సంస్కృత సుభాషితాన్ని పంచుకుంటూ... ప్రజా శ్రేయస్సు కోసం మేధస్సు, ఏఐల లక్షణాలను ప్రస్తావించిన ప్రధానమంత్రి

February 17th, 08:53 am

శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని సమాజానికి నిజంగా ఉపయోగకరంగా మార్చడంలో మేధస్సు, హేతుబద్ధత, నిర్ణయం తీసుకునే సామర్థ్యాల ప్రాముఖ్యాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు స్పష్టం చేశారు. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు గురించి ప్రధానంగా ప్రస్తావించిన ఆయన... పౌరులందరి సంక్షేమం కోసం కృత్రిమ మేధస్సును ఉపయోగించుకోగల మార్గాలను అన్వేషించడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

'నాగరికదేవో భవ' స్ఫూర్తితో 'సేవా తీర్థ్'ను జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి కర్తవ్యం, కరుణ, ఇండియా ఫస్ట్ దార్శనికత పట్ల నిబద్ధతకు చిహ్నంగా ‘సేవా తీర్థ్’

February 13th, 05:12 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సేవా తీర్థ్‌ను జాతికి అంకితం చేశారు. భారత ప్రజలకు సేవ చేయాలనే తన అచంచల సంకల్పాన్ని పునరుద్ఘాటిస్తూ... 'నాగరికదేవో భవ' పవిత్ర స్ఫూర్తిని దానికి మార్గదర్శక శక్తిగా ప్రకటించారు.

మహనీయుడు సంత్ శ్రీ గురు రవిదాస్ మహారాజ్ గారికి శ్రద్ధాంజలి ఘటించిన ప్రధానమంత్రి

February 01st, 09:15 am

మహనీయుడు సంత్ శ్రీ గురు రవిదాస్ మహారాజ్ గారి జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. శ్రీ గురు రవిదాస్ మహారాజ్ గారు న్యాయాన్నీ, కరుణనీ ఇతర అన్ని భావనల కన్నా మిన్నగా తలచారనీ, ప్రజల సంక్షేమానికి మేం అమలు చేస్తున్న పథకాలకు కూడా ఈ భావనలే ఆధారంగా ఉన్నాయనీ శ్రీ మోదీ వివరించారు. ‘‘ఆయన వెలిగించిన సామాజిక సామరస్యం, సద్భావనల జ్యోతి దేశ ప్రజలు నడిచే దారిని ఎప్పటికీ ప్రకాశవంతం చేస్తూనే ఉంటాయి’’ అని శ్రీ మోదీ అన్నారు.

కేరళలోని ఆర్య వైద్యశాల ధార్మిక ఆస్పత్రి శతాబ్ది వేడుకలలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

January 28th, 02:39 pm

ఈ విశిష్ట సందర్భంలో మీ అందరితో మమేకం కావడం నాకెంతో సంతోషంగా ఉంది. ఆయుర్వేద వైద్య విధాన పరిరక్షణ, అభివృద్ధి, ఆధునికీకరణలో ఆర్య వైద్యశాల కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సంస్థ తన 125 ఏళ్ల ప్రస్థానంలో ఆయుర్వేదాన్ని శక్తిమంతమైన చికిత్సా విధానంగా నిరూపించింది. ఈ నేపథ్యంలో ఆర్య వైద్యశాల వ్యవస్థాపకులైన వైద్యరత్నం పి.ఎస్.వారియర్ సేవలను వినమ్రంగా స్మరించుకుంటున్నాను. ఆయుర్వేదంపై ఆయన దృక్పథం, ప్రజా సంక్షేమంపై అంకితభావం నేటికీ మనందరికీ స్ఫూర్తినిస్తున్నాయి.

కేరళలోని ఆర్య వైద్యశాల ధార్మిక ఆస్పత్రి శతాబ్ది ఉత్సవంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

January 28th, 02:25 pm

కేరళలోని ఆర్య వైద్యశాల ధార్మిక ఆస్పత్రి శతాబ్ది ఉత్సవం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం ద్వారా ప్రసంగించారు. ఇటువంటి పవిత్ర సందర్భంలో అందరితోనూ మమేకం కావడం తనకెంతో ఆనందంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఆయుర్వేద వైద్యవిధాన పరిరక్షణ, అభివృద్ధి, ఆధునికీకరణలో ఆర్య వైద్యశాల కీలక పాత్ర పోషిస్తున్నదని ఆయన కొనియాడారు. ఈ మేరకు 125 ఏళ్ల ప్రస్థానంలో ఈ సంస్థ ఆయుర్వేదాన్ని శక్తిమంతమైన చికిత్సా విధానంగా నిరూపించిందని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆర్య వైద్యశాల వ్యవస్థాపకుడు వైద్యరత్నం పి.ఎస్.వారియర్ సేవలను స్మరించుకుంటూ, ఆయుర్వేదంపై ఆయన దృక్పథం, ప్రజా సంక్షేమంపై అంకితభావం నేటికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.3

శ్రీ నారాయణ ధర్మ సంఘం ట్రస్టు స్వామీజీలను కలిసిన ప్రధాని

January 23rd, 04:02 pm

వ‌ర్కాల‌లోని శివ‌గిరి మ‌ఠంలో శ్రీ నారాయ‌ణ ధ‌ర్మ సంఘం ట్రస్టు స్వామీజీల‌తో ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు భేటీ అయ్యారు.

48వ ప్రగతి సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రధానమంత్రి

June 25th, 09:11 pm

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రయత్నాలను సజావుగా సమన్వయం చేయడం ద్వారా ముందుచూపుతో కూడిన పాలన అందించడం – సకాలంలో పనులను పూర్తి చేయడం లక్ష్యంగా ఏర్పాటైన ఐసీటీ ఆధారితమల్టీ-మోడల్ వేదిక ‘ప్రగతి’ 48వ సమావేశం ఈరోజు ఉదయం సౌత్ బ్లాకులో నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు.