సేవా తీర్థ్, కర్తవ్య భవన్-1, 2 ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

February 13th, 06:55 pm

నూతన చరిత్రకు ఇవాళ మనం ప్రత్యక్ష సాక్షులం. విక్రమ సంవత్ 2082, ఫాల్గుణ కృష్ణ పక్షం, విజయ ఏకాదశి, శక సంవత్ 1947 మాఘ 24, నేటి సాధారణ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 13-ఈ శుభదినాన భారతదేశ అభివృద్ధి ప్రస్థానంలో నూతన అధ్యాయం ప్రారంభమవుతోంది. మన శాస్త్రాల ప్రకారం, విజయ ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంది. ఈ రోజున తీసుకునే ఏ సంకల్పమైనా తప్పక ఫలిస్తుంది. అభివృద్ధి చెందిన భారత్ సంకల్పంతో ఇవాళ మనం సేవా తీర్థ, కర్తవ్య భవన్‌లోకి అడుగుపెడుతున్నాం. మన లక్ష్య సాధనలో విజయమనే దైవిక ఆశీస్సులు మనకు తోడుగా ఉన్నాయి. సేవా తీర్థ, నూతన భవనాల ప్రారంభోత్సవం సందర్భంగా మీ అందరికీ, పీఎంఓ బృందానికి, కేబినెట్ సెక్రటేరియట్‌కు, వివిధ శాఖల ఉద్యోగులకు నా అభినందనలు తెలియజేస్తున్నాను. వీటి నిర్మాణంలో పాలుపంచుకున్న ఇంజనీర్లకు, కార్మికులకూ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.

న్యూఢిల్లీలో సేవా తీర్థ్, కర్తవ్య భవన్-1,2 ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

February 13th, 06:30 pm

న్యూఢిల్లీలో నేడు జరిగిన సేవా తీర్థ్, కర్తవ్య భవన్-1,2 ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేడు మనమందరం ఒక కొత్త చరిత్ర సృష్టిని వీక్షిస్తున్నామని పేర్కొన్నారు. 2082 విక్రమ సంవత్సరం నాడు ఫాల్గుణ కృష్ణ పక్షం, విజయ ఏకాదశి శుభ సందర్భంగా మాఘ 24, ప్రస్తుత క్యాలెండర్ ప్రకారం 2026 ఫిబ్రవరి 13న ఉన్న శక సంవత్సరం 1947న భారత్‌ తన అభివృద్ధి ప్రయాణంలో ఒక కొత్త ఆరంభానికి సాక్షిగా నిలిచిందని ఆయన స్పష్టం చేశారు. శాస్త్రాల ప్రకారం విజయ ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉందని, ఈ రోజున తీసుకున్న సంకల్పం ఎల్లప్పుడూ విజయానికి దారితీస్తుందని ఆయన గుర్తుచేశారు. అభివృద్ధి చెందిన భారత్‌ అనే సంకల్పంతో మనమందరం నేడు సేవా తీర్థ్, కర్తవ్య భవన్‌లోకి ప్రవేశిస్తున్నామని తెలిపారు. ఈ లక్ష్యంలో విజయానికి దైవిక ఆశీస్సులు మనకు ఉన్నాయని ఆయన చెప్పారు. సేవా తీర్థ్, ఈ కొత్త భవనాల నిర్మాణానికి గానూ ప్రధానమంత్రి కార్యాలయ బృందానికి, మంత్రివర్గ సచివాలయం, వివిధ శాఖల ఉద్యోగులతో సహా అందరికీ ఆయన అభినందనలు తెలిపారు. వీటి నిర్మాణంలో పాలుపంచుకున్న ఇంజనీర్లు, కార్మిక మిత్రులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.

నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు నివాళి అర్పిస్తూ.. సామర్థ్యం, న్యాయం, ఐక్యత గురించి తెలియజెప్పే సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధాని

December 30th, 10:10 am

అసమాన ధైర్యసాహసాలను ప్రదర్శించి నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1943 డిసెంబర్ 30న పోర్ట్‌బ్లెయిర్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని ఆయనకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.

Rashtra Prerna Sthal gives the message that every step, every effort must be dedicated to nation-building: PM Modi in Lucknow

December 25th, 06:16 pm

PM Modi inaugurated the Rashtra Prerna Sthal in Lucknow, Uttar Pradesh today. He paid respectful homage, offering salutations to Mahamana Malaviya ji, Atal ji, and Maharaja Bijli Pasi. He remarked that Atal ji and Malaviya ji dedicated their lives to safeguarding India’s identity, unity and pride. Quoting lines of Atal ji, the PM emphasized that Rashtra Prerna Sthal gives the message that every step, every effort must be dedicated to nation-building.

