Prime Minister greets President of the United States on the 250th anniversary of the United States' independence

July 04th, 09:40 pm

The Prime Minister, Shri Narendra Modi, extended greetings to the President of the United States, Mr. Donald J. Trump, and the people of the United States on the historic occasion of the 250th anniversary of the country's independence. Shri Modi underscored the enduring strength of the India–United States partnership. He noted that the relationship between the two democracies extends beyond a strategic partnership and is anchored in shared values of democracy, the rule of law and faith in the limitless potential of their people.

ప్రధానమంత్రి సీషెల్స్ పర్యటన (జూన్ 27-29, 2026)

June 25th, 06:05 pm

సీషెల్స్ అధ్యక్షుడు పాట్రిక్ హెర్మిని ఆహ్వానం మేరకు, భారతదేశపు 'మహాసాగర్' దార్శనికతను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రధాని మోదీ 2026 జూన్ 27-29 తేదీలలో సీషెల్స్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా, ఆయన సీషెల్స్ జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా హాజరై, అధ్యక్షుడు హెర్మినితో చర్చలు జరుపుతారు. ఆయన సీషెల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించి, ప్రవాస భారతీయులతో కూడా సంభాషిస్తారు.

రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము పుట్టినరోజు సందర్భంగా ఆమెతో కలిసి ఒడిశాలోని పహాడ్‌పూర్ గ్రామాన్ని సందర్శించిన ప్రధాని

June 20th, 08:58 pm

రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము పుట్టినరోజు సదర్భంగా ఆమెతో కలిసి ఒడిశాలోని పహాడ్‌పూర్ గ్రామాన్ని సందర్శించటాన్ని తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసి పహాడ్‌పూర్‌ గ్రామంలోని గోసాని పీఠంలో పూజలు నిర్వహించిన ప్రధానమంత్రి

June 20th, 08:54 pm

పహాడ్‌పూర్‌ గ్రామంలోని గోసాని పీఠంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసి పూజలు నిర్వహించినట్లు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.

Prime Minister pays respects at Santhali Jahera and Ho Jahera in Pahadpur village with President, Smt. Droupadi Murmu

June 20th, 08:51 pm

The Prime Minister, Shri Narendra Modi has paid respects at Santhali Jahera and Ho Jahera in Pahadpur village with President, Smt. Droupadi Murmu.

పహాడ్‌పూర్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కుటుంబ సభ్యుల సమాధుల వద్ద పుష్పాంజలి ఘటించిన ప్రధానమంత్రి

June 20th, 08:47 pm

పహాడ్‌పూర్‌లోని పాఠశాల ప్రాంగణంలో ఉన్న దివంగత శ్రీ శ్యామ్ చరణ్ ముర్ము, దివంగత శ్రీ లఖన్ ముర్ము, దివంగత శ్రీ సిపున్ ముర్ము సమాధుల వద్ద ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పుష్పాంజలి ఘటించారు.

పహాడ్‌పూర్‌ గ్రామంలోని పాఠశాలను సందర్శించి, విద్యా మౌలిక సదుపాయాల మెరుగుదలకు జరుగుతున్న కృషిని కొనియాడిన ప్రధానమంత్రి

June 20th, 08:44 pm

పహాడ్‌పూర్‌ గ్రామంలోని పాఠశాలను సందర్శించటం ఎంతో సంతోషాన్ని కలిగించిందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

స్లోవాక్ రిపబ్లిక్ అధ్యక్షుడిని కలిసిన ప్రధానమంత్రి

June 15th, 11:33 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ బ్రాటిస్లావాలోని అధ్యక్ష భవనంలో స్లోవాక్ రిపబ్లిక్ అధ్యక్షుడు గౌరవ పీటర్ పెల్లెగ్రినితో భేటీ అయ్యారు.

ఇటలీ అధ్యక్షుడితో భారత ప్రధానమంత్రి భేటీ

May 20th, 07:19 pm

రోమ్‌లోని అధ్యక్ష భవనం క్విరినాలేలో ఇటలీ అధ్యక్షుడు సెర్గియో మట్టారెల్లాతో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు సమావేశమయ్యారు.

