శ్రీ సంస్థాన్ గోకర్ణ పార్తగలి జీవోత్తమ్ మఠం 550వ వార్షికోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం

November 28th, 03:35 pm

ఈ రోజు ఈ పవిత్ర సందర్భంలో నా మనసు శాంతితో నిండిపోయింది. సాధువులు, మహర్షుల సమక్షంలో కూర్చోవడం ఒక ఆధ్యాత్మిక అనుభవం. ఇక్కడ పెద్ద సంఖ్యలో భక్తులు ఉండటం శతాబ్దాల నాటి ఈ మఠం శక్తిని మరింత బలోపేతం చేస్తుంది. ఈ వేడుకలో మీ మధ్య ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడికి రాకముందు, రామాలయం... వీర్ విఠల్ ఆలయాల్లో పూజలో పాల్గొనే భాగ్యం నాకు లభించింది. ఇక్కడి శాంతి, ప్రశాంత వాతావరణం ఈ వేడుక ఆధ్యాత్మిక సారాన్ని మరింతగా పెంచాయి.

గోవాలో జరిగిన శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాలి జీవోత్తమ్ మఠం 550వ వార్షికోత్సవంలో ప్రసంగించిన ప్రధానమంత్రి

November 28th, 03:30 pm

“శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాలి జీవోత్తమ్ మఠం 550వ వార్షికోత్సవాన్ని చేసుకుంటోంది. ఇది చాలా చారిత్రాత్మక సందర్భం. గత 550 సంవత్సరాలలో ఈ మఠం అనేక కల్లోల పరిస్థితులను ఎదుర్కొంది. తరాలు మారినా, కాలాలు మారినా.. దేశంతో పాటు సమాజంలో అనేక పరివర్తనలు వచ్చినా మఠం ఎప్పుడూ దిశను కోల్పోలేదు. దీనికి బదులు ఈ మఠం ప్రజలకు మార్గదర్శక కేంద్రంగా మారింది. మఠానికి ఉన్న గొప్ప గుర్తింపు ఏంటంటే.. చరిత్రతో గట్టిగా పాతుకుపోయి ఉన్నప్పటికీ కాలంతో పాటు మారుతూ ముందుకు కదులుతూనే ఉంది” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. మఠం స్థాపించటంలో ఉన్న స్ఫూర్తి ఈ రోజు కూడా అదే విధంగా సజీవంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఆ స్ఫూర్తే సాధనను సేవతో, సంప్రదాయాన్ని ప్రజా సంక్షేమంతో మిలితం చేస్తోందన్నారు. ‘జీవితానికి స్థిరత్వం, సమతుల్యత, విలువలను అందించడం’ అనే ఆధ్యాత్మికతకు ఉన్న నిజమైన భావనను తరతరాలుగా మఠం తెలియజేస్తోందని ప్రధాని అన్నారు. కష్ట సమయాల్లో కూడా సమాజాన్ని నిలబెట్టే బలానికి మఠం చేసిన 550 సంవత్సరాల ప్రయాణమే నిదర్శనమని ఆయన ఉద్ఘాటించారు. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకొని మఠాధిపతి శ్రీమద్ విద్యాధీశ తీర్థ స్వామీజీ, కమిటీలోని సభ్యులందరూ, ఈ వేడుకతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

Converting problems into possibilities has been Modi's guarantee: PM Modi

March 11th, 01:30 pm

Prime Minister Narendra Modi inaugurated and laid the foundation stone of 112 National Highway projects spread across the country worth about Rs. One lakh crore at Gurugram, Haryana today. Lakhs of people connected with the event from all over the country through technology. Speaking on the occasion, the Prime Minister noted the change from the culture of holding programmes in Delhi to holding big programmes in other parts of the country. He said that today the nation has taken another big and important step towards modern connectivity.

వివిధ రాష్ట్రాల కోసం రూ.లక్ష కోట్ల విలువైన 112 జాతీయ రహదారి ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవం.. శంకుస్థాపన

March 11th, 01:10 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు సంబంధించి దాదాపు రూ.1 లక్ష కోట్ల విలువైన 112 జాతీయ ర‌హ‌దారులకు ప్రారంభోత్సవం, శంకుస్థాప‌న చేశారు. హర్యానాలోని గురుగ్రామ్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంతో సాంకేతిక పరిజ్ఞాన మాధ్యమం ద్వారా దేశం నలుమూలల నుంచి లక్షలాదిగా ప్రజలు మమేకమయ్యారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మాట్లాడుతూ- అనేక ప్రధాన కార్యక్రమాలను ఢిల్లీలో నిర్వ‌హించే సంప్రదాయం మారిపోగా, నేడు దేశంలోని ఇత‌ర ప్రాంతాల్లో నిర్వ‌హిస్తుండటాన్ని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ఆధునిక అనుసంధానం దిశగా దేశం ఇవాళ మరో పెద్ద, కీలక ముందడుగు వేసిందని ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగా మైలురాయి వంటి ద్వారకా ఎక్స్‌‘ప్రెస్‌ వే పరిధిలో 19 కిలోమీటర్ల పొడవైన హర్యానా విభాగాన్ని జాతికి అంకితం చేయడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. దీనివల్ల ఢిల్లీ-హర్యానాల మధ్య ప్రయాణానుభవం ఇక నిత్యం మెరుగ్గా ఉంటుందన్నారు. అంతేకాకుండా ‘‘వేగం పెంచే గేరు మార్పు వాహనాలకే కాకుండా ఈ ప్రాంత ప్రజల దైనందని జీవనానికీ వర్తిస్తుంది’’ అని చమత్కరించారు.

మా కామాఖ్య కారిడోర్ ఒక ప్రతిష్టాత్మకకార్యక్రమం అవుతుంది: ప్రధాన మంత్రి

April 19th, 03:39 pm

కాశీ విశ్వనాథ్ ధామ్ మరియు శ్రీ మాహాకాళ్ మహాలోక్ కారిడోర్ ల మాదిరిగానే మా కామాఖ్య కారిడోర్ కూడా ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం కాగలదన్న ఆశ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.