'మన్ కీ బాత్'లో, పశ్చిమ ఆసియా సంక్షోభాన్ని అధిగమించడానికి 140 కోట్ల మంది భారతీయుల ఐకమత్యంపై విశ్వాసం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ
March 29th, 11:30 am
ఈ నెల 'మన్ కీ బాత్' కార్యక్రమంలో, ప్రధాని మోదీ పశ్చిమ ఆసియా సంఘర్షణ గురించి ప్రస్తావిస్తూ, ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి అందరూ ఐకమత్యంతో ఉండాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. పుకార్లకు లోనై తప్పుదోవ పట్టవద్దని, కేవలం ప్రభుత్వం అందించే సమాచారంపైనే ఆధారపడాలని ఆయన పౌరులకు విజ్ఞప్తి చేశారు. అలాగే 'జ్ఞాన్ భారతం' సర్వే, క్రీడలు మరియు ఫిట్నెస్, నీటి సంరక్షణ, చేపల పెంపకం, సౌర విద్యుత్ వంటి కీలక అంశాలను కూడా ప్రధాని తన ప్రసంగంలో ప్రస్తావించారు.తొలిసారి రంజీ ట్రోఫీ గెలిచిన జమ్మూ కాశ్మీర్ జట్టుకు ప్రధానమంత్రి అభినందనలు
February 28th, 07:03 pm
ఈ చరిత్రాత్మక విజయం జట్టులోని ఆటగాళ్ల ధైర్యాన్ని, క్రమశిక్షణను, ఆట పట్ల వారి అభిరుచిని ప్రతిబింబిస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇది జమ్మూ కాశ్మీర్ ప్రజలకు గర్వకారణమైన క్షణం... ఈ విజయం ఈ ప్రాంత ప్రజల్లో పెరుగుతున్న క్రీడాభిరుచిని, వారి ప్రతిభను స్పష్టం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.