అహ్మదాబాద్‌లోని కన్యా ఛత్రాలయలో సర్దార్‌ధామ్ 2వ దశ శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం

August 24th, 10:39 pm

కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు, గుజరాత్ ప్రభుత్వ మంత్రులు.. హాజరైన నా తోటి పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, సర్దార్‌ధామ్‌ వ్యవహారాలు చూసుకుంటున్న సోదరుడు శ్రీ గగ్జీ భాయ్, ట్రస్టీ వి.కె. పటేల్, దిలీప్ భాయ్, ఇతర ప్రముఖులు.. నా ప్రియమైన సోదరీ సోదరులారా, ముఖ్యంగా నా ప్రియమైన కుమార్తెలారా..

అహ్మదాబాద్‌లోని కన్యా ఛత్రాలయలో సర్దార్‌ధామ్ ఫేజ్ - II శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

August 24th, 10:25 pm

గుజరాత్ లోని అహ్మదాబాద్ లో కన్యా ఛత్రాలయలో సర్దార్‌ధామ్ ఫేజ్- II శంకుస్థాపన సందర్శంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో సందేశం ద్వారా ఈ రోజు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలికల సేవ, విద్యకు అంకితమైన ఈ వసతి గృహం స్థాపన గురించి వివరిస్తూ.. సర్దార్ ధామ్ పేరు లాగే అది చేసే కృషి కూడా పవిత్రమైనదని ప్రధానమంత్రి అన్నారు. ఈ హాస్టల్లో వసతి పొందే బాలికలు...అనేక ఆకాంక్షల్నీ, ఆశయాలనీ కలిగి ఉంటారని, వాటిని నెరవేర్చుకొనేందుకు అనేక అవకాశాలు లభిస్తాయని ఆయన వెల్లడించారు. ఈ అమ్మాయిలు స్వావలంబన, శక్తి సాధించినప్పుడు.. దేశ నిర్మాణంలో వారు సహజంగానే కీలకపాత్ర పోషిస్తారని, వారి కుటుంబాలు సాధికారత సాధిస్తాయని శ్రీ మోదీ స్పష్టం చేశారు. ఈ వసతి గృహంలో ఉండే అవకాశం లభించిన బాలికలకు, వారి కుటుంబాలకు ఉజ్వల భవిష్యత్తు లభిస్తుందని ఆకాంక్షిస్తూ.. హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

9/11 వంటి విషాదాలకు శాశ్వత పరిష్కారం ఉంటుంది, మానవతా విలువలతో మాత్రమే: ప్రధాని మోదీ

September 11th, 11:01 am

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సర్దార్ధమ్ భవన్ యొక్క లోకార్పన్ మరియు సర్దార్ధమ్ ఫేజ్ - II కన్యా ఛత్రాలయ భూమి పూజను నిర్వహించారు. ఈ రోజు ప్రారంభిస్తున్న హాస్టల్ సౌకర్యం చాలా మంది అమ్మాయిలు ముందుకు రావడానికి కూడా సహాయపడుతుందని ప్రధాన మంత్రి అన్నారు. అత్యాధునిక భవనం, బాలికల హాస్టల్ మరియు ఆధునిక గ్రంథాలయం యువతకు సాధికారతనిస్తాయని ఆయన అన్నారు.

స‌ర్దార్‌ధామ్ భ‌వ‌న్ లోక్ అర్ప‌ణ్ గావించిన ప్ర‌ధాన‌మంత్రి, స‌ర్ధార్‌ధామ్ -ఫేజ్ 2 క‌న్యాఛాత్రాల‌య‌కు భూమి పూజ

September 11th, 11:00 am

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ స‌ర్దార్‌ధామ్ భ‌వ‌న్ లోక్ అర్ప‌ణ్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. అలాగే స‌ర్దార్ ధామ్ ఫేజ్ -2 క‌న్యా ఛాత్రాయ‌ల‌య‌కు ఈరోజు వీడియో కాన్ఫ‌రెన్సింగ్ ద్వారా భూమి పూజ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి, ఉప ముఖ్య‌మంత్రి పాల్గొన్నారు. గ‌ణేశ్ ఉత్స‌వ్ సంద‌ర్భంగా స‌ర్దార్ ధామ్ భ‌వ‌న్ ప్రారంభం అవుతుండ‌డం ప‌ట్ల ప్ర‌ధాన‌మంత్రి సంతోషం వ్య‌క్తం చేశారు. గ‌ణేశ్ చ‌తుర్థి ఉత్స‌వాలు, రుషి పంచ‌మి , క్ష‌మ‌వాణి దివ‌స్ సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌తి ఒక్క‌రికి శుభాకాంక్ష‌లు తెలిపారు. స‌ర్దార్‌ధామ్ ట్ర‌స్ట్‌తో సంబంధం ఉన్న ప్ర‌తి ఒక్క‌రిని ప్ర‌ధాన‌మంత్రి అభినందించారు. మాన‌వాళి సేవ‌కు వారు అంకిత‌భావంతో చేస్తున్న కృషిని ప్ర‌ధాన‌మంత్రి అభినందించారు.పాటిదార్ సొసైటీ, పేద‌లు, ప్ర‌త్యేకించ మ‌హిళ‌ల‌కు సాధికార‌త క‌ల్పించ‌డంలో వారి శ్ర‌ద్ధను ప్ర‌ధాని ప్ర‌శంసించారు.

సెప్టెంబర్ 11వ తేదీన సర్దార్ధం భవనాన్ని జాతికి అంకితం చేసి, సర్దార్ధం రెండవ దశ కింద బాలికల వసతి గృహానికి భూమి పూజ నిర్వహించనున్న - ప్రధానమంత్రి

September 10th, 01:25 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, 2021 సెప్టెంబర్, 11వ తేదీ ఉదయం 11 గంటలకు, దృశ్య మాధ్యమం ద్వారా, సర్దార్ధం భవనాన్ని జాతికి అంకితం చేసి, సర్దార్ధం రెండవ దశ కింద బాలికల వసతి గృహానికి భూమి పూజ, నిర్వహించనున్నారు.