ప్రధానిని కలిసిన శ్రీరామ్ కామర్స్ కాలేజీ పాలక మండలి సభ్యులు
April 25th, 10:50 pm
శ్రీరామ్ కామర్స్ కాలేజీ పాలక మండలి సభ్యుల ప్రతినిధి బృందం ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిసింది. విద్యాపరమైన ఉన్నతి, దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తూ ముందుకు సాగుతున్న సంస్థకు ఈ ఏడాదితో వందేళ్లు పూర్తవుతున్నాయనీ, సంస్థ విశిష్ట ప్రస్థానంలో ఇదొక కీలకమైన మైలురాయి అనీ శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ఉన్నత విద్యారంగానికి కళాశాల దీర్ఘకాలిక సేవలనూ, తరతరాలుగా విభిన్న రంగాల్లో నిపుణులను తీర్చిదిద్దడంలో సంస్థ పాత్రను ఆయన కొనియాడారు.