Prime Minister extends best wishes on the special occasion of Puthandu

April 14th, 09:21 am

The Prime Minister, Shri Narendra Modi has extended best wishes on the special occasion of Puthandu.

రాజ్యసభకు శ్రీ హరివంశ్‌… శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

April 10th, 02:20 pm

శ్రీ హరివంశ్‌ ను గౌరవ రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేసిన నేపథ్యంలో... ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఆయనకు హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన భావి పార్లమెంటరీ పదవీకాలం ఫలప్రదం కావాలని ప్రధాని అభిలషించారు.

Prime Minister extends his best wishes to Shri Nitish Kumar upon his taking oath as Rajya Sabha MP

April 10th, 02:07 pm

PM Modi extended his heartiest congratulations and best wishes to Shri Nitish Kumar on the occasion of him taking oath as a Member of the Rajya Sabha. The PM remarked that Shri Nitish Kumar is one of the nation's most experienced leaders whose commitment to good governance and indelible contribution to Bihar's development are widely recognized. He noted that it is a pleasure to see him return to Parliament.

రామ నవమి సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు

March 26th, 12:11 pm

పవిత్ర రామ నవమి సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. త్యాగం, తపస్సు, నిగ్రహానికి మారుపేరైన మర్యాద పురుషోత్తముడు రాముని జీవితం.. ఎలాంటి పరిస్థితినైనా స్థైర్యం, సంకల్పంతో ఎదుర్కొనే స్ఫూర్తిని ప్రజలకు ఇస్తుందని శ్రీ మోదీ చెప్పారు.

అందరికీ ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

March 21st, 08:24 am

నేడు పవిత్ర పండగ ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

ఖతార్ పాలకుడితో మాట్లాడిన ప్రధానమంత్రి ఈద్ శుభాకాంక్షలు తెలిపి... ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులను ఖండించిన ప్రధానమంత్రి

March 19th, 10:00 pm

ఖతార్ పాలకుడు శ్రీ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్‌ థానీతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడారు. ఈద్ శుభాకాంక్షలను తెలియజేశారు. ప్రాంతీయ భద్రత పరమైన ఆందోళనలపై చర్చించారు.

“గుడి పడ్వా.. ఉగాది.. చేతి చాంద్.. నవ్రేహ్.. సాజిబు చెయిరోబా..” పర్వదిన సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు

March 19th, 08:46 am

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఇవాళ “గుడి పడ్వా.. ఉగాది.. చేతి చాంద్.. నవ్రేహ్.. సాజిబు చెయిరోబా..” పర్వదినాల నేపథ్యంలో కొత్త సంవత్సర వేడుకలు నిర్వహించుకుంటున్న ప్రజలకు ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

కొత్త సంవత్సరాది నేపథ్యంలో ప్రజలందరికీ ప్రధానమంత్రి శుభాకాంక్షలు

March 19th, 08:03 am

పవిత్ర నవ సంవత్సరం (కొత్త సంవత్సరాది) సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది ఆద్యంతం యావత్‌ ప్రజానీకం సంపూర్ణ సౌభాగ్యంతో వర్ధిల్లాలని, జాతీయ ప్రగతిపై నవ్య నిబద్ధత ఏర్పరచుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

నేపాల్ ఎన్నికల్లో విజయం సాధించిన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ నాయకులకు ప్రధాని శుభాకాంక్షలు

March 09th, 10:04 pm

రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్ఎస్‌పీ) అధ్యక్షుడు శ్రీ రబీ లామిఛానే, ఆ పార్టీ సీనియర్ నాయకుడు శ్రీ బాలేంద్ర షాతో టెలిఫోన్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ మాట్లాడారు.

ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ గెలుచుకున్న భారత జట్టుకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రధానమంత్రి

March 08th, 11:32 pm

ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ గెలిచిన సందర్భంగా భారత క్రికెట్ జట్టుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. అత్యుత్తమ నైపుణ్యాలనూ, సంకల్పాన్నీ, సమష్టి కృషినీ ఈ విజయం ప్రతిబింబిస్తుందని శ్రీ మోదీ అన్నారు. ఈ టోర్నమెంట్ అంతా అసాధారణ పట్టుదలను జట్టు ప్రదర్శించిందని ప్రశంసించారు.

ఆట్టుకల్ పొంగాల సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

March 03rd, 07:13 pm

పవిత్రమైన ఆట్టుకల్ పొంగాల సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

February 22nd, 01:30 pm

బాబా ఔఘర్‌నాథ్ పుణ్యభూమి, విప్లవనేల మీరట్‌లో ఇవాళ వికసిత్ ఉత్తరప్రదేశ్, వికసిత్ భారత్ లక్ష్య సాధనకు నూతనోత్తజం పరుగులు పెడుతోంది. తొలిసారిగా ఒకే వేదిక నుంచి నమో భారత్ రాపిడ్ రైలు, మెట్రో సర్వీసులు ప్రారంభమమయ్యాయి. అభివృద్ధి చెందిన భారతదేశంలోని రవాణా వ్యవస్థకు ఇది అద్భుతమైన ఉదాహరణ. నగరంలో ప్రయాణించేందుకు మెట్రో, జంట నగరాల అనుసంధానానికి అత్యాధునిక నమో భారత్ రైలు అందుబాటులోకి వచ్చాయి. అభివృద్ధిలో ఉత్తరప్రదేశ్ కీలకఘట్టానికి చేరుకున్నందుకు నాకు సంతృప్తిగా ఉంది.