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ‘జాతీయ స్ఫూర్తి ప్రదాన ప్రాంగణాన్ని’ ప్రారంభించిన ప్రధానమంత్రి

December 25th, 05:23 pm

మాజీ ప్రధాని అటల్ బిహారీ శ్రీ వాజ్‌పేయి 101వ జయంతి నేపథ్యంలో ఆయన జీవితం, ఆదర్శాల గౌరవపూర్వక సంస్మరణ దిశగా ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో నిర్మించిన ‘జాతీయ స్ఫూర్తి ప్రదాన ప్రాంగణాన్ని (రాష్ట్ర ప్రేరణా స్థల్‌)ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- లక్నో నగరం ఇవాళ ఓ నవ్య స్ఫూర్తికి సాక్షిగా నిలిచిందని వ్యాఖ్యానించారు. అలాగే, దేశ ప్రజలతోపాటు యావత్‌ ప్రపంచంలోని క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో లక్షలాది కుటుంబాలు నేడు ఘనంగా వేడుకలు నిర్వహించుకుంటున్నాయని పేర్కొన్నారు. ఈ క్రిస్మస్ వేడుక ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం నింపాలన్నదే ప్రజానీకం సమష్టి ఆకాంక్షగా ఆయన పేర్కొన్నారు.

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో మాధవ్ నేత్రాలయ ప్రీమియం సెంటర్‌ శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం

March 30th, 11:53 am

గుడి పడ్వా, నూతన సంవత్సరారంభం సందర్భంగా నేను మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అత్యంత గౌరవనీయ సర్‌ సంఘ్‌చాలక్ డాక్టర్ మోహన్ భగవత్ , స్వామి గోవింద్ గిరి జీ మహారాజ్, స్వామి అవధేశానంద్ గిరి జీ మహారాజ్, ప్రజాదరణ పొందిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ , నా మంత్రివర్గ సహచరులు నితిన్ గడ్కరీ , డాక్టర్ అవినాష్ చంద్ర అగ్నిహోత్రి, ఇతర గౌరవ ప్రముఖులు, ఇంకా ఇక్కడ హాజరైన సీనియర్ సహచరులారా! ఈరోజు రాష్ట్ర యజ్ఞం అనే పవిత్ర కార్యక్రమంలో పాల్గొనే భాగ్యం నాకు లభించింది. ఈరోజు చైత్ర శుక్ల ప్రతిపాద ఎంతో ప్రత్యేకమైన రోజు. పవిత్ర నవరాత్రుల ఉత్సవాలు కూడా కూడా ఈరోజు ప్రారంభమవుతున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో గుడి పడ్వా, ఉగాది, నవరే పండుగలను కూడా ఈ రోజు జరుపుకుంటున్నారు. అలాగే ఈరోజు ఝులేలాల్ జీ, గురు అంగద్ దేవ్ జీ జయంతి కూడా. ఇవే కాకుండా, ఈ రోజు మన స్ఫూర్తి ప్రదాత, అత్యంత గౌరవనీయ డాక్టర్ సాహెబ్ జయంతి సందర్భం కూడా. అలాగే, ఈ ఏడాది రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ఘనమైన 100 ఏళ్ల ప్రయాణం కూడా పూర్తవుతోంది. ఈ సందర్భంలో, ఈ రోజు స్మృతి మందిరాన్ని సందర్శించి, గౌరవనీయ డాక్టర్ సాహెబ్, గౌరవనీయ గురూజీకి నివాళులర్పించే అవకాశం నాకు లభించింది.

మహారాష్ట్ర‌లోని నాగ్‌పూర్‌లో మాధవ్ నేత్రాలయ ప్రీమియం సెంట‌ర్‌కు శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి దేశంలోని పౌరులందరికీ మెరుగైన ఆరోగ్య సౌకర్యాలు కల్పించడమే మా ప్రాధాన్యత: ప్రధాని

