తమిళనాడులోని పరమకుడి - రామనాథపురం విభాగాన్ని (ఎన్‌హెచ్-87) రూ. 1853 కోట్ల వ్యయంతో 4 వరుసలుగా విస్తరించేందుకు క్యాబినెట్ ఆమోదం

July 01st, 03:13 pm

మధురై, పరమకుడి, రామనాథపురం, మండపం, రామేశ్వరం, ధనుష్కోటి మధ్య అనుసంధానం ప్రస్తుతం ఉన్న 2 వరుసల జాతీయ రహదారిపై, రాష్ట్ర రహదారులపై ఆధారపడి ఉంది. అధిక ట్రాఫిక్ వల్ల ఈ రహదారులన్నీ ఇరుకుగా మారిపోయాయి. ఈ ప్రాంతంలో ఉన్న కీలక పట్టణాలతో పాటు జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాలు ట్రాఫిక్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. వీటిని పరిష్కరించేందుకు పరమకుడి నుంచి రామనాథపురం వరకు దాదాపు 46.7 కి.మీ మేర జాతీయ రహాదారి-87ను నాలుగు వరుసలకు విస్తరించనున్నారు. ఇది రద్దీని తగ్గించి, భద్రతను మెరుగుపరటమే కాకుండా వేగంగా అభివృద్ధి చెందుతున్న పరమకుడి, సత్తిరకుడి, అచుందన్వాయల్, రామనాథపురం పట్టణాల రవాణా అవసరాలను తీరుస్తుంది.

డాక్టర్ కలాం భారతదేశ యువతకు స్ఫూర్తిగా నిలిచారు: ప్రధాని మోదీ

July 27th, 12:34 pm

దేశం లోని 12 జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగానికి నెలవైన రామేశ్వరం మత సంబంధి కేంద్రమొక్కటే కాదు.. గంభీరమైన ఆధ్యాత్మిక జ్ఞానానికీ కేంద్రం. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక ‘ జ్ఞాన పుంజం. ’ స్వామి వివేకానంద 1897 లో అమెరికా నుండి తిరిగి వస్తూ సందర్శించిన ప్రాంతం ఇది. భరత మాత అత్యంత ప్రసిద్ధ పుత్రులలో ఒకరైన డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ క‌లామ్‌ ను అందించిన పవిత్ర భూమి. రామేశ్వరానికి సహజమైన నిరాడంబరత్వం, ప్రశాంతత, గంభీరతలు డాక్టర్ కలామ్ మాటలలో, చేతలలో సదా ప్రతిబింబించేవి.

తమిళనాడులోని రామేశ్వరంలోని పేయి కోరుంబు డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం స్మారకం ప్రారంభించిన ప్రధాని మోదీ

July 27th, 12:29 pm

రామేశ్వరం వద్ద డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం స్మారకం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పర్యటించే 'కలాం సందేశ్ వాహిని'గా ఎగ్జిబిషన్ బస్సును ఆయన ప్రారంభించారు. సుదీర్ఘ లైనర్ ట్రులర్లు లబ్ధిదారులకు మంగళవారం ఉత్తర్వుల మోదీ పంపిణీ చేసారు. అయోధ్య నుంచి రామేశ్వరం నుంచి కొత్త ఎక్స్ప్రెస్ రైలును పతాకం చేసి హరిత రామేశ్వరం ప్రాజెక్ట్ను ప్రారంభించారు.