రాజ్యసభకు శ్రీ హరివంశ్‌… శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

April 10th, 02:20 pm

శ్రీ హరివంశ్‌ ను గౌరవ రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేసిన నేపథ్యంలో... ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఆయనకు హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన భావి పార్లమెంటరీ పదవీకాలం ఫలప్రదం కావాలని ప్రధాని అభిలషించారు.

సోషలిస్టు రిపబ్లిక్ వియత్నాం అధ్యక్ష పదవికి ఎన్నికైన సందర్భంగా శ్రీ తో లామ్ కు అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి

April 07th, 12:32 pm

కొత్త అధ్యక్షుని నాయకత్వంపై ప్రధానమంత్రి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కాల పరీక్షకు తట్టుకొని నిలిచిన భారత్, వియత్నాంల మైత్రి రాబోయే కాలంలో మరింత బలోపేతం అవుతుందని ప్రధాని అన్నారు. రెండు దేశాల ప్రజలతో పాటు ఈ ప్రాంతం కూడా పురోగమించేలా, సమృద్ధి పథంలో పయనించేలా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించడానికి కలిసి పనిచేయాలని కోరుకుంటున్నానని శ్రీ మోదీ తెలిపారు.

పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రపతికి జరిగిన అవమానాన్నీ, సంతాల్ సంస్కృతి పట్ల అగౌరవాన్నీ ఖండించిన ప్రధాని

March 07th, 08:14 pm

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రాష్ట్రపతిని అగౌరవపరచిన తీరునూ, సంతాల్ సంస్కృతి పట్ల ఆ ప్రభుత్వ చిన్నచూపునూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు.

‘కేరళ’ పేరును ‘కేరళం’గా మార్చడానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం

February 24th, 03:20 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ఈ రోజు జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశం ‘కేరళ’ రాష్ట్రం పేరును ‘కేరళం’గా మార్చాలనే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.

భారత్‌లో స్పెయిన్ అధ్యక్షుడు శ్రీ పెడ్రో సాంచెజ్ పర్యటన

February 18th, 05:08 pm

స్పెయిన్ అధ్యక్షుడు శ్రీ పెడ్రో సాంచెజ్ ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఫిబ్రవరి 18,19 న ‘ఏఐ ఇంపాక్ట్ సదస్సు 2026’లో ఆయన పాల్గొంటున్నారు. 2024 అక్టోబర్ 27, 29 ద్వైపాక్షిక పర్యటన తర్వాత ఆయనకు ఇది రెండో అధికారిక భారత పర్యటన. ఆయనతో పాటు స్పెయిన్ డిజిటల్ పరివర్తన, పౌర సేవల మంత్రి శ్రీ ఆస్కార్ లోపెజ్ అగ్యుడా, వ్యవసాయ, మత్స్య, ఆహార శాఖ మంత్రి శ్రీ లూయిస్ ప్లానాస్ పుచాడెస్ కూడా ఉన్నారు.

Prime Minister Welcomes French President to India, Emphasises Strengthening Bilateral Ties

February 17th, 09:57 am

PM Modi extended a warm welcome to French President Emmanuel Macron, expressing confidence that the visit will elevate India–France relations to new heights. The PM noted that the engagements in Mumbai and later in Delhi will provide fresh momentum to the strategic partnership between the two nations, benefiting not only both countries but also the wider global community.

భారత మాజీ రాష్ట్రపతిని కలిసిన ప్రధానమంత్రి

February 16th, 10:03 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు భారత మాజీ రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్‌తో సమావేశమయ్యారు.

ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఇమేన్యుయెల్ మేక్రోన్‌ను ఫిబ్రవరి 17న కలుసుకోనున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

February 16th, 09:02 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 ఫిబ్రవరి 17న ముంబయికి వెళ్లనున్నారు. అక్కడ ఆయన ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఇమేన్యుయెల్ మేక్రోన్‌‌తో సమావేశమవుతారు.

