భారత ఎగుమతి వ్యవస్థ బలోపేతం కోసం రూ.25,060 కోట్లతో ‘ఎగుమతి ప్రోత్సాహక మిషన్‌’కు మంత్రిమండలి ఆమోదం

November 12th, 08:15 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రిమండలి ఇవాళ ఎగుమతి ప్రోత్సాహక మిషన్ (ఈపీఎం)కు ఆమోదం తెలిపింది. దేశం నుంచి ఎగుమతుల పరంగా పోటీతత్వాన్ని బలోపేతం చేయడం దీని ప్రధాన లక్ష్యం. ముఖ్యంగా ఇది ‘ఎంఎస్‌ఎంఈ'లు, తొలిసారి ఎగుమతిదారులు, శ్రామికశక్తి ఆధారిత రంగాలకు సంబంధించి కేంద్ర బడ్జెట్ 2025–26లో ప్రకటించిన కీలక కార్యక్రమం.