ఉగ్రవాదం భారతదేశ స్ఫూర్తిని విచ్ఛిన్నం చేయదు: ప్రధాని మోదీ
April 24th, 03:36 pm
పహల్గామ్ ఉగ్రవాద దాడిలో అమాయకుల ప్రాణాలను కోల్పోయినందుకు భారతదేశం సంతాపం వ్యక్తం చేసింది. బీహార్లోని మధుబనిలో జరిగిన జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవ కార్యక్రమంలో, ప్రధానమంత్రి మోదీ దేశాన్ని విచారంలో ముంచెత్తారు, తీవ్ర దుఃఖం మరియు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బాధితులను గౌరవించేందుకు రెండు నిమిషాల మౌనం పాటించారు, బాధిత కుటుంబాలకు మొత్తం దేశం సంఘీభావంగా నిలిచింది.బీహార్లోని మధుబనిలో జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవ సంబంధిత కార్యక్రమంతో పాటు అభివృద్ధి పనుల ప్రారంభ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
April 24th, 12:00 pm
నేను నా ప్రసంగాన్ని మొదలుపెట్టడాని కన్నా ముందు, మీకందరికీ ఒక వినతి చేస్తున్నాను... మీరు ఎక్కడ ఉన్న సరే, మీరు కూర్చున్న చోటే.. లేచి నిలబడనక్కర లేదు... మనం కూర్చొని ఉండే, ఈ నెల 22న మనం కోల్పోయిన కుటుంబసభ్యులకు నివాళిని సమర్పిద్దాం... మీరు ఆసీనులై ఉన్న చోటు నుంచే, కొన్ని క్షణాల పాటు మౌనాన్ని పాటించండి... మనం మన ఆరాధ్య దైవాలను స్మరించుకొంటూ, మొన్నటి మృతులందరికీ శ్రద్ధాంజలిని సమర్పిద్దాం. ఇది అయ్యాక, నేను నా నేటి ప్రసంగాన్ని మొదలుపెడతాను.జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్బంగా బీహార్లోని మధుబనిలో
April 24th, 11:50 am
ఈ రోజు జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా బీహార్లోని మధుబనిలో కొన్ని ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఇప్పటికే పూర్తయిన వాటిని జాతికి అంకితం చేశారు. వీటన్నింటి మొత్తం విలువ రూ.13,480 కోట్లు. పెహల్గాంలో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో మరణించినవారి ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించాలని కార్యక్రమానికి హాజరైన వారిని ప్రధాని కోరారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా దేశమంతా మిథిల, బీహార్తో అనుసంధామైందని అన్నారు. బీహార్ అభివృద్ధి కోసం వేల కోట్ల రూపాయల విలువైన విద్యుత్, రైల్వేలు, వసతుల ప్రాజెక్టులను ప్రారంభించామని, శంకుస్థాపనలు చేశామని తెలిపారు. ఇవి బీహార్లో నూతన ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తాయని చెప్పారు. ప్రముఖ కవి రాంధారి సింగ్ దినకర్ జీ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు.ఏప్రిల్ 24న ప్రధానమంత్రి బీహార్ పర్యటన
April 23rd, 06:30 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపు (ఏప్రిల్ 24 న) బీహార్ లో పర్యటిస్తారు. ఉదయం మధుబని చేరుకుని, 11.45 ని. లకు జాతీయ పంచాయితీ రాజ్ దినోత్సవం సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా రూ. 13,480 కోట్లు విలువ చేసే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. పూర్తయిన ప్రాజెక్టులను జాతికి అంకితం ఇస్తారు. అనంతరం శ్రీ మోదీ బహిరంగ సభనుద్దేశించి ప్రసంగిస్తారు.ఏప్రిల్ 24, 25 తేదీలలో మధ్యప్రదేశ్, కేరళ, దాద్రా నాగర్ హవేలీ , డామన్ , డయ్యు సందర్శించనున్న ప్రధాన మంత్రి
April 21st, 03:02 pm
24వ తేదీ ఉదయం 11-30కు ప్రధానమంత్రి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రేవాలో జరిగే జాతీయ పంచాయతి రాజ్ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అక్కడ ఆయన రూ. 19,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి జాతికి అంకితం ఇస్తారు. 25వ తేదీ ఉదయం 10-30కు తిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషన్ లో ప్రధానమంత్రి వందే భారత్ ఎక్సప్రెస్ కు జెండా ఊపి ప్రారంభిస్తారు. ఆ తరువాత ఉదయం 11 గంటలకు తిరువనంతపురం సెంట్రల్ స్టేడియంలో రూ. 3200 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి జాతికి అంకితం ఇస్తారు.పంచాయితీ రాజ్ దినోత్సవం సందర్భంగా గ్రామ సభలను ఉద్దేశించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగం పాఠం
April 24th, 11:31 am
జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా జీ, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరుడు, గిరిరాజ్ సింగ్ జీ, ఈ భూమి పిల్లలు, నా తోటి డాక్టర్ జితేంద్ర సింగ్ జీ, శ్రీ కపిల్ మోరేశ్వర్ పాటిల్ జీ, పార్లమెంట్లోని నా సహోద్యోగి శ్రీ జుగల్ కిషోర్ జీ, జమ్మూ కాశ్మీర్తో సహా మొత్తం దేశంతో అనుబంధం ఉన్న పంచాయతీరాజ్కి చెందిన ప్రజా ప్రతినిధులు, సోదరులు మరియు సోదరీమణులు అందరూ!జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు జమ్మూ, కాశ్మీర్ ను సందర్శించిన - ప్రధానమంత్రి
April 24th, 11:30 am
జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జమ్మూ-కశ్మీర్ లో పర్యటించి, దేశవ్యాప్తంగా అన్ని గ్రామసభలను ఉద్దేశించి ప్రసంగించారు. సాంబ జిల్లా లోని పల్లి పంచాయతీ ని ఆయన సందర్శించారు. దాదాపు 20,000 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అమృత్ సరోవర్ కార్యక్రమాన్ని కూడా ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో, జమ్మూ-కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా, కేంద్ర మంత్రులు శ్రీ గిరిరాజ్ సింగ్, డాక్టర్ జితేంద్ర సింగ్, శ్రీ కపిల్ మోరేశ్వర్ పాటిల్ ప్రభృతులు పాల్గొన్నారు.జాతీయ పంచాయతీ రాజ్ దినం నాడు ప్రజలకు శుభాకాంక్ష లు తెలిపిన ప్రధాన మంత్రి
April 24th, 09:51 am
జాతీయ పంచాయతీ రాజ్ దినం సందర్భం లో ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుబాకాంక్షలు తెలిపారు. పంచాయతీ లు అనేవి భారతదేశ ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలు గా ఉన్నాయి అని ఆయన అన్నారు.PM to launch physical distribution of Property Cards under the SVAMITVA Scheme on 11th October
October 09th, 01:31 pm
In a historic move set to transform rural India and empower millions of Indians, PM Narendra Modi will launch the physical distribution of Property Cards under the SVAMITVA Scheme on 11th October. The launch will enable around one lakh property holders to download their Property Cards through the SMS link delivered on their mobile phones.