రోజ్‌గార్ మేళా ద్వారా నియామక పత్రాల పంపిణీ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

May 23rd, 11:15 am

దేశవ్యాప్తంగా ఉన్న వేలాది మంది యువతీ యువకులకు నేడు చాలా ముఖ్యమైన రోజు. 51,000 కంటే ఎక్కువ మంది యువత నేడు ప్రభుత్వ ఉద్యోగాల నియామక పత్రాలను అందుకున్నారు. మీరు దేశ అభివృద్ధి ప్రయాణంలో అత్యంత కీలకమైన, బాధ్యతాయుతమైన భాగస్వాములుగా మారుతున్నారు. రైల్వే, బ్యాంకింగ్, రక్షణ, ఆరోగ్యం, విద్య, ఇతర అనేక రంగాల్లో సరికొత్త బాధ్యతలను స్వీకరించబోతున్నారు. రాబోయే సంవత్సరాల్లో అభివృద్ధి చెందిన భారత్‌ సంకల్పాన్ని నెరవేర్చడంలో మీరే కీలక పాత్ర పోషిస్తారు.

రోజ్‌గార్ మేళా ద్వారా ప్రభుత్వంలో కొత్తగా నియమితులైన యువతకు 51,000కు పైగా నియామక పత్రాలను పంపిణీ చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

May 23rd, 11:00 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా 19వ రోజ్‌గార్ మేళా (ఉగ్యోగ మేళా)లో వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన 51,000 మందికి పైగా యువతకు నియామక పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా వేలాది మంది యువతీ యువకులకు ఇది అత్యంత ముఖ్యమైన రోజు అని అభివర్ణించారు. ప్రభుత్వ సేవలోకి కొత్తగా అడుగుపెడుతున్న వారికి స్వాగతం పలుకుతూ.. రైల్వే, బ్యాంకింగ్, రక్షణ, ఆరోగ్యం, విద్య వంటి రంగాలతో సహా పలు రంగాల్లో దేశ అభివృద్ధికి వారు అందించబోయే కీలక సహకారాన్ని ప్రస్తావించారు. ‘‘రాబోయే సంవత్సరాల్లో వికసిత్‌ భారత్ దార్శనికతను సాకారం చేయడంలో మీరందరూ కీలక పాత్ర పోషిస్తారు’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

మూడో ఇండియా-నార్డిక్ సదస్సు నేపథ్యంలో ఫిన్లాండ్ ప్రధానితో భేటీ అయిన ప్రధానమంత్రి

May 19th, 06:42 pm

ఓస్లోలో జరుగుతున్న మూడో ఇండియా-నార్డిక్ సదస్సు నేపథ్యంలో 2026 మే 19న ఫిన్లాండ్ ప్రధాని శ్రీ పెటెరి ఓర్పోతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.

నార్వే - భారత్ వ్యాపార, పరిశోధన సదస్సులో ప్రధాని ప్రసంగం

May 18th, 11:49 pm

నార్వే, భారత్ వ్యాపార, పరిశోధన వర్గాల మధ్య ఈ రోజు ఇక్కడుండడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొందరి మాటలు వినే అవకాశం లభించింది. మన భాగస్వామ్యానికి పునాది చాలా బలంగా ఉందన్న నమ్మకం వారి మాటలు విన్న తర్వాత నాకు కలిగింది.

భారత్-నార్వే వాణిజ్య, పరిశోధన సదస్సులో పాల్గొన్న ప్రధానమంత్రి

May 18th, 08:50 pm

ఓస్లోలో జరిగిన భారత్-నార్వే వాణిజ్య, పరిశోధన సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. గౌరవ రాజు హాకాన్‌, నార్వే ప్రధానమంత్రి గౌరవ జోనాస్ గార్‌ స్టోర్‌ కూడా ఈ సదస్సుకు హాజరయ్యారు.

నార్వే ప్రధానమంత్రితో భారత ప్రధానమంత్రి ద్వైపాక్షిక చర్చలు

May 18th, 08:21 pm

నార్వే రాజధాని ఓస్లోలో ఆ దేశ ప్రధానమంత్రి శ్రీ జోనాస్ గర్ స్టోరెతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అంతకుముందు ఉదయం ఓస్లో విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని శ్రీ మోదీకి నార్వే ప్రధానమంత్రి స్టోరె స్వయంగా విచ్చేసి ఘనస్వాగతం పలికారు. ఇది ఇరు దేశాల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలకు అద్దం పట్టింది.

