పురాతన భారతీయ 'స్టిచ్డ్-షిప్' పద్ధతిలో నిర్మించిన ఐఎన్ఎస్వీ కౌండిన్య పోర్బందర్ నుంచి ఒమన్లోని మస్కట్కు తొలి ప్రయాణాన్ని ప్రారంభించడంపై ప్రధానమంత్రి ప్రశంస
December 29th, 05:57 pm
ఐఎన్ఎస్వీ కౌండిన్య నౌకను అద్భుతంగా తీర్చిదిద్ది, ప్రాణం పోసిన రూపకర్తలు, కళాకారులు, నౌకా నిర్మాణ నిపుణులు, భారత నావికాదళం అంకితభావంతో చేసిన కృషిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. ఈ నౌక గుజరాత్లోని పోర్బందర్ నుంచి ఒమన్లోని మస్కట్ వరకు తొలి ప్రయాణాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రశంసలు కురిపించారు. పురాతన భారతీయ 'స్టిచ్డ్-షిప్' సాంకేతికతతో నిర్మించిన ఐఎన్ఎస్వీ కౌండిన్య, భారతదేశపు సుసంపన్నమైన సముద్రయాన సంప్రదాయాలను ప్రతిబింబిస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. 'గల్ఫ్ ప్రాంతంతో, ఇతర దేశాలతో మనకున్న చారిత్రక సంబంధాలను పునరుద్ధరిస్తూ సాగుతున్న ఈ నౌకా సిబ్బందికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. వారి ప్రయాణం సురక్షితంగా, ఎప్పటికీ గుర్తుండిపోయేలా సాగాలని కోరుకుంటున్నాను' అని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒమన్ పర్యటన సందర్భంగా భారత్ - ఒమన్ దేశాల సంయుక్త ప్రకటన
December 18th, 05:28 pm
ఒమన్ సుల్తాన్ హైతం బిన్ తారిక్ ఆహ్వానం మేరకు, భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2025 డిసెంబర్ 17,18 తేదీల్లో ఒమన్ లో అధికారికంగా పర్యటించారు. విమానాశ్రయంలో ప్రధానమంత్రికి ఒమన్ ఉప ప్రధానమంత్రి (రక్షణ వ్యవహారాలు) సయ్యద్ షిహాబ్ బిన్ తారిక్ అధికార లాంఛనాలతో స్వాగతం పలికారు. డిసెంబర్ 18, 2025న అల్ బరాకా ప్యాలెస్లో సుల్తాన్ హైతం బిన్ తారిక్ ప్రధానికి స్వాగతం పలికారు.ఒమన్ సుల్తాన్ తో ప్రధానమంత్రి సమావేశం
December 18th, 05:22 pm
ఒమన్ లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు మస్కట్లో ఒమన్ సుల్తాన్ హైతం బిన్ తారిక్తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. రాయల్ ప్యాలెస్ వద్ద ప్రధానమంత్రికి సుల్తాన్ హైతం బిన్ తారిక్ సాదర స్వాగతం పలికారు. అధికార లాంఛనాలతో కూడిన ఘనమైన స్వాగత కార్యక్రమం నిర్వహించారు.ఒమన్లో ప్రధాని పర్యటన: కుదిరిన ఒప్పందాలు
December 18th, 04:57 pm
- సన్నిహిత ఆర్థిక, వాణిజ్య ఏకీకరణను బలోపేతం చేసి, మరింతగా వాటిని అభివృద్ధి చేయడం.భారత్-ఒమన్ వాణిజ్య సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
December 18th, 04:08 pm
ఏడేళ్ల తర్వాత ఒమన్ను సందర్శించటం, ఇవాళ మీ అందరినీ కలిసే అవకాశం లభించటం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా.అనువాదం: ఒమన్లోని భారతీయ సమాజం, విద్యార్థులను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం
December 18th, 12:32 pm
మీ యువ ఉత్సాహం, శక్తి ఇక్కడి వాతావరణాన్ని నిజంగా ఉత్తేజపరిచాయి. ఈ హాల్ సరిపోకపోవటంతో పక్కనే ఉన్న హాల్లోని తెరలపై ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తున్న సోదరీసోదరులందరికీ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇంత దూరం వచ్చి కూడా ఈ హాల్లోకి ప్రవేశించలేకపోయినందుకు వారు ఏమనుకుంటున్నారో మీరు ఊహించొచ్చు.ఒమన్లోని భారతీయులనుద్దేశించి ప్రధాని ప్రసంగం
December 18th, 12:31 pm
మస్కట్లో అక్కడి భారతీయుల భారీ సమావేశాన్నుద్దేశించి ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. వివిధ భారతీయ పాఠశాలలకు చెందిన సుమారు 700 మంది విద్యార్థులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒమన్లో భారతీయ పాఠశాలలను నెలకొల్పి ఈ ఏడాదితో 50 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారత్లోని కుటుంబాలు, మిత్రుల తరఫున వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మీయంగా, వర్ణశోభితంగా తనకు స్వాగతం పలికిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఒమన్లో స్థిరపడిన భారత్లోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలను కలవడం తనకు చాలా ఆనందంగా ఉందన్నారు. వైవిధ్యమే భారతీయ సంస్కృతికి మూలమనీ, భారతీయులు ఏ సమాజంతోనైనా కలిసిపోవడానికి ఈ వైవిధ్యమే కారణమని వ్యాఖ్యానించారు. ఒమన్లో భారతీయ సమాజానికి లభిస్తున్న గౌరవాన్ని ప్రస్తావిస్తూ.. సహజీవనం, సహకారం భారతీయ ప్రవాసుల విశేష లక్షణమని ప్రధానమంత్రి ప్రశంసించారు.భారత్ ఒమన్ వాణిజ్య వేదికకు హాజరైన ప్రధానమంత్రి
December 18th, 11:15 am
మస్కట్ లో జరిగిన భారత్- ఒమన్ వాణిజ్య వేదికను ఉద్దేశిస్తూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ప్రసంగించారు. ఈ సమావేశానికి ఒమన్ వాణిజ్యం, పరిశ్రమల మంత్రి శ్రీ ఖైస్ అల్ యూసఫ్, ఒమన్ వాణిజ్య, పరిశ్రమల చాంబర్ చైర్మన్ శ్రీ షేక్ ఫైసల్ అల్ రావాస్, భారత వాణిజ్యం, పరిశ్రమల మంత్రి శ్రీ పియూష్ గోయల్, సీఐఐ అధ్యక్షుడు శ్రీ రాజీవ్ మెమాని హాజరయ్యారు. ఈ వేదికలో రెండు దేశాల నుంచి ఇంధనం, వ్యవసాయం, రవాణా, మౌలిక సదుపాయాలు, తయారీ, ఆరోగ్యం, ఆర్థిక సేవలు, హరిత అభివృద్ధి, విద్య, అనుసంధాన రంగాల్లోని ప్రముఖ వ్యాపారవేత్తలు పాల్గొన్నారు.PM Modi arrives in Muscat, Oman to a warm welcome
December 17th, 07:19 pm
PM Modi arrived in Muscat, Oman, a short while ago. He was accorded a ceremonial welcome at the airport. The PM’s visit marks 70 years of the establishment of diplomatic ties between India and Oman. In Muscat, the PM will hold discussions with His Majesty the Sultan of Oman to further strengthen the Strategic Partnership.జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ దేశాల పర్యటనకు బయలుదేరే ముందు ప్రధాని ప్రకటన
December 15th, 08:15 am
ఈ రోజు నేను మూడు దేశాలు- హాషెమైట్ కింగ్డమ్ ఆఫ్ జోర్డాన్, ఫెడరల్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇథియోపియా, ఒమన్ సుల్తానేట్లో పర్యటించేందుకు బయలుదేరి వెళుతున్నాను. ఈ మూడు దేశాలతోనూ భారత్కు ప్రాచీన నాగరిక సంబంధాలు, సమకాలీన ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయి.జోర్డాన్, ఇథియోపియా, ఒమన్లలో ప్రధాని పర్యటన
December 11th, 08:43 pm
మహారాజు అబ్దుల్లా II బిన్ అల్ హుస్సేన్ ఆహ్వానం మేరకు.. భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2025 డిసెంబరు 15 – 16 తేదీల్లో హషేమైట్ రాజ్యమైన జోర్డాన్లో పర్యటించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా గౌరవ మహారాజు అబ్దుల్లా II బిన్ అల్ హుస్సేన్తో భారత ప్రధానమంత్రి సమావేశమై.. భారత్, జోర్డాన్ మధ్య సంబంధాల పూర్తి పరిధిని సమీక్షించడంతోపాటు పలు ప్రాంతీయ అంశాలపైనా చర్చిస్తారు. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ పర్యటన జరుగుతోంది. భారత్ - జోర్డాన్ ద్వైపాక్షిక సంబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి, పరస్పర వృద్ధి, సంక్షేమం కోసం సహకారానికి కొత్త మార్గాల అన్వేషణకు, అలాగే.. ప్రాంతీయ శాంతి, సమృద్ధి, భద్రత, స్థిరత్వాన్ని ప్రోత్సహించడంలో అంకితభావాన్ని పునరుద్ఘాటించేందుకు ఇదో మంచి అవకాశం.భారతీయ ప్రవాసులు వివిధ దేశాల్లో తమదైన ముద్ర వేశారు: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
November 24th, 11:30 am
మన్ కీ బాత్ యొక్క 116వ ఎపిసోడ్లో, పీఎం మోదీ ఎన్సిసి డే యొక్క ప్రాముఖ్యతను చర్చించారు, ఎన్సిసి క్యాడెట్ల పెరుగుదల మరియు విపత్తు సహాయంలో వారి పాత్రను హైలైట్ చేశారు. అభివృద్ధి చెందిన భారతదేశం కోసం యువత సాధికారతను నొక్కి, వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ గురించి మాట్లాడారు. డిజిటల్ ప్లాట్ఫారమ్లను నావిగేట్ చేయడంలో సీనియర్ సిటిజన్లకు యువత సహాయం చేయడం మరియు ఏక్ పెద్ మా కే నామ్ క్యాంపెయిన్ విజయాన్ని కూడా ఆయన పంచుకున్నారు.భారతదేశం, ఓమాన్ల సంగీత ప్రధానమైన ప్రదర్శన ను ప్రశంసించిన ప్రధాన మంత్రి
January 30th, 10:17 pm
ఓమాన్ లో భారతదేశం రాయబార కార్యాలయం లోని ఎంబసీ రిసెప్శన్ లో భారతదేశం,ఓమాన్ లు సుంయక్తం గా ప్రదర్శించిన గణతంత్ర దిన సంబంధి సంగీత ప్రధాన ప్రదర్శన ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ప్రశంసించారు.ఒమన్ సుల్తాన్తో ప్రధానమంత్రి సమావేశం
December 16th, 09:29 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ఒమన్ సుల్తాన్ గౌరవనీయ హైతం బిన్ తారిక్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై దేశాధినేతలిద్దరూ సమీక్షించారు.ఒమన్ సుల్తాన్ తో జరిగిన ప్రతినిధివర్గం స్థాయి చర్చల సమయంలో ప్రధానమంత్రి ప్రారంభోపన్యాసం (16 డిసెంబరు 2023)
December 16th, 07:02 pm
మీ అందరినీ భారతదేశానికి ఆహ్వానించడం నాకు చాలా ఆనందంగా ఉంది.2020 సంవత్సరానికి గాంధీ శాంతి బహుమతి ప్రకటించారు
March 22nd, 09:37 pm
2020 సంవత్సరానికి గాంధీ శాంతి బహుమతి బంగాబంధు షేక్ ముజిబూర్ రెహ్మాన్ కు ప్రదానం చేయబడుతుంది. మహాత్మా గాంధీ 125 వ జయంతి సందర్భంగా గాంధీ శాంతి బహుమతి వార్షిక పురస్కారాన్ని 1995 నుండి భారత ప్రభుత్వం అందిస్తోంది. ఈ అవార్డు జాతీయత, జాతి, భాష, కులం, మతం లేదా లింగంతో సంబంధం లేకుండా ప్రదానం చేయబడుతుంది.2019 సంవత్సరానికి గాంధీ శాంతి బహుమతిని ప్రకటించారు
March 22nd, 09:36 pm
2019 సంవత్సరానికి గాంధీ శాంతి బహుమతిని ఒమాన్కు చెందిన దివంగత హిజ్ మెజెస్టి సుల్తాన్ కబూస్ బిన్ సాయిద్ అల్ సాయిద్కు ప్రదానం చేయనున్నారు. మహాత్మా గాంధీ 125 వ జయంతి సందర్భంగా గాంధీ శాంతి బహుమతి వార్షిక పురస్కారాన్ని 1995 నుండి భారత ప్రభుత్వం అందిస్తోంది. ఈ అవార్డు జాతీయత, జాతి, భాష, కులం, మతం లేదా లింగంతో సంబంధం లేకుండా ప్రదానం చేయబడుతుంది.ఓమన్ సుల్తాన్ మాన్య శ్రీ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ తో టెలిఫోన్ ద్వారా మాట్లాడిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
February 17th, 09:43 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బుధవారం నాడు, అంటే ఈ నెల 17న, ఓమన్ సుల్తాన్ మాన్య శ్రీ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ తో టెలిఫోన్ లో మాట్లాడారు.ప్రధానమంత్రి మరియు ఒమాన్ సుల్తాన్ మధ్య టెలిఫోన్ సంభాషణ
April 07th, 05:50 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు ఒమాన్ సుల్తాన్ గౌరవనీయులు హైతం బిన్ తారిఖ్ తో టెలిఫోన్ లో మాట్లాడారు.ఓమాన్ సుల్తాన్ శ్రీ సయీద్ హైథాం బిన్ తారీఖ్ అల్ సైద్ కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి
January 12th, 10:04 am
ఓమాన్ సుల్తాన్ గా శ్రీ సయీద్ హైథాం బిన్ తారీఖ్ అల్ సైద్ పదవీ బాధ్యతలు స్వీకరించినందుకు గాను ఆయన ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.