దేవ్‌నీ‌మొరీ పవిత్ర అవశేషాల ప్రదర్శనను ప్రారంభించినందుకు శ్రీలంక అధ్యక్షునికి కృతజ్ఞత‌లు తెలిపిన ప్రధానమంత్రి

February 05th, 10:45 am

కొలంబోలోని పావన గంగారామయా ఆలయంలో దేవ్‌నీమొరీ పవిత్ర అవశేషాల ప్రదర్శనను ప్రారంభించినందుకు శ్రీలంక అధ్యక్షుడు శ్రీ అనూర కుమార దిసానాయకేకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞత‌లు తెలిపారు.

పార్లమెంట్ బడ్జెటు సమావేశాలు మొదలైన సందర్భంగా ప్రధానమంత్రి వాఖ్యలు

January 29th, 10:15 am

నిన్న, గౌరవ రాష్ట్రపతి ప్రసంగం 140 కోట్ల మంది భారతీయుల ఆత్మగౌరవాన్ని చాటిచెప్పడమే కాకుండా, 140 కోట్ల మంది దేశ ప్రజల ఉమ్మడి కృషితో పాటు ఆకాంక్షలకు.. మరీ ముఖ్యంగా యువత ఆకాంక్షలకు నిర్దిష్ట వ్యాఖ్యానంగా ఉన్నది. ఆ ప్రసంగం చట్టసభల సభ్యులందరికీ మార్గదర్శకం కాగల అనేక ఆలోచనల్ని కూడా ఆవిష్కరించింది. సమావేశాల ఆరంభంలో, అదీనూ 2026 సంవత్సరం మొదలయ్యీ మొదలవక ముందే, గౌరవ రాష్ట్రపతి గారు సభలో పేర్కొన్న విషయాలు చాలా సరళ భాషలో దేశాధినేతగా చెప్పిన మాటలు. ఈ మాటలను పట్టి చూస్తే పార్లమెంటు గౌరవ సభ్యులంతా ఈ మాటల్ని గంభీరంగా లెక్క లోకి తీసుకుని ఉంటారని నేను నమ్ముతున్నాను. నిజానికి, ఈ సమావేశాలు ఎంతో కీలకం. బడ్జెట్ సమావేశాలివి.

పార్లమెంటు 2026 బడ్జెట్ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో విలేకరులను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

January 29th, 10:00 am

పార్లమెంటు 2026 బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు విలేకరులను ఉద్దేశించి ప్రసంగించారు. అంతకుముందు ఉభయసభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగం 140 కోట్ల మంది పౌరుల ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించిందని ఆయన పేర్కొన్నారు. అలాగే ప్రజల కఠోర శ్రమను, యువతరం ఆకాంక్షలను ప్రస్ఫుటం చేసిందని వ్యాఖ్యానించారు. సమావేశాల ప్రారంభానికి ఎంతో ముందుగానే... 2026 ఆరంభ సమయాన అనేక మార్గదర్శకాంశాలను రాష్ట్రపతి పార్లమెంటు సభ్యులందరి ముందుంచారని ఆయన గుర్తుచేశారు. దేశాధినేతగా రాష్ట్రపతి సరళ ప్రసంగంలో వెలిబుచ్చిన ఆకాంక్షలను ఎంపీలందరూ తప్పక పరిగణనలోకి తీసుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. తద్వారా ఈ సమావేశాలు కీలకమైనవి కాగలవని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఇది బడ్జెట్ సమావేశం కావడంతోపాటు 21వ శతాబ్దపు తొలి త్రైమాసికం ముగింపు సహా రెండో త్రైమాసికం ఆరంభాన్ని సూచిస్తుందని ఆయన చెప్పారు. దేశం 2047 నాటికి వికసిత భారత్‌ సంకల్పాన్ని సాకారం చేసుకోవడంలో రాబోయే 25 ఏళ్లు ఎంతో కీలకమన్నారు. ఈ బడ్జెట్ ప్రస్తుత శతాబ్దపు రెండో త్రైమాసికంలో మొదటిదని పేర్కొన్నారు. దేశ తొలి మహిళా ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 9వ సారి బడ్జెట్‌ను ప్రవేశపెడుతుండటం మన పార్లమెంటరీ చరిత్రలోనే గర్వకారణ క్షణమని ప్రధానమంత్రి అభివర్ణించారు.