Prime Minister’s Audience with His Majesty King Harald V of Norway

May 18th, 07:36 pm

PM Modi had an audience with His Majesty King Harald V of Norway at the Royal Palace in Oslo, where the two discussed the growing India-Norway partnership and progress across sectors, particularly new technologies. The meeting was followed by a luncheon hosted in honour of PM Modi.

Prime Minister receives the Grand Cross of the Royal Norwegian Order of Merit

May 18th, 07:35 pm

In yet another global honour for PM Modi, he was conferred the ‘Grand Cross of the Royal Norwegian Order of Merit’ by His Majesty King Harald V of Norway. The award is conferred in recognition of the outstanding service in the interest of Norway and humankind. Expressing deep gratitude to the King and the people of Norway, the PM dedicated the award to the historic friendship between India and Norway.

నార్వే ప్రధానమంత్రితో సంయుక్త పత్రికా ప్రకటన సందర్భంగా భారత ప్రధానమంత్రి పత్రికా ప్రకటన

May 18th, 04:44 pm

గతేడాదే నేను నార్వేలో పర్యటించాల్సి ఉంది. అయితే, పహల్గాంలో ఉగ్రవాద దాడి కారణంగా ఆ పర్యటనను వాయిదా వేయాల్సి వచ్చింది. ఆ క్లిష్ట సమయంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌కు నార్వే అండగా నిలిచింది. మన స్నేహబంధం శక్తికి ఇది నిదర్శనం. ఆ మద్దతు, సంఘీభావం పట్ల ఈ రోజు నార్వే పర్యటన సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

మోదీ నార్వేకు చేరుకున్న ప్రధానమంత్రి

May 18th, 01:00 pm

నాలుగు దశాబ్దాలకు పైగా కాలంలో భారతదేశం నుండి నార్వేలో పర్యటిస్తున్న మొట్టమొదటి చారిత్రాత్మక పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ నార్వేలోని ఓస్లోకు చేరుకున్నారు. ఆయనకు ప్రధానమంత్రి జోనాస్ గార్ స్టోర్ ఘన స్వాగతం పలికారు.

Prime Minister’s Departure Statement ahead of his visit to the UAE, Netherlands, Sweden, Norway, and Italy

May 15th, 07:56 am

PM Modi is embarking on a five-nation visit to the UAE, the Netherlands, Sweden, Norway and Italy from 15-20 May 2026. During the visit, he will meet various Heads of State and hold discussions to further strengthen partnerships across key sectors. Highlights of the visit include his participation in the European Round Table for Industry in Sweden and the 3rd India-Nordic Summit in Oslo.

ప్రధానమంత్రి యూఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే మరియు ఇటలీ పర్యటన (మే 15 - 20, 2026)

May 11th, 09:00 pm

ప్రధానమంత్రి మోదీ మే 15 నుండి మే 20, 2026 వరకు యూఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే మరియు ఇటలీలలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా, ఆయన యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌ను కలిసి వివిధ అంశాలపై అభిప్రాయాలను పంచుకుంటారు. నెదర్లాండ్స్‌లో, ప్రధానమంత్రి మోదీ రాజు విల్లెం-అలెగ్జాండర్‌ను కలిసి, ప్రధానమంత్రి రాబ్ జెట్టెన్‌తో చర్చలు జరుపుతారు. స్వీడన్‌లో, ఆయన ప్రధానమంత్రి క్రిస్టర్‌సన్‌తో చర్చలు జరుపుతారు. నార్వేలో, ఆయన రాజు హెరాల్డ్ Vను కలిసి, ప్రధానమంత్రి జోనాస్ గార్ స్టోర్‌తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అనంతరం, ఆయన ఇటలీని సందర్శించి ప్రధానమంత్రి జార్జియా మెలోనితో చర్చలు జరుపుతారు.

నార్వే ప్రధాని శ్రీ జోనాస్ గహర్ స్టార్ తిరిగి ఎన్నికైన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు‌

September 10th, 06:22 pm

నార్వే ప్రధాని పదవికి శ్రీ జోనాస్ గహర్ స్టార్‌ మళ్లీ ఎన్నికైన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు ఈ రోజు అభినందనలు తెలిపారు. నార్వేతో వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత పటిష్ఠపరుచుకోవాలన్నదే భారత్ నిబద్ధత అని శ్రీ మోదీ పునరుద్ఘాటించారు.

