేవలు కొనసాగించాలని హిందుస్థాన్ టైమ్స్ పత్రికే స్వయంగా చెబుతున్నట్లుగా తాను భావిస్తున్నానని అన్నారు. ఇందుకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని ప్రసంగం

November 27th, 11:01 am

కేబినెట్‌లో నా సహచరుడు శ్రీ జి. కిషన్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ టి.జి. భరత్ గారు, ఇన్-స్పేస్ చైర్మన్ శ్రీ పవన్ గోయెంకా గారు, స్కైరూట్ బృందం, ఇతర ప్రముఖులు, సోదరీ సోదరులారా...!

Prime Minister Shri Narendra Modi inaugurates Skyroot’s Infinity Campus in Hyderabad via video conferencing

November 27th, 11:00 am

PM Modi inaugurated Skyroot’s Infinity Campus in Hyderabad, extending his best wishes to the founders Pawan Kumar Chandana and Naga Bharath Daka. Lauding the Gen-Z generation, he remarked that they have taken full advantage of the space sector opened by the government. The PM highlighted that over the past decade, a new wave of startups has emerged across perse sectors and called upon everyone to make the 21st century the century of India.

నవంబర్ 27న స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్‌ను ప్రారంభించనున్న ప్రధానమంత్రి

November 25th, 04:18 pm

భారత అంతరిక్ష అంకుర సంస్థ స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్‌ను నవంబర్ 27న ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టగల సామర్థ్యం కలిగిన స్కైరూట్ మొదటి కక్ష రాకెట్ విక్రమ్-Iను కూడా ఆయన ఆవిష్కరించనున్నారు.