ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం వేలాది కుటుంబాల కలలను నాశనం చేసింది: పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్లో ప్రధాని మోదీ
April 09th, 11:45 am
పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్లో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ టీఎంసీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సంక్షేమ పథకాలలో భారీ స్థాయిలో అవకతవకలు జరిగాయని ఆయన ఆరోపించారు మరియు రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో మార్పు కోసం నిర్ణయాత్మక తీర్పు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ప్రతి బూత్లో కమలం బటన్ను నొక్కి, అభివృద్ధి, గౌరవం మరియు భద్రతను అందించే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ఆయన ప్రజలను కోరారు.టిఎంసి పాపాల ఘటం నిండిపోయింది: పశ్చిమ బెంగాల్లోని అసన్సోల్లో ప్రధాని మోదీ
April 09th, 11:40 am
పశ్చిమ బెంగాల్లోని అసన్సోల్లో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, మహిళల భద్రత, పాలన మరియు అక్రమ చొరబాట్లపై ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నిర్ణయాత్మక తీర్పు ఇవ్వాలని పిలుపునిచ్చిన ఆయన, అధికార పార్టీ భయానక రాజకీయాలను అనుసరిస్తోందని తీవ్రంగా విమర్శించారు. మహిళల హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్న ఏకైక పార్టీ బీజేపీయేనని ప్రధాని స్పష్టం చేశారు.టిఎంసి'కట్ మనీ' మరియు కమీషన్ల వ్యవస్థను సృష్టించింది: పశ్చిమ బెంగాల్లోని హల్దియాలో ప్రధాని మోదీ
April 09th, 11:35 am
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హల్దియాలో ఉద్వేగభరితంగా ప్రసంగించి, బీజేపీ మద్దతుదారులను ఉత్తేజపరిచి, రాబోయే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధం చేశారు. భారీ జనసమూహాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ, గత రాజకీయ పరివర్తన స్ఫూర్తిని ప్రధాని మోదీ గుర్తుచేసుకున్నారు మరియు అటువంటి తరంగమే రాష్ట్రవ్యాప్తంగా వీస్తోందని పేర్కొన్నారు.పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు ముందు హల్దియా, అసన్సోల్, బీర్భూమ్లలో ప్రధాని మోదీ ర్యాలీలు భారీ ఊపునిచ్చాయి
April 09th, 11:30 am
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హల్దియాలో ఉద్వేగభరితంగా ప్రసంగించి, బీజేపీ మద్దతుదారులను ఉత్తేజపరిచి, రాబోయే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధం చేశారు. భారీ జనసమూహాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ, గత రాజకీయ పరివర్తన స్ఫూర్తిని ప్రధాని మోదీ గుర్తుచేసుకున్నారు మరియు అటువంటి తరంగమే రాష్ట్రవ్యాప్తంగా వీస్తోందని పేర్కొన్నారు.పశ్చిమ బెంగాల్లోని సింగూరులో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
January 18th, 03:30 pm
నిన్న నేను మాల్దాలో ఉన్నాను, ఈరోజు హుగ్లీలో మీ అందరి మధ్యకు వచ్చే భాగ్యం కలిగింది. వికసిత భారత్ కోసం తూర్పు భారత్ అభివృద్ధి - లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోంది. నిన్నటి, నేటి కార్యక్రమాలు ఈ సంకల్పాన్ని మరింత బలోపేతం చేస్తాయి. ఈ క్రమంలో, పశ్చిమ బెంగాల్ కు సంబంధించిన వందల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసే, అంకితం ఇచ్చే అవకాశం నాకు లభించింది. నిన్న దేశ మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలు పశ్చిమ బెంగాల్ నుంచి ప్రారంభమైంది. బెంగాల్కు సుమారు అరడజను కొత్త అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు అందాయి. ఈరోజు మరో