గుజరాత్‌లోని దేడియాపడలో గిరిజ‌న ఆత్మ‌గౌర‌వ దినోత్స‌వం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

November 15th, 03:15 pm

గిరిజన ఆత్మగౌరవ దినోత్సవం సందర్భంగా అన్ని రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, మంత్రులు సహా ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

ధర్తి ఆబా భగవాన్ బిర్సా ముండా 150వ జయంతిని పురస్కరించుకుని గుజరాత్‌లోని దేడియాపాడలో జన్‌జాతీయ గౌరవ్ దివస్ కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

November 15th, 03:00 pm

ధర్తి ఆబా భగవాన్ బిర్సా ముండా 150వ జయంతిని పురస్కరించుకుని గుజరాత్‌లోని దేడియాపాడలో జన్‌జాతీయ గౌరవ్ దివస్ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ప్రసంగించారు. ఈ సందర్భంగా రూ.9,700 కోట్ల విలువైన పలు మౌలిక సదుపాయాలు, అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. నర్మదా మాత పవిత్ర భూమి ఇవాళ మరో చారిత్రక ఘట్టానికి సాక్ష్యంగా నిలిచిందని, అక్టోబరు 31న ఇక్కడే సర్దార్ పటేల్ 150వ జయంతి సందర్భంగా భారతదేశ ఏకత్వాన్ని, భిన్నత్వాన్ని చాటి చెప్పేందుకు భారత్ పర్వ్‌ను ప్రారంభించినట్లు శ్రీ నరేంద్ర మోదీ గుర్తుచేసుకున్నారు. ఈరోజు భగవాన్ బిర్సా ముండా 150వ జయంతిని ఘనంగా నిర్వహిస్తున్న సందర్భంగా, భారత్ పర్వ్ పరమావధికి చేరుకుందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఈ శుభ సందర్భంగా భగవాన్ బిర్సా ముండాకు నివాళులర్పించారు. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, దేశవ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లో స్వాతంత్ర్య స్ఫూర్తిని రగిలించిన గోవింద్ గురు ఆశీస్సులు ఈ కార్యక్రమంపై ఉంటాయని ప్రధానమంత్రి అన్నారు. వేదికపై నుంచి గోవింద్ గురుకు గౌరవ వందనం సమర్పించారు. కొద్దిసేపటి క్రితం దేవ్‌మోగ్రా మాత ఆలయాన్ని సందర్శించే అదృష్టం కలిగిందన్న ప్రధానమంత్రి.. ఆ మాత పాదాల వద్ద శిరస్సు వంచి ప్రణమిల్లినట్లు తెలిపారు.

జనజాతీయ గౌరవ్ దివస్ పురస్కరించుకొని ఈ నెల 15న ప్రధాని బీహార్ పర్యటన

November 13th, 06:59 pm

జనజాతీయ గౌరవ్ దివస్ పురస్కరించుకుని ఈ నెల 15న బీహార్‌లోని జముయి పట్టణాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ సందర్శిస్తారు. ఇది ఏడాది పాటు సాగే ధార్తీ ఆబా భగవాన్ బిర్సా ముండా 150వ జయంత్యుత్సవాల ప్రారంభాన్ని సూచిస్తుంది. ఉదయం 11 గంటల సమయంలో భగవాన్ బిర్సా ముండా గౌరవార్థం స్మారక నాణేన్ని, తపాలా బిళ్లను ప్రధాని విడుదల చేస్తారు. ఈ ప్రాంతంలోని గ్రామాలు, మారుమూల ప్రదేశాల్లో గిరిజన తెగల అభ్యున్నతికి, మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే లక్ష్యంతో రూ. 6,640 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు.

త్రిపురలోని అగర్తలాలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవ సందర్భంగా ప్రధానమంత్రి చేసిన ప్రసంగం : తెలుగు అనువాదం

December 18th, 04:40 pm

ఈ కార్యక్రమంలో పాల్గొన్న త్రిపుర గవర్నర్ శ్రీ సత్య దేవ్ నారాయణ్ ఆర్య జీ, ప్రముఖ ముఖ్యమంత్రి శ్రీ మాణిక్ సాహా జీ, కేంద్ర మంత్రివర్గంలో నా సహోద్యోగి ప్రతిమ భూమిక్ జీ, త్రిపుర శాసనసభాపతి శ్రీ రతన్ చక్రవర్తి జీ, ఉప ముఖ్యమంత్రి శ్రీ జిష్ణు దేవ్ వర్మ జీ, నా స్నేహితుడు, పార్లమెంటు సభ్యుడు శ్రీ బిప్లబ్ దేబ్ జీ, త్రిపుర ప్రభుత్వంలోని గౌరవనీయ మంత్రులందరితో పాటు, నా ప్రియమైన త్రిపుర ప్రజలారా!

త్రిపుర లోని అగర్తలాలో రూ. 4350 కోట్ల విలువైన వివిధ కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం, దేశ ప్రజలకు అంకితం చేసిన ప్రధాన మంత్రి

December 18th, 04:29 pm

త్రిపుర లోని అగర్తలాలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రూ. 4350 కోట్ల విలువైన వివిధ కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం తో పాటు కొన్నింటిని దేశ ప్రజలకు అంకితం చేశారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన - పట్టణ గ్రామీణ లబ్ధిదారుల కోసం గృహ ప్రవేశ్

సోషల్ మీడియా కార్నర్ 17 సెప్టెంబర్ 2017

September 17th, 07:33 pm

సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!

'ఏక్ భారత్,శ్రేష్ట భారత్' అనే కలను సర్దార్ పటేల్ చేసిన కృషి వల్లనే సాకారం చేసుకోగలిగాము: ప్రధాని మోదీ

September 17th, 12:26 pm

గుజరాత్ ధబయోలోని నేషనల్ ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్స్ మ్యూజియం కోసం ప్రధాని మోదీ పునాది రాయి వేశారు. బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, వలసవాదం పై బలమైన పోరాటం చేసిన గిరిజన వర్గాలకు చెందిన మన స్వాతంత్ర్య సమరయోధులను మేము గుర్తుంచుకున్నాము. అని అన్నారు.

సర్దార్ సరోవర్ ఆనకట్ట ను దేశ ప్రజలకు అంకితం చేసిన ప్రధాన మంత్రి; జాతీయ ఆదివాసీ స్వాతంత్ర్య యోధుల సంగ్రహాలయ నిర్మాణానికి శంకుస్థాపన

September 17th, 12:25 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సర్దార్ సరోవర్ ఆనకట్ట ను దేశ ప్రజలకు ఈ రోజు అంకితం చేశారు. ఈ సందర్భంగా కేవాడియా లోని ఆనకట్ట వద్ద పూజలు, మంత్రోచ్చారణలు జరిగాయి. ఒక ఫలకాన్ని ప్రధాన మంత్రి ఆవిష్కరించారు.