ఆక్రాలోని ఎన్క్రుమా సంస్మరణ వాటికలో నివాళులర్పించిన ప్రధానమంత్రి
July 03rd, 03:50 pm
ఘనా దేశం ఆక్రా నగరంలోని ఎన్క్రుమా సంస్కరణ వాటికను సందర్శించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ... దివంగత నేత, ఆఫ్రికా స్వాతంత్ర్య వీరుడు, దేశాన్ని ఉనికిలోకి తెచ్చిన తొలి దేశాధ్యక్షుడు డాక్టర్ క్వామే ఎన్క్రుమాకు ఘన నివాళులు అర్పించారు. ఘనా ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ నానా జేన్ ఓపుకు-ఆగ్యేమాంగ్ ప్రధాని వెంట ఉన్నారు. స్వాతంత్ర్యం, ఐక్యత, సామాజిక న్యాయం వంటి ఆశయాల సాధనకు డాక్టర్ ఎన్క్రుమా చేసిన కృషిని, ఆయా రంగాలపై చెక్కుచెదరని ఆయన ప్రభావానికి గౌరవ సూచకంగా శ్రీ మోదీ పుష్ప గుచ్ఛాన్ని ఉంచి మౌనం పాటించారు.