మూడు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు ప్రారంభమయ్యాయి. వీటిలో ఒక రైలు నా పార్లమెంటు నియోజకవర్గం కాశీ బనారస్తో బెంగాల్ అనుసంధానాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఇవే కాకుండా, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాలకు వెళ్లే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు కూడా మొదలయ్యాయి. అంటే, పశ్చిమ బెంగాల్ రైలు అనుసంధానానికి గత 24 గంటలు అపూర్వమైనవి. బహుశా గత 100 ఏళ్లలో 24 గంటల వ్యవధిలో ఇంతటి పని జరగలేదు.పశ్చిమ బెంగాల్లోని సింగూర్లో 830 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి
January 18th, 03:00 pm
పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లా సింగూర్లో ఈ రోజు 830 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభోత్సవం చేయగా, కొన్నింటికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. నిన్న తాను మాల్దాలో ఉండగా ఈ రోజు హుగ్లీ ప్రజల మధ్య ఉండే భాగ్యం కలిగిందని అన్నారు. అభివృద్ధి చెందిన దేశం కోసం తూర్పు భారత్ అభివృద్ధి అత్యంత ఆవశ్యకమని.. ఈ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఆయన ప్రధానంగా చెప్పారు. నిన్నటి, నేటి కార్యక్రమాలు ఈ సంకల్పాన్ని మరింత బలోపేతం చేస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ రెండు రోజుల్లో పశ్చిమ బెంగాల్ అభివృద్ధికి సంబంధించిన వందల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేసే అవకాశం తనకు లభించిందని ప్రధానమంత్రి అన్నారు.అనువాదం: గుజరాత్లోని భావ్నగర్లో నిర్వహించిన ‘సముద్ర సే సమృద్ధి’ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
September 20th, 11:00 am
భావ్నగర్లో ఒక ఉత్తేజకరమైన వాతావరణం కనిపిస్తోంది. వేదిక ముందున్న జన సంద్రం నాకు కనిపిస్తోంది. ఇంత పెద్ద జనసమూహం నాకు ఆశీస్సులు ఇచ్చేందుకు వచ్చింది. మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.గుజరాత్లోని భావ్నగర్లో ‘సముద్ర సే సమృద్ధి’ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
September 20th, 10:30 am
గుజరాత్లోని భావ్నగర్లో రూ. 34,200 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి పనులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. మరికొన్ని పనులకు శంకుస్థాపన చేశారు. 'సముద్ర సే సమృద్ధి' కార్యక్రమంలో ప్రసంగిస్తూ.. ఈ కార్యక్రమంలో ప్రముఖులు, ప్రజల భాగస్వామ్యాన్ని ప్రధానమంత్రి స్వాగతించారు. ఈ నెల 17న తనకు పంపిన పుట్టినరోజు శుభాకాంక్షలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజల ప్రేమాభిమానాలు గొప్ప బలమన్నారు. దేశంలో విశ్వకర్మ జయంతి నుంచి గాంధీ జయంతి వరకు అంటే ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు సేవా పఖ్వాడా నిర్వహిస్తున్నట్లు ప్రధానమంత్రి తెలిపారు. గత 2-3 రోజుల్లో గుజరాత్లో అనేక సేవా కార్యక్రమాలు.. వందలాది ప్రదేశాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించారన్నారు. ఇప్పటివరకు ఒక లక్ష మంది రక్తదానం చేశారని ప్రధానమంత్రి వెల్లడించారు. అనేక నగరాల్లో నిర్వహించిన పరిశుభ్రతా కార్యక్రమాల్లో లక్షలాది మంది పౌరులు చురుగ్గా పాల్గొంటున్నారని ఆయన అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 30,000 కి పైగా ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేశామనీ, ప్రజలకు.. ముఖ్యంగా మహిళలకు ఉచితంగా వైద్య పరీక్షలు, చికిత్స అందిస్తున్నామని శ్రీ మోదీ తెలియజేశారు. దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ ప్రశంసిస్తూ వారికి కృతజ్ఞతలు తెలిపారు.