ఎం.ఎస్. స్వామినాథన్ శతాబ్ది అంతర్జాతీయ సమావేశాన్ని ఆగస్టు 7న న్యూఢిల్లీలో ప్రారంభించనున్న ప్రధాని
August 06th, 12:20 pm
ఎం.ఎస్. స్వామినాథన్ శతాబ్ది సందర్భంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ సమావేశాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపు ఉదయం సుమారు 9 గంటలకు న్యూఢిల్లీలోని ఐసీఏఆర్ పూసాలో ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.