భారత తొలి నమో భారత్ ఆర్ ఆర్ టీ ఎస్ ను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ; ఢిల్లీ - మీరట్ నమో భారత్ కారిడార్‌ జాతికి అంకితం

February 22nd, 01:12 pm

మీరట్‌లో నమో భారత్ రాపిడ్ రైల్, మీరట్ మెట్రో మార్గాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును 'వికసిత ఉత్తరప్రదేశ్' 'వికసిత భారత్' కోసం ఒక సరికొత్త శక్తిగా ఆయన అభివర్ణించారు. భారతదేశంలో ఒకే ప్లాట్‌ఫారమ్ నుంచి రాపిడ్ రైల్, మెట్రో సర్వీస్ రెండూ ఒకే రోజు ప్రారంభం కావడం ఇదే తొలిసారి.

అరుణాచల్ ప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు

February 20th, 09:35 am

అరుణాచల్ ప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.

పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు

February 18th, 10:00 pm

పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా భారతీయులకు, అంతర్జాతీయ సమాజానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

కేరళలోని ఆర్య వైద్యశాల ధార్మిక ఆస్పత్రి శతాబ్ది వేడుకలలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

January 28th, 02:39 pm

ఈ విశిష్ట సందర్భంలో మీ అందరితో మమేకం కావడం నాకెంతో సంతోషంగా ఉంది. ఆయుర్వేద వైద్య విధాన పరిరక్షణ, అభివృద్ధి, ఆధునికీకరణలో ఆర్య వైద్యశాల కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సంస్థ తన 125 ఏళ్ల ప్రస్థానంలో ఆయుర్వేదాన్ని శక్తిమంతమైన చికిత్సా విధానంగా నిరూపించింది. ఈ నేపథ్యంలో ఆర్య వైద్యశాల వ్యవస్థాపకులైన వైద్యరత్నం పి.ఎస్.వారియర్ సేవలను వినమ్రంగా స్మరించుకుంటున్నాను. ఆయుర్వేదంపై ఆయన దృక్పథం, ప్రజా సంక్షేమంపై అంకితభావం నేటికీ మనందరికీ స్ఫూర్తినిస్తున్నాయి.

కేరళలోని ఆర్య వైద్యశాల ధార్మిక ఆస్పత్రి శతాబ్ది ఉత్సవంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

January 28th, 02:25 pm

కేరళలోని ఆర్య వైద్యశాల ధార్మిక ఆస్పత్రి శతాబ్ది ఉత్సవం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం ద్వారా ప్రసంగించారు. ఇటువంటి పవిత్ర సందర్భంలో అందరితోనూ మమేకం కావడం తనకెంతో ఆనందంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఆయుర్వేద వైద్యవిధాన పరిరక్షణ, అభివృద్ధి, ఆధునికీకరణలో ఆర్య వైద్యశాల కీలక పాత్ర పోషిస్తున్నదని ఆయన కొనియాడారు. ఈ మేరకు 125 ఏళ్ల ప్రస్థానంలో ఈ సంస్థ ఆయుర్వేదాన్ని శక్తిమంతమైన చికిత్సా విధానంగా నిరూపించిందని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆర్య వైద్యశాల వ్యవస్థాపకుడు వైద్యరత్నం పి.ఎస్.వారియర్ సేవలను స్మరించుకుంటూ, ఆయుర్వేదంపై ఆయన దృక్పథం, ప్రజా సంక్షేమంపై అంకితభావం నేటికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.3

భగవాన్ స్వామినారాయణ్ రచించిన శిక్షాపత్రి ద్విశతాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

January 23rd, 02:12 pm

ఈరోజు మనమందరం ఒక ప్రత్యేక సందర్భానికి సాక్షులుగా నిలుస్తున్నాం. భగవాన్ స్వామినారాయణ్ రచించిన శిక్షాపత్రి 200 ఏళ్లు పూర్తైన సందర్భంగా జరుగుతున్న ఈ ద్విశతాబ్ది వేడుకలు మనందరికీ దక్కిన అదృష్టం. ఈ పవిత్ర మహోత్సవంలో మనమందరం భాగస్వాములవ్వడం విశేషం. ఈ పుణ్యకాలంలో నేను సాధువులందరికీ ప్రణామం చేస్తున్నాను. ఈ ద్విశతాబ్ది ఉత్సవాల సందర్భంగా భగవాన్ స్వామినారాయణ్ కోట్లాది మంది భక్తులకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.

శిక్షాపత్రి ద్విశతాబ్ది మహోత్సవం సందర్బంగా ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

January 23rd, 02:00 pm

శిక్షాపత్రి ద్విశతాబ్ది మహోత్సవం సందర్బంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన సందేశాన్ని ఇవాళ వీడియో ద్వారా పంచుకున్నారు. భగవాన్ స్వామినారాయణ్ రచించిన శిక్షాపత్రి 200 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రత్యేక సందర్భానికి మనమంతా సాక్షులమని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ద్విశతాబ్ది వేడుకలు జరుపుకోవటం, ఈ పవిత్రమైన కార్యక్రమంలో భాగస్వాములు కావటం అందరికీ దక్కిన అదృష్టమన్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో సాధువులకు శిరస్సు వంచి నమస్కరించిన ప్రధానమంత్రి శ్రీ మోదీ, ద్విశతాబ్ది వేడుకల సందర్భంగా భగవాన్ స్వామి నారాయణ్ బోధనలను అనుసరిస్తున్న కోట్ల మంది భక్తులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

వసంత పంచమి శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

January 23rd, 09:43 am

శుభప్రద వసంత పంచమి సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.