March 30th, 11:52 am

మహారాష్ట్ర‌లోని నాగ్‌పూర్‌లో మాధవ్ నేత్రాలయ ప్రీమియం కేంద్రానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పవిత్ర నవరాత్రి ఉత్సవ ప్రారంభాన్ని తెలిపే చైత్ర శుక్ల ప్రతిపాద ప్రాముఖ్యతను వివరించారు. దేశవ్యాప్తంగా నేడు గుడి పడ్వా, ఉగాది, నవరేహ్ వంటి పండుగలు జరుగుతున్నాయన్న ఆయన.. భగవాన్ ఝులేలాల్, గురు అంగద్ దేవ్ జయంతి అయిన ఈ రోజు ప్రాముఖ్యతను ప్రధానంగా తెలియజేశారు. స్ఫూర్తిదాయకమైన డాక్టర్ కేబీ హెడ్గేవార్ జయంతి ఇవాళ అని గుర్తు చేశారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) మహోన్నత ప్రయాణం శతాబ్ది కాలాన్ని పూర్తి చేసుకున్నట్లు గుర్తు చేశారు. ఈ ముఖ్యమైన రోజున డాక్టర్ హెడ్గేవార్, శ్రీ గోల్వాల్కర్ గురూజీలకు నివాళులు అర్పించటానికి స్మృతి మందిరాన్ని సందర్శించడం ఎంతో గౌరవంతో కూడుకున్న విషయమని అన్నారు.

మారిషస్‌లోని భారతీయులతో సమావేశంలోప్రధానమంత్రి ప్రసంగం

March 12th, 06:07 am

పదేళ్ల కిందట ఇదే తేదీన నేను మారిషస్‌ పర్యటనకు వచ్చేనాటికి ఓ వారం ముందే మేం హోలీ పండుగ చేసుకున్నాం. అప్పుడు భారత్‌ నుంచి హోలీ వేడుకల సంరంభాన్ని నాతో మోసుకొచ్చాను. అయితే, ఈసారి వర్ణరంజిత హోలీ సంరంభాన్ని మారిషస్‌ నుంచి మన దేశానికి తీసుకెళ్తాను. ఈ నెల 14వ తేదీన హోలీ కాబట్టి.. వేడుకలకు మరొక రోజు మాత్రమే ఉంది.

మారిషస్‌లో భారతీయ సముదాయాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

March 11th, 07:30 pm

మారిషస్ ప్రధాని శ్రీ నవీన్ చంద్ర రాంగులాంతో పాటు భారత్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు మారిషస్‌లోని ట్రాయోన్ కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటైన ఒక ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ సముదాయాన్ని, ఇండియా మిత్రులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వృత్తినిపుణులు, సామాజిక సంస్థలు, సాంస్కృతిక సంస్థలు, వ్యాపార రంగ ప్రముఖులు సహా భారతీయ ప్రవాసులు చాలా మంది ఉత్సాహంగా పాల్గొన్నారు. అలాగే మారిషస్ మంత్రులు అనేక మందితోపాటు పార్లమెంట్ సభ్యులు, ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

పరాక్రమ దివస్ సందర్భంగా ప్రధాని ప్రసంగం

January 23rd, 11:30 am

నేడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా యావత్ దేశం ఆయనను భక్తిశ్రద్ధలతో స్మరించుకుంటోంది. సుభాష్ బాబుకు వినమ్ర పూర్వక నివాళి అర్పిస్తున్నాను. ఆయన జన్మస్థలంలో ఈ ఏడాది పరాక్రమ దివస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఒడిశా ప్రజలకు, ఒడిశా ప్రభుత్వానికి నా శుభాకాంక్షలు. నేతాజీ జీవిత విశేషాలను వివరించేలా భారీ ప్రదర్శనను కూడా కటక్ లో ఏర్పాటు చేశారు. ఆయన జీవితంతో ముడిపడి ఉన్న అనేక వారసత్వ స్మారకాలను భద్రపరిచి ఈ ప్రదర్శనకు ఉంచారు. అనేకమంది చిత్రకారులు బోస్ జీవిత విశేషాలకు కాన్వాస్ పై చిత్రరూపమిచ్చారు. వీటన్నింటితో పాటు సుభాష్ బాబుకు సంబంధించిన అనేక పుస్తకాలను కూడా సేకరించారు. నేతాజీ ఈ ఘనమైన జీవిత ప్రస్థానం నా యువ భారతానికీ, నా భారతదేశానికి కొత్త శక్తిని అందిస్తాయి.

పరాక్రమ దివస్ సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్రమోదీ ప్రసంగం

January 23rd, 11:25 am

పరాక్రమ దివస్‌గా నిర్వహిస్తున్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి నేపథ్యంలో ఆయన్ను యావత్ దేశం సగౌరవంగా స్మరించుకుంటోందని అన్నారు. నేతాజీ సుభాష్ బోస్‌కు నివాళులు అర్పిస్తూ, ఈ ఏడాది పరాక్రమ దివస్ ఉత్సవాలను ఆయన జన్మస్థలమైన ఒడిశాలో ఘనంగా నిర్వహిస్తున్నామని శ్రీ మోదీ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలు, ప్రభుత్వానికి అభినందనలు తెలియజేశారు. నేతాజీ జీవితం ఆధారంగా ఒడిశాలోని కటక్‌లో భారీ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు ప్రధాని వెల్లడించారు. ఎంతో మంది చిత్రకారులు నేతాజీ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన సంఘటనలను కాన్వాస్‌పై చిత్రించారని అన్నారు. అలాగే నేతాజీకి సంబంధించిన ఎన్నో పుస్తకాలను సైతం సేకరించినట్లు ఆయన తెలిపారు. నేతాజీ జీవిత ప్రయాణంలోని ముఖ్యమైన ఈ పరిణామాలు మేరీ యువ భారత్ లేదా మై భారత్‌కు కొత్త శక్తిని ఇస్తాయనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.

People are regarding BJP's ‘Sankalp Patra’ as Modi Ki Guarantee card: PM Modi in Tirunelveli

April 15th, 04:33 pm

Prime Minister Narendra Modi graced a public meeting ahead of the Lok Sabha Elections, 2024 in Tirunelveli, Tamil Nadu. The audience welcomed the PM with love and adoration. Manifesting a third term, PM Modi exemplified his vision for Tamil Nadu and the entire nation as a whole.

PM Modi holds a public meeting in Tirunelveli, Tamil Nadu

April 15th, 04:23 pm

Prime Minister Narendra Modi graced a public meeting ahead of the Lok Sabha Elections, 2024 in Tirunelveli, Tamil Nadu. The audience welcomed the PM with love and adoration. Manifesting a third term, PM Modi exemplified his vision for Tamil Nadu and the entire nation as a whole.

No room for division in India's mantra of unity in diversity: PM Modi

February 08th, 01:00 pm

Prime Minister Narendra Modi, addressed the program marking the 150th anniversary of Srila Prabhupada ji at Bharat Mandapam, Pragati Maidan. Addressing the gathering, the Prime Minister said that the 150th anniversary of Srila Prabhupada ji is being celebrated in the wake of the consecration of the Shri Ram Temple at the Ayodhya Dham. He also paid tributes to Srila Prabhupada and congratulated everyone for the postage stamp and commemorative coin released in his honour.

శ్రీల ప్రభుపాద గారి 150 వ జయంతి కి గుర్తు గా ఏర్పాటైన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి

February 08th, 12:30 pm

శ్రీల ప్రభుపాద గారి 150 వ జయంతి కి గుర్తు గా ప్రగతి మైదాన్ లోని భారత్ మండపం లో ఈ రోజు న ఏర్పాటైన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఆచార్య శ్రీల ప్రభుపాద యొక్క ప్రతిమ కు ప్రధాన మంత్రి పుష్పాంజలి ని సమర్పించడం తో పాటు ఆయన యొక్క గౌరవార్థం ఒక స్మారక స్టాంపు ను మరియు ఒక నాణేన్ని కూడా విడుదల చేశారు. గౌడీయ మఠాని కి వ్యవస్థాపకుడు అయిన ఆచార్య శ్రీల ప్రభుపాద వైష్ణవ ధర్మం యొక్క మౌలిక సిద్ధాంతాల ను పరిరక్షించడం లో మరియు వాటిని వ్యాప్తి చేయడం లో ఒక ప్రముఖమైన పాత్ర ను పోషించారు.

ఎర్రకోట వద్ద పరాక్రమ్ దివస్ వేడుకల్లో ప్రధాని ప్రసంగం

January 23rd, 06:31 pm

కేంద్ర మంత్రి వర్గంలో నా సహచరులు కిషన్ రెడ్డి గారు, అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు, మీనాక్షి లేఖి గారు, అజయ్ భట్ గారు, బ్రిగేడియర్ ఆర్ ఎస్ చికారా గారు, ఐఎన్ఎ వెటరన్ లెఫ్టినెంట్ ఆర్ మాధవన్ గారు, ప్రియమైన నా దేశప్రజలారా!

ఢిల్లీ ఎర్రకోట వద్ద పరాక్రమ్‌ దివస్‌ ఉత్సవాల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీనరేంద్రమోదీ.

January 23rd, 06:30 pm

ప్రధానమంత్రి శ్రీనరేంద్రమోదీ ఈరోజు , ఢల్లీిలోని ఎర్రకోటవద్ద జరిగిన పరాక్రమ్‌ దివస్‌ ఉత్సవాలలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రధానమంత్రి భారత్‌ పర్వ్‌ ను ప్రారంభించారు. ఇందులో దేశ సుసంపన్న వైవిధ్యతను రిపబ్లిక్‌ దినోత్సవ శకటాలను, సాంస్కృతిక ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. నేషనల్‌ ఆర్కైవ్స్‌ నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ పై ఫోటోలు, పెయింటింగ్స్‌, పుస్తకాలు, శిల్పాలతో కూడిన సాంకేతికత ఆధారిత ఇంటరాక్టివ్‌ ఎగ్జిబిషన్‌ను ప్రధానమంత్రి తిలకించారు. నేతాజీ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా వారు నేతాజీ జీవితంపై ప్రదర్శించిన డ్రామాను ప్రధానమంత్రి తిలకించారు. ఐఎన్‌ఎ కి సంబంధించి జీవించి ఉన్న ఏకైక ప్రముఖుడు లెఫ్టినెంట్‌ ఆర్‌.మాధవన్‌ ను ప్రధానమంత్రి ఈ సందర్భంగా సత్కరించారు. పరాక్రమ్‌దివస్‌ను 2021 నుంచి నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌ జయంతి రోజు జరుపుకుంటున్నారు. దేశ స్వాతంత్య్రోద్యమంలో కీలకపాత్ర పోషించిన ప్రముఖులను గౌరవించుకోవాలన్న ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా పరాక్రమ్‌ దివస్‌ను పాటిస్తున్నారు.

అయోధ్యలో పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, అంకితం , శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగం

December 30th, 02:15 pm

మోడీ హామీకి అంత బలం ఉంది ఎందుకంటే మోడీ ఏదైనా చెప్పినప్పుడు, దానిని నెరవేర్చడానికి ఆయన తన జీవితాన్ని అంకితం చేస్తారు. మోడీ హామీపై నేడు దేశంలో నమ్మకం ఉంది, ఎందుకంటే మోడీ హామీ ఇచ్చినప్పుడు, దానిని నెరవేర్చడానికి ఆయన రాత్రింబవళ్లు కష్టపడతారు. అయోధ్య నగరం కూడా దీనికి సాక్ష్యం. ఈ పవిత్రమైన నగరాన్ని అభివృద్ధి చేయడంలో మేము ఏ మాత్రం వెనకడుగు వేయబోమని ఈ రోజు నేను అయోధ్య ప్రజలకు భరోసా ఇస్తున్నాను. శ్రీరాముడు మనందరినీ ఆశీర్వదించాలి, ఈ కోరికతో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. శ్రీరాముని పాదాలకు నమస్కరిస్తున్నాను. అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. నాతో కలిసి ఇలా చెప్పండి:

ప్రధానమంత్రి చేతులమీదుగా రూ.15,700 కోట్లకుపైగా విలువైన పలు అభివృద్ధి పథకాలు ప్రారంభం.. జాతికి అంకితం.. శంకుస్థాపన

December 30th, 02:00 pm

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ఉత్త‌రప్ర‌దేశ్‌లోని అయోధ్య క్షేత్రంలో రూ.15,700 కోట్లకుపైగా విలువైన అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, జాతికి అంకితం, శంకుస్థాపన చేశారు. వీటిలో అయోధ్య, దాని పరిసర ప్రాంతాల్లోని సుమారు రూ.11,100 కోట్ల విలువైన ప్రాజెక్టులతోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాజెక్టులకు సంబంధించిన రూ.4600 కోట్ల విలువైన కార్యక్రమాలున్నాయి. దీనికిముందు పునర్నవీకృత అయోధ్య రైల్వే స్టేషన్‌ను ప్రారంభించిన ఆయన, కొత్త అమృత భారత్, వందే భారత్ రైళ్లను జెండా ఊపి సాగనంపారు. వీటితోపాటు అనేక ఇతర రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. ఆ తర్వాత అయోధ్యలో కొత్త విమానాశ్రయాన్ని ప్రధాని ప్రారంభించి, దీనికి ‘మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం’గా నామకరణం చేశారు.

ఎన్ పిడిఆర్ ఆర్, సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ –2023 తృతీయ సమావేశంలో ప్రధానమంత్రి శ్రీ న రేంద్ర మోదీ చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం.

March 10th, 09:43 pm

విపత్తులనుంచి కోలుకునేలా చేయడంలో, విపత్తుల నిర్వహణ పనులలో నిమగ్నమైన వారందరికీ ముందుగా నా అభినందనలు. చాల సందర్భాలలో మీరు మీ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఇతరుల ప్రాణాలను కాపాడడానికి మీరు అద్భుతమైన కృషి చేస్తుంటారు. ఇటీవవవల, టర్కీ, సిరియాలలో భారత బృందం కృషిని మొత్తం ప్రపంచం అభినందించింది. ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణం.