కాత్యాయనీ మాతను ప్రార్థించి... సంస్కృత సుభాషితంతోపాటు ఓ భక్తి గీతాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

March 24th, 08:06 am

కాత్యాయనీ మాతను ప్రార్థించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, జగదంబ ఆరాధన మనసును అనంత ఉత్తేజంతో, అంతర్గత శక్తితో నింపుతుందని అభివర్ణించారు. ఆ తల్లి దివ్య తేజస్సు మన హృదయాన్ని అత్యున్నత చైతన్యంతో ప్రకాశింపజేస్తుందని పేర్కొన్నారు. దైవత్వానికి, శౌర్యానికి ప్రతిరూపమైన ఆ దేవి ఆశీస్సులతో భక్తులందరికీ అపార శక్తి, ఆత్మవిశ్వాసం కలగాలని ఆయన ప్రార్థించారు.

దేవీ ఆరాధనతో ప్రాప్తించే దివ్య వాతావరణాన్నీ, ఆధ్యాత్మిక ఆనందాన్నీ ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

March 23rd, 08:50 am

నవ రాత్రులకు ఉన్న ఆధ్యాత్మిక ప్రాముఖ్యం విషయంలో స్వీయ ఆలోచనల్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు. దేవీ మాత ఆరాధనతో అపార శాంతీ, శక్తీ లభిస్తాయని స్పష్టం చేశారు. దేవిని స్తుతించే ఒక భక్తి గీతాన్ని శ్రీ మోదీ పంచుకున్నారు.

అంబ మాత పట్ల భక్తితో నిండిన దివ్య వాతావరణం, నవరాత్రి ఆధ్యాత్మిక సారం.. వీటిని ప్రస్తావించిన ప్రధానమంత్రి

March 20th, 09:48 am

నవరాత్రుల ఆధ్యాత్మిక వాతావరణానికి సంబంధించిన తన అభిప్రాయాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో ఈ రోజు పంచుకున్నారు. అంబ మాత పట్ల భక్తి ప్రపత్తులు మదిని అనంత శాంతితో, ఉత్సాహంతో నింపేసే తీరును ఆయన ప్రస్తావించారు. అంబ మాతను స్తుతిస్తున్న ఒక భక్తి గీతాన్ని శ్రీ మోదీ ఈ సందర్భంగా పంచుకున్నారు.

నవరాత్రి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసిన ప్రధానమంత్రి

March 19th, 09:48 am

నవరాత్రి పర్వదినం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యంతో వర్ధిల్లాలని.. 'వికసిత భారత్' సంకల్పం నెరవేరాలని ఆయన ప్రార్థించారు.

అస్సాంలోని గువాహటిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం

March 13th, 05:30 pm

అస్సాం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, ప్రజాదరణ చూరగొన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, కేంద్ర క్యాబినెట్లో నా సహ మంత్రి సర్బానంద సోనోవాల్, రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, ప్రజాప్రతినిధులు, సాకేంతిక పరిజ్ఞానం సాయంతో దేశం నలుమూలల నుంచి ఈ కార్యక్రమానికి హాజరైన రైతు మిత్రులకు, టీ తోటల్లో పనిచేస్తున్న సోదరీసోదరులకు, ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి హాజరవుతున్న వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, అందరికీ నా శుభాకాంక్షలు.

అస్సాంలోని గువహటిలో రూ. 19,480 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

March 13th, 05:00 pm

అస్సాంలోని గువహటిలో దాదాపు రూ. 19,480 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. గువహటిలో జరిగిన భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ, నగర ప్రజలకు ప్రధాని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా వర్చువల్ గా పాల్గొంటున్న రైతులకు, అలాగే తేయాకు తోటల్లో పనిచేస్తున్న కార్మికులకు కూడా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. నవరాత్రుల ముందు కామాఖ్య మాత పవిత్ర భూమిలో ఉండటం తన అదృష్టమని ప్రధానమంత్రి అన్నారు. నవరాత్రులు ప్రారంభం కావడానికి సరిగ్గా ముందు, కామాఖ్య మాత పుణ్య భూమిలో మిమ్మల్ని దర్శించుకునే భాగ్యం నాకు కలిగింది అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం

October 16th, 03:00 pm

గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ గారు, ప్రజాదరణ పొందిన, కష్టపడి పనిచేసే ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర మంత్రులు శ్రీ కె.రామ్మోహన్ నాయుడు గారు, శ్రీ చంద్రశేఖర్ పెమ్మసాని గారు, శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారు, రాష్ట్ర మంత్రి శ్రీ నారా లోకేష్ గారు, ఇతర మంత్రులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పీవీఎన్ మాధవ్ గారు, పార్లమెంట్ సభ్యులు, ఎంఎల్ఏలు అందరికీ, మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చిన నా ప్రియమైన సోదరీసోదరులకు...

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో రూ.13,430 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన.. ప్రారంభోత్సవం.. కొన్నింటిని జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

October 16th, 02:30 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో దాదాపు రూ.13,430 కోట్ల విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం, జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ- తొలుత అహోబిలంలోని నరసింహ స్వామితోపాటు మహానందిలోని శ్రీ మహానందీశ్వర స్వామికి ప్రణామాలు అర్పించారు. అలాగే సకలజన సౌభాగ్యం ఆకాంక్షిస్తూ మంత్రాలయంలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆశీస్సులు కోరారు.

అందరికీ మహా నవమి శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

October 01st, 09:26 am

ఈ రోజు మహా నవమి. ఈ సందర్భంగా, దేశ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

మహా అష్టమి సందర్భంగా ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

September 30th, 09:11 am

మహా అష్టమి శుభ సందర్భంగా ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ ప్రతి ఒక్కరికీ సుఖశాంతులనూ, ఉత్తమమైన ఆరోగ్యాన్నీ అందించాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. అమ్మవారి స్తుతిని కూడా శ్రీ మోదీ పంచుకున్నారు.

BJP’s connection with Delhi goes back to the Jana Sangh days and is built on trust and commitment to the city: PM Modi

September 29th, 08:40 pm

Inaugurating the Delhi BJP’s new office, PM Modi said, “On this auspicious occasion of Navratri, Delhi BJP has received its new office today. It is a moment filled with new dreams and fresh resolutions.” He added, “For us, every BJP office is no less than a shrine, no less than a temple. A BJP office is not merely a building. It is a strong link that connects the Party with the grassroots and with people’s aspirations.”

PM Modi inaugurates Delhi BJP’s new office at Deendayal Upadhyaya Marg

September 29th, 05:00 pm

Inaugurating the Delhi BJP’s new office, PM Modi said, “On this auspicious occasion of Navratri, Delhi BJP has received its new office today. It is a moment filled with new dreams and fresh resolutions.” He added, “For us, every BJP office is no less than a shrine, no less than a temple. A BJP office is not merely a building. It is a strong link that connects the Party with the grassroots and with people’s aspirations.”

దేశ ప్రజలంతా క్షేమంగా ఉండాలని అమ్మవారిని ప్రార్ధించిన ప్రధానమంత్రి

September 29th, 09:43 am

నవరాత్రి సందర్భంగా దేశ ప్రజల అభ్యున్నతీ, సంక్షేమం కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అమ్మ వారికి నిండుమనసుతో ప్రార్థన చేశారు.

అమ్మవారిని ప్రార్థించిన ప్రధానమంత్రి.. అందరికీ శక్తితో పాటు సుఖశాంతులు దక్కాలని కోరుకున్న ప్రధాని

September 28th, 09:00 am

దేశానికి మంచి జరిగేందుకు ఆశీస్సులు ఇవ్వాల్సిందిగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అమ్మవారికి ప్రార్థనలు చేశారు. ఈ ఆధ్యాత్మిక వాతావరణంలో దేశ ప్రజలంతా సుఖశాంతులతో, ధైర్యంతో, మనోనిబ్బరంతో ఉండేలా అనుగ్రహించాల్సిందిగా అమ్మవారిని ప్రార్థించారు.

అందరికీ విశ్వాసాన్నీ, ధైర్యాన్నీ ప్రసాదించాలని కోరుతూ నవరాత్రి ప్రార్థన చేసిన ప్రధానమంత్రి

September 27th, 08:42 am

నవరాత్రి శుభ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జగన్మాతకు భక్తితో నమస్కరించి, పౌరులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

బీహార్‌లో ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన’ను వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం ద్వారా ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

September 26th, 11:30 am

ఈ నవరాత్రి పర్వదిన సమయాన ఇవాళ బీహార్ రాష్ట్ర నారీశక్తి ఆనందంలో పాలుపంచుకునే అదృష్టం నాకు దక్కింది. ఇక్కడ టీవీ తెరపై లక్షలాదిగా తల్లులు..చెల్లెమ్మలు నాకు కనిపిస్తున్నారు. ఈ పండుగ వేళ మీ ఆశీస్సులే మాకు ఎనలేని ఉత్సాహాన్నిస్తాయి. ఇందుకుగాను మీకందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెబుతున్నాను. రాష్ట్రంలో “ముఖ్యమంత్రి మహిళా ఉపాధి పథకం” నేటి నుంచి అమలులోకి వచ్చింది. నాకు లభించిన సమాచారం ప్రకారం... ఇప్పటికే 75 లక్షల మంది అక్కచెల్లెళ్లు ఈ పథకంలో చేరగా, ఇప్పుడు వారందరి బ్యాంకు ఖాతాలకు ఏకకాలంలో తలా రూ.10,000 వంతున నగదు జమ చేశారు.

బీహార్‌ రాష్ట్రానికి చెందిన ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన’ను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

September 26th, 11:00 am

బీహార్ రాష్ట్రానికి చెందిన ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన’ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో అనుసంధానం ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా సభకు హాజరైన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. నవరాత్రి శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. బీహార్ మహిళలతో కలిసి వారి వేడుకల్లో పాల్గొనడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజనను ఈ రోజు ప్రారంభించడం సంతోషాన్ని కలిగించిందన్నారు. ఇప్పటికే 75 లక్షల మంది మహిళలు ఈ కార్యక్రమంలో చేరారని శ్రీ మోదీ తెలిపారు. ఈ 75 లక్షల మంది మహిళల్లో ఒక్కొక్కరి బ్యాంకు ఖాతాలకు ఒకేసారిగా రూ. 10,000 బదిలీ చేసినట్లు ఆయన ప్రకటించారు.

నవరాత్రి సందర్భంగా అమ్మవారిని ప్రార్థించిన ప్రధానమంత్రి

September 26th, 10:00 am

నవరాత్రి సందర్భంగా దేశ ప్రజలకు ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారిని భక్తజనులందరికీ శ్రేయస్సును కలగజేయాల్సిందని ప్రార్థించారు.

నవరాత్రి సందర్భంగా నాలుగో రోజు కూష్మాండ అమ్మవారిని ప్రార్థించిన ప్రధానమంత్రి

September 25th, 08:08 am

నవరాత్రి సందర్భంగా నాలుగో రోజు కూష్మాండ అమ్మ వారిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రార్థించారు.

నవరాత్రి మూడో రోజున చంద్రఘంట దేవిని ప్రార్థించిన ప్రధానమంత్రి

September 24th, 08:43 am

నవరాత్రి మూడో రోజు సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ చంద్రఘంట దేవిని ప్రార్థించారు.