ప్రధానమంత్రి జనధన్ యోజన 11 సంవత్సరాల మార్గదర్శక ప్రయాణాన్ని గుర్తు చేసిన ప్రధాని మోదీ
August 28th, 01:20 pm
ప్రధానమంత్రి జనధన్ యోజనను ప్రారంభించి నేటికి 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా ఆర్థిక సేవలను విస్తృతంగా పెంచే కార్యక్రమంగా ఈ పథకం నిలిచిందన్నారు. పీఎం జన్ధన్ యోజన.. గౌరవాన్ని పెంచడమే కాకుండా ఆర్థిక సార్వజనీనతను సాధించడం ద్వారా తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకునే శక్తిని ప్రజలకు అందించిందని ఆయన పేర్కొన్నారు.అంతరిక్ష రంగంలో భారత్ ప్రయాణం అద్భుతం....
August 23rd, 01:03 pm
భారతదేశంలోని 140 కోట్ల మంది ప్రజల నైపుణ్యాలు, ప్రతిభతో అంతరిక్ష ప్రపంచంలో భారత్ విశేషమైన పురోగతిని సాధిస్తోందని ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.2047లో అభివృద్ధి చెందిన భారతదేశానికి మార్గం స్వావలంబన ద్వారానే సాగుతుంది: మన్ కీ బాత్లో ప్రధాని మోదీ
July 27th, 11:30 am
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. 'మన్ కీ బాత్' కార్యక్రమంలో మళ్ళీ ఒకసారి మన దేశ సాఫల్యాల గురించి, మన ప్రజల విజయాల గురించి మాట్లాడుకుందాం. గత కొన్ని వారాల్లో – క్రీడలలోనైనా, శాస్త్రవిజ్ఞానంలోనైనా, సంస్కృతిలోనైనా – ఎన్నో గొప్ప సంఘటనలు జరిగాయి. ప్రతి భారతీయుడినీ గర్వపడేలా చేసిన విషయాలివి. శుభాంశు శుక్లా అంతరిక్ష ప్రయాణాన్ని ముగించుకొని భూమిపైకి ఇటీవల విజయవంతంగా తిరిగివచ్చిన సందర్భాన్ని దేశం యావత్తూ ఎంతో ఉత్సాహంగా గమనించింది. ఆయన భూమి పైకి తిరిగివచ్చిన వెంటనే దేశవ్యాప్తంగా సంతోషాల వెల్లువ పెల్లుబికింది. ప్రతి హృదయంలో ఆనంద తరంగాలు పుట్టుకొచ్చాయి. దేశం అంతా గర్వంతో ఉప్పొంగిపోయింది. నాకు గుర్తుంది.... 2023 ఆగస్టులో చంద్రయాన్-3 విజయవంతంగా చంద్రునిపై ల్యాండింగ్ అయిన తర్వాత దేశంలో శాస్త్రవిజ్ఞానం పట్ల, అంతరిక్ష పరిశోధన పట్ల ఒక కొత్త ఆసక్తి పిల్లల్లో ఏర్పడింది. తాము కూడా అంతరిక్ష యాత్ర చేస్తామని, చంద్రునిపై దిగుతామని, అంతరిక్ష శాస్త్రవేత్తలం అవుతామని ఇప్పుడు చిన్నారులు కూడా చెప్తున్నారు.స్వావలంబనను, ఆధునికీకరణను దృఢతరం చేస్తూ భారత్ రక్షణ రంగంలో గత 11 సంవత్సరాల్లో అపూర్వ వృద్ధి నమోదు... ప్రధానమంత్రి హర్షం
June 10th, 09:47 am
భారత్ రక్షణ రంగంలో గత 11 సంవత్సరాలలో అసాధారణ ప్రగతి చోటుచేసుకొందని, రక్షణ రంగానికి అవసరమైన ఉత్పత్తుల తయారీలో ఆధునికీకరణపైన, స్వయంసమృద్ధిపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకొంటున్నారని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వ్యాఖ్యానించారు.30 మార్చి 2025 న జరిగిన ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం యొక్క 120 వ భాగంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
March 30th, 11:30 am
నా ప్రియమైన దేశప్రజలారా! నమస్కారం. ఈరోజు- ఈ పవిత్రమైన రోజున మీతో ‘మన్ కీ బాత్’ పంచుకునే అవకాశం నాకు లభించింది. ఈరోజు చైత్ర మాస శుక్ల పక్ష పాడ్యమి. నేటి నుండి చైత్ర నవరాత్రి ప్రారంభమవుతుంది. భారతీయ నూతన సంవత్సరం కూడా నేటి నుంచే ప్రారంభమవుతోంది. ఈసారి విక్రమ సంవత్సరం 2082 ప్రారంభమవుతోంది. ప్రస్తుతం మీరు రాసిన చాలా ఉత్తరాలు నా ముందు ఉన్నాయి. కొందరు బీహార్ నుండి, కొందరు బెంగాల్ నుండి, కొందరు తమిళనాడు నుండి, కొందరు గుజరాత్ నుండి ఈ లేఖలు రాశారు. వీటిలో ప్రజలు తమ ఆలోచనలను చాలా ఆసక్తికరమైన రీతిలో రాశారు. చాలా లేఖలలో శుభాకాంక్షలు, అభినందన సందేశాలు కూడా ఉన్నాయి. ఈ రోజు మీతో కొన్ని సందేశాలు పంచుకోవాలనిపిస్తోంది-మన అన్నదాతలను చూసి మేం గర్వపడుతున్నాం వారి జీవనాన్ని మెరుగుపరచడానికి కట్టుబడి ఉన్నాం: ప్రధానమంత్రి
February 24th, 10:01 am
భారతదేశ అన్నదాతలను చూసి ప్రభుత్వం గర్వపడుతోందనీ, వారి జీవనాన్ని మెరుగుపరచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందనీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఎక్స్లో ‘మైగవ్ఇండియా’ (MyGovIndia) పొందుపరిచిన కొన్ని సందేశాలకు ఆయన ప్రతిస్పందిస్తూ ఇలా పేర్కొన్నారు:భారతీయ ప్రవాసులు వివిధ దేశాల్లో తమదైన ముద్ర వేశారు: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
November 24th, 11:30 am
మన్ కీ బాత్ యొక్క 116వ ఎపిసోడ్లో, పీఎం మోదీ ఎన్సిసి డే యొక్క ప్రాముఖ్యతను చర్చించారు, ఎన్సిసి క్యాడెట్ల పెరుగుదల మరియు విపత్తు సహాయంలో వారి పాత్రను హైలైట్ చేశారు. అభివృద్ధి చెందిన భారతదేశం కోసం యువత సాధికారతను నొక్కి, వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ గురించి మాట్లాడారు. డిజిటల్ ప్లాట్ఫారమ్లను నావిగేట్ చేయడంలో సీనియర్ సిటిజన్లకు యువత సహాయం చేయడం మరియు ఏక్ పెద్ మా కే నామ్ క్యాంపెయిన్ విజయాన్ని కూడా ఆయన పంచుకున్నారు.'హర్ ఘర్ తిరంగ అభియాన్' త్రివర్ణ పతాకం యొక్క వైభవాన్ని నిలబెట్టడంలో ఒక ప్రత్యేకమైన పండుగగా మారింది: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
July 28th, 11:30 am
నా ప్రియమైన దేశప్రజలారా! 'మన్ కీ బాత్' కార్యక్రమానికి మీకు స్వాగతం. అభినందనలు. ప్రస్తుతం పారిస్ ఒలింపిక్స్ ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఒలింపిక్స్ మన క్రీడాకారులకు ప్రపంచ వేదికపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే అవకాశం అందిస్తుంది. దేశం కోసం ఏదైనా చేసే అవకాశాన్ని కల్పిస్తుంది. మీరు కూడా మన క్రీడాకారులను ప్రోత్సహించండి. ఛీర్ ఫర్ భారత్.!!#10YearsOfMyGov: ఈ మాధ్యమం సుపరిపాలన కు ఒక చైతన్య భరిత వేదిక గా ఉందంటూ ప్రశంసించిన ప్రధాన మంత్రి
July 26th, 06:50 pm
MyGov (మైగవ్) మాధ్యమం ప్రాతినిధ్యపూర్వకమై, సుపరిపాలన కు చైతన్యభరిత వేదిక గా ఉందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. మైగవ్ మాధ్యమం పది సంవత్సరాల కాలాన్ని ఈ రోజు పూర్తి చేసుకొన్న సందర్భంగా ఆ మాధ్యమాన్ని ప్రధాన మంత్రి ప్రశంసించారు.మన్ కీ బాత్: ‘నా మొదటి ఓటు - దేశం కోసమే’...మొదటిసారి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరిన ప్రధాని మోదీ
February 25th, 11:00 am
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. ‘మన్ కీ బాత్’ 110వ ఎపిసోడ్కి స్వాగతం. ఎప్పటిలాగే ఈసారి కూడా మీనుండి పెద్ద సంఖ్యలో వచ్చిన సూచనలు, స్పందనలు, వ్యాఖ్యలను స్వీకరించాం. ఎప్పటిలాగే ఈసారి కూడా ఎపిసోడ్లో ఏ అంశాలను చేర్చాలనేదే సవాలు. నేను సానుకూల వైఖరితో నిండిన అనేక స్పందనలను అందుకున్నాను. ఇతరులకు ఆశాకిరణంగా మారడం ద్వారా వారి జీవితాలను మెరుగుపరచడానికి కృషి చేస్తున్న చాలా మంది దేశవాసుల ప్రస్తావనలు వాటిలో ఉన్నాయి.న్యూఢిల్లీలోని కరియప్ప పరేడ్ గ్రౌండ్ లో జరిగిన ఎన్ సిసి క్యాడెట్స్ ర్యాలీలో ప్రధాన మంత్రి ప్రసంగం
January 27th, 05:00 pm
కేంద్ర మంత్రి వర్గంలోని నా సహచరులు శ్రీ రాజ్ నాథ్ సింగ్ గారు, శ్రీ అజయ్ భట్ గారు, సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ గారు, త్రివిధ దళాల అధిపతులు, రక్షణ కార్యదర్శి, డిజి ఎన్ సిసి, అందరూ విశిష్ట అతిథులు మరియు ఎన్ సిసి నుండి నా యువ కామ్రేడ్ లు!ఢిల్లీలోని కరియప్ప పరేడ్ గ్రౌండ్లో ఎన్సీసీ పీఎం ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని
January 27th, 04:30 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఢిల్లీలోని కరియప్ప పరేడ్ గ్రౌండ్లో వార్షిక ఎన్సీసీ పీఎం ర్యాలీలో ప్రసంగించారు. శ్రీ మోదీ ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని వీక్షించారు. బెస్ట్ క్యాడెట్ అవార్డులను ప్రదానం చేశారు. ఎన్సీసీ బాలికల మెగా సైక్లోథాన్, ఝాన్సీ నుండి ఢిల్లీ వరకు నారీ శక్తి వందన్ రన్ (ఎన్ఎస్ఆర్వి) లను కూడా ఆయన జెండా ఊపి ప్రారంభించారు. సభను ఉద్దేశించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, తాను ఒక మాజీ ఎన్సీసీ క్యాడెట్గా ఉన్నందున, వాటిలో ఉన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తుకు రావడం సహజమని అన్నారు. “ ఎన్సీసీ క్యాడెట్ల మధ్య ఉండటం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఆలోచనను హైలైట్ చేస్తుంది”, దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన క్యాడెట్లను చూసిన సందర్భంగా ప్రధాన మంత్రి అన్నారు. ఎన్సిసి రంగం నిరంతరం అభివృద్ధి చెందుతోందని సంతోషం వ్యక్తం చేసిన ఆయన, నేటి సందర్భం కొత్త ప్రారంభాన్ని సూచిస్తుందని అన్నారు. వైబ్రంట్ విలేజెస్ పథకం కింద ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న సరిహద్దు ప్రాంతాలకు చెందిన 400 మందికి పైగా గ్రామాల సర్పంచ్లు, దేశవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాలకు చెందిన 100 మందికి పైగా మహిళలు ఉన్నారని ఆయన గుర్తించారు.వీర్ బాల్ దివస్ కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగం
December 26th, 12:03 pm
ఈ రోజు, దేశం ధైర్యవంతులైన సాహిబ్జాదాల శాశ్వత త్యాగాన్ని స్మరించుకుంటుంది, వారి అచంచలమైన స్ఫూర్తి నుండి ప్రేరణ పొందుతుంది. 'ఆజాదీ కా అమృత్కాల్'లో వీర్ బాల్ దివస్ రూపంలో కొత్త అధ్యాయం ఆవిష్కృతమవుతుంది. గత ఏడాది డిసెంబర్ 26న వీర్ బాల్ దివస్ ప్రారంభోత్సవాన్ని జరుపుకోవడంతో యావత్ దేశం సాహిబ్జాదాల వీర గాథలతో ప్రతిధ్వనించి, తీవ్ర భావోద్వేగాలను రేకెత్తించింది. వీర్ బాల్ దివస్ భారతీయత యొక్క సారాన్ని కాపాడటానికి ఎంతవరకైనా వెళ్ళడానికి అచంచలమైన నిబద్ధతకు ప్రతీక. ధైర్యసాహసాల శిఖరం వయసుతో పరిమితం కాదని ఈ రోజు మనకు గుర్తుచేస్తుంది. ఈ పండుగ మనకు ఆ గొప్ప వారసత్వాన్ని గుర్తు చేస్తుంది, ఇక్కడ గురువుగారు చెప్పేవారు - सूरा सो पहचानिए, जो लरै दीन के हेत, पुरजा-पुरजा कट मरै, कबहू ना छाडे खेत! మాతా గుజ్రీ, గురుగోవింద్ సింగ్ జీ, వారి నలుగురు సాహిబ్జాదాల శౌర్యం, ఆదర్శాలు ప్రతి భారతీయుడిలో బలాన్ని నింపుతూనే ఉన్నాయి. వీర్ బాల్ దివస్ ఈ నిజమైన వీరుల అసమాన ధైర్యసాహసాలకు, వారిని ప్రపంచంలోకి తీసుకువచ్చిన తల్లులకు దేశం యొక్క ప్రామాణిక నివాళిగా నిలుస్తుంది. బాబా మోతీ రామ్ మెహ్రా, ఆయన కుటుంబ సభ్యుల త్యాగానికి, దివాన్ తోదర్మాల్ భక్తికి ఈ రోజు నివాళులు అర్పిస్తున్నాను. దేశభక్తిని రగిల్చే మన గురువుల పట్ల గాఢమైన భక్తికి అవి ప్రతీకలు.‘వీర్ బాల్ దివస్’ నాడు నిర్వహించినకార్యక్రమం లో ప్రసంగించిన ప్రధాన మంత్రి
December 26th, 11:00 am
‘వీర్ బాల్ దివస్’ కు గుర్తు గా ఈ రోజు న న్యూ ఢిల్లీ లోని భారత్ మండపం లో ఏర్పాటైన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. బాల లు పాలుపంచుకేన్న ఒక పఠన సంబంధి కార్యక్రమాన్ని ఆయన ఆలకించడం తో పాటుగా వారు ప్రదర్శించిన మూడు యుద్ధ విద్యల కార్యక్రమాన్ని కూడా చూశారు. ఇదే సందర్భం లో, దిల్లీ లో యువత చేపట్టిన ఒక మార్చ్-పాస్ట్ కు ప్రధాన మంత్రి ప్రారంభ సూచక జెండా ను చూపెట్టారు.కాశీ విశ్వనాథ్కారిడర్ ఏర్పడి రెండు సంవత్సరాలు అయినందుకు సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధానమంత్రి
December 14th, 03:00 pm
కాశీ విశ్వనాథ్ కారిడర్ రూపుదాల్చి రెండు సంవత్సరాలు అయిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.This is the period in the history of India when the country is going to take a quantum leap: PM Modi
December 11th, 10:35 am
PM Modi launched ‘Viksit Bharat @2047: Voice of Youth’ via video conferencing. PM Modi underlined the need to channel the energy of the students and the youth of every university towards achieving the common goal of ‘Viksit Bharat’. Noting the persity of ideas, PM Modi stressed linking all the streams towards building a developed India. Elaborating on the exercise of seeking suggestions, PM Modi emphasized the need to create an Amrit generation that keeps the national interest paramount.‘వికసిత్ భారత్ @ 2047: వాయిస్ ఆఫ్ యూథ్’ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
December 11th, 10:30 am
ప్రధాన మంత్రి శ్రీ నరంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా ‘వికసిత్ భారత్ @ 2047: వాయిస్ ఆఫ్ యూథ్’ ను ప్రారంభించారు. కార్యక్రమం లో భాగం గా ప్రధాన మంత్రి ఈ కార్యక్రమం యొక్క ఆరంభం లో రాజ్ భవన్ లలో ఏర్పాటు చేసిన కార్యశాలల్లో విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్ లర్ లు, సంస్థల ప్రముఖులు మరియు ఫేకల్టీ మెంబర్స్ ను ఉద్దేశించి ప్రసంగించారు.140 crore people are driving numerous changes: PM Modi during Mann Ki Baat
November 26th, 11:30 am
During the 107th episode of Mann Ki Baat, PM Modi began his address by honoring the lives lost in the 26/11 Mumbai terrorist attacks. He subsequently delved into crucial topics such as Constitution Day, the 'Vocal for Local' campaign's influence, the 'Swachh Bharat' mission, the surge in digital payments, and other significant matters.31 October has become a festival of spirit of nationalism in every corner of the country: PM Modi
October 31st, 10:00 am
PM Modi participated in the Rashtriya Ekta Diwas-related events. Addressing the gathering, the PM Modi remarked that Rashtriya Ekta Diwas celebrates the strength of the unity of India’s youth and its warriors. “In a way, I can witness the form of mini India '', PM Modi emphasized. He underlined that even though the languages, states and traditions are different, every person in the country is weaved in the strong thread of unity.గుజరాత్ లోనికేవడియా లో జరిగిన రాష్ట్రీయ ఏకత దివస్ వేడుకల లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి
October 31st, 09:12 am
జన సభ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, భారతదేశం లో యువతీ యువకులు మరియు యోధుల యొక్క ఏకత శక్తి ని రాష్ట్రీయ ఏకత దివస్ అనేది చాటిచెబుతోంది అని అభివర్ణించారు. ‘‘ఒక విధం గా ఇక్కడ బుల్లి భారతదేశాన్ని నేను చూస్తున్నాను’’ అని ప్రధాన మంత్రి అన్నారు. భాషలు, రాష్ట్రాలు మరియు సంప్రదాయాలు వేరైనప్పటికీ దేశం లో ప్రతి ఒక్క వ్యక్తి ఏకత తాలూకు బలమైన పాశం తో ముడిపడ్డారు అని ఆయన నొక్కి చెప్పారు. ‘‘పూస లు అనేకం ఉన్నా గానీ దండ మాత్రం ఒక్కటే, మనం భిన్నం గా ఉన్నప్పటికీ ఒక్కటి గా ఉంటున్నాం’’ అని ఆయన అన్నారు. ఆగస్టు లో 15 వ తేదీ ని స్వాతంత్య్ర దినం గా మరియు జనవరి లో 26 వ తేదీ ని గణతంత్ర దినం గా జరుపుకొన్నట్లే అక్టోబరు 31 వ తేదీ ని దేశవ్యాప్తం గా ‘ఏకత’ తాలూకు పండుగ రోజు గా పాటిస్తున్నట్లు ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ఎర్రకోట లో జరిగే స్వాతంత్య్ర దిన ఉత్సవాలు, కర్తవ్య పథ్ లో జరిగే గణతంత్ర దిన కవాతు, మరి నర్మద మాత తీర ప్రాంతం లో గల స్టేట్యూ ఆఫ్ యూనిటీ వద్ద జరిగే రాష్ట్రీయ ఏకత దివస్ వేడుక లు.. ఈ మూడూ జాతీయ చైతన్యాని కి ప్రతీక లు అని ఆయన ప్రముఖం గా పేర్కొన్నారు. ఈ రోజు న నిర్వహించుకొంటున్న కార్యక్రమాన్ని గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఎవరైతే ఏకత నగర్ ను సందర్శిస్తారో వారు స్టేట్యూ ఆఫ్ యూనిటీ ని వీక్షించడం ఒక్కటే కాకుండా, సర్ దార్ సాహబ్ యొక్క జీవనం మరియు భారతదేశ జాతీయ అఖండత కు ఆయన అందించిన సేవల ను సైతం దర్శిస్తారు అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘స్టేట్యూ ఆఫ్ యూనిటీ అనేది ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఆదర్శాల కు ప్రతినిధిత్వాన్ని వహిస్తున్నది’’ అని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఆ విగ్రహ నిర్మాణం లో పౌరులు అందించిన తోడ్పాటుల ను గురించి ఆయన చెప్తూ, రైతులు ఈ కార్యం కోసం వారి ఉపకరణాల ను విరాళం గా ఇచ్చిన ఉదాహరణ ను ప్రస్తావించారు. వాల్ ఆఫ్ యూనిటీ నిర్మాణం కోసం భారతదేశం లో వివిధ ప్రాంతాల నుండి మట్టి ని తీసుకు వచ్చి, ఆ మట్టి భాగాల ను ఒక చోట కలపడం జరిగింది అని కూడా ఆయన అన్నారు. దేశవ్యాప్తం గా ‘రన్ ఫర్ యూనిటీ’ మరియు ఇతర సాంస్కృతిక కార్యక్రమాల లో పాలుపంచుకోవడం ద్వారా రాష్ట్రీయ ఏకత దివస్ వేడుకల లో కోట్ల కొద్దీ పౌరులు జతపడ్డారు అని ప్రధాన మంత్రి తెలియ జేశారు. ‘‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ భావన ను ఒక పండుగ లాగా జరుపుకోవడం కోసం ముందుకు వచ్చిన 140 కోట్ల మంది పౌరుల లో సర్ దార్ సాహబ్ యొక్క ఆదర్శాలు మూర్తీభవించాయి’’ అని ప్రధాన మంత్రి అన్నారు. సర్ దార్ పటేల్ గారి కి ప్రధాన మంత్రి శ్రద్ధాంజలి ని సమర్పించి, పౌరుల కు రాష్ట్రీయ ఏకత దివస్ సందర్భం లో అభినందనల ను తెలియ జేశారు.