'ముండియల్ డో కీజో డో బ్రెజిల్ 2026'లో భారతీయ జున్ను తయారీదారులు సాధించిన విజయం పట్ల అభినందనలు తెలియజేసిన ప్రధాని
April 22nd, 09:02 pm
జున్ను, పాడి ఉత్పత్తులకు సంబంధించి జరిగే ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పోటీ 'ముండియల్ డో కీజో డో బ్రెజిల్ 2026'లో భారతీయ జున్ను తయారీదారులు సాధించిన విజయం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఇందులో 1 సూపర్ స్వర్ణం, 2 స్వర్ణం, 1 రజతంతో సహా మొత్తం నాలుగు భారతీయ ఉత్పత్తులు పతకాలను గెలుచుకున్నాయి.