డెన్మార్క్ ప్రధాన మంత్రి మెట్టె ఫ్రెడరిక్సేన్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

April 15th, 06:02 pm

డెన్మార్క్ ప్రధాన మంత్రి గౌరవ మెట్టె ఫ్రెడరిక్ సన్‌తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఫోన్‌లో మాట్లాడారు. ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ప్రపంచ పరిణామాలపై ఇరువురు నేతలు చర్చించారు.

నార్వే ప్రధానితో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ

November 19th, 05:44 am

బ్రెజిల్ లోని రియో డి జనీరోలో జి20 శిఖరాగ్ర సమావేశం జరుగుతున్న సందర్భంగా నార్వే ప్రధాని శ్రీ జోనాస్ గహర్ స్టోర్ తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సమావేశమయ్యారు.

నార్వే ప్ర‌ధాన‌మంత్రి జొనాస్ గహ్ర్ స్టోర్ తో ఫోన్‌లో మాట్లాడిన ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ

September 09th, 07:57 pm

ఇరువురు నాయ‌కులు, ద్వైపాక్షిక‌, అంత‌ర్జాతీయ అంశాల‌ను, ప‌ర‌స్ప‌ర ప్ర‌యోజ‌న‌క‌ర అంశాల‌ను చ‌ర్చించారు. అలాగే వ‌ర్ధ‌మాన దేశాల‌లో పున‌రుత్పాద‌క ఇంధ‌న ప్రాజెక్టుల‌కు క్లైమేట్ ఫైనాన్స్ ను స‌మ‌కూర్చేంఉద‌కు తీసుకోవ‌ల‌సిన చ‌ర్య‌లను వారు చర్చించారు. వ‌ర్ధ‌మాన ప్ర‌పంచానికి స‌కాలంలో, త‌గినంత , న్యాయ‌బ‌ద్ధ‌మైన క్లైమేట్ ఫైనాన్స్ అందేలా చేయాల్సిన అంశం ప్రాధాన్య‌త గురించి ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌స్తావించారు. ఈ దిశ‌గా హిజ్ ఎక్స‌లెన్సీ స్టోర్ నిబ‌ద్ధ‌త‌ను ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌శంసించారు.

‘భారత-నార్డిక్’ రెండో శిఖరాగ్ర సదస్సు

May 04th, 07:44 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘భారత-నార్డిక్‌’ రెండో శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. ఆయనతోపాటు డెన్మార్క్‌, ఐస్‌లాండ్‌, నార్వే, స్వీడన్‌, ఫిన్లాండ్‌ దేశాల ప్రధానమంత్రులు- మెట్టీ ఫ్రెడరిక్సన్‌, కాట్రిన్‌ జాకబడోట్టిర్‌, జోనాస్‌ గార్‌స్టోర్‌, మగ్దలీనా ఆండర్సన్‌, సనామారిన్‌ కూడా ఇందులో పాలుపంచుకున్నారు.

నార్వే ప్రధాని తో సమావేశమైన ప్రధాన మంత్రి

May 04th, 02:25 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ రెండో ఇండియా- నార్డిక్ సమిట్ జరిగిన సందర్భం లో కోపెన్ హేగన్ లో నార్వే ప్రధాని శ్రీ జోనస్ గహర్ స్టోర్ తో సమావేశమయ్యారు. ప్రధాని శ్రీ స్టోర్ 2021వ సంవత్సరం లో అక్టోబరు లో పదవీబాధ్యతల ను స్వీకరించిన తరువాత ఇద్దరు నేతల మధ్య ఇదే ఒకటో సమావేశం.

నార్వే ప్రధాని గా శ్రీ జోనస్‌ గహర్ స్టోర్‌ పదవీబాధ్యతల ను స్వీకరించడం పట్ల అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి

October 16th, 09:38 pm

నార్వే ప్రధాని గా పదవీ బాధ్యతల ను స్వీకరించిన శ్రీ జోనస్ గహర్ స్టోర్‌ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందన లు తెలియజేశారు.

నార్వే ప్రధానమంత్రి ఎర్నా సోల్బెర్గ్తో ఉమ్మడి పత్రికా సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగం

January 08th, 12:09 pm

ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు భారత ప్రధాని మోదీ, నార్వేప్రధాన మంత్రి ఎర్నా సోల్బెర్గ్లు విస్తృతమైన చర్చలు జరిపారు. ఉమ్మడి పత్రికా సమావేశంలో, ప్రధాని మోదీ వాణిజ్యం, పెట్టుబడులు, నిలకడైన అభివృద్ధి లక్ష్యాలు, సముద్ర ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన విషయాలను మెరుగుపర్చడం గురించి మాట